తెలుసుకుంటే లాభం...మలుచుకుంటే అ'ధనం' | Value added by products with jackfruit | Sakshi
Sakshi News home page

తెలుసుకుంటే లాభం...మలుచుకుంటే అ'ధనం'

Published Mon, Feb 17 2025 5:57 AM | Last Updated on Mon, Feb 17 2025 1:28 PM

Value added by products with jackfruit

పనస కాయలతో విలువఆధారిత ఉప ఉత్పత్తులు 

తయారీ, మార్కెటింగ్‌ ద్వారా అధిక ఆదాయం   

ఆ దిశగా శిక్షణ ఇస్తున్న   పందిరిమామిడి  కేవీకే

మార్చిలో మరో బ్యాచ్‌కు శిక్షణ

గిరిజనుల ఆర్థిక పరిస్థితిలో మార్పు తేవాలి, వారి ఆదాయం రెట్టింపుకావాలన్న లక్ష్యంతో పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం (Krishi Vigyan Kendra) పనిచేస్తోంది. ఇందుకోసం గిరిజనులకు అందుబాటులో ఉండే వనరుల వినియోగం, విలువ ఆధారిత ఉప ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో లభించే పనస పండ్లతో పసందైన వంటకాల తయారీ, మార్కెటింగ్‌పై శిక్షణ అందిస్తోంది. మార్చి నెలలో రెండో బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. పసన పండ్ల లాభాలు తెలియజేసి, వాటి నుంచి అదనంగా ఆదాయం సమకూర్చుకునేలా శిక్షణ  అందజేయనున్నారు.

రంపచోడవరం: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విరి­విగా లభించే పనసకాయలతో విలువ ఆధారిత ఉత్ప­త్తుల తయారీలో పందరిమామిడి (Pandarimamidi) కృషి విజ్ఞాన కేంద్రం గిరిజనులకు అవగాహన కల్పిస్తోంది. పనస తొనలతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయడంలో ఇప్పటికే ఒక దఫా 30  మందికి శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో మరో బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చేందుకు కేవీకే  ప్రణాళిక సిద్ధం చేసింది. 
  
రెండు లక్షల చెట్లు 
జిల్లాలో రెండు లక్షల వరకు పనస చెట్లు ఉన్నట్టు ఉద్యానవన శాఖాధికారుల అంచనా. మారేడుమిల్లి, వై.రామవరం, రంపచోడవరం, అడ్డతీగల, చింతూరు, పాడేరు, చింతపల్లి, అరకు (Araku) తదితర 19 మండలా­ల్లో పనస చెట్లు ఎక్కువగా ఉన్నాయి. గిరిజనులు తో­ట­లుగానే కాకుండా ఇళ్ల వద్ద, పంట పొలాల్లో కూడా ప­నసను పెంచుతారు.  పనస కాయల (Jack Fruit) దిగుబడి ఫిబ్రవరి­లో ప్రారంభమై మే వరకు లభిస్తాయి. పనస మొదటి దశ­లో తొనలు, విత్తనాలు(పనస పిక్కలు) తయారు కా­వు. 

వీటిని ఎక్కువగా కూరలు, పచ్చళ్ల తయారీకి ఉప­యోగిస్తారు. గింజలు అభివృద్ధి చెందే దశలో కూ­డా కూర పనసగా ఉప­యో­గిసా­్తరు.   తొనలు వచ్చినా తీí­³, వాసన లేకుండా ఉంటా­యి. వీటిని చిప్స్‌ తయారీ­లో ఉపయోగిస్తారు. ప­న­స తొక్కు పచ్చడి, బజ్జీలు, ప­కో­డి, బిర్యానీ, హల్వా, చాక్లెట్స్, తాండ్ర, జా­మ్,­ జ్యూస్, ఐస్‌క్రీమ్, పనస పిక్కల పిం­డితో పూరీ­లు, అప్పడాలు తయా­­రు చేయవచ్చు. కేవీకే శాస్త్రవేత్తలు వీటి తయారీపై ఇప్పటికే  గిరిజన యు­వ­తకు శిక్షణ ఇ­చ్చా­రు. 

ఆర్థిక భరోసా 
జిల్లాలో మేలుజాతి పనస ఉత్ప­త్తులు సీజన్‌లో లభిస్తాయి. అనే­క పోషక విలువలు ఉన్న పనసను గిరిజను­లు వారపు సంతల్లో, గ్రామాలకు వచ్చే వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కొనుగోలు దా­రులులేకపోతే పశువులకు ఆహారంగా వేస్తున్నా­రు.  గిరిజన రైతులు గరిష్ట ధర పొందలేకపోతున్నారు. గతంలో కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందిన పలువురు  ఉప ఉత్పత్తులు తయారు చేసి వారపు సంతల్లో విక్రయిస్తూ మంచి ఆదాయం పొం­దు­తున్నారు. 

పోషక విలువలెన్నో.. 
పనసలో మెండైన పోషక విలువలు ఉన్నాయి. విటమిన్లు, పీచుపదార్థం, ఖనిజ లవణాలు ఉన్నాయన్నారు. దీంతో పనస ఉప ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. గిరిజన యువత కొద్దిపాటి మెలకువలు పాటిస్తే పనసకాయలతో పచ్చడి, చిప్స్, పనస జ్యూస్, జామ్‌తోపాటూ పలు రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. 

నోరూరించే చాక్లెట్లు 
పనస తొనలతో తయారు చేసే చాక్లె­ట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సు­లభంగా తయారు చేయవచ్చు. కేజీ ప­న­స తొనలను వేడి నీటిలో ఉడికించి, గు­జ్జు­­గా తయారు చేసుకోవాలి. గిన్నె­లో నె­య్యి వేసుకుని పనసగుజ్జు, కరిగించిన పాలపొ­డి, వేయించిన కోకో పౌడరు, పంచదార వే­సి కాసేపు వేయించుకోవాలి. చల్లారిన త­రువాత ముక్కలుగా చేసుకోవాలి. అంతే..  పనస చాక్లెట్లు సిద్ధమవుతాయి.

చ‌ద‌వండి: వైజాగ్‌పై చంద్రబాబు సర్కారు శీతకన్ను!

కరకరలాడే చిప్స్‌పచ్చి పనస తొనలతో వీటిని తయారు చేస్తారు. అర కేజీ తొనల నుంచి పిక్కలు వేరు చేయాలి. తరువాత అర ఇంచీ మందంతో పొడవుగా కోయాలి. కోసిన పనస తొనల ముక్కలను గుడ్డలో కట్టి మరిగించిన నీళ్లలో రెండు నిమిషాల పాటు ఉంచి బయటకు తీ­యా­లి.తరువాత వా­టిని అరబెట్టుకోవాలి. ఒక పాత్రలో నూనె వేసి తగినంత పసుపు వేసి మరిగించాలి. నూనె బాగా మరి­గిన తరువాత అర­బెట్టుకొన్న పనస తొనల ముక్క­లను వేయించాలి. వాటిపై ఉప్పు,­కారం జల్లుకుంటే వేడివేడి చిప్స్‌ రెడీ

తాండ్ర తయారీ ఇలా  
పిక్కలు వేరు చేసిన కేజీ  పనస తొనలను వేడినీళ్లలో వేసుకుని మరిగించుకోవాలి. మెత్తబడిన  పనస తొనలను మిక్సర్‌లో వేసుకొని గుజ్జుగా చేసుకోవాలి. ట్రేలలో సమాంతరంగా ఈ గుజ్జును వేసుకోవాలి. తేమ ఆరే వరకు ఎండలోగాని, డ్రయర్ల గాని ఉంచుకోవాలి. తేమ ఆరిపోతే తాండ్ర ట్రేలో నుంచి సులభంగా వస్తుంది. వీటితో పాటు మరికొన్ని విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వనున్నారు.

మార్చిలో మరోదఫా శిక్షణ 
పందిరిమామిడి కేవీకేలో మార్చి నెల­లో మా­రోమారు పనసతో విలువ ఆధారిత ఉత్పత్తు­ల తయారీపై శిక్షణ ఇవ్వనున్నాం. ఈ ఏడా­ది ఏ­జెన్సీలో 25 ఎకరాల్లో  పనస మొక్కలు నాటించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జిల్లాలో అధిక సంఖ్యలో పనసపండ్లు లభిస్తున్నా గిరిజనులు పూర్తిస్థాయిలో ఆదాయం పొందలేకపోతున్నారు. పనసతో వి­లువ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. గిరిజన యువతను  ఆ దిశగా ప్రోత్సహించేందుకు కేవీకే కృషి చేస్తోంది.   
– క్రాంతి, ఉద్యానవన శాస్త్రవేత్త, కేవీకే, పందిరిమామిడి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement