Jawaharlal Nehru
-
ఆ లేఖల్లో ఏముంది?
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లేఖలు మరోసారి వార్తల్లోకెక్కాయి. స్వాతంత్య్ర పోరాట సమయంలో పుంఖానుపుంఖాలుగా ఆయన రాసిన లేఖలు అనంతర కాలంలో ఎంతగానో ప్రసిద్ధికెక్కాయి. బ్రిటిషర్ల చెరలో జైలు జీవితం అనుభవిస్తూ కూతురు ఇందిరకు రాసిన లేఖలైతే సంకలనాలుగా వెలువడి ఎంతో ఆదరణ కూడా పొందాయి. జయప్రకాశ్ నారాయణ్ వంటి రాజకీయ ఉద్ధండులు మొదలుకుని భౌతికశాస్త్ర దిగ్గజం ఆల్బర్ట్ ఐన్స్టీన్ దాకా ప్రముఖులెందరితోనో నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు లోకప్రసిద్ధం. చక్కని రచనా శైలికే గాక అద్భుతమైన అభివ్యక్తికి వాటిని నిలువెత్తు నిదర్శనంగా చెబుతుంటారు. నెహ్రూ తదనంతరం ఆయన లేఖలన్నింటినీ ప్రధానమంత్రి మ్యూజియం, లైబ్రరీ (పీఎంఎంఎల్)లో భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో 2008లో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ వాటన్నింటినీ తన నివాసానికి తరలించిన వైనం ఇప్పుడు రాజకీయ రగడకు దారితీస్తోంది. నెహ్రూ లేఖలతో కూడిన ఏకంగా 51 పెట్టెలను తన సోనియా తరలించుకుని వెళ్లారని బీజేపీ ఆరోపిస్తోంది. వాటన్నింటినీ తిరిగివ్వాల్సిందిగా పీఎంఎంఎల్ తాజాగా సోనియాను కోరింది. కనీసం జిరాక్సులో, పీడీఎఫ్లో అయినా అందజేస్తే భద్రపరుస్తామంటూ విజ్ఞప్తి చేసింది. దాంతో, ‘‘అసలు నెహ్రూ లేఖలను సోనియా పనిగట్టుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచి్చంది? అందుకెవరు అనుమతించారు? 16 ఏళ్లుగా తన వద్దే ఎందుకు ఉంచుకున్నారు? ఎందుకు తిరిగివ్వడం లేదు? అంతగా దాచాల్సిన అంశాలు ఆ లేఖల్లో ఏమున్నాయి?’’ వంటి అనేకానేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీటికి సమాధానంగా అన్ని వేళ్లూ నెహ్రూ–ఎడ్వినా లేఖలవైపే చూపిస్తుండటం విశేషం. ఎడ్వినా నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్బాటెన్ భార్య. ఆమెకు, నెహ్రూకు మధ్య చాలా సాన్నిహిత్యం ఉందంటారు. ‘‘నిజానికిది బహిరంగ రహస్యమే. అప్పట్లో రాజకీయ వర్గాల్లో నిత్యం అందరి నోళ్లలోనూ నానిన అంశం కూడా’’ అని చరిత్రకారులు కూడా చెబుతారు. ‘‘నెహ్రూ, ఎడ్వినా సాన్నిహిత్యానికి వారి నడుమ సాగిన లేఖలు అద్దం పట్టాయి. దాంతో అవి వెలుగు చూడకూడదని సోనియా భావించారు. అందుకే వాటితో పాటు అన్ని లేఖలనూ పీఎంఎంఎల్ నుంచి తరలించుకుపోయారు’’ అని బీజేపీ ఆరోపిస్తోంది. ‘గాం«దీ–నెహ్రూ కుటుంబం’ అంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం దొరికినప్పుడల్లా పదునైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖల రగడ ఎంత దూరం వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సోనియా తరలించుకుపోయిన నెహ్రూ లేఖలన్నింటినీ తిరిగి ఇప్పించాలంటూ ఆమె కుమారుడు, విపక్ష నేత రాహుల్గాం«దీకి పీఎంఎంల్ సభ్యుడు, చరిత్రకారుడు రిజ్వాన్ కాద్రీ డిసెంబర్ 10న లేఖ రాశారు. ‘‘అవన్నీ ఎడ్వినా, ఐన్స్టీన్, జేపీ, పద్మజా నాయుడు, విజయలక్ష్మీ పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబూ జగ్జీవన్రాం, జేబీ పంత్ తదితరులకు నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు. 1971లో ఇందిర వాటిని పీఎంఎంల్ (అప్పట్లో నెహ్రూ మ్యూజియం)కు అప్పగించారు. అవి పీఎంఎంల్లో ఉంటే స్కాలర్లకు, పరిశోధకులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. దాంతో నెహ్రూతో ఎడ్వినా సాన్నిహిత్యం ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. మిగతా లేఖల సంగతి ఎలా ఉన్నా గత చరిత్ర, బీజేపీ ఆరోపణల పుణ్యమా అని నెహ్రూ–ఎడ్వినా లేఖలపైనే అందరికీ ఆసక్తి నెలకొంది. ‘‘వాటిలో అంత గోప్యంగా ఉంచాల్సిన అంశాలేమున్నాయి? ఎందుకు వాటిని సోనియా తన ఇంట్లో దాచిపెట్టుకున్నారు? ఆమె బదులిచ్చి తీరాలి’’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ డిమాండ్ చేయడం విశేషం. పార్టీ మరో అధికార ప్రతినిధి సంబిత పాత్ర కూడా సోమవారం ఏకంగా లోక్సభలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై సరైన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బదులివ్వడం విశేషం. అనంతరం పాత్ర మీడియాతో కూడా దీనిపై మాట్లాడారు. ‘‘నెహ్రూ లేఖలు గాంధీ కుటుంబపు వ్యక్తిగత ఆస్తి కాదు. దేశ సంపద. వాటిని బయట పెట్టడానికి గాంధీ కుటుంబం వెనకాడుతుండటం ఎన్నో సందేహాలకు తావిస్తోంది. సరిగ్గా పీఎంఎంల్లోని లేఖల డిజిటైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టే ముందే నెహ్రూ లేఖలను సోనియా తీసుకెళ్లారు. వాళ్లేం దాస్తున్నారో తెలుసుకోవాలని దేశం భావిస్తోంది’’ అన్నారు. ‘గాఢమైన’ బంధం నెహ్రూ, ఎడ్వినా మధ్య నడిచిన లేఖలు ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేవు. అయితే ఎడ్వినా కూతురు పమేలా హిక్స్ తదితరులు వాటికి సంబంధించిన పలు విశేషాలను గతంలో పంచుకున్నారు. నెహ్రూ, ఎడ్వినా మధ్య ‘అత్యంత గాఢమైన’ బంధం కొనసాగిందని పమేలా తన పుస్తకంలో స్పష్టంగా పేర్కొనడం విశేషం! ‘‘నా తల్లి, నెహ్రూ పరస్పరం ఎంతగానో ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత గౌరవాభిమానాలుండేవి. దీన్ని నేను ఎన్నోసార్లు గమనించాను. మా అమ్మ తానెంతగానో తపించిన ఆదర్శ సాహచర్యాన్ని పండిట్జీ (నెహ్రూ) రూపంలో పొందింది. అయితే వారిద్దరి మధ్య శారీరక బంధానికి అంతగా అవకాశం లేకపోయింది. నిత్యం తమను చుట్టుముట్టి ఉండే సిబ్బంది తదితరుల వల్ల ఏకాంతం దొరకడం గగనంగా ఉండేది. ఎడ్విన్ భారత్ వీడేముందు నెహ్రూకు ఓ ఉంగరమివ్వాలని భావించారు. తీసుకుంటారో లేదోనని చివరికి ఆయన కుమార్తె ఇందిరకు ఇచ్చి వెళ్లారు’’ అని పమేలా చెప్పుకొచ్చారు. నెహ్రూ తన వీడ్కోలు ప్రసంగంలోనూ ఎడ్వినాను ఆకాశానికెత్తిన వైనాన్నీ ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలుగువారి జీవధారకు 69 వసంతాలు
విజయపురిసౌత్: నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రేపటితో 69 ఏళ్లు నిండుతాయి. ఆనాడు నెహ్రూ కన్న కలలను నిజం చేస్తూ కోట్లాది మంది ప్రజలకు జీవనాధారంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అన్నపూర్ణగా ఆధునిక దేవాలయంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు విరాజిల్లుతోంది. 1955 డిసెంబర్ 10న ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ఈనాడు నాగార్జున సాగరానికి నేనిక్కడ జరిపే శంకుస్థాపనను పవిత్రకార్యంగా పరిగణిస్తున్నాను. ఇది భారత ప్రజాసౌభాగ్య మందిరానికి జరుగుతున్న శంకుస్థాపన. ఈనాడు మనం ఆసేతుహిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న నవదేవాలయాలకు ఇది చిహ్నం’ అని అన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో మానవశక్తితో నిర్మితమైన ప్రాజెక్టు నాగార్జునసాగర్. సాగునీటి కోసం కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. కుడికాలువను జవహర్ కాలువగా, ఎడమకాలువను లాల్బహదూర్ కాలువగా పిలుస్తారు. జవహర్ కాలువ సాగర్ రిజర్వాయర్ నుంచి ఆనకట్టకు కుడివైపు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కాలువ పనులను అప్పటి ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1956 అక్టోబర్ 10న ప్రారంభించారు. దక్షిణ విజయపురి (రైట్బ్యాంకు) వద్ద ఈ కాలువ సొరంగ మార్గం ద్వారా ప్రారంభమై 392 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11లక్షల 74వేల 874 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్ ఎడమవైపు నుంచి ప్రారంభమయ్యే కాలువకే లాల్బహదూర్ కెనాల్ అని పేరు. ఈ కాలువ పొట్టిచెలమ నుంచి చలకుర్తి వరకు సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ కాలువ నిర్మాణాన్ని ఆనాటి గవర్నర్ భీమ్సేన్ సచార్ 1959లో ప్రారంభించారు. ఈ కాలువ పొడవు 349కిలోమీటర్లు. ఈ కాలువ కింద 10 లక్షల 37వేల 796 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు కుడికాలువలాగే ఈ కాలువకు కూడా నీటిని విడుదల చేయవచ్చు. సాగర్ ప్రాజెక్టు ఒకసారి నిండితే ప్రభుత్వానికి 20 వేల కోట్ల రూపాయలకు పైచిలుకు ఆదాయం వస్తుందని అంచనా. 1967 ఆగస్టు 4న నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు నీటిని వదిలారు. సాగర్ జలాశయం విస్తీర్ణం,110 చదరపు మైళ్లుగరిష్ట నీటిమట్టం 590 అడుగులుడెడ్ స్టోరేజి లెవల్ 490 అడుగులునీటి నిల్వ 408.24 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 312.0. టీఎంసీలు)డెడ్స్టోరేజినీరు 179.16 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 168 టీఎంసీలు)నీటివిడుదలకు కనీస నీటిమట్టం 510 అడుగులు -
పరవాడ నెహ్రూ ఫార్మాసిటీ.. ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీక్
సాక్షి,అనకాపల్లి : జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విషవాయువులు లీకయ్యాయి. ఫార్మాసిటీలోని ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీకవ్వడంతో ఎనిమిది మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుల్లో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. -
నెహ్రూకు నివాళులర్పించిన మోదీ
-
రేపటి భావి భారత ఆశా దీపాలు వీళ్లే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి పిల్లలే రేపటి భావి భారత ఆశా దీపాలు అంటూ తన ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారాయన. బాలల దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా.. బాల్యం.. మళ్లీ ఎప్పటికీ తిరిగిరాని, మరిచిపోలేని మధుర జ్ఞాపకం. బాల్యంలో ఉన్న మన పిల్లలను ఆనందంగా, ఆరోగ్యంగా ఎదగనిద్దాం. వాళ్లే రేపటి భావి భారత ఆశా దీపాలు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. బాల్యం.. మళ్లీ ఎప్పటికీ తిరిగిరాని, మరిచిపోలేని మధుర జ్ఞాపకం. బాల్యంలో ఉన్న మన పిల్లలను ఆనందంగా, ఆరోగ్యంగా ఎదగనిద్దాం. వాళ్లే రేపటి భావి భారత ఆశా దీపాలు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2024 పిల్లలకు మనం ఇచ్చే విలువైన ఆస్తి ఏదైనా ఉందంటే.. అది చదువు మాత్రమే.కేవలం పిల్లల చదువు మాత్రమే పేదల తలరాతను మార్చగలదని బలంగా నమ్మి.. గత ఐదేళ్లు ఆ దిశగా అడుగులు వేసిన @ysjagan గారుపిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.#ChildrensDay#YSJaganForQualityEducation pic.twitter.com/xS9e0J0nmh— YSR Congress Party (@YSRCParty) November 14, 2024 -
Nehru Birthday: ఆ హత్యాయత్నాల నుంచి నెహ్రూ తప్పించుకున్నారిలా..
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1889, నవంబరు 14న జన్మించారు. నెహ్రూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. స్వాతంత్య్రోద్యమంలో నెహ్రూ పలుమార్లు జైలుకు వెళ్లారు. నెహ్రూ ప్రధానిగా ఉండగా ఆయనపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. వాటినుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.జవహర్లాల్ నెహ్రూపై మొదటి హత్యాయత్నం 1947లో జరిగింది. ఆ సమయంలో నెహ్రూ దేశ తాత్కాలిక ప్రభుత్వానికి అధ్యక్షునిగా ఉన్నారు. నెహ్రూ నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో కారులో ప్రయాణిస్తుండగా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ ప్రాంతం నేటి పాకిస్థాన్లో ఉంది. 1948 జూలైలో నెహ్రూపై రెండవసారి హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వచ్చాయి. నెహ్రూను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీకి వెళ్తున్న ముగ్గురిని బీహార్లోని ధర్మశాలలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రెండు పిస్టల్స్, రెండు రివాల్వర్లు, రైఫిల్, కంట్రీ మేడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో వీరి కుట్ర బయటపడింది.1953లో కూడా నెహ్రూపై హత్యాయత్నం జరిగింది. నాటి నివేదికల ప్రకారం నెహ్రూ ప్రయాణిస్తున్న బొంబాయి-అమృతసర్ ఎక్స్ప్రెస్ రైలును పేల్చివేసేందుకు కొందరు కుట్ర పన్నారు. అయితే కళ్యాణ్లోని రైల్వే పట్టాల దగ్గర కూర్చున్న ఇద్దరిని పోలీసులు పట్టుకోవడంతో ఈ కుట్ర విఫలమైంది.1955లో నెహ్రూపై ఒక రిక్షా పుల్లర్ కత్తితో దాడి చేశాడు. నాటి వార్తాపత్రికల నివేదికల ప్రకారం 32 ఏళ్ల రిక్షా పుల్లర్ నుంచి పోలీసులు ఆరు అంగుళాల కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి నెహ్రూ కారుపైకి దూకాడు. దీనిని గమనించిన నెహ్రూ అతనిని కిందకు నెట్టివేశారు. 1955లో నెహ్రూ ముంబైలోని ఒక వేదికపై ప్రసంగిస్తుండగా వందలాది మంది రాళ్లతో దాడికి ప్లాన్ చేశారని నాడు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.ఇది కూడా చదవండి: 15న మరో రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య -
Children's Day 2024: బాలల నేస్తం.. చాచా నెహ్రూ..
నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి జాతి సంపదలు.. విరిసివిరియని కుసుమాలు.. సరైన విద్యతో మాత్ర మే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చు. సుసంపన్నమైన దేశం కోసం.. సిద్ధమవుతున్న నేటి ఆణిముత్యాలే రేపటి మన జాతి రత్నాలు. తల్లిదండ్రుల కలల ప్రతిరూపాలు.. భావి భారత పౌరులు. పాలబుగ్గల నవ్వులు, అపురూపమైన క్షణాలు.. మరపురాని జ్ఞాపకాలు.. బాల్యం ఒక వరం. పిల్లలు భగవంతు ని స్వరూపాలు.. కలా్లకపటం ఎరుగని కరుణామయులు.. రివ్వున ఎగిరే గువ్వలు.. వారికి విద్యతో పాటు మంచి విలువలను నేర్పుదాం.నవంబర్ 14 వచ్చింది.. బాలలకు బోలెడు సందడి తెచ్చింది. ఈ రోజంటే పిల్లలకు పండగ లాంటిది. బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకొంటారు. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ. పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే వల్లమానిన ప్రేమ. ఆయనను ముద్దుగా ‘చాచా నెహ్రూ’, ‘చాచాజీ’ అని పిలుచుకుంటారు. అందుకే 1889 నవంబర్ 14న నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన బర్త్డేను ‘చిల్ర్డన్స్ డే’ నిర్వహించడం ఆనవాయితీ. ఈ రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం ఉంటుంది. పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, ఇతర కానుకలను పంచిపెడతారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లల్లో ఉత్సాహం నింపుతారు.కరీంనగర్ అర్బన్/సిరిసిల్ల టౌన్: పిల్లలకు పౌష్టికాహారం అందితేనే ఆరోగ్యంగా ఉంటారు.. నాణ్యమైన విద్యనందిస్తే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు.. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి.. నార్మల్ డెలివరీ అయితే భవిష్యత్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు.. విద్యార్థినులకు రక్షణ ఉండాలి.. పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలి.. ఇవన్నీ గుర్తెరిగిన కరీంనగర్, రాజన్నసిరిసిల్ల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్కుమార్ ఝా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఒకరు శుక్రవారం సభ పేరిట అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తూ, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందేలా చూస్తుంటే.. మరొకరు పాఠశాలలు, కళాశాలల్లో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్లు ఏర్పాటు చేయిస్తున్నారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. జిల్లాలో శుక్రవారం సభ పేరిట అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. ఏఎన్ఎంల ద్వారా గర్భిణులకు వైద్య సేవలు, అంగన్వాడీ సూపర్వైజర్ల ద్వారా చిన్నారుల ఎత్తు, వయసుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. గర్భిణులకు నార్మల్ డెలివరీ అయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఇక, తన పుట్టినరోజుతోపాటు వివిధ సందర్భాల్లో కలిసేవారు పుష్పగుచ్ఛాలు కాకుండా పెన్నులు, పుస్తకాలు, నోట్బుక్కులు తీసుకురావాలని సూచించగా కుప్పలు తెప్పలుగా వచ్చాయి. వాటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేశారు. అలాగే, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే సినిమాలు చూపిస్తూ వాటిపై సమీక్షలు రాయిస్తున్నారు. హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలపై ఆరా తీస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. సైన్స్ మ్యూజియాన్ని తెరిపించి, సైన్స్ చర్చలు, సదస్సులు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పదోతరగతిలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా బాద్యతలు చేపట్టినప్పటి నుంచి బాలల విద్యాభ్యాసంపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ టీచర్ల పనితీరును పరిశీలిస్తున్నారు. ఆయనే స్వయంగా పాఠాలు బోధిస్తూ.. విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. గురుతర బాధ్యతలు విస్మరించే ఉపాధ్యాయులకు సింహస్వప్నంగా ఉంటున్నారు. స్కూళ్లను సందర్శించిన సమయంలో ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఆడపిల్లల రక్షణకు, వారి సమస్యల పరిష్కారం కోసం గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్లు ఏర్పాటు చేయిస్తున్నారు. విద్యా ప్రమాణాల వృద్ధిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. -
పట్టనట్లు నెహ్రూ... పంతంతో పటేల్!
కొన్ని చారిత్రక సంఘటనలు దశాబ్దాలు దాటినా కూడా చర్చనీయాంశాలుగా కదలాడుతూనే ఉంటాయి. అలాంటి అంశమే 1948లో జరిగిన హైదరాబాద్ యాక్షన్. ‘ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్’ ద్వారా భారత ఉపఖండాన్ని భారత్, పాక్లుగా విభజిస్తున్నట్టు అప్పటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ ఆట్లీ 1948 జూన్ 3న ప్రకటించి ఉపఖండంలోని 562 రాచ రిక రాజ్యాలు ఇక నుండి ఏదో ఒక దేశంలో విలీనం అవొచ్చు లేదా, స్వతంత్రంగా ఉండొచ్చు అని తేల్చి చెప్పారు. దీనికి హైదరాబాదు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జూన్ 11న స్పందిస్తూ, హైదరాబాదు సంస్థానం స్వతంత్ర ఇస్లామిక్ దక్కన్ రాష్ట్రంగా ఉంటుందని ప్రకటించారు. వెంటనే ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా, ‘‘నిజాం ప్రతిపాద నకు బేషరతుగా పాకిస్తాన్ మద్దతుంటుంది’’ అని తెలిపారు. దాంతో 82,688 చదరపు మైళ్ల విస్తీర్ణంలో, 85 శాతం హిందూ, 13 శాతం ముస్లిం జనాభాతో ఉన్న హైదరాబాదు మున్ముందు ప్రజా స్వామ్య, లౌకిక, స్వతంత్ర భారతదేశానికి కొరకరాని కొయ్యగా మారుతుందని అప్పటి రాజకీయ నేతలు ఊహించారు.ఆ క్రమంలో రాచరిక రాష్ట్రాల రాజులు ‘ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్’ కూటమిగా ఏర్పాటై, 1947 ఆగస్టు తర్వాత తమ తమ ‘ఇలాఖా’లను భారతదేశంలో విలీనం చేశారు. కశ్మీరు, జునాఘఢ్, హైదరాబాదు రాష్ట్రాలు మాత్రం దీనికి ససేమిరా అన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాదును భారత్లో కలపడానికి వీల్లేదని ప్రకటించిన ‘మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్–ముస్లిమీన్’ నేత ఖాసీం రిజ్వీ 1948 ఫిబ్రవరి నుండి రెండు వేల మంది ముస్లిం రాడికల్ యువకులను గ్రామీణ ప్రాంతాల్లో హిందువులపై అరాచకాలకు, స్త్రీలపై అనేక అమానుష చర్యలకు పురిగొలిపాడు. ఇదేమి పట్టనట్టుగా ఉండి పోయాడు మీర్ ఉస్మాన్ అలీ. హైదరాబాదులో హిందువులపై జరుగుతున్న హత్యాచారాలను భారత ప్రభుత్వం అరికట్టాలని ఉపప్రధాని సర్దార్ పటేల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగులో గళ మెత్తారు. అయినా ప్రధాని నెహ్రూ, ఆయన విధేయులు నోరు మెదప లేదు!భారత్పై మిలిటరీ దాడికి 1948 జూన్ నుండే నిజాం ప్రభుత్వం ఐరోపా నుండి మెషీన్ గన్స్, గ్రెనేడ్లు, ఫైటర్ విమానాలను కరాచీ (పాకిస్తాన్)కి, అటునుండి సముద్రం ద్వారా పోర్చుగీసు ఆధీనంలోని గోవాకు తరలించి, ఆ తర్వాత హైదరాబాదుకు చేరవేయటం ఆరంభించింది. ఇక సమయం ‘బర్బాద్’ చేస్తే నష్టమే అనుకుని, తన సన్నిహి తులు వి.పి.మీనన్, హెచ్.వి. అయ్యంగార్, డిఫెన్స్ సెక్రటరీ హెచ్.ఎం. పటేల్ పర్యవేక్షణతో ‘ఆపరేషన్ పోలో’ అనే సీక్రెట్ కోడ్తో హైదరాబాదుపై విరుచుకుపడటం కోసం పథకం వేశారు వేశారు ‘ఉక్కు మనిషి’ పటేల్. ఆర్మీ జనరల్ జయంతో నాథ్ చౌధురీ ఇన్చార్జిగా పుణె కంటోన్మెంటులో సరిపడా యుద్ధ సామగ్రి, గోర్ఖా రైఫిల్స్, బర్మా బెటాలి యన్ ఫౌజీలను ఆగస్టు నెలలోనే సిద్ధం చేశారు. ఆపరేషన్కు ముందు సెప్టెంబర్ 8న కేబినెట్ మీటింగులో, ‘‘పరిస్థితి చేయి దాటక ముందే హైదరాబాదును ముట్టడించాలి. దేశం నడి బొడ్డులోని ఈ పుండును ఇలా వదిలేస్తే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరం’’ అని తేల్చేసిన పటేల్పై చిందులు తొక్కారు నెహ్రూ! ఆయనతో వాదించదలచు కోలేదు సర్దార్. 1948 సెప్టెంబర్ 12న షోలాపూర్ దగ్గర గంగాపూర్ రైల్వే స్టేష న్లో కొందరు హిందువులను రజాకార్లు, భారత భూభాగంలో చొరబడి హత మార్చారు. ఈ వార్త ఢిల్లీ చేరటమే తడవు, ఆపరేషన్ పోలోకు గ్రీన్ సిగ్నల్ పంపారు.మరుసటి రోజు, సెప్టెంబర్ 13న ఉదయం 4 గంటల నుండి భారత బల గాలు బళ్లారి, షోలాపూర్, అహ్మద్నగర్, విజయవాడ మీదుగా నైజాం స్టేట్ నలు వైపులా సరిహద్దులను దాటుతూ హైదరాబాదు నగరం వైపు కదిలాయి. ఈ ఆకస్మిక ఆక్ర మణకు నీరుగారి పోయాడు నిజాం ఆర్మీ చీఫ్ మహమ్మద్ ఇద్రూస్. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ సామగ్రిని వాడే శిక్షణ లేక పోవటంతో వారి తుప్పుపట్టిన తుపాకులు, జీపులు భారత సైన్యాన్ని ఎదుర్కోలేక పోయాయి. సెప్టెంబరు 17 మధ్యాహ్నం సికింద్రాబాదు కంటోన్మెంట్కు 5 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది ఇండియన్ ఆర్మీ. పరిస్థితి క్షీణించటంతో ఉస్మాన్ అలీ ఖాన్, ఆర్మీ చీఫ్ ఇద్రుస్ ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాళ్ల బేరానికి వచ్చాడు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ రేడియో ప్రసంగం ద్వారా తన ప్రభుత్వాన్ని రద్దుచేసి, భారత సైనిక బలగాలకు లొంగిపోయినట్టు ప్రకటించారు.జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత అధికారి, ముంబై(2023లో విడుదలైన జాన్ జుబ్రిచ్చికి ‘డీథ్రోన్డ్: పటేల్, మేనన్అండ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ ఇండియా’ ఆధారంగా.) -
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భారత్లో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కొంతమంది బలహీనత వల్లే పీఓకేపై భారత్ నియంత్రణ కోల్పోయిందని ఆరోపించారు. ఒకరు చేసిన పొరపాటే దీనికి కారణమని చెప్పారు. భారత తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా ఉద్ధేశిస్తూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్లో ‘విశ్వబంధు భారత్’ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ పీఓకేపై జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ విలీనం చేసుకునే విషయమై లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయంటే తాను నమ్మబోనని చెప్పారు.లక్ష్మణ రేఖ వంటిది ఏదీ లేదని పేర్కొన్నారు. భారత్లో పీఓకే అంతర్భాగమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కొందరి బలహీనత వల్లే పీఓకే తాత్కాలికంగా మన నుంచి చేజారిందని, దానిపై పట్టు కోల్పోవడానికి వారి పొరపాటే కారణం అని నెహ్రూపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. విశ్వ వేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని, స్వీయ విశ్వాసాన్ని ఏనాడూ వీడొద్దన్నారు.చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, పాక్తో బీజింగ సహకారంపై జై శంకర్ విమర్శలు గుప్పించారు. ‘నేను చైనా రాయబారిగా ఉన్నాను, చైనా గత చర్యల గురించి మనందరికీ తెలుసు. ఈ భూమిని పాకిస్తాన్ లేదా చైనా తమదని చెప్పుకోలేదని మేము వారికి పదేపదే చెప్పాము. సార్వభౌమాధికారం ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే, అది భారతదేశం. మీరు ఆక్రమిస్తున్నారు, మీరు అక్కడ నిర్మిస్తున్నారు, కానీ చట్టపరమైన హక్కు మాదే.’నని పేర్కొన్నారు.చైనా పాకిస్తాన్ మధ్య 1963 సరిహద్దు ఒప్పందాన్ని కూడా జైశంకర్ ఎత్తి చూపారు. అక్కడ పాకిస్తాన్ దాదాపు 5,000 కి.మీ భూభాగాన్ని చైనాకు అప్పగించిందని అన్నారు. ‘1963లో, పాకిస్తాన్- చైనా తమ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి. చైనాను దగ్గరగా ఉంచడానికి, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో దాదాపు 5,000 కి.మీలను డ్రాగన్కు అప్పగించింది. ఈ ప్రాంతం భారతదేశానికి చెందింది’ ఆయన తెలిపారు. -
'నెహ్రూ అలా చేసి ఉంటే..' చైనాతో బంధంపై జైశంకర్ వ్యాఖ్యలు
ఢిల్లీ: కొత్త ఏడాది 2024లోనూ ప్రపంచ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొనడానికి భారత్ రాజకీయంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉందని చెప్పారు. తాను రాసిన నూతన పుస్తకం 'Why Bharath Matters' ఆవిష్కరణ సందర్భంగా ఈ మేరకు మాట్లాడారు. దేశ స్వాంతంత్య్రం తొలినాళ్లలో మాజీ ప్రధాని నెహ్రూ అనుసరించిన విదేశీ విధానాలను జైశంకర్ విమర్శించారు. భారత ప్రయోజనాలకే నెహ్రూ అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉంటే చైనాతో బంధంపై ఆశలు పెంచుకునేవాళ్లం కాదని జై శంకర్ అన్నారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, పండిట్ నెహ్రూకు మధ్య చైనా అంశంపై జరిగిన లేఖల మార్పిడి ఇందుకు సాక్ష్యంగా ఉందని చెప్పారు. చైనా అంశంలో నెహ్రూకు, పటేల్కు మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని జైశంకర్ తెలిపారు. భద్రతా మండలిలో చైనాకు చోటు దక్కేలా నెహ్రూ వ్యవహరించారని జైశంకర్ అన్నారు. ‘‘భద్రతా మండలిలో ముందుగా చైనా చోటు దక్కించుకోనివ్వండి’’ అని ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసిన లేఖ కూడా ఉందని పేర్కొన్నారు. చైనాతో యుద్ధం విషయంలో అమెరికా సహాయాన్ని నెహ్రూ నిరాకరించారని గుర్తుచేశారు. పటేల్కు ఈ విషయంలో భిన్నాభిప్రాయం ఉందని జై శంకర్ అన్నారు. "మనం అమెరికాపై ఎందుకు అపనమ్మకంతో ఉన్నాం.. మన ప్రయోజనాల దృష్టిలోనే చూడాలి. చైనా-అమెరికా బంధం కోణంలో కాదు." అని పటేల్ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎప్పుడంటే..? -
యుద్ధాన్ని ఎందుకు విరమించారు?
ఈ నెల 6న పార్లమెంట్లో ఆమోదం పొందిన రెండు బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంలోకేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... ‘జమ్మూ–కశ్మీర్ శాసనసభలో పీఓకేకు 24 స్థానాలూ, కశ్మీరీ నిర్వాసితులకు 2, పీఓకే నిర్వాసి తులకు ఒకటి కేటాయించాం. తొలి ప్రధాని నెహ్రూ తప్పులు కశ్మీర్ ఉగ్ర–వేర్పాటువాదా లకూ, పీఓకే పుట్టుకకూ కారణం. మన సైన్యం పాక్ సేనను తరుముతూ 3 రోజుల్లో కశ్మీర్ను స్వాధీనం చేసుకోనుండగా యుద్ధం విరమించారు. అనవసరంగా, హడావిడిగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి చేర్చారు. 70 ఏళ్ళుగా హక్కులు పోయి అన్యాయానికి గురైన కశ్మీరీలకు న్యాయం చేకూర్చడమే ఈ బిల్లుల ఉద్దేశం’ అన్నారు. దీంతో అనుపమ్ ఖేర్ లాంటి వలస కశ్మీరీ పండితులు, వైదికవాదులు కశ్మీరీ ప్రజాప్రతినిధులు కాగలరు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రయోజనమూ నెరవేరగలదు. అమిత్ షా మాట్లాడిన మాటల్లో ఒక్కటీ నిజం కాదు. నిజానికి నెహ్రూ వల్లనే కశ్మీర్ఇండియాలో కలిసింది. దాన్ని ఇండియాలో కలి పేందుకు షేక్ అబ్దుల్లాను ఒప్పించారు. నెహ్రూ మంత్రివర్గ నిర్ణయం ప్రకారం హోం మంత్రి పటేల్ విన్నపానికి 566 సంస్థానాల్లో 563 ఇండియాలో కలిశాయి. జమ్ము–కశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ మిగిలాయి. పాక్ సరిహద్దు జమ్మూ– కశ్మీర్, సముద్ర సరిహద్దులోని జునాగఢ్లను పాక్కు ఇచ్చి, దేశం మధ్యలోనున్న హైదరాబాద్ను ఇండియాలో కలపాలని పటేల్ ప్రతిపా దించారు. తన చిరకాల వాంఛకు విరుద్ధమైన ఈ ప్రతిపాదనను నెహ్రూ ఆమోదించలేదు. కశ్మీర్ యుద్ధ విరమణ సమయంలో మన సైన్యం పూంఛ్, రాజౌరీ ప్రాంతాలను రక్షిస్తూ ఉంది. విరమణ ప్రకటించకుంటే ఈ ప్రాంతాలు పాక్ అధీనమయ్యేవి.పఠాన్ లష్కర్ల గిరిజన చొరబాటు పేరుతో పాక్ సైన్యానికి భారత సేనకు మధ్య యుద్ధం జరిగింది. పాక్ ముందుగానే పాత రోడ్లను బాగు చేసి, కొత్త రోడ్లను నిర్మించి సైన్యాల తరలింపు నకు ఏర్పాట్లు చేసుకోవడం వల్ల వేలాది సైని కులు కశ్మీర్లోకి ప్రవేశించారు. భారతీయ సైన్యం చేరడానికి సరైన రవాణా మార్గం లేక తక్కువ సైనికులే చేరారు. నానాటికీ పెరిగిన పాక్ సైన్యం మొత్తం కశ్మీర్ను ఆక్రమించే పరిస్థితి దాపురించింది. ఈలోపు ఇండియాను ప్రతివాదిని చేస్తూ పాక్ ఐరాసకు పోవచ్చు. 1947 డిసెంబర్ 8న నెహ్రూ చాకచక్యంగా ఈ అవకాశాన్ని కాల్పుల విరమణ ప్రకటించి అడ్డుకున్నారు. ఆ తర్వాత ఐరాసకు కశ్మీర్ సమ స్యను తీసుకెళ్లారు. నెహ్రూ అనుమానించినట్లే అమెరికా పక్షపాతి అయిన ఐరాస భారత్కు న్యాయం చేయలేదు. – సంగిరెడ్డి హనుమంత రెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
నెహ్రూ వల్లే కశ్మీర్లో కుంపట్లు
జమ్మూ కశ్మీర్ ఏడు దశాబ్దాలుగా అనుభవిస్తున్న కష్టనష్టాలన్నింటికీ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన భారీ తప్పిదాలే ఏకైక కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో ఆరోపించారు. అవే అక్కడ ఉగ్రవాదానికి, వేర్పాటువాద కుంపట్లకు, పాక్ ఆక్రమిత కశ్మీర్ పుట్టుకకు కారణమయ్యాయని దుయ్యబట్టారు. ‘‘మన సైన్యం పాక్ దళాలను తరిమికొడుతున్న వేళ కశ్మీర్ను పూర్తిగా తిరిగి స్వా«దీనం చేసుకోక ముందే నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించారు. అంతటితో ఆగకుండా కశ్మీర్ అంశాన్ని హడావుడిగా, అనవసరంగా ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చేసిన ఈ రెండు ఘోర తప్పిదాలే కశ్మీర్లో ఆరని కుంపట్లకు కారణమయ్యాయి. నెహ్రూది నిజంగా చారిత్రక తప్పిదం!’’ అని మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్, విపక్షాలు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చాయి. బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించాయి. షా వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేశాయి. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ, నెహ్రూయే గనక అప్పట్లో సరైన చర్యలు తీసుకుని ఉంటే కశ్మీర్లో చాలా భాగాన్ని పాక్కు కోల్పోయే వాళ్లమే కాదని పునరుద్ఘాటించారు. అంతేగాక పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పుడో తిరిగి భారత్లో అంతర్భాగంగా మారేదని అభిప్రాయపడ్డారు. ‘‘అప్పటికి మన సైన్యం పంజాబ్ దాటి కశ్మీర్కేసి దూసుకుపోతోంది. నెహ్రూ కాల్పుల విరమణను కనీసం మూడు రోజులు ఆలస్యం చేసినా పీఓకే ఇప్పుడు భారత్లో అంతర్భాగంగా ఉండేది’’ అని ఆక్షేపించారు. అంతా అయిపోయాక, కాల్పుల విరమణ పొరపాటు నిర్ణయమని నెహ్రూ తీరిగ్గా అంగీకరించారని విమర్శించారు. ఆయన చేసిన సరిదిద్దుకోలేని తప్పిదం వల్ల భారీ భూభాగాన్ని దేశం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. 1962లో చైనాతో భారత యుద్ధానికి దారి తీసిన నెహ్రూ ‘భారీ తప్పిదం’ గురించి కూడా మాట్లాడాలని బిజూ జనతాదళ్ సభ్యుడు భర్తృహరి మహతబ్ కోరగా అమిత్ షా తనదైన శైలిలో స్పందించారు. ‘‘నెహ్రూ తప్పిదాల్లో రెండింటిని ప్రస్తావిస్తేనే విపక్షాలు అలిగి వాకౌట్ చేశాయి. ఇక భారీ తప్పిదం గురించి మాట్లాడితే ఏకంగా రాజీనామా చేసేవేమో!’’ అంటూ ఎద్దేవా చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఎవరినీ అవమానించడానికి కాదని, జరిగిన వాస్తవాలను దేశం ముందుంచే ప్రయత్నం మాత్ర మేనని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఇక 370 ఆరి్టకల్ను రద్దు చేసే దమ్ము గత కాంగ్రెస్ సర్కారుకు లేకపోయిందని అమిత్ షా ఎద్దేవా చేశారు. -
పిల్లల కోసం ఎంతో చేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని.. అందుకే ప్రపంచస్థాయి విద్యకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద పీట వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఎక్స్ ద్వారా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. దేశ తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులూ అర్పించారు. ‘‘మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ.. ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం. అంగన్వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం’’ అని సందేశంలో సీఎం జగన తెలియజేశారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపిన సీఎం జగన్.. రాష్ట్రంలోని బాలబాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం. అంగన్వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2023 -
భారత తొలి ప్రధాని నెహ్రు కాదు.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
బెంగళూరు: ప్రజల్లో తిరుగే ప్రజాప్రతినిధులు ఏది మాట్లాడినా కొన్ని నిమిషాల్లో జనాల్లోకి వెళ్లిపోతుంది. అలాంటి వ్యక్తులు దేశంలోని కీలక వ్యక్తులు గురించి మాట్లాడేటప్పడు ఎంతో జాగ్రత్త వహించాలి. అయితే, తాజాగా కర్ణాటకలో బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు కాదని ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. వివరాల ప్రకారం.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ భారత్కు తొలి ప్రధాని కాదని ఆయన అన్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ కాదు, మన తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని పాటిల్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. బ్రిటిషర్లలో సుభాష్ చంద్రబోస్ భయం రేకెత్తించడంతోనే వారు భారత్ను విడిచిపెట్టి వెళ్లారని అన్నారు. అలాగే, మనం నిరాహార దీక్షలతో స్వాతంత్ర్యం పొందలేదని, ఒక చెంపపై కొడితే మరో చెంపను చూపడం ద్వారా స్వాతంత్య్రం సిద్ధించలేదన్నారు. బ్రిటిష్ వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భయం కలిగించడం వల్లే మనకు స్వాతంత్ర్యం లభించిందని బాబాసాహెబ్ ఓ పుస్తకంలో రాశారని ఆయన పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా దేశంలో కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర ప్రకటన చేసిన సమయంలో స్వతంత్ర భారత్కు తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకొచ్చారు. ఇదే సయమంలో మాజీ కేంద్ర రైల్వే, టెక్స్టైల్స్ మంత్రి పాటిల్ మాట్లాడుతూ.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిషర్లు దేశం విడిచివెళ్లారని ఆయన కామెంట్స్ చేశారు. ఇక, వీరి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. 'Not Nehru, but Subhas Chandra Bose is the first PM of the country': Karnataka BJP MLA Basangouda Patil Yatnal pic.twitter.com/N8Ck6uZTcW — The Jaipur Dialogues (@JaipurDialogues) September 28, 2023 ఇదిలా ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇదే తొలిసారి కాదు. అంతకుముందు కూడా ఆయన.. కర్నాటకలో పాలక కాంగ్రెస్ ప్రభుత్వం ఆరేడు నెలల్లో కూలిపోతుందని ఆయన ఇటీవల జోస్యం చెప్పారు. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుందని అన్నారు. రాష్ట్రంలో అవినీతిని బీజేపీ లేవనెత్తుతుందని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తమిళనాడులో రసవత్తర రాజకీయం.. -
నెహ్రూ ఐడియా & జెఆర్డీ టాటా విజన్తో పుట్టిన కంపెనీ ఇదే!
బ్యూటీమీద ఎక్కువ దృష్టిపెట్టేవారికి 'లాక్మే' (Lakme) బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని రకాల సౌందర్య సాధనాలు, అలంకరణలను సంబంధించిన వస్తువులు ఇక్కడ లభిస్తాయి. నేడు కాస్మొటిక్ రంగంలో దూసుకెళ్తున్న ఈ కంపెనీ నిర్మించడం వెనుక భారతదేశ మొదటి ప్రధాని 'జవహర్ లాల్ నెహ్రూ' ఉన్నట్లు చాలామందికి తెలియకపోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జెఆర్డీ టాటాతో చర్చ.. భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే మహిళలు సౌందర్య సాధనాలు ఉపయోగించేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అవసరమని భావించిన నెహ్రూ ప్రముఖ పారిశ్రామిక వేత్త జెఆర్డీ టాటాతో చర్చించారు. దీనికి ఏకీభవించిన టాటా 1952లో లాక్మేను టాటా ఆయిల్ మిల్స్ అనుబంధ సంస్థగా స్థాపించారు. లాక్మే అనేది భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ కాస్మొటిక్ కంపెనీ. మహిళలు విదేశీ వస్తువులను అధికంగా వినియోగిస్తున్న కారణంగా జవహర్ లాల్ నెహ్రూ దీని ఏర్పాటుకి కారకుడయ్యాడు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయకుండా ఉండాలంటే స్వదేశీ కంపెనీ అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇక ఆ జియో రీఛార్జ్ ప్లాన్ లేదు.. కొత్త ప్లాన్ ఏంటంటే? లాక్మే అంటే ఫ్రెంచ్ భాషలో.. నిజానికి జెఆర్డీ టాటా ఈ కంపెనీ ప్రారంభించిన సమయంలో సంస్థకు ఏ పేరు పెట్టాలని తీవ్రంగా ఆలోచించాడు. అప్పట్లో సామాన్యులకు కూడా నచ్చే విధంగా ఉండాలని కొంతమంది ప్రతినిధులతో చర్చించి 'లాక్మే' అని నామకరణం చేశారు. లాక్మే అంటే ఫ్రెంచ్ భాషలో 'లక్ష్మీదేవి' అని అర్థం. పురాణాల్లో లక్ష్మీదేవి అందానికి ప్రతిరూపంగా భావించేవారు కావున ఈ పేరునే స్థిరంగా ఉంచేశారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు చూసుండరు..! ప్రారంభంలో లాక్మే ముంబైలోని ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమైంది. ఇది ప్రారంభమైన అతి తక్కువ సమయంలో మంచి ప్రజాదరణ పొందింది. ఈ కంపెనీ ప్రారంభించిన తరువాత దాదాపు విదేశీ వస్తువుల దిగుమతి భారతదేశంలో ఆగిపోయింది. 1961లో నావల్ టాటా భార్య సిమోన్ టాటా ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. సంస్థ అభివృద్ధికి ఈమె ఎంతగానో కృషి చేసింది. -
అవిశ్వాస తీర్మానం.. నెహ్రూ నుంచి మోదీ వరకు.. నెగ్గింది, ఓడింది వీరే!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అసలు సిసలైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై నేడు లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది. మణిపూర్ హింసపై అధికార, విపక్షాల మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై వాడివేడీగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అవిశ్వాసంపై చర్చను ప్రారంభించనున్నారు. మోదీ ఇంటి పేరు కేసులో శిక్ష కారణంగా నాలుగు నెలల తర్వాత పార్లమెంట్లోకి అడుగుపెట్టిన రాహుల్.. అవిశ్వాస తీర్మానంపై చేయనున్న తొలి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. రేపు, ఎల్లుండి కూడా అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగనుంది. ఆగస్టు 10న మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో అసలు అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి? దాన్ని ఎలా, ఎప్పుడు ప్రవేశపెడతారు? ఇప్పటి వరకు స్వతంత్ర భారత దేశంలో ఎన్నిసార్లు ప్రతిపాదించారు? ఎవరూ నెగ్గారు? ఎవరూ ఓడిపోయారు? ఎవరిపై ఎక్కువసార్లు అవిశ్వాసం ప్రవేశపెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.. చదవండి: No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ప్రసంగం.. ఏం మాట్లాడనున్నారు? గత ప్రభుత్వాలపై అవిశ్వాస తీర్మానాలు అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రజలకు, దేశానికి జవాబుదారీగా ఉంచడానికి ఉపయోగించబడింది. ప్రత్యేకించి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన సమయంలో వాటిని పడగొట్టడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. ►దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి 2018లో నరేంద్ర మోదీ వరకు అనేకమంది నేతలు ఈ అవిశ్వాన్ని ఎదుర్కొన్నారు. మొదటిసారిగా 1963లో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంపై విపక్ష నేత ఆచార్య జేబీ కృపలానీ ప్రవేశ పెట్టారు. 1962లో చైనాతో జరిగిన యుద్దంలో భారత్ ఓడిపోవడంతో ఆగస్టులో నెహ్రూపై ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. తర్వాత చదవండి: ‘బిల్కిస్ బానో’ కేసులో దోషులను వదలొద్దు ►మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యధికంగా 15సార్లు అవిశ్వాసాలను ఎదుర్కొన్నారు. అయితే అన్నింట్లోనూ ఆమె విజయం సాధించారు. ► లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు (మూడు చొప్పున), మొరార్జీ దేశాయ్ (రెండు), జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ఒకొక్కసారి ఎదురుకున్నారు. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వీపీ సింగ్తోపాటు 1999లో వాజ్పేయి ఒక ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. ► దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు 27 అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. తాజాగా మోదీ ఎదుర్కొంటున్నది 28వ తీర్మానం. ►చివరి సారి 2018లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోగా.. 199 ఓట్లతో విజయం సాధించింది. ప్రస్తుతం మరోసారి మోదీ ప్రతిపక్షాల నుంచి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు. దీంట్లోనూ బీజేపీ సర్కార్ తప్పక విజయం సాధించే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం అంటే.. అవిశ్వాస తీర్మానం అనేది కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయామని తెలియజేసేందుకు ప్రతిపక్షాలు ఉపయోగించే పార్లమెంటరీ సాధనం. దీనిని స్పీకర్ ఆమోదీస్తే విశ్వాసాన్ని కాపాడుకునేందుకు అధికార పక్షం లోక్సభలో మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెజారిటీ కోల్పోతే ప్రభుత్వం వెంటనే పడిపోతుంది. లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రతిపక్షాల ఆయుధం ప్రతిపక్షాలు తరచుగా ఓ వ్యూహాత్మక సాధనంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగిస్తూ ఉంటాయి. దీని ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, వారి వైఫల్యాలను ఎత్తిచూపడానికి, వీటన్నింటినీ సభలో చర్చించడానికి ఉపయోగపడుతోంది. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కూడా ఈ తీర్మానం కీలక పాత్ర పోషిస్తోంది. అదే సభలో తీర్మానం ఆమోదం పొందితే ప్రధానితో సహా మొత్తం మంత్రివర్గం రాజీనామా చేయాలి. లోక్సభ ప్రత్యేక హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం కేంద్ర కేబినెట్ సమిష్టిగా లోక్సభకు జవాబుదారీగా ఉంటుంది. అవిశ్వాస ప్రతిపాదనను కేవలం ప్రతిపక్షాలు మాత్రమే ప్రవేశపెట్టగలవు. అలాగే లోక్సభలో మాత్రమే దీనిని ప్రవేశపెట్టవచ్చు. రాజ్యసభలో ప్రతిపాదించేందుకు అనుమతి లేదు. పార్లమెంటులో సభ్యత్వం కలిగిన ఏ పార్టీ అయినా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అయితే అధికారంలో కొనసాగడానికి ప్రభుత్వం తప్పక తన మెజారిటీని నిరూపించుకోవాలి. చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్.. లోక్సభ స్పీకర్ కీలక నిర్ణయం ఎలా ప్రవేశపెడతారు.. లోక్సభ నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. లోక్సభ నియమాలు 198(1), 198(5) ప్రకారం స్పీకర్ చెప్పిన తర్వాత మాత్రమే దీనిని ప్రవేశపెట్టవచ్చు. లోక్సభకు తీసుకురావాల్సిన సమాచారాన్ని ఉదయం 10 గంటలలోపు సెక్రటరీ జనరల్కు ఆయన కార్యాలయంలో లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సభలో అదే సమయంలో కనీసం 50 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. తీర్మానం ఆమోదం పొందితే.. చర్చకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజులను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. దీనిపై అధికార పార్టీతో సహా, ప్రతిపక్షాలు చర్చిస్తాయి. అంతేగాక రాష్ట్రపతి సైతం తమ మెజార్టీని నిరూపించుకోమని ప్రభుత్వాన్ని కోరవచ్చు. ప్రభుత్వం నిరూపించుకోలేకపోతే మంత్రివర్గం రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ స్వయంగా ప్రకటిస్తారు. మరోవైపు మణిపుర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రకటన చేయాల్సిందేనని విపక్ష కూటమి పట్టుబడుతున్న విషయం తెలిసిందే. మూడు నెలలుగా మణిపూర్ హింస రుగులుతున్నా పరిస్థితులను అదుపు చేయడంలో, శాంతి భద్రతలు పునర్నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి(జూలై20) దీనిపై ప్రభుత్వం చర్చించాలని విపక్షాల మొండిపట్టుతో సభలు వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. -
సుప్రీం కోర్ట్ తీర్పును వెంటనే అమలుపర్చాలిని ప్రభుత్వానికి విజ్ఞప్తి
-
నెహ్రూ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోండి.. సీఎం కేసీఆర్కు భట్టి సూచన
సాక్షి, హైదరాబాద్: ‘గుండు సూది కూడా తయారు చేసే స్థితిలో లేని తరుణంలో మన దేశానికి నెహ్రూ మొదటి ప్రధాని అయ్యారు. పంచవర్ష ప్రణాళికలు, సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరుచుకుంటూ దేశా న్ని ప్రగతి బాటలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అందరం కలిసి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, ఈ రాష్ట్ర తొలి సీఎంగా కేసీఆర్ నెహ్రూ స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగాలి’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 17.39 లక్షల కోట్ల బడ్జెట్ను పెట్టుకున్నా ప్రజల ఆశలు, ఆకాంక్షలు మాత్రం నెరవేరడం లేదన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఆదివారం అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత తొలి సీఎంగా కేసీఆర్పై ఉందన్నారు. వారుంటే దేశం గతి ఏమయ్యేదో.. తెలంగాణ వస్తే తప్ప ఈ ప్రాంతంలో ఆశించిన లక్ష్యాలు నెరవేరవని.. ఉవ్వెత్తున సాగిన రాష్ట్ర మలిదశ ఉద్యమాన్ని చూసి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేందుకు చొరవ చూపిన విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రం అన్నాక ప్రతిపక్షాలుంటాయని, వాటిపై కక్ష సాధింపు ధోరణితో కాకుండా కలుపుకొని పోవాలన్న నెహ్రూ తరహాలో ఇక్కడ పాలన సాగాల్సి ఉందన్నారు. ఆ రోజు తొలి ప్రధానిగా నెహ్రూ కాకుండా ప్రస్తుత పాలకులలాంటి వారు ప్రధాని అయి ఉంటే దేశం గతి ఏమై ఉండేదోనని తల్చుకుంటేనే ఆందోళన కలుగుతోందని భట్టి వ్యాఖ్యానించారు. దేశంలో శాస్త్రీయమైన పరిపాలన జరగడం లేదనటానికి, కరోనా వస్తే దీపాలు వెలిగించండి, చప్పట్లు కొట్టండిలాంటి సూచనలే నిదర్శనమని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో విద్య, వైద్యం, వ్యవసాయానికి కేటాయించిన నిధులు సరిపోవని, వాటిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పోడు భూముల పంపిణీ తేదీలను ముఖ్యమంత్రి ప్రకటించాలని కోరారు. పోడు భూముల సాగును అడ్డుకునే క్రమంలో గిరిజనులను బలవంతంగా అడవుల నుంచి తరిమేసేందుకు వారు తాగే నీళ్లను కలుషితం చేసే వికృత చేష్టలకు పాల్పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాసమస్యలన్నీ చర్చకు రాలేదు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 28 రోజుల పాటు జరపాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం కోరితే ప్రభుత్వం కేవలం 7 రోజుల్లో ఈ సమావేశాలను ముగించిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రజలెదుర్కొంటున్న సమస్యలన్నీ చర్చకు రాలేదని విమర్శించారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన అనంతరం ఆదివారం సాయంత్రం మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ద్రవ్యవినిమయ బిల్లు సందర్భంగా సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. మాజీ ప్రధాని నెహ్రూ వేసిన పునాదులే దేశాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాట్లాడుతూ.. ఇంత తక్కువ రోజులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం దేశంలోనే ఇదే మొదటిసారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభ, మండలిపై బీఆర్ఎస్కు గౌరవం లేదని, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ఆమోదంపై చర్చ జరిగిందో, కేంద్ర బడ్జెట్పై చర్చ జరిగిందో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పక్కదోవ పట్టించేందుకే కేంద్రంపై నెపం నెట్టారని, కేసీఆర్ చిన్నబుద్ధి బయటపడిందని చెప్పారు. బడ్జెట్ కేటాయింపుల్లో సగం నిధులు కూడా ఖర్చు చేస్తారన్న నమ్మకం తమకు లేదని జీవన్రెడ్డి అన్నారు. చదవండి: సభలో నవ్వులే నవ్వులు..ప్రధాని భజన బృందంపై పిట్ట కథను వినిపించిన సీఎం కేసీఆర్ -
ఆధునిక దేశ నిర్మాత
ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసినవాడు జవహర్లాల్ నెహ్రూ. వలసవాద వ్యతి రేకిగా, లౌకికవాదిగా, మానవతావాదిగా, ప్రజా స్వామ్యవాదిగా, స్వాతంత్య్ర ఉద్యమ నేతగా ప్రసిద్ధి గాంచిన వ్యక్తి నెహ్రూ... భారతదేశ సమగ్రాభివృద్ధికి దాదాపు 17 ఏళ్లు ప్రధానమంత్రిగా కృషి చేశారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో 9 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఆ రోజుల్లో 1936లో ఆటో బయోగ్రఫీ, 1946లో ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రచించి, ఆనాటి రాజకీయ, సామా జిక, సాంస్కృతిక, ఆర్థిక విషయాలను ప్రజలకు తెలియజేసి ప్రముఖ రాజ నీతిజ్ఞునిగా ప్రసిద్ధి కెక్కారు. తండ్రి మోతీలాల్ నెహ్రూ కుమా రుని విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో సైన్స్లో డిగ్రీ చదివించారు. లండన్లోని ‘ఇన్నర్ టెంపుల్ ఇన్’లో న్యాయ శాస్త్రాన్ని అధ్యయనం చేసి లాయర్గా జీవితాన్ని ప్రారంభించారు నెహ్రూ. 1912 నుండి అఖిల భారత కాంగ్రెస్లో చురుకైన పాత్ర పోషించారు. 1920లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో, 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీ జీతో పాటు పాల్గొన్నారు. 1946లో ఏర్పడిన ప్రొవి జనల్ ప్రభుత్వంలో ప్రధానిగా ఎన్నికయ్యారు. నెహ్రూ భారతదేశం లౌకిక తత్వంతో సోష లిస్టు భావజాలంతో ముందుకు వెళ్లడానికి తోడ్ప డ్డారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు సమీక రించడం కష్టమవుతున్న నాటి పరిస్థితులలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసిన ధీశాలి నెహ్రూ. బహుళార్థ సాధక భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, రైల్వేల అభివృద్ధి, రోడ్డు మార్గాలు, విమానాశ్ర యాలు, ఇనుము, ఉక్కుకర్మాగారాలు, శాస్త్ర పరి శోధన సంస్థలను ప్రభుత్వ రంగంలోనే ప్రారం భించిన దార్శనికుడాయన. ప్రముఖ ఆర్థిక వేత్త మహలనోబిస్ నేతృత్వంలో పంచవర్ష ప్రణాళి కలకు రూపకల్పన చేసి ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి నెహ్రూ. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తటస్థ వైఖరి అవలంబించి, అలీన ఉద్యమానికి నేతృత్వం వహించారు. ప్రతిరోజు భారత ప్రజలు వివిధ సమస్యలపై దాదాపు రెండు వేలకు పైగా ఉత్తరాలు రాసేవారు. ప్రతి రాత్రి అదనంగా నాలుగు లేదా ఐదు గంటలు పని చేసి, ఆ ఉత్తరాలను అధ్యయనం చేసి సమాధానాలను రాయడం ఆయన నిరంతర కృషికి నిదర్శనం. 12 శాతం అక్షరాస్యతతో ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న దేశంగా ఉన్న భారత దేశాన్ని నెహ్రూ తన రాజకీయ పరిజ్ఞా నంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశంగా నిలబెట్టారు. ఇంతటి గొప్ప దార్శనికుడు నెహ్రూజీకి బాలల పట్ల అమితమైన ప్రేమ, వాత్సల్యం ఉండేవి. అందుకనే పిల్ల లందరూ చాచా నెహ్రూగా పిలిచేవారు. అందుకే ఆయన జన్మదినమైన నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. నిజా నికి 1956 నుంచి అంతర్జాతీయ బాలల దినో త్సవం జరిగే రోజునే ఇండియాలోనూ బాలల దినోత్సవాన్ని జరిపేవారు. అయితే 1964 మే 27న పిల్లల్ని ఎంతగానో ఇష్టపడే నెహ్రూజీ తుదిశ్వాస విడిచిన తర్వాత... ఆయన పుట్టిన రోజును భారత ప్రభు త్వం బాలల దినోత్సవంగా జరపాలని నిర్ణ యించింది. ఈ తరుణంలో ఆ మహనీయుని స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడం అవసరం. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వ్యాసకర్త ఏపీ అధ్యక్షులు, జన చైతన్య వేదిక మొబైల్: 99499 30670 -
నెహ్రూ ఆత్మకథకు పొంగిపోయిన రవీంద్రుడు
జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్రో ద్యమంలో పాల్గొని జైలు జీవితం గడుపుతున్న దశలో 1934–35 మధ్య కాలంలో తన ఆత్మకథ (టువార్డ్ ఫ్రీడమ్) రాసుకున్నారు. బానిస సంకెళ్లు తెంచుకుని, దేశం స్వేచ్ఛ కోసం తపిస్తున్న దశలో తన అనుభవాల్ని నమోదు చేసుకున్నారు. నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య కమలా నెహ్రూ అనారోగ్యంతో మంచానపడి ఉన్నారు. కూతురు ఇందిర చిన్నపిల్ల. ఆమె ఆలనాపాలనా చూసేవారు ఎవరూ లేకపోవడం వల్ల, తరచూ రవీంద్రుడి శాంతినికేతన్కు పంపు తుండేవారు. అందరినీ, అన్నింటినీ ప్రేమగా చూసే లక్షణం ఆ బాలికలో ఉందని గ్రహించి రవీంద్రనాథ్ టాగూర్ ఆమెను ‘ప్రియదర్శిని’ అన్నారు. అప్పటి నుండి ఆమె ఇందిరా ప్రియ దర్శిని అయ్యింది. పండిట్ నెహ్రూకు సాహిత్యం, కళల పట్ల ఉన్న అవ్యా జమైన ప్రేమ జగద్విదితం. ఆయన ఆత్మకథను చదివి ‘విశ్వ కవి’ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉత్తరం రాశారు. 1936 మే 31న శాంతినికేతన్ నుండి రవీంద్రుడు రాసిన ఉత్తరం ఇలా ఉంది: ‘‘ప్రియమైన జవహర్లాల్! మీ పుస్తకం చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. నిజంగా అది చాలా గొప్ప పుస్తకం. చదువుతూ ఎంతో చలించిపోయాను. మీరు సాధించిన విజయాలు తెలుసుకుని గర్వపడుతున్నాను. అన్నింటినీ మించి అట్టడుగున ప్రవహించే లోతైన మీ మానవత్వపు దృక్కోణం, సంక్లిష్టమైన చిక్కుముడులనన్నింటినీ విప్పుతూ ఉంది. వాస్తవాల్ని నిబ్బరంగా బహిర్గతం చేస్తూ ఉంది. ఇంతవరకూ సాధించిన విజయాలకు మించిన మహో న్నతమైన వ్యక్తిత్వం మీది – అనే విషయం తెలిసిపోతూ ఉంది. సమకాలీన స్థితిగతుల నుంచి నిజాయతీ అయిన ఒక నిఖార్స యిన మీ వ్యక్తిత్వం గోచరిస్తూ ఉంది.’’ సాహిత్యకారుడు అయిన నెహ్రూకు, అమృతా షేర్గిల్, సరోజినీ నాయుడు, ఫ్రెంచ్ సాహిత్యకారుడు రోమా రోలా వంటి దిగ్గజాల నుండి ఉత్తరాలు వస్తుండేవి. ఆ రోజుల్లో లేఖలు రాయడం కూడా ఒక కళగా పరిగణింపబడుతూ ఉండేది. జైలు నుండి నెహ్రూజీ తన కూతురికి రాసిన ఉత్తరాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ఆ ఉత్తరాల్లో సాహిత్య, సామాజిక, చారి త్రక, స్వాతంత్య్రోద్యమ అంశాలు; దేశ, కాల పరిస్థితుల గురించి చర్చించారు. తరువాత కాలంలో ఆ లేఖలన్నీ పుస్తక రూపంలో వెలువడ్డాయి. పిల్లల పట్ల ఆయనకు గల ప్రత్యే కమైన శ్రద్ధ, ప్రేమల వల్ల ఎన్నో సంస్థలకు, ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. చాచా నెహ్రూగా శాశ్వతత్వం పొందారు. అందుకే ఆయన పుట్టినరోజు 14 నవంబర్ను పిల్లల దినంగా జరుపుకొంటున్నాం. జాతీయ సంస్థల్ని ప్రారంభించి నిలబెట్టింది నెహ్రూజీ అయితే, అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసింది మోదీజీ. తొలి ప్రధాని నుండి ఇటీవలి కాలం వరకు ఏ ప్రధానీ చేయని ‘ఘన’మైన పనులు ఇప్పటి ప్రధాని చేశారు. పటేల్ విగ్రహం నెలకొల్పారు. దాన్ని ఐక్యతా విగ్రహం అన్నారు. బావుంది. ప్రారంభోత్సవ సభలో నేటి హోంమంత్రి కనబడలేదు. విగ్రహం తొలి హోంమంత్రిది కదా? పైగా వేల సంఖ్యలో మత గురువుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అసలది మతానికేం సంబంధం? ఏమీ మాట్లాడలేక వారసత్వ పాలనకు నెహ్రూయే కారణమని నిందిస్తారు. ఆయన మరణానంతరం జరిగిన సంఘటనలకు నెహ్రూ ఎలా బాధ్యులవుతారు? ఆ రోజుల్లో ఆసేతు హిమాచలం స్వాతంత్య్ర సమర యోధులు లక్షలమంది ఉండి ఉంటారు. వారందరిలోకి నాయ కత్వ లక్షణాలు, చురుకుదనం, విశాల భావాలు, అభ్యుదయ ధోరణి, విదేశాంగ విధానాల మీద పట్టు, చదువు, సంస్కారం అన్నీ పుణికిపుచ్చుకుని ఉన్నారు గనుక నెహ్రూ తొలి ప్రధాని కాగలిగారు. సుదీర్ఘ కాలం ఆ పదవిలో మనగలిగారు. మనిషిలో ఎంతో సంయమనం ఉంటేగానీ అలా నిలబడలేరు. ధనం, స్థాయి, స్థోమత ఏమీ లేనివాడు త్యాగం చేయడానికి ఏముం టుంది? కానీ, నెహ్రూజీకి ఇవన్నీ ఉండి కూడా అన్నింటినీ త్యజించి, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం గొప్ప. పైగా కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడై ఉండి, నిరీశ్వరవాది కావడం అంతకన్నా గొప్ప! డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త రచయిత, సామాజికాంశాల వ్యాఖ్యాత -
మనం అన్నది నెహ్రూనే కదా.. గాంధీని కాదుగా!
మనం అన్నది నెహ్రూనే కదా..గాంధీని కాదుగా! -
Gaurav Yatra: నెహ్రూ వల్లే కశ్మీర్ సమస్య
జంజార్కా/ఉనాయ్(గుజరాత్): కశ్మీర్ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూయే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. నెహ్రూ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసినప్పటికీ అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ఆయన గురువారం అహ్మదాబాద్ జిల్లా జంజర్కా, ఉనాయ్లలో బీజేపీ ‘గౌరవ్ యాత్ర’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా పైవ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370ను రాజ్యాంగంలో చేర్చుతూ నెహ్రూ చేసిన తప్పిదం వల్లే కశ్మీర్ పెద్ద సమస్య అయి కూర్చుంది. ఆ ప్రాంతం దేశంతో సరిగ్గా విలీనం కాలేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 370ను తొలగించాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ 2019లో ఒక్క వేటుతో 370ను రద్దు చేసి, కశ్మీర్ను దేశంతో విలీనం చేశారు’అని అమిత్ షా చెప్పారు. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటూ బీజేపీ చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కానీ, మందిరం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది’అని అన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎయిర్ స్ట్రైక్స్ను ఆయన ప్రస్తావిస్తూ.. సీమాంతర ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందన్నారు. గతంలో యూపీఏ హయాంలో పాక్ ఆర్మీ మన సైనికుల తలలను నరికి, వెంట తీసుకెళ్లింది. 2014లో మన ప్రభుత్వం వచ్చాక కూడా అలాగే చేయాలని చూసింది. కానీ, ఇది మౌని బాబా (మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఉద్దేశిస్తూ) ప్రభుత్వం కాదన్న విషయం వాళ్లు మరిచారు. ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మోదీ ప్రభుత్వం గుణపాఠం చెప్పింది’అని అమిత్ షా అన్నారు. ‘గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఏడాదిలో 365 రోజులకు గాను 200 రోజులు కర్ఫ్యూయే అమలయ్యేది. కానీ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక గత 20 ఏళ్లలో అలాంటి పరిస్థితులు లేవు’అని చెప్పారు. దేశానికి భద్రత కల్పించడం, దేశాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం కాంగ్రెస్కు లేవని విమర్శించారు. ఇదీ చదవండి: ఉద్ధవ్ థాక్రే వర్గానికి భారీ ఊరట -
ఎన్నయినా అనొచ్చు! కాదని వచ్చి వాదించలేరుగా!!
ఎన్నయినా అనొచ్చు! కాదని వచ్చి వాదించలేరుగా!! -
నెహ్రు తర్వాత బలమైన ప్రధాని మోదీనే.. ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు బలమైన ప్రధాని వద్దంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరాలంటే దేశంలో బలహీన ప్రధాని అవసరం అన్నారు. ఈసారి బలహీనులకు లబ్ధి చేకూర్చే బలహీన ప్రధాని దేశానికి అవసరమని తాను భావిస్తున్నానని సెటైరికల్ కామెంట్స్ చేశారు. బలహీన ప్రధాని పగ్గాలు చేపడితే బలహీనవర్గాలు లాభపడతాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. బలమైన ప్రధాని కేవలం ధనవంతులకు(సంపన్న వర్గాలకే) సాయపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు మనం బలమైన ప్రధానిని చూశాము.. ఇక వచ్చే ఎన్నికల్లో పేదలకే మేలు చేసే ప్రధానిని ఎన్నుకోవాలన్నారు. కాగా, 2024 ఎన్నికల్లో తాము ఈ దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి 306 మంది ఎంపీలున్నా.. వ్యవస్థను నిందిస్తున్నారని అన్నారు. పేదలు, రైతులు, యువతకు మేలు చేసేందుకు ఆయనకు ఇంకా ఏం అధికారాలు కావాలని ప్రశ్నించారు. దేశంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యంత శక్తివంతమైన ప్రధాని అయిన నరేంద్ర మోదీ.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చైనా చొరబాటు, కార్పొరేట్ ట్యాక్స్ రద్దు వంటి ప్రశ్నలు ఎదురైతే ప్రధాని వ్యవస్ధను నిందిస్తుంటారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగానే ఒవైసీ.. ఆమ్ ఆద్మీ పార్టీపైన సైతం విమర్శలు గుప్పించారు. గుజరాత్లో జరిగిన బిల్కిన్ బానో కేసు విషయంలో ఖైదీల విడుదలపై అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు స్పందించలేదన్నారు. ఆప్ కూడా బీజేపీ వంటిదేనని.. రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు. When we speak of development of minority communities & justice for them, nonsense is spoken against us. This is hypocrisy in a way that those posing as experts of secularism today will decide who's secular & who's communal.The country is watching them: AIMIM chief Asauddin Owaisi pic.twitter.com/gNFrieqoeQ — ANI (@ANI) September 10, 2022 -
మోదీ@20 పుస్తకావిష్కరణ... ఒక ప్రధాని ఉండేవారంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ యూపీ సీఎం
వారణాసి: యూపీలోని వారణాసిలో రుద్రాక్ష్ కన్వెక్షన్ సెంటర్లో మోదీ@20 అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ... ఒకప్పుడూ ఒక ప్రధాని ఉండేవారంటూ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరు చెప్పకుండానే ఆయనతో మోదీని పోల్చారు. ఆయనకు భిన్నంగా ప్రస్తుత ప్రధాని వారసత్వం భారతదేశానికి గర్వకారణమని అన్నారు. అలాగే భారత్ని ఏక్ భారత్, శ్రేష్ట భారత్గా మార్చాలనే సంకల్పంతో ఉన్న మోదీ భారత్కి లభించారంటూ ప్రశంసించారు. అంతేకాదు భారత్ ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రపంచానికి తెలియజేసేలా ఆదర్శంగా నిలించిందన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాద మూలాలను శాశ్వతంగా అంతం చేయడంలో ప్రధాని వెనుకాడడం లేదని కొనియాడారు. ఇదే మోదీ నాయకత్వ సామర్థ్యం అని పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు సోమ్నాథ్ పునరుద్ధరణ కోసం రాష్ట్రపతిని పంపని ఒక ప్రధానిని చూశాం, అలాగే భవ్య శ్రీరామ నిర్మాణ పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రధానిని కూడా చూశాం అంటూ కాంగ్రెస్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులలో మన ప్రధాని ఒకరు కావడం మనకు గర్వకారణమని అన్నారు. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని, దాదాపు వందల ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన బ్రిటన్ని వెనక్కినెట్టి మరీ ఈ స్థానానికి చేరుకుందని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అన్నారు. (చదవండి: గోవాలో బ్రిటన్ హోం సెక్రటరీ తండ్రికి ఉన్న ఆస్తి కబ్జా... విచారణకు ఆదేశం) -
చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?
ఎనిమిదేళ్ల ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనా కాలంలో దేశం సాధించిన విజయాలు, వైఫల్యాలపై జరిగే చర్చకంటే... కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రను వంకరటింకర చేయడం, అలాగే వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ యేతర పార్టీలను బలహీనం చేయడంపైననే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్నది. భారతదేశ చరిత్ర సమున్నతమైనది. అందులో స్వాతంత్య్ర సంగ్రామ పోరాటం ప్రధాన మైనది. అలాగే దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు–దేశ విభజన, మత ఘర్షణలు; నెహ్రూ పాలనలో అనుసరించిన ఆర్థిక, సామాజికాభివృద్ధి, విదేశీ విధానాలు తదితర అంశాలు చరిత్రలో ప్రముఖ స్థానం ఆక్రమించాయి. అయితే, పాక్షిక దృష్టితోనో లేక కాంగ్రెస్, వామపక్ష భావజాలాల దృక్కోణం నుంచో సంఘటనలను చరిత్రకారులు చెప్పారని బీజేపీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ఇందులో కొంత నిజం ఉండొచ్చు. చరిత్రకు సైద్ధాంతిక ఏకీభావం ఉండదు. ఇది ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచంలో ఏ దేశ చరిత్ర పరిశీలించినా అనేక అంశాలలో భిన్నమైన వాదనలు, వ్యక్తీ కరణలు, అభిప్రాయాలు కనిపిస్తాయి. అయితే, భారత్కు సంబంధించినంత వరకు జాతీయవాదం తమ గుత్తసొత్తుగా భావించే బీజేపీ ఇపుడు చరిత్రను సరిచేసే నెపంతో గత చరిత్రను తారుమారు చేసే పనిలో నిమగ్నమైంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నప్పుడు స్వయంగా మోదీ చరిత్ర మసిపూసే పనికి తగిన సహకారం, ప్రోద్బలం అందిస్తున్నట్టు భావించాల్సి వస్తోంది. ముఖ్యంగా, స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడి, స్వాతంత్య్రం లభించినాక దేశానికి 17 ఏళ్లపాటు ప్రధాన మంత్రిగా పనిచేసి... ప్రపంచంలో భారత్కు ఓ విశిష్ట స్థానం కల్పించిన పండిట్ నెహ్రూ పాత్రను కుదించే పనిలో నేడు బీజేపీ తలమునకలై ఉంది. దేశ విభజన, జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం, చైనాతో యుద్ధం వంటి అంశాలలో ప్రధానమంత్రిగా నెహ్రూ పోషించిన పాత్ర, తీసుకొన్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కేవలం ఆయన విజయాలను విస్మరించి వైఫల్యాలను సాకుగా చూపి దేశ చరిత్రలో నెహ్రూ పాత్రను తక్కువ చేయడం; పూర్తిగా విస్మరించాలనుకోవడం ఆశ్చర్యకరం. దేశంలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి సోషలిస్ట్ అభివృద్ధి నమూనాతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించిన ఘనత నెహ్రూది. ఆయన ఏర్పరిచిన ‘ప్లానింగ్ కమిషన్’ అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్రాలకూ అనేక దశాబ్దాలపాటు దిక్సూచిగా నిలిచింది. అయితే, ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసి దానిస్థానంలో నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రాథమిక విద్యకు సంబం ధించిన పాఠ్యాంశాలలో నెహ్రూపై ఉన్న అధ్యాయాలను ఇటీవల తొలగించారు. కర్ణాటక ప్రభుత్వమైతే ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా వివిధ స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు వేసి, నెహ్రూ బొమ్మ లేకుండా చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. ఈ ఏడాదిలోనే ఢిల్లీలోని ఒకప్పటి నెహ్రూ అధికార నివాసమైన తీన్మూర్తి భవన్లో నిర్వహిస్తున్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీలకు ప్రాధాన్యం తగ్గించి, అందులో భారత ప్రధానుల జీవితాలను తెలియజెప్పే కాంప్లెక్స్ను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధానులందరినీ సముచితంగా గౌరవించడంలో తప్పులేదు. కానీ, నెహ్రూ మ్యూజియంను అక్కడి నుండి తొలగించాల్సిన అవసరం ఉందా? ఇక, దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన సంఘటన అయిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంపై నేషనల్ ఆర్కైవ్స్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లోనూ నెహ్రూ ప్రస్తావన లేకుండా చేశారు. ప్రధాని మోదీ తనకు నెహ్రూపై గల వ్యతిరేకతను బహిర్గత పర్చడానికి ఏమాత్రం సంకోచించరు. పార్లమెంట్లోనే ఓ సందర్భంలో ‘భారతదేశానికి స్వాతంత్య్రం నెహ్రూ ఒక్కడి వల్లనే రాలేదు’ అని వ్యాఖ్యానించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఆయన ఒక్కరి వల్లనే వచ్చిందని ఎవరన్నారు? నెహ్రూ పాలనలో జరిగిన వ్యవసాయ విప్లవం, క్షీర విప్లవం, నీలి విప్లవం; ఏర్పాటైన వివిధ అత్యున్నత విద్యా సంస్థలు, రష్యా సాంకేతిక సహకారంతో నెలకొల్పిన పబ్లిక్ రంగ సంస్థలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, విదేశాలతో ఏర్పరచుకొన్న సత్సంబంధాలు, అనుసరించిన అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు; విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిపిన కృషి; అనుసరించిన లౌకికవాదం (సెక్యులరిజం), భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు... ఇలాంటివెన్నో పండిట్ నెహ్రూను నవభారత శిల్పిగా నిలిపాయి. ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికీ, వ్యక్తి స్వేచ్ఛను కాపాడటానికీ అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని చరిత్ర చెబుతోంది. ఆయన విమర్శకులు సైతం ఈ విషయాలను ఒప్పుకోక తప్పదు. (క్లిక్: ఇప్పుడు మతం కాదు... ప్రేమ కావాలి!) నెహ్రూ విమర్శలకు అతీతుడేమీ కాదు. ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపవచ్చు. అదే సమయంలో చరిత్రలో ఆయన స్థానం ఆయనకు ఇవ్వాల్సిందే. ఆయనను తక్కువ చేసి చూపడం వల్లా, విస్మరించడం వల్లా బీజేపీకి ఒరిగే లాభం ఏమిటి? (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) - సి. రామచంద్రయ్య ఏపీ శాసన మండలి సభ్యులు -
ఎదలో పూసిన ఎర్ర గులాబీ!
చందమామ లేని వెన్నెల కాయించే మాంత్రికులు రాబో తున్నారు. ఆకాశం లేని ఇంద్రధనుసును పూయించే చమత్కా రులు కూడా రాబోతు న్నారు. పండిత నెహ్రూ ప్రస్తావన లేకుండానే స్వతంత్ర భారత ప్రస్థా నాన్ని వినిపించగల హరి కథకులు ఇప్పటికే వేంచేసి ఉన్నారు. ఇక ముందు ఇలాంటి అనేక వింతల్ని చూడ వలసి ఉన్నది. అనేక విషాదాలను కూడా తట్టుకోవలసి ఉన్నది. ‘క్లైమేట్ ఛేంజ్’ పర్యవసానంగా శిరమెత్తిన నడిమంత్రపు తుపాను గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నది. ఇది రాజకీయ వాతావరణ శాస్త్రవేత్తల తుది హెచ్చరిక. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్భై అయిదేళ్లు నిండిన సందర్భాన్ని అమృతోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు పిలుపునిచ్చింది. ప్రజలు అద్భుతంగా స్పందించారు. పొలం పనులకు వెళ్లిన కూలి జనం కూడా ముందుగా గట్ల మీద మువ్వన్నెల జెండాలను ఎగుర వేశారు. ‘జనగణమన’ పాడారు. జైహిందంటూ జెండాలకు వందనం చేసిన తర్వాతే పనుల్లోకి దిగారు. దండకారణ్య మారుమూల ప్రాంతాల్లో ఒంటి మీద సరిగా గుడ్డల్లేని గిరిజన బిడ్డలు కూడా జెండా పండుగలు చేసుకున్నారు. దేశభక్తి ఏ ఒక్కడి అబ్బ సొత్తు కాదని ఢంకా భజాయించి చెప్పారు. ఈ నేల మీద మొలకెత్తిన గడ్డిపోచకు కూడా దేశభక్తిపై పేటెంట్ ఉన్నదని ఘంటాపథంగా చాటి చెప్పారు. భావజాల వాతావరణ మార్పుల ప్రభావం ఈ ఉత్సవాల్లో అక్కడక్కడా కనిపించింది. నవభారత నిర్మాతగా పేరున్న పండిత జవహర్లాల్ నెహ్రూ ప్రతిష్ఠ మీద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ప్రభుత్వాలు, పాలక పార్టీలు కూడా పాల్గొన్నాయి. ‘దేశవిభజనకు నెహ్రూయే కారకు’డంటూ భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన వీడియో ఆరోపించింది. కర్ణాటకలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొన్ని పత్రికా ప్రకటనల్ని విడుదల చేసింది. అందులో నెహ్రూను మినహాయించి మిగిలిన జాతీయ నాయకుల ఫొటోలు వేశారు. కావాలనే నెహ్రూ ఫొటోను వెయ్యలేదని ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి ఒకరు ప్రక టించారు. అంబేడ్కర్ బొమ్మను కూడా అట్టడుగున మొక్కు బడిగా వేశారనీ, బ్రిటిష్ వారిని క్షమాభిక్ష వేడిన సావర్కర్ ఫొటో మాత్రం ప్రముఖంగా వేశారనీ విమర్శలు కూడా వచ్చాయి. నెహ్రూ చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నాలు పథకం ప్రకారమే ప్రారంభమైనట్లు కనిపిస్తున్నది. ‘‘ఈ దేశంలో ఏ హృదయ ద్వారం తెరిచినా నువ్వు – ఈ దేశంలో ఏ దారి మలుపు తిరిగినా అక్కడ నీ పదాంకం’’ – అట్లాంటి నిన్ను ఈ దేశం ఎలా మరవగలుగుతుందని నెహ్రూ చనిపోయినప్పుడు రాసిన కవితలో తిలక్ ప్రశ్నిస్తాడు. అది అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమని కొంతమంది వీరతిలకాలు దిద్దుకొని మరీ ప్రయత్నాలు ప్రారంభించినట్టు కనిపిస్తున్నది. ఎందుకు ఈ ప్రయత్నాలు? నెహ్రూను తెరమరుగు చేసి ఏం సాధించగలరు? నెహ్రూపై కత్తి దూయడం వెనుక ఉన్నది భావజాల సంఘర్షణ కావచ్చు. దూసిన కత్తికి రెండో వైపున కూడా పదునుందని ఇటీవలి పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. పేదవర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం అమలు చేసే పథకాలను ‘ఉచిత పథకాల’ పేరుతో ఈసడించుకునే క్యాంపెయిన్ ఈ మధ్యనే ప్రారంభమైంది. దాదాపు ఇదే సమయంలో నెహ్రూ భావ జాలాన్ని తెరమరుగు చేసే ప్రయత్నాలు యుద్ధప్రాతిపదికపై మొదలయ్యాయి. ఈ రెంటికీ మధ్యన ఉన్న సంబంధమేమిటి? అసలు నెహ్రూ భావజాలమేమిటి? ఆయన చేసిందేమిటి? 1929 డిసెంబర్లో జరిగిన ‘లాహోర్ కాంగ్రెస్ సభ’లో మొదటిసారిగా దేశానికి ‘పూర్ణ స్వరాజ్’ కావాలనే డిమాండ్ ముందుకొచ్చింది. అప్పటి వరకూ డొమినియన్ హోదా ఇస్తే చాలన్న పార్టీ పంథాలో ఈ విప్లవాత్మక మార్పునకు కారకుడు ఆ సభలో పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన జవహర్లాల్ నెహ్రూ. స్వాతంత్య్రం ప్రకటించే ముందు లార్డ్ మౌంట్ బాటెన్ ఒక ప్లాన్ను ముందుకు తెచ్చాడు. ఆ ప్లాన్ ప్రకారం ప్రావిన్స్ల (రాష్ట్రాల) వారీగా స్వాతంత్య్రాన్ని ప్రకటిస్తారు. భారత రాజ్యాంగ సభలో చేరడం, చేరకపోవడమనేది వారి ఇష్టం. ఈ ప్లాన్ను తీవ్రంగా వ్యతిరేకించి దేశం డజన్ ముక్కలు కాకుండా కాపాడిన వారిలో ప్రథముడు జవహర్లాల్ నెహ్రూ. స్వతంత్రం లభించిన తర్వాత దేశంలో ప్రజాస్వామిక విలువలు వేళ్లూనుకోవడానికీ, లౌకిక వ్యవస్థ పటిష్ఠమవడానికీ, సామాజిక న్యాయం – సామ్యవాద భావాలు వికసించడానికీ అహరహం కృషి చేసిన వ్యక్తిగా జవహర్లాల్ నెహ్రూ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. భారత్తో పాటు ఆ కాలంలో వలస సంకెళ్లు తెంచుకున్న అనేక దేశాలు ప్రజాస్వామిక వ్యవస్థలతో ప్రారంభమై, అచిర కాలంలోనే నియంతృత్వంలోకి జారుకున్నాయి. ఆ దేశాల జాతీయ నాయకులు అభ్యుదయ భావాలు కలిగినవారే. అయినా పతనాన్ని నిరోధించలేక పోయారు. ఇండోనేషియా, పాకిస్థాన్, పలు ఆఫ్రికా దేశాలు ఇందుకు ఉదాహరణలు. ఆ రోజుల్లో ఒక్క జూలియస్ నైరేరే (టాంజానియా) మాత్రమే పండిత నెహ్రూ మాదిరిగా ప్రజాస్వామ్య వ్యవస్థలను నిలబెట్టగలిగారు. డచ్ వలస పాలన నుంచి ఇండోనేషియాకు విముక్తి సాధించడంలో సుకర్ణో కీలకపాత్ర పోషించారు. ఆయన నెహ్రూతో సమానంగా అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. అలీనోద్యమంలో నెహ్రూకు కుడి భుజంగా వ్యవహరించాడు. నియంతృత్వ పోకడలు పొడసూపి, పది లక్షల మంది ఊచకోతకు కారకుడై చివరకు పదవీచ్యుతుడయ్యాడు. ‘నూరు పువ్వులు వికసించాలి, వెయ్యి భావాలు పోటీపడాల’ని ప్రజాస్వామిక నినాదాలిచ్చిన మావో జెడాంగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆయన ప్రారంభించిన సాంస్కృతిక విప్లవం జనం మెదళ్లపై కూడా నిఘా వేసి లక్షలాది మందిని హతమార్చింది. పండిత నెహ్రూ ఇందుకు భిన్నంగా ప్రజాస్వామిక సంప్రదాయాలకు పాదు చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా లోపభూయిష్ఠంగా వ్యవహరించి ఉండవచ్చు. కానీ ఆ కాలపు తరుణ స్వతంత్ర దేశాధినేతల్లో ఒకరికి ‘అత్యుత్తమ ప్రజాస్వామ్యవాది’ టైటిల్ ఇవ్వాల్సి వస్తే నెహ్రూతో పోటీపడగలిగే వారెవరూ లేరు. ఇన్నాళ్లుగా ప్రజాస్వామ్యం, లౌకిక విధానాలు ఈ దేశంలో నిలబడి ఉండటానికి నెహ్రూ వేసిన పునాదులే కారణమని అందరూ అంగీకరిస్తారు. ప్రతిపక్ష నేతలలో కూడా నెహ్రూ సౌహార్దంగానే వ్యవహరించారని చెప్పేందుకు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నెహ్రూ విధానాలకు సోషలిస్టు నాయకుడు రామ్మనోహర్ లోహియా బద్ధవ్యతిరేకి. తీవ్రంగా విమర్శించేవాడు. ఒకసారి ఏదో ధర్నా చేసి ఆయన జైలుకు వెళ్లాడు. జైల్లో ఉన్న లోహియాకు ప్రధానిగా ఉన్న నెహ్రూ ఒక బుట్ట నిండా మామిడిపళ్లను పంపించారట. ఈ చర్య పట్ల అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘జనసంఘ్’ టిక్కెట్పై లోక్సభకు తొలిసారి ఎన్నికైన అటల్ బిహారి వాజ్పేయ్ తన విధానాలను విమర్శిస్తూ చేసే ప్రసంగాలకు నెహ్రూ ముగ్ధుడయ్యేవారట. ఒకసారి ఓ విదేశీ దౌత్యవేత్తకు వాజ్పేయ్ని పరిచయం చేస్తూ ‘ఈ యువకుడు భవిష్యత్తులో దేశానికి ప్రధాని అవుతాడ’ని నెహ్రూ చెప్పారట. నెహ్రూ విధానాలను తీవ్రంగా విమర్శించే వాజ్పేయి వ్యక్తి గతంగా మాత్రం ఆయనను అభిమానించేవారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలై, జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. వాజ్పేయి విదేశాంగ మంత్రయ్యారు. తన ఛాంబర్లోకి వచ్చి చూసిన తర్వాత అక్కడ గతంలో ఉన్న నెహ్రూ ఫొటోను ఇప్పుడు తీసేశారని గుర్తించారు. ‘పండిత్జీ ఫొటోను తెచ్చి ఎక్కడుందో అక్కడ మళ్లీ పెట్టండ’ని ఆదేశించారట! స్వాతంత్య్ర ప్రకటనకు కొన్ని గంటల ముందు ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ పేరుతో నెహ్రూ చేసిన ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఈ ప్రసంగంలో రేఖామాత్రంగా చెప్పిన అంశాలే ఆయన భావజాలానికి తార్కిక పునాది. ‘కొన్నేళ్ల కిందట (ఉద్యమ కాలంలో) మనం విధికి ఒక ఒక మాట ఇచ్చాం. ఆ మాటను ఇప్పుడు నెరవేర్చాలి. దారిద్య్రాన్ని, అసమానతలను, అజ్ఞా నాన్ని పారద్రోలాలి. ప్రతి ఒక్క కంటిలోని ప్రతి కన్నీటి చుక్కనూ తుడిచేయాలి. భారతదేశం కోసం, ప్రపంచ మానవాళి కోసం మనం కన్న కలల్ని నిజం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయా’లంటూ ఉత్తేజపూరితమైన ఉపన్యాసం చేశారు. అంబే డ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగంలో ఈ అభిప్రాయాలు ప్రతిఫలించాయి. తొలి రోజుల్లో తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్న దేశం హరిత విప్లవాన్ని సాధించడం వెనుక అవసరమైన భూమికను నెహ్రూ సిద్ధం చేశారు. భాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్ వంటి భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టులను ప్రారంభించి వాటిని ‘ఆధునిక దేవాలయాలు’గా పిలిచారు. ఇప్పుడు ప్రపంచంలో గొప్ప గొప్ప సంస్థలకు సీఈఓలుగా భారతీయులు పనిచేస్తున్నారంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వారందరికీ విద్యాబుద్ధులు నేర్పిన ఐఐటీలు, ఐఐఎమ్లూ, వాటితోపాటు ప్రతిష్ఠాత్మకమైన ‘ఎయిమ్స్’లాంటి విద్యా సంస్థల్ని నెహ్రూ స్థాపించారు. హోమీ జె.బాబా, విక్రమ్ సారాబాయ్, సీడీ దేశ్ముఖ్, భట్నాగర్, వర్గీస్ కురియన్ వంటి మేధావులను ప్రోత్సహించి, వారి కృషితో దేశానికి అభివృద్ధి బాటలు పరిచిన దార్శనికుడు నెహ్రూ. అంతరిక్ష రంగంలో దేశాన్ని అగ్రరాజ్యాల సరసన చేర్చిన ‘ఇస్రో’ను, అణ్వస్త్ర దేశంగా నిలబెట్టిన ‘బార్క్’ను కూడా నెహ్రూ కాలంలోనే స్థాపించారు. దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన పరిశోధనా సంస్థల్లో సింహభాగం ఆయన కాలంలోనే ఏర్ప డ్డాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక సుదీర్ఘమైన జాబితా తయారవుతుంది. నెహ్రూ రూపొందించిన పంచవర్ష ప్రణాళికలు అభివృద్ధిని క్రమబద్ధం చేసి దేశాన్ని నిలబెట్టాయి. పబ్లిక్ రంగ పరిశ్రమలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు రూపుదిద్ది అసమానతలు, అంతరాలు అడ్డగోలుగా పెరగకుండా నియంత్రించగలిగాయి. స్వాతంత్య్రా నికి ముందు బ్రిటీష్ దోపిడీ యథేచ్ఛగా సాగిన రోజుల్లో దేశ జనాభాలోని ఒక్క శాతం అగ్రగామి శ్రీమంతుల చేతుల్లో 21 శాతం జాతి సంపద ఉండేది. నెహ్రూ విధానాల ఫలితంగా 1980 నాటికి ఒక్క శాతం జనాభా చేతిలో ఉండే జాతి సంపద 6 శాతానికి తగ్గింది. మళ్లీ ఇప్పుడు 22 శాతానికి ఎగబాకింది. ‘బ్రిటీష్రాజ్’ నుంచి ‘స్వరాజ్’ వైపు దేశాన్ని మళ్లించడానికి నెహ్రూ తదితర జాతీయోద్యమ నేతలు ప్రయత్నించారు. ఇప్పటి ఆధునిక నేతలు దాన్ని ‘బిలియనీర్ల రాజ్’ వైపు పరుగె త్తిస్తున్న వైనం మన కళ్ల ముందు కనిపిస్తున్నది. ‘బ్రిటీష్ రాజ్ టు బిలియనీర్ రాజ్’ పేరుతో వెలువడిన ఒక పరిశోధనా పత్రం లోని ఈ వివరాలను ఇటీవల ‘ది హిందూ’ పత్రికలో ప్రకటించారు. నెహ్రూ సర్వజ్ఞుడనీ, లోపరహితుడనీ చెప్పలేము. ఆయన పాలనా కాలంలో చాలా పొరపాట్లు జరిగి ఉండవచ్చు. ముఖ్యంగా చైనాను అంచనా వేయడంలో ఆయన తప్పటడుగు వేశారు. తరుణ స్వతంత్ర దేశాలన్నీ సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించారు. చైనాతో ‘పంచశీల’ ఒడంబడిక కుదుర్చు కున్నారు. మావో జెడాంగ్ ఎంత కమ్యూనిస్టో అంతే కరుడు గట్టిన నేషనలిస్టు అనే విషయాన్ని పసిగట్టలేకపోయారు. టిబెట్పై దురాక్రమణ చేస్తుంటే నిర్లిప్తంగా ఉండిపోయారు. ఆ పరిణామానికి వ్యతిరేకంగా ఆనాడు ప్రపంచ దేశాలను నెహ్రూ కూడగట్టి ఉన్నట్లయితే ప్రస్తుత ప్రపంచ ముఖచిత్రం మరో రకంగా ఉండేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. చైనాతో యుద్ధం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ బెంగే ఆయన మరణానికి కూడా కారణమైంది. పదిహేడేళ్ల సుదీర్ఘ పాలనలో దేశీయంగా కూడా నెహ్రూ కొన్ని తప్పటడుగులు వేసి ఉండొచ్చు. కానీ స్థూలంగా చెప్పాలంటే ఆయన ఆధునిక భారత నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీ నెంబర్ వన్. దేశాన్ని అభివృద్ధి పట్టాలు ఎక్కించినవాడు. ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమవకుండా కాపాడినవాడు. లౌకిక భావాలను సమాజం గుండెల నిండా నింపినవాడు. సమతాభావాలకు జైకొట్టినవాడు. మనిషిని ప్రేమించినవాడు. ఈ దేశపు మట్టిని ప్రేమించినవాడు. ఆయన పటేల్ విగ్రహ మంత పెద్ద విగ్రహాన్ని పెట్టకపోవచ్చు కానీ ప్రపంచ కార్పొరేట్ రంగాన్ని ఏలుతున్న మేధావులను తయారు చేసిన ప్రతిష్ఠాత్మక విద్యాలయాలను స్థాపించారు. ఆయన రామ మందిరాన్ని నిర్మించకపోవచ్చు కానీ ఆధునిక దేవాలయాల నిర్మాణానికి ఆద్యుడు. ఛాందస భావాలకు బద్ధవిరోధి. శాస్త్రీయ ఆలోచనా రీతులకూ, సైంటిఫిక్ టెంపర్కూ కేరాఫ్ అడ్రస్ – పండిత నెహ్రూ. ఇప్పుడా చిరునామాను చెరిపేస్తారట! కోటు మీద అలంకరించుకున్న గులాబీ పువ్వును పీకి పారేయొచ్చు. కానీ ఎద ఎదలో పూసిన ఎర్రగులాబీలను పీకేయడం ఎలా సాధ్యం? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
డీపీల మార్పుకై మోదీ పిలుపు.. తమదైన శైలిలో స్పందించిన కాంగ్రెస్ నేతలు
న్యూఢిల్లీ: జాతీయజెండాను సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్లుగా మార్చుకోవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ పార్టీ నేతలు తమదైన శైలిలో స్పందించారు. పార్టీ అధికార వెబ్సైట్తోపాటు అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రా సహా పలువురు తమ ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాల్లో దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతీయ జెండాను చేతబూనిన ఫొటోను బుధవారం తమ ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకున్నారు. నెహ్రూ జాతీయ జెండా వైపు చూస్తున్నట్లుగా ఉన్న బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని ఫొటోషాప్ సాంకేతికతతో కలర్లోకి మార్చారు. ‘తిరంగా దేశానికి గర్వకారణం. తిరంగా ప్రతి భారతీయుడి గుండెలోనూ ఉంటుంది’అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘52 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ పుణెలోని తన ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయలేదు. ప్రధాని పిలుపుతోనైనా తిరంగా ఆ సంస్థ ప్రొఫైల్ పిక్చర్ మారుతుందా?’అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు ఆ అవకాశం ఇవ్వండి: రాహుల్పై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు కాంగ్రెస్ పార్టీ నేతలు సోషల్ మీడియా ప్రొఫైల్లలో త్రివర్ణ పతాకంతో ఉన్న తమ ఫొటోలు పెట్టుకునే అవకాశం నేతలకు ఇవ్వాలని రాహుల్ గాంధీని బీజేపీ ఎద్దేవా చేసింది. తిరంగా విషయంలోనైనా తమ కుటుంబం పరిధి దాటి ఆయన ఆలోచించాలని హితవు పలికింది. -
చైతన్య భారతి: గృహిణి, ఉద్యమకారిణి.. కమలా నెహ్రూ
కమలా నెహ్రూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సతీమణి. ఇంటి పట్టునే ఉండే కమలా నెహ్రూ 1921లో సహాయ నిరాకరణోద్యమంలో మహిళల బందానికి నాయకత్వం వహించి విదేశీ వస్తువులు, దుస్తులు, మద్యం అమ్మకాలు తగవనే నినాదంతో ముందుకు సాగారు. రెండుసార్లు అరెస్ట్ అయ్యారు. కమల పాత ఢిల్లీ లోని కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో 1899 ఆగస్టు 1 రాజ్పతి, జవహర్మల్ కౌల్ దంపతులకు జన్మించారు. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు. చాంద్ బహదూర్ కౌల్ , కైలాష్ నాథ్ కౌల్; ఒక చెల్లెలు స్వరూప్ కఠ్జు. కమలకు 1916 ఫిబ్రవరి 8న జవహర్ లాల్ నెహ్రూ తో వివాహం జరిగింది. కమలా నెహ్రూ మామగారు మోతీలాల్ నెహ్రూ. అత్తగారు శ్రీమతి స్వరూప రాణి. ఉద్యమాలు తెలియకుండా పెరిగి వచ్చిన కోడలు సహాయ నిరాకరణకు నడుము బిగించడంతో అత్తమామలు సంతోషించారని అంటారు. ఆమె మామగారు మోతీలాల్ నెహ్రూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తండ్రితో కలసి నెహ్రూ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుండేవారు. దేశ స్వాతంత్ర్యం పోరాటం కోసం నెహ్రూ కుటుంబం ఆస్తినంతా ధారపోసింది. చివరకు తమ ఇంటిని సైతం కొంత భాగం హాస్పిటల్గా మార్చి స్వాతంత్య్ర పోరాటంలో గాయపడిన వారికి వైద్య చికిత్సలు అందించారు. 1917 నవంబరు 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూలకు ఏకైక సంతానంగా అలహాబాద్ లో ఇందిర జన్మించారు. 1924 లో కమలా నెహ్రూ ఒక బాబును కన్నారు. పూర్తిగా పరిణతి చెందక ముందే జన్మించడం వలన రెండు రోజులలో బాబు చనిపోయాడు. 1934లో జైలు నుండి విడుదలైన నెహ్రూ తిరిగి అరెస్టు అయి కలకత్తా, డెహ్రాడూన్ లలో జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో నెహ్రూ ఆరోగ్యం దెబ్బతినింది. భర్త ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కమలా నెహ్రూ కూడా దిగులుతో అనారోగ్యానికి గురయ్యారు.. చికిత్స కోసం స్విట్జర్లాండ్కు వెళ్లి 1936లో టి.బి. జబ్బు మూలాన 36 ఏళ్ల వయసుకే మరణించారు. కమలా నెహ్రూ చనిపోయిన తరువాత ఆమె పేరుతో కాలేజీలు, పార్కులు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు వెలశాయి. కమలా నెహ్రూ తండ్రి జవహర్మల్ కౌల్ప్రసిద్ధ వ్యాపారి. జవహర్ లాల్ నెహ్రూకు సరైనజోడి కమలా నెహ్రూ అని భావించి, వారి వివాహం జరిపించాడు. వివాహం తరువాత కమలా కౌల్ కమలా నెహ్రూగా మారారు. -
శతమానం భారతి: లక్ష్యం 2047 నెహ్రూ వారసత్వం
మన దేశ నిర్మాణం, ఘనమైన ప్రజాస్వామ్య విధానాల్లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాత్ర ఎనలేనిది. ప్రపంచం మొత్తంమీద భారత్ వాణికి ఒక విలువ ఉందంటే అది నెహ్రూ వల్లనే. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లోని సంక్లిష్ట, ప్రమాదకరమైన భౌగోళిక పరిస్థితులతో కూడిన వ్యవహారాలను నెహ్రూ దార్శనికతతో చక్కబెట్టడమే కాదు, తన నాయకత్వ లక్షణాలు, స్వతంత్ర వ్యవహారశైలితో భారత భూభాగాన్ని కాపాడగలిగారు. విదేశీ, దౌత్య వ్యవహారాల్లోనూ నెహ్రూ చెరగని ముద్ర వేశారు. అంతర్జాతీయ స్థాయిలో పాలనను సూచించే ‘వన్ వరల్డ్’ అన్న అంశంపై నెహ్రూ అప్పట్లోనే విస్తృతంగా రాశారు. ఆయన దార్శనికత వల్లే దేశంలో అణు, అంతరిక్ష కార్యక్రమాలు మొదలయ్యాయి. అత్యున్నత నైపుణ్య కేంద్రాలుగా ఐఐటీలు ఎదిగేందుకు, శాస్త్ర పరిశోధనల నెట్ వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఏర్పాటు, ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలూ నెహ్రూ ఆలోచనల ఫలాలే. భారతీయులు శాస్త్రీయ ధోరణిని కలిగి ఉండాలని బోధించినదీ ఈయనే. నెహ్రూ రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’.. భారత చరిత్ర పట్లా, తరతరాలుగా దేశ ప్రాపంచిక దృక్పథాన్ని తీర్చిదిద్దిన తాత్విక, మేధా ప్రవాహాల పట్లా, భారతీయులను ఒక్కటిగా ఉంచుతున్న ఘనమైన సాంస్కృతిక వారసత్వం పట్లా ఆయనకు ఉన్న లోతైన అవగాహనకు సాక్ష్యం. భారతదేశ గొప్ప వైవిధ్యాన్నీ, దాని బహుముఖ సాంస్కృతిక మూర్తిమత్వాన్నీ నెహ్రూ శోభావంతం చేశారు. ఈ అమృతోత్సవాల వేళ నెహ్రూ మిగిల్చివెళ్లిన రాజనీతిజ్ఞ వారసత్వాన్ని తప్పక గుర్తు చేసుకోవాలి. ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. -
స్వతంత్ర భారతి 1964/2022
సరిహద్దు వివాదాలను చైనా బహిరంగ యుద్ధాలుగా మార్చిన సమయం అది. సామ్రాజ్యవాద బాధితులుగా మనం ఐకమత్యంగా ఉండాలని భావించి, ‘హిందీ–చీనీ భాయి భాయి అంటూ.. నెహ్రూ తరచు తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండేవారు. నెహ్రూ తన స్వభావం కొద్దీ ఒక సామ్యవాద దేశం మరొక సామ్యవాద దేశంపై దాడి చెయ్యదని నమ్మారు. అలాగే భారతదేశం అన్నది ఎవరూ చొరబడలేని మంచు గోడలైన హిమాలయాల వెనుక సురక్షితమని భావించారు. అయితే చైనా ఉద్దేశాలు, సైనిక సామర్ధ్యాల ముందు రెండూ కూడా తప్పని తేలాయి. భారత్పై చైనా యుద్ధానికి దిగిన కొద్ది రోజులలోనే చైనా సైన్యం ఈశాన్య భారతదేశంలోని అస్సాం వరకు చొచ్చుకు రావడం భారత సైన్యం బలహీనతను బహిర్గత పరచింది. నెహ్రూ అంతిమయాత్ర భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నెహ్రూ తీవ్ర విమర్శలు ఎదుర్కొని రక్షణ మంత్రి అయిన కృష్ణ మీనన్ను తొలగించి, యు.ఎస్. సైనిక సహాయాన్ని అర్థించవలసి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా నెహ్రూ ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి అయన 1963 లో కొన్ని నెలలు కశ్మీర్లో గడపవలసి వచ్చింది. కొంతమంది చరిత్ర కారులు ఈ ఆకస్మిక ఆరోగ్య సమస్యకు కారణం చైనా దండయాత్ర వలన ఆయన పొందిన అవమానం, చైనా విశ్వాస ఘాతుకంగా అని భావిస్తారు. కశ్మీర్ నుండి తిరిగి వచ్చిన తరువాత నెహ్రూ గుండెపోటుకు చికిత్స పొందుతూ 1964 మే 27 వేకువ జామున మరణించారు. హిందూమత కర్మల ననుసరించి యమునా నది ఒడ్డున ఉన్న శాంతివనంలో నెహ్రూ అంత్యక్రియలు నిర్వహించారు. -
స్వతంత్ర భారతి: భారత్-చైనా యుద్ధం
హిందీ చీనీ భాయ్ భాయ్. 1950ల మధ్యలో చైనాతో భారతదేశం చరిత్రాత్మక శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ నినాదం భారతదేశమంతటా మార్మోగింది. అయితే 1962లో సరిహద్దులో తలెత్తిన ఘర్షణ భారతదేశ ఘోర పరాజయంతో ముగియడంతో ఆ నినాదం హాస్యాస్పదంగా తయారైంది. యుద్ధంలో చైనాతో సంప్రాప్తించిన ఓటమి , అజేయుడని జవహర్లాల్ నెహ్రూకు ఉన్న పేరుకు మచ్చ తెచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకే ఆయన కన్నుమూశారు. సాయుధ దళాలు, అలీన విధానంపై భారతదేశం విధానంలో కూడా అది మార్పును తెచ్చింది. అణ్వాయుధాల కార్యక్రమాన్ని వేగిరపర్చడంతో పాటు, పటిష్టమైన సైన్య నిర్మాణానికి ప్రభుత్వం దండిగా నిధులు సమకూర్చడం ప్రారంభమైంది. అప్పటికీ ఇప్పటికీ అరవై ఏళ్లు గడిచిపోయినా, సరిహద్దు వివాదం ఇంకా భారత–చైనాల మధ్య ఆరని చిచ్చుగానే ఉండిపోయింది. యుద్ధకాలం నాటి ‘టైమ్’ పత్రిక ముఖచిత్రంగా భారత ప్రధాని నెహ్రూ, చైనా నాయకుడు మావో జెడాంగ్ -
చైతన్య భారతి: శక్తివంతమైన నాయకుడు! అతని తర్వాత ఎవరు?
జవహర్లాల్ నెహ్రూ 1889–1964: నెహ్రూ మరణించడానికి ఏడాది ముందు ఒక ప్రముఖ అమెరికన్ పాత్రికేయుడు ‘ఆఫ్టర్ నెహ్రూ, హూ?’ అనే పుస్తకం రాశారు. నిజానికి ఆయన తరువాత పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ప్రపంచమంతటికీ వచ్చిందే. ఆయన మరణించిన దాదాపు నాలుగు దశాబ్దాలకు గానీ, నెహ్రూ భావజాలం దేశంలో చెక్కు చెదరనంత శక్తిమంతమైన నాయకత్వం నెహ్రూది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన మొదటి పదిహేడేళ్లు నెహ్రూయే భారతదేశం, భిన్న ధ్రువాల విచిత్ర సంగమం ఆయన. సదుపాయాల భోగంలో పెరిగిన కులీన కుటుంబీకుడు కష్టజీవుల నిత్య వేదనకు సానుభూతితో స్పందించడం ఆయనలో ఒక చిత్రం. భావోద్వేగాలతో స్పందించే ఆదర్శవాద మేధావి, ఉదాత్తమైన సమతా వాద భావాలకు పట్టం కట్టిన నెహ్రూ... హారో, కేంబ్రిడ్జ్లలో ఆంగ్లోపాసన చేసిన విద్యావేత్త. బ్రిటిష్ జైళ్లలో పదేళ్లకు పైగా కాలం గడిపిన వ్యక్తి కూడా. మహాత్మా గాంధీ నుంచి అనూహ్యంగా ప్రత్యేక ప్రోత్సాహం పొందిన నాయకుడు. భారతదేశానికి నెహ్రూ అందించిన వారసత్వానికి నాలుగు మూల స్తంభాలు : ప్రజాస్వామిక వ్యవస్థల నిర్మాణం లౌకికవాదం, స్వదేశంలో సమతా వాద ఆర్థిక వ్యవస్థ, విదేశీ విధానంలో అలీన మార్గం. భారతదేశ నైతిక, నాగరిక చరిత్ర మీద ఆధారపడి, ప్రపంచంలో భారతదేశానికి ఒక పాత్రను నెహ్రూ నిర్దేశించారు. దళితులకు, దగా పడిన వారికి గళం కల్పించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఆయన తెచ్చిన ప్రతిష్ట కొన్ని ఏళ్ల పాటు పనికొచ్చింది. కానీ, 1962లో చైనాతో తలెత్తిన యుద్ధం కారణంగా కలిగిన అవమానం అటువంటì ప్రతిష్టకు గల పరిమితులను చాటింది. అధికారంలో సమున్నత స్థాయిలో ఉన్న రోజుల్లో ఆయన ఒక వ్యాసం రాసి, తన పేరు లేకుండా ప్రజల్లోకి వదిలారు. నియంత కావాలనే ప్రేరణలు తనలో కలుగకుండా అడ్డు కట్ట వేయాలని దానిలో ప్రబోధించారు. ‘‘ఆయనను హద్దుల్లో ఉంచాలి. మనం సీజర్లను కోరుకోవడం లేదు’’ అని నెహ్రూ తన గురించి తానే దానిలో రాశారు. తన లోటుపాట్ల వల్ల కానీ, అనుచరుల లోటు పాట్ల వల్ల కానీ ప్రజలలో తన స్థాయి ఏమాత్రం దెబ్బతినని అరుదైన నాయకుడు నెహ్రూ. భారతదేశానికి ఎలాంటి వారసత్వాన్ని అందించాలని మీరు ఆశిస్తున్నారని అమెరికన్ సంపాదకుడు నార్మన్ కజిన్స్ ఒకసారి నెహ్రూను ప్రశ్నించారు. ‘‘నలభై కోట్ల మంది ప్రజలు తమను తాము పరిపాలించుకునే సామర్థ్యం.. ’’ అని నెహ్రూ సమాధానం ఇచ్చారు. – శశి థరూర్ పుస్తకం ‘నెహ్రూ : ది ఇన్వెషన్ ఆఫ్ ఇండియా’ నుంచి (చదవండి: ఘట్టాలు: టాటా గ్రూపు ఆవిర్భావం) -
నెహ్రూ ఫొటో లేకుండా అమృత్ ఉత్సవాలా?
సాక్షి, హైదరాబాద్: చదువురాని ప్రధాని నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను వక్రీకరిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫొటో లేకుండా ఆజాదీకా అమృత్ ఉత్సవాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. దేశంకోసం త్యాగాలు చేసిన మహనీయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని మండిపడ్డా రు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ నెహ్రూ స్థానంలో సావర్కర్ బొమ్మ పెట్టినంత మాత్రాన చరిత్ర మారదన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలన్నారు. హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లో నెహ్రూ ఫొటో పెట్టాలని అడగడానికి వెళ్లిన యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలకు చెందిన 12 మంది నాయకులను పోలీసులు నిర్బంధించడం, రైల్వే రిక్రూట్మెంట్ పరీక్ష జరిగే రోజే ఉన్న టెట్ పరీక్షను వాయిదా వేయాలని విద్యామంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన మరో 21 మంది ఎన్ఎస్యూఐ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. అరెస్టు చేసిన విద్యార్థి, యువజన నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు భట్టి తెలిపారు. సామాజిక మార్పునకు కృషి చేసిన మహానేత నందమూరి తారక రామారావు అని కొనియాడారు. -
జిప్మర్లో హిందీ రగడ
సాక్షి, చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ (జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చి)లో పాలనా వ్యవహారాలన్నీ హిందీలోనే జరగాలన్న ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ హిందీ, సంస్కృత భాషలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిప్మర్ ఇచ్చిన హిందీ ఉత్తర్వులపై తమిళాభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బలవంతంగా హిందీని రుద్దాలన్న కేంద్ర ప్రభుత్వ యత్నాలను అడ్డుకుంటామని డీఎంకే ఎంపీ కనిమొళి హెచ్చరించారు. పుదుచ్చేరిలో బీజేపీ– ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. -
సాక్షి కార్టూన్ 19-02-2022
బయటివాళ్లు మా విషయాల్లో జోక్యం చేసుకుంటే.. ఖబర్దార్! -
నెహ్రూస్ ఇండియా, ఎంపీల నేరచరిత్రపై వ్యాఖ్యలు చేసిన సింగపూర్ పీఎం... తప్పుబట్టిన భారత్!
India has slammed the Singapore Prime Minister's comments: సింగపూర్ పార్లమెంట్లో సిటీ-స్టేట్లో ప్రజాస్వామ్యంపై ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతదేశ మొదటి ప్రధానమంత్రి గురించి ప్రస్తావించారు. నెహ్రూస్ భారత్లో లోక్సభలో దాదాపు సగం మంది ఎంపీలపై అత్యాచారం హత్య ఆరోపణలతో సహా క్రిమినల్ అభియోగాలు పెండింగ్లో ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు వీటిలో చాలా మటుకు రాజకీయ ఆరోపణలు కూడా ఉన్నాయని లీ అన్నారు. ఈ వ్యాఖ్యలను సింగపూర్ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ఎలా పని చేయాలనే అంశంపై జరిగిన ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా లీ ఈ వ్యాఖ్యలు చేశారు. "చాలా దేశాలు ఉన్నతమైన ఆదర్శాలు. గొప్ప విలువల ఆధారంగా ఏర్పడినవే కానీ ఆ తర్వాత రానురానూ రాజీకీయ ఆకృతి మారుతోంది. చాలా రాకీయ పార్టీలు తమ వ్యవస్థాపక నాయకులను విస్మరిస్తోంది." అని లీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈ ప్రసంగంలో ప్రధాని లీ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో సహా వివిధ ప్రధాన మంత్రుల గురించి ప్రస్తావిస్తూ..." చాలా దేశాలు మొదట చాలా ఉద్వేగభరితంగా ఏర్పడ్డాయి. డేవిడ్ బెన్-గురియన్లు, జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్రం కోసం పోరాడి సాధించిన గొప్ప నాయకులు. గొప్ప ధైర్యం అపారమైన సంస్కృతి, అద్భుతమైన సామర్థ్యం కలిగిన అసాధారణ వ్యక్తులు. అంతేకాదు వారు అపారమైన వ్యక్తిగత ప్రతిష్టతో, ధైర్యవంతమైన కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి, దేశంలోని ప్రజల కొత్త భవిష్యత్తును రూపొందించడంలోనూ ప్రజల అంచనాలను అందుకోవడానికి సదా ప్రయత్నిస్తారు. కానీ ఈ ప్రారంభ ఉత్సాహాన్ని తరువాత తరాలకు కొనసాగించడం లేదా నడిపించడంలో విఫలమవ్వడం లేదా కష్టమవుతోంది. అలాగే బెన్-గురియన్స్ ఇజ్రాయెల్ రెండేళ్లలో నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ, కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతోనే సరిపోయిందని, సీనియర్ రాజకీయ నాయకులు అధికారులు నేరారోపణలను ఎదుర్కొన్నారు". అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సింగపూర్లో ప్రజాస్వామ్యం ఎలా ? ఉండాలి, ఆ మార్గంలో పయనించకుండా ఉండాలంటే ఏం చేయాలని ప్రశ్నించారు. మనమేమి గొప్ప తెలివైనవాళ్లం, ధర్మాత్ములం కాదు కాబట్టి తరం వెంబడి తరం వ్యవస్థను పర్యవేక్షించి దాని నిర్మాణాన్ని కొనసాగిస్తే సాధ్యమవుతుందని లీ పేర్కొన్నారు. ఈ మేరకు భారత్ సింగపూర్ ప్రధాని లీ నెహ్రూస్ ఇండియా పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిడమే కాక అనవసరమైన వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. అంతేకాదు విదేశాంగ మంత్రిత్వ శాఖ సింగపూర్ హైకమిషనర్ను పిలిపించి తమ అభ్యంతరాన్ని తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. (చదవండి: ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రునే నిందిస్తున్నారు: మన్మోహన్ సింగ్) -
ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రునే నిందిస్తున్నారు: మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీడియా సందేశంలో ప్రజలను కాంగ్రెస్కి ఓటు వేయాలని కోరారు. ప్రతి సమస్యకు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే నిందిస్తున్నారంటూ మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్రమోదీ పై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందంటూ ఆక్రోసించారు. అంతేకాదు ఆ వీడియోలో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎన్నడూ దేశాన్ని విభజించలేదని మోదీకి కౌంటరిచ్చారు. దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యతో ప్రజలు సతమతమవుతుంటే గత ఏడున్నరేళ్లుగా అధికారంలో ఉన ప్రస్తుతం ప్రభుత్వం తమ తప్పులన ఒప్పుకోకుండా ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రూనే కారణమంటూ ఇప్పటికీ నిందిస్తూనే ఉన్నారని ఆరోపించారు. అంతేకాదు మీరు మీ స్వంత లోపాలను తగ్గించే క్రమంలో చరిత్రను నిందించలేరంటూ వక్కాణించారు. ప్రపంచం ముందు దేశ ప్రతిష్టను పోగొట్టుకోనివ్వను, అలాగే భారతదేశ గర్వాన్ని నేనెప్పుడూ కించపరచలేదంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు తనపై తప్పడు ఆరోపణలు చేసిన బీజేపీ, ఆ పార్టీకి సంబంధించిన బీ అండ్ సీ టీమ్లు గురించి దేశం ముందు బహిర్గతం అవుతున్నందుకు ఆనందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. (చదవండి: సర్జికల్ స్ట్రైక్స్, అయోధ్య విషయంలో వారు సంతోషంగా లేరు! ప్రధాని ఆగ్రహం) -
ఆధునిక దేవాలయం: ఆ అపురూప ఘట్టానికి నేటికి 66 ఏళ్లు
Nagarjunasagar Project Marks the 66th Anniversary of The Foundation Stone: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి నేటితో 66 ఏళ్లు నిండాయి. 1955 డిసెంబర్ 10న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి పైలాన్లో శంకుస్థాపన చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో మానవశక్తితో నిర్మితమైన ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. కుడి కాలువను జవహర్ కాలువగా, ఎడమ కాలువను లాల్బహుదూర్ శాస్త్రి కాలువగా పిలుస్తారు. జవహర్ కాలువ సాగర్ ఆనకట్ట కుడివైపు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కాలువ పనులను 10 అక్టోబర్ 1956న అప్పటి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. ఇది దక్షిణ విజయపురి (రైట్ బ్యాంకు) వద్ద సొరంగ మార్గం ద్వారా ప్రారంభమై 392 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11లక్షల 74వేల 874 ఎకరాలు సాగవుతుందని స్థిరీకరించారు. రిజర్వాయర్ ఎడమవైపు నుంచి ప్రారంభమయ్యే లాల్బహుదూర్ శాస్త్రి కాలువ పొట్టిచెలమ నుంచి చలకుర్తి వరకు సొరంగమార్గం ద్వారా ప్రయాణిస్తుంది. దీని నిర్మాణాన్ని 1959లో ఆనాటి గవర్నర్ భీమ్సేన్ సచార్ ప్రారంభించారు. ఈ కాలువ పొడవు 349 కిలోమీటర్లు. దీని కింద 10లక్షల 37వేల 796 ఎకరాలు సాగవుతుందని స్థిరీకరించారు. రెండు కాలువలకు 132 టీఎంసీల చొప్పున నీటిని కేటాయించారు. రిజర్వాయర్ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు ఈ రెండు కాలువలకు నీటిని విడుదల చేయవచ్చు. 4 ఆగస్టు 1967న నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు మొట్టమొదటిసారి నీటిని వదిలారు. లక్ష్యానికి దూరంగా.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నేటికీ నెరవేరలేదు. సిమెంట్తో నిర్మించిన కాలువలు కాలక్రమేణా దెబ్బతినడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ప్రపంచ బ్యాంకు రుణంతో చిట్టచివరి ఎకరం వరకు నీరందాలనే ఉద్ధేశంతో సాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. అయినా ఇప్పటికీ చివరి భూములకు నీరందని కాల్వలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూడికతో రెండు పంటలకు అందని నీరు.. నాగార్జునసాగర్ జలాశయంతో పాటు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయంలో పూడిక చేరడంతో ఒకసారి నిండితే రెండు పంటలకు నీరు సరిపోవడం లేదు. అంతేకాకుండా ప్రాజెక్టు నిండిన సమయంలో అధికారులు సరైన ప్రణాళికలు తయారుచేయకపోవడంతో నీటి విడుదల ఆలస్యమై దుబారా అధికమవుతుంది. ఇప్పటికీ ఏ తూము ద్వారా ఎంత నీటిని విడుదల చేస్తే ఎన్ని ఎకరాలు సాగవుతుందనే సమాచారం అధికారుల వద్ద లేదు. ఆయా తూముల వద్ద బోర్డులు ఏర్పాటు చేయలేదు. జలాశయంలోకి పూడిక చేరకుండా చూసి కాలువల స్థానంలో పైపులైన్లు అమర్చితే మరికొన్ని భూములకు సాగునీరందే అవకాశాలున్నాయని రైతులు అంటున్నారు. తూములన్నింటికీ షట్టర్లు బిగించాలి.. ప్రధాన కాల్వకు ఉన్న మేజర్ల దగ్గరి నుంచి ప్రతి పంట కాల్వకు షట్టర్లు బిగించాలి. పంటల అవసరాన్ని బట్టి రైతులు నీటిని వినియోగించుకునేలా తూములు డిజైన్ చేయాలని రైతులు కోరుతున్నారు. మేజర్ల దగ్గరి నుంచి పంట కాల్వల వరకు ఏ తూముకు ఏ నెలలో ఎంత నీటిని విడుదల చేస్తే ఎంత భూమి సాగవుతుందనే విషయాన్ని బోర్డుల ద్వారా తెలియజేయాలని కోరుతున్నారు. సాగర్ జలాశయం విస్తీర్ణం– 110 చదరపు మైళ్లు గరిష్ట నీటిమట్టం – 590 అడుగులు డెడ్ స్టోరేజీ లెవల్ – 490 అడుగులు నీటి నిల్వ సామర్ధ్యం – 408.24 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 312 టీఎంసీలు) నీటి నిల్వ డెడ్ స్టోరేజీ – 179.16 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 168 టీఎంసీలు) నీటి విడుదలకు ఉండాల్సిన కనీస నీటిమట్టం 510 అడుగులు -
ఆ వారసత్వం నేటికీ రేపటికీ అవసరమే!
స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఒక సంక్లిష్టమైన, ప్రమాదకరమైన భౌగోళిక పరిస్థితులతో కూడిన దేశ వ్యవహారాలను నెహ్రూ దార్శనికతతో చక్కబెట్టారు. విదేశీ వ్యవహారాలు, దౌత్యాల విషయంలోనూ నెహ్రూ చెరగని ముద్ర వేశారు. దేశాన్ని ఆధునికీకరణ బాట పట్టించడంలో నెహ్రూదే ప్రధాన పాత్ర. భారతదేశ గొప్ప వైవిధ్యాన్నీ, దాని బహుముఖ సాంస్కృతిక మూర్తిమత్వాన్నీ నెహ్రూ శోభావంతం చేశారు. జాతీయ ఐక్యత కోణంలో విభిన్న అస్తిత్వాల మధ్య ఉండాల్సిన సయోధ్య అవసరాన్ని గుర్తించారు. సమాజ ఉపరితలంలో పాతుకుపోయి ఉన్న ఒంటెద్దుపోకడలు, ఛాందసవాదుల పట్ల అప్రమత్తతతో వ్యవహరించడంలో లౌకికవాదం ప్రాధాన్యాన్ని నెహ్రూ అర్థం చేసుకున్నారు. ఆ స్ఫూర్తిని చివరిదాకా కొనసాగించారు. ఈ దేశ నిర్మాణం, ఘనమైన ప్రజాస్వామ్య విధానాల్లో ఆయన పాత్ర ఎనలేనిది. ప్రపంచంలో భారత వాణికి ఒక విలువ ఉందంటే అది నెహ్రూ పుణ్యమే! ఈ వారసత్వాన్ని స్మరించుకోవడం, స్ఫూర్తిని పెంపొందించుకోవడం ఈ తరానికే కాదు... భవిష్యత్ తరాలకూ చాలా అవసరం. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 132వ జయంతిని ఈ నెల 14న ‘పాటించాం’. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే నెహ్రూ జయంతి ఉత్సవాలేవీ జరగలేదు. ఈ దేశ నిర్మాణం, ఘనమైన ప్రజాస్వామ్య విధానాల్లో ఆయన పాత్ర ఎనలేనిది. ప్రపంచం మొత్తంమీద భారత్ వాణికి ఒక విలువ ఉందంటే అది నెహ్రూ పుణ్యమే. ఈ వారసత్వాన్ని సదా స్మరించుకోవడం, స్ఫూర్తిని పెంపొం దించుకోవడం ఈ తరానికే కాదు.. భవిష్యత్తు తరాలకు కూడా చాలా అవసరం. నెహ్రూ నాయకత్వంలో లోపాలు లేవా? కచ్చితంగా ఉన్నాయి. ఆ లోటుపాట్ల తాలూకూ పరిణామాలు చాలాకాలంపాటు పీడించాయి కూడా. కశ్మీర్ అంశాన్ని నెహ్రూ సక్రమంగా చేపట్టలేదని, 1962 చైనా చొరబాట్లలోనూ ఆయన వైఫల్యం ఉందని నేను తప్పు పట్టగలను. అయితే ఈ అంశాలన్నింటినీ హ్రస్వదృష్టితో చూడటం కంటే.. ఆ కాలపు సమయం, సందర్భం, పరిస్థితి వంటి అన్ని అంశాలనూ విశ్లేషించి మరీ చూడటం ముఖ్యం. స్వాతంత్య్రం వచ్చిన నాటికి దేశం ఎంతటి విచిత్ర పరిస్థితుల్లో ఉండిందో మనం అర్థం చేసుకోలేం. మత ప్రాతిపదికన దేశ విభజన, ఆ తరువాత చెలరేగిన అమానవీయ ఘర్షణలు, కొత్తగా గీసుకున్న సరిహద్దుల వెంబడి భారీ స్థాయిలో ప్రజల రాకపోకలు... 500 రాజాస్థానాలను ఒక్క ఛత్రం కిందకు తేవాల్సిన అవసరం.. వెరసి గందరగోళం! ఇదంతా సమసిపోతోందని అనుకునేలోపే జమ్మూ కశ్మీర్ వైపు నుంచి పాకిస్తాన్తో యుద్ధం ఒకటి ముంచుకొచ్చింది. ఆ తరువాతైనా పరిస్థితులు చక్కబడ్డాయా? అంటే సైద్ధాంతిక విభేదాలున్న రెండు ప్రబల శక్తుల మధ్య రణం అణు ముప్పు ఛాయల్లో కొనసాగుతూనే వచ్చింది. తిరుగులేని దార్శనికుడు... ఈ సంక్లిష్ట, ప్రమాదకరమైన భౌగోళిక పరిస్థితులతో కూడిన వ్యవహారాలను నెహ్రూ దార్శనికతతో చక్కబెట్టడమే కాదు, తన నాయకత్వ లక్షణాలు, స్వతంత్య్ర వ్యవహారశైలితో భారత భూభాగాన్ని కాపాడగలిగారు. విదేశీ, దౌత్య వ్యవహారాల్లోనూ నెహ్రూ చెరగని ముద్ర వేశారు. నెహ్రూది జాతీయవాది మాత్రమే కాదు.. అంతర్జాతీయవాది, మానవతావాది కూడా. తన సమకాలీనులందరికంటే ఎంతో ముందుచూపు, విషయ అవగాహన ఆయన సొంతం. అణ్వస్త్ర ప్రమాదం సరిహద్దులను అప్రస్తుతంగా మార్చగలదన్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. దేశాంతర, ఖండాంతర ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రయత్నాలే మేలని, దేశాల మధ్య బహుముఖ సహకారం అవసరమనీ నెహ్రూ ఎప్పుడో గుర్తించారు. అంతర్జాతీయ స్థాయిలో పాలనను సూచించే ‘వన్ వరల్డ్’ అన్న అంశంపై నెహ్రూ అప్పట్లోనే విస్తృతంగా రాశారు. దేశ, ప్రాంత సరిహద్దులను దాటిపోయి మరీ వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ అంతర్జాతీయ స్థాయి పాలనకు ప్రత్యామ్నాయం లేదని ఆయన వాదించేవారు. టెక్నాలజీ పుణ్యమా అని ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో నెహ్రూ ఆలోచనలు ఎంతైనా ఆచరణ సాధ్యమైనవనడంలో సందేహం లేదు. దేశాన్ని ఆధునికీకరణ బాట పట్టించడంలో నెహ్రూదే ప్రధాన పాత్ర. ఆయన దార్శనికత వల్లే దేశంలో అణు. అంతరిక్ష కార్యక్రమాలు మొదలయ్యాయి. అత్యున్నత నైపుణ్య కేంద్రాలుగా ఐఐటీలు ఎదిగేందుకు , శాస్త్ర పరిశోధనల నెట్ వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఏర్పాటు, ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలూ నెహ్రూ ఆలోచనల ఫలాలే. భారతీయులు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని బోధించినదీ ఈయనే. అయితే ప్రాథమిక, సెకండరీ విద్యా వ్యవస్థల్లో లోటుపాట్ల ఫలితంగా ఆధునికీకరణ వైపు మన ప్రయాణానికి ప్రతిబంధకంగా మారాయి. అసలైన భారతీయుడు నెహ్రూను ఎక్కువ ఆంగ్లేయుడు, తక్కువ భారతీయుడు అనుకుం టారు. అయినప్పటికీ ఆయన రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’... భారత చరిత్ర పట్లా, తరతరాలుగా దేశ ప్రాపంచిక దృక్పథాన్ని తీర్చిదిద్దిన తాత్విక, మేధా ప్రవాహాల పట్లా, భారతీయులను ఒక్కటిగా ఉంచుతున్న ఘనమైన సాంస్కృతిక వారసత్వం పట్లా ఆయనకు ఉన్న లోతైన అవగాహనకు సాక్ష్యం. కళలు, హస్తకళల్లో భారతదేశ ఘనమైన వారసత్వం... వాటికి సంబంధించి జనాల్లో ఉన్న సౌందర్య సున్నితత్వం ఆయన్ని ముగ్ధుడిని చేయడంతో వాటి పునరుద్ధరణకు కృషి చేశారు. భారతదేశ గొప్ప వైవిధ్యాన్నీ, దాని బహుముఖ సాంస్కృతిక మూర్తిమత్వాన్నీ నెహ్రూ శోభావంతం చేశారు. అదే సమయంలో జాతీయ ఐక్యత కోణంలో విభిన్న అస్తిత్వాల మధ్య ఉండాల్సిన సయోధ్య అవసరాన్ని గుర్తించారు. అందువల్లే భారతీయులు ఆదరించే విభిన్న అస్తిత్వాలను భారత రాజ్యాంగం అణిచివేయాలని చూడదు. కానీ వాటిని ప్రతి వ్యక్తికీ హక్కులు, స్వేచ్ఛ ఉండేలా భాగస్వామ్యపూరిత, సమాన పౌరసత్వంలోకి అధిగమించమని కోరుతుంది. మతపరమైన ఆచారాలు, అలవాట్లతో సంబంధాన్ని ప్రభుత్వం ఉంచుకోకూడదనే లౌకికవాద భావనకు ఇది పునాది వంటిది. బహుళ సాంస్కృతిక, బహుళ మత ప్రాతిపదిక కలిగిన దేశం లౌకిక రాజ్యంగా తప్ప మరేవిధంగానూ ఉండదు. సమాన పౌరసత్వ సూత్రాన్ని ఎత్తిపట్టాలంటే ఇది తప్పనిసరి. సమాజ ఉపరితలంలో పాతుకుపోయి ఉన్న ఒంటెద్దుపోకడలు, మతోన్మాదుల పట్ల అప్రమత్తతతో వ్యవహరించడంలో లౌకికవాదం ప్రాధాన్యాన్ని నెహ్రూ అర్థం చేసుకోవడమే కాకుండా ఆ స్ఫూర్తిని కలిగి వుంటూనే ఆచరించారు. లౌకిక విధానం నుంచి రాజ్యం వేరుపడితే ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో మనం చూస్తూ ఉన్నాం. హిందూ–ముస్లిం విభజనపై జాతీయ ఐక్యతను సాధించలేం. భారతీయ గతం నుంచి ఈ గుణపాఠాన్ని మర్చిపోవడం ప్రమాదహేతువు. నెహ్రూ ఒక ఆధునిక నేత. కానీ భారతీయ నాగరికతా వారసత్వంతో ఆయన పూర్తిగా మమేకమయ్యారు. తన డిస్కవరీ ఆఫ్ ఇండియా రచనలో తన ప్రియమైన దేశం గురించి ఘనంగా ప్రశంసించారు. అదే సమయంలో దాని నాగరికతా గుణాలపట్ల చక్కటి అవగాహనను కూడా ప్రదర్శించారు. ‘‘భారతదేశం తన దారిద్య్రం, అథఃపతనాలతోపాటు, మహోన్నత గుణాన్ని కలిగి ఉంది. ప్రాచీన సంప్రదాయాలకు, విపత్కర స్థితికి సంబంధించిన అధిక బరువును మోస్తూనే భారత మాత నేత్రాలు అలిసిపోయి కనబడుతున్నాయి. కణం కణంగా పోగు చేసుకున్న తన రక్తమాంసాలతో, వినూత్న ఆలోచనలతో, అద్భుతమైన స్వప్నాలతో, దివ్యమైన ఆనురక్తులతో ఒక నిసర్గసౌందర్యంతో భారత్ అలరారుతోంది. బయటా లోపలా దాడులతో భారత మాత శరీరం చీలికలైపోయినప్పటికీ, దాని మహోన్నతమైన ఆత్మిక సౌందర్యాన్ని మనం చూడవచ్చు. యుగాలుగా దేశం ప్రయాణం సాగించి ఆ మార్గంలో ఎంతో విజ్ఞానాన్ని పోగు చేసుకున్న క్రమంలో ఎంతోమంది విదేశీయులను ఆహ్వానించి తన పెద్ద కుటుంబంలో కలుపుకుంది. ఈ క్రమంలో అనేక ఉజ్వలమైన క్షణాలను, మహా పతనానికి కూడా సాక్షీభూతమై నిలిచింది. అనేక అవమానాలకు గురైంది. అంతులేని విషాదాల బారినపడింది. తన సుదీర్ఘ ప్రయాణంలో మర్చిపోలేని సంస్కృతిని అంటిపెట్టుకుంటూనే, దాన్నుంచి శక్తిని కూడగట్టుకుని ఇతర భూభాగాలతో పంచుకుంది కూడా.’’ భారతదేశ ఆత్మను నిజంగా అర్థం చేసుకుని, తన జీవిత పర్యంతం దానికి సేవ చేస్తూ వచ్చిన మరో భారతీయ నేత నా ఆలోచనల్లో కూడా లేడు. ఈ రోజు మనం చూస్తున్న అల్పబుద్ధుల, నీచమైన దురభిమానం కాకుండా... ప్రజల నిజమైన జాతీయవాదాన్ని తీర్చిదిద్దిన భారతీయ విస్తృతాత్మ ఇది మాత్రమే. – శ్యామ్ శరణ్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి -
అవమానించడం కాదు! అనుసరిద్దాం!!
