ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.
హైదరాబాద్: ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.