సమీకృత ఉద్యానాభివృద్ధికి రూ.67.50 కోట్లు | Rs .67.50 crore integrated to development of Horticulture Department | Sakshi

సమీకృత ఉద్యానాభివృద్ధికి రూ.67.50 కోట్లు

Published Mon, Jan 11 2016 3:46 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Rs .67.50 crore integrated to development of Horticulture Department

ఉద్యానశాఖ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉద్యానవన శాఖ సవరణ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణలో సమీకృత ఉద్యానాభివృద్ధి ప్రాజెక్టు(ఎంఐడీహెచ్)కు రూ. 67.50 కోట్లు కేటాయించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఉద్యాన శాఖ రూ. 81 కోట్లకు ప్రతిపాదనలు పంపింది. అయితే, కేంద్రం వాటా 85 నుంచి 60 శాతానికి తగ్గింది. దీంతో రూ. 81 కోట్లకు పంపిన ప్రతిపాదనలను రూ. 67.50 కోట్లకు సవరించి కేంద్ర ప్రభుత్వానికి పంపగా ఆమోదం లభించింది.  కేంద్రం వాటా రూ.40.50 కోట్లు కాగా, రాష్ట్ర వాటా రూ.27 కోట్లు. నిధులు తగ్గడంతో ఉద్యాన పథకాలకు కూడా నిధులు తగ్గించాల్సి వచ్చింది.

సవరణ ప్రణాళిక ప్రకారం అత్యధికంగా కోల్డ్ స్టోరేజీలకు రూ. 12.79 కోట్లు కేటాయించారు. ఒక్కో కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం 5 వేల మెట్రిక్ టన్నులు. గరిష్టంగా రూ. 1.40 కోట్లు కేటాయిస్తారు. ఆ ప్రకారం రాష్ట్రంలో 11 యూనిట్లకు అనుమతి ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement