ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ విద్యార్హత కేసులో జనవరి 18న అన్ని రికార్డులతో తమ ఎదుట హాజరుకావాలని అసెంబ్లీ పీఐవోను ఆర్టీఐ కమిషన్ ఆదేశించింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ విద్యార్హత కేసులో జనవరి 18న అన్ని రికార్డులతో తమ ఎదుట హాజరుకావాలని అసెంబ్లీ పీఐవోను ఆర్టీఐ కమిషన్ ఆదేశించింది. శుక్రవారం ఆర్టీఐ కమిషనర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కేసును వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణకు లా డిగ్రీ లేదని...ఆయన ఆ పదవికి అనర్హుడంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.