జీవిత కాలమంతా బాలలు, యువకుల పట్ల పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఎంతో ఆసక్తీ, అభిరుచీ ఉండేవి. వారి సంక్షేమానికి, విద్యావ్యాప్తికి, అభివృద్ధికి ఆయన చేసిన కృషి, చేపట్టిన విధానాల గుర్తింపుగా ఆయన జన్మదినమైన నవం బర్ 14ను బాలల దినోత్సవంగా జరుపు కుంటున్నాము. దేశాభివృద్ధికి, భావి తరాల బాగుకు నెహ్రూ ప్రదర్శించిన దార్శనికత, రాజనీతిజ్ఞతలను ఈ తరం విద్యార్థులు, యువకులు తెలుసుకోవాలి. జవహర్ లాల్ నెహ్రూ దార్శనికుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రపంచజ్ఞాన అనుభవజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు. అంతే కాకుండా ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను గొప్ప నాయకుల కంటే మెరుగ్గా పాటించినవాడు. ‘‘భారత స్వాతంత్య్ర, ప్రజాస్వామ్య సూర్యుడు అస్తమించరాదు. మన ఆశలు మోసానికి గురికారాదు. ఏ మతస్థులమైనా మనమంతా సమాన హక్కులు, అధికారాలు, బాధ్యతలు గల భారతీయులం. మనం మత తత్వాన్ని, సంకుచిత స్వభావాలను ప్రోత్సహించరాదు.’’ ఇది భారత్ భవిష్యత్తు నిర్మాణంపై నెహ్రూ దార్శనిక ప్రకటన. నెహ్రూ మీద బురదజల్లే ప్రయత్నాలు నేడు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి నేటి దేశ నాయకుల స్థాయిలో ఉన్నవారే నెహ్రూను అవమానిస్తున్నారు. వారి భక్తులు సిగరెట్ తాగుతున్న, స్త్రీల ప్రక్కన కూర్చున్న (సందర్భాన్ని ప్రస్తా వించకుండా) ఆయన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను సామా జిక మాధ్యమాల్లో ఉంచి దుష్ప్రచారం చేశారు, చేస్తున్నారు. చరిత్ర చదవని విద్యార్థులు, యువకులు వాటిని ఉపయోగించి నెహ్రూ వ్యక్తిత్వంపై అవాంఛనీయ వ్యాఖ్యానాలు చేశారు. 1905 లో నెహ్రూ ఇంగ్లండ్ ‘హారొ’ నగరంలో పేరుగాంచిన పాఠశాలలో విద్య అభ్యసించారు. ఆ పాఠశాలలో సాధించిన విద్యా ప్రావీణ్యతలకు గానూ నెహ్రూకు ప్రఖ్యాత ఆంగ్ల చరిత్ర కారుడు జార్జ్ మెకాన్లె ట్రెవెల్యాన్ రచించిన ‘గారిబాల్డి‘ పుస్తకా లను బహూకరించారు. గారిబాల్డి ఇటలీ సైన్యాధికారి, రాజకీయ నేత. ఇటలీ జాతిపితలలో ఒకరిగా పేరొందారు. నెహ్రూ ఈ పుస్త కాలను క్షుణ్ణంగా చదివారు. ఆయన దృష్టిలో గారిబాల్డి ఒక విప్లవ వీరుడు. ఆయన జీవితం నుంచే నెహ్రూ భారత స్వాతంత్ర పోరా టానికి స్ఫూర్తి పొందారు. తర్వాత నెహ్రూ 1907 అక్టోబర్లో కేంబ్రిడ్జ్లోని ట్రినిటి కాలేజీలో చేరారు. 1910లో జీవశాస్త్రంలో ఆనర్స్ పట్టా పొందారు. తన పాఠ్యాంశాలతో సంబంధం లేక పోయినా రాజకీయ, ఆర్థిక, సామాజిక శాస్త్రాలను, చరిత్ర, సాహి త్యాలను అధ్యయనం చేశారు. ప్రఖ్యాత ఆంగ్ల కవులు, రచయి తలైన జార్జ్ బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, జె.ఎమ్. కీన్స్, బెర్ ట్రాండ్ రస్సెల్, లొజెస్ డికెన్సన్, మెరెడిత్ టౌన్ సెండ్ల రచనలు నెహ్రూ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చాయి. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో (1942) కారాగార నిర్భంధవాసం గడుపుతున్న సమయంలో కూడా నెహ్రూ వివిధ దేశాల చరిత్రలు, సామాజిక, ఆర్థిక, రాజకీయాంశాలకు సంబం ధించిన 55 పుస్తకాలను అధ్యయనం చేసి విశేష పరిజ్ఞానాన్ని సంపాదించారు. పాఠ్యాంశాలను కూడా సరిగా చదవని విద్యా ర్థులు, ఏమీ అధ్యయనం చేయకుండా అవాకులు చవాకులు వాగే రాజకీయ నేతలు గ్రంథ పఠన ప్రాముఖ్యతను గురించి నెహ్రూ నుండి నేర్చుకోవాలి. పాఠ్యపుస్తకాలకు మించి సామాజిక శాస్త్రా లను జీవితాంతం అధ్యయనం చేయాలని, అప్పుడే సంపూర్ణ అవగాహన, సామాజిక స్పృహ కలుగు తాయని గుర్తించాలి. భారత ప్రప్రథమ ప్రధానిగా నెహ్రూ ప్రగతిశీల సామాజిక విధానాలను అమలుచేశారు. బాలలకు, యువకులకు సమర్థ, ప్రతిభా నైపుణ్యతల విద్యను అందించాలని కోరుకున్నారు. భవి ష్యత్ భారత ప్రగతికి ఇది ముఖ్యమని భావించారు. అందుకోసం ప్రపంచ స్థాయి విద్యాసంస్థలైన అఖిల భారత వైద్య సేవల సంస్థ, భారతీయ సాంకేతిక సంస్థలు (ఐఐటీలు), భారతీయ నిర్వహణ సంస్థలు(ఐఐఎమ్లు), సాంకేతిక జాతీయ సంస్థలు (ఎన్ఐటీలు) స్థాపించారు. సోవియట్ యూనియన్ బాటలో పంచవర్ష ప్రణాళి కల ద్వారా బాలలందరికి ఉచిత, నిర్భంధ ప్రాథమిక విద్యను అందజేసే విధానాలను రూపొందించారు. దీనికోసం గ్రామీణ ప్రాంతాల్లో మూకుమ్మడి పాఠశాల విద్యార్థుల నమోదు పథకా లను ప్రవేశపెట్టారు. వేల సంఖ్యలో పాఠశాలలు స్థాపించారు. పోషకాహార లోపం నుండి పిల్లలను రక్షించడానికి ఉచిత పాల, భోజన సదుపాయాలు కల్పించారు. దేశమంతా ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దల కోసం వయోజన విద్యాకేంద్రాలను, వృత్తి, సాంకేతిక పాఠశాలలను ఏర్పాటు చేశారు. ప్రజా స్వామ్యం, సామ్యవాదం, ఐక్యత, లౌకికత్వం నెహ్రూ స్వదేశీ సూత్ర మూలస్తంభాలు. భారతదేశాన్ని లౌకికదేశంగా ప్రకటిం చారు. సామ్యవాద సమాజ స్థాపన లక్ష్యంగా నిర్దేశించారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, టువర్డ్స్ ఫ్రీడం (ఆత్మ కథ) లాంటి పుస్తకాలను నెహ్రూ రచిం చారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ జిల్లాలోని ముస్సోరి బోర్డింగ్ పాఠశాలలో చదువుతూ ఉండిన పదేళ్ళ కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి 30 ఉత్తరాలు రాశారు. ఈ ఉత్తరాలలో బాగా చదవమని, ఫస్ట్ మార్కులు తెచ్చుకోమని రాయలేదు. దేశాల చరిత్రలు, ప్రపంచ ప్రజల నాగరికతలను వివరించారు. ఈ ఉత్త రాలను ‘తండ్రి నుంచి తనయకు ఉత్తరాలు’ అన్న శీర్షికతో పుస్త కంగా అచ్చువేశారు. తమ జ్ఞానాన్ని భావి తరాలకు అందజేసి విజ్ఞానంగా మార్చాలి. లేకపోతే మన సమాచార సంపదకు సార్థకత శూన్యం. నేడు నెహ్రూకు పూర్తి విరుద్ధ భావాలున్న నేతలు దేశాధినేతలయ్యారు. ఎంత గొప్పవారయినా తప్పులు చేయని, మచ్చలు లేని మానవులుండరు. పనిచేసే వారిలో పొర పాట్లు, తప్పులు సహజం. అయినా ఎదుటివారు ఏ పక్షం అన్న పట్టింపులు మాని, వారినుండి మంచిని గ్రహించి, చెడును వది లేయాలి. వెలుగులను మరిచి మచ్చలనే వెదికితే మన భవిష్యత్తు కూడా మచ్చలమయం కాకతప్పదు. వ్యాసకర్త: సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి ‘ మొబైల్ : 94902 04545 (నేడు బాలల దినోత్సవం, నెహ్రూ జయంతి) -
మన ఆర్థిక ప్రస్థానం.. బ్రిటిష్ రాజ్... లైసెన్స్ రాజ్.. డిజిటల్ రాజ్!
17వ శతాబ్దం ఆరంభం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 22.6 శాతం. అంటే దాదాపు యూరప్ మొత్తం వాటా (23%)తో సమానం. 1952 నాటికి మన వాటా 3.8 శాతానికి పడిపోయింది. కేంబ్రిడ్జ్ చరిత్రకారుడు ఆంగస్ మాడిసన్ వెల్లడించిన ఈ అంచనాలు చాలు... బ్రిటిష్ పాలనలో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా కుదేలయిందో చెప్పడానికి! బ్రిటిష్ పాలకులు భారత్లో పారిశ్రామికీకరణను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో స్వాంత్రంత్య్రం పొందే నాటికి దేశం ఆర్థికంగా చితికిపోయింది. ఇప్పుడు 74 ఏళ్ల తర్వాత, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాం. కడు పేదరికం నుంచి డిజిటల్ ఆర్థిక శక్తిగా ఎదగడంలో మన ఆర్థిక విధానాలు పోషించిన పాత్ర, మన ఆర్థికరంగంలో చోటు చేసుకున్న కీలక మార్పులపై 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఒక సింహావలోకనం. నెహ్రూ.. సర్వం ప్రభుత్వం చెప్పుచేతల్లోనే! స్వాతంత్య్రం వచ్చాక అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చికిత్స ప్రారంభించారు. స్వావలంబనతో కూడిన ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం, దారిద్య్ర నిర్మూలన లక్ష్యాలతో సోషలిజం ఛాయలతో కూడిన అభివృద్ధి విధానాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వమే ఒక ఎంట్రప్రెన్యూర్గా వ్యవహరించేలా 1948లో ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధాన తీర్మానం దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు బాటలు వేసింది. ప్రభుత్వ రంగ కంపెనీల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రైవేటు కంపెనీలను పూర్తిగా ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంచుకునేలా విధానాలను రూపొందించారు. దేశంలో లైసెన్స్ రాజ్కు ఇక్కడే బీజం పడింది. ఉక్కు, మైనింగ్, యంత్ర పరికరాలు, టెలికం, బీమా, విద్యుత్ తదితర కీలక పరిశ్రమల్లో ప్రభుత్వ ఆధిపత్యం కొనసాగింది. అప్పటి సోవియెట్ యూనియన్ విధానాల ప్రభావంతో పంచ వర్ష ప్రణాళికలకు రూపకల్పన చేసిన నెహ్రూ సర్కారు... మొత్తం ప్రభుత్వ ప్రణాళికలను పర్యవేక్షించడం కోసం 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. 1951లో భారత్ మొట్టమొదటి పంచ వర్ష ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై ఈ ఐదేళ్లూ దృష్టి సారించారు. అధిక మొత్తంలో పొదుపులు, పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధి సాధించేలా పాలసీలను రూపొందించారు. ఈ తొలి పంచవర్ష ప్రణాళిక మంచి ఫలితాలనే అందించింది. 2.1 శాతం వార్షిక జీడీపీ వృద్ధి రేటు లక్ష్యాలను అధిగమించి 3.6 శాతం వృద్ధి సాకారమైంది. లైసెన్స్ రాజ్... 1956 నాటి రెండో పంచవర్ష ప్రణాళిక దేశంలో ప్రభుత్వ రంగ కంపెనీల జోరుకు బాటలు వేయడంతో పాటు లైసెన్స్ రాజ్ ఆవిర్భావానికి కారణమైంది. భారత్లో పరిశ్రమలను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి, రెండవ గ్రూపుల్లో ప్రధానమైన, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న కంపెనీలను పూర్తిగా ప్రభుత్వ రంగంలో చేర్చారు. ఇక మూడో గ్రూపులో కన్జూమర్ పరిశ్రమలను చేర్చి, వాటిని ప్రైవేటు రంగానికి వదిలేశారు. అయితే, లైసెన్సుల జారీ వ్యవస్థ ద్వారా ప్రైవేటు రంగంపై ప్రభుత్వం పూర్తి పెత్తనం చలాయించేలా విధానాలను రూపొందించడంతో అన్నింటికీ ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొని, అధికారుల జోక్యం మితిమీరి, విపరీతమైన అవినీతికి దారితీసింది. భాక్రా–నంగల్ టు భిలాయ్... భారతదేశ ఆధునిక దేవాలయాలు ప్రభుత్వ ప్రణాళికల్లో విద్యుత్, ఉక్కు రంగాలను కీలకమైనవిగా నెహ్రూ భావించారు. హిమాచల్ప్రదేశ్లోని సట్లెజ్ నదిపై నిర్మించిన భాక్రా బహుళార్థసాధక ప్రాజెక్టును పునరుజ్జీవ భారతదేశంలో కొత్త దేవాలయంగా ఆయన అభివర్ణించారు. భాక్రా–నంగల్తో పాటు అనేక జల విద్యుత్ ప్రాజెక్టులు దేశంలో లక్షలాది ఇళ్లలో వెలుగులు నింపాయి, అనేక ఫ్యాక్టరీలను నడిపించాయి, లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించాయి. రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో 60 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకోