
గాంధీ, నెహ్రూలను కించపర్చొద్దు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ను తక్కువ చేసి మాట్లాడటం ప్రధాని మోదీకి సరికాదని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గుజరాత్కు చెంది న వ్యక్తి కావడం వల్లనే పటేల్ను ప్రధాని కానివ్వలేదని మోదీ ఆరోపించడం సరికాదన్నారు. నెహ్రూ అనుభవాన్ని, దార్శనికతను గమనించిన తర్వాతనే ప్రధానిగా చేయడానికి గాంధీ సిద్ధపడ్డారన్నారు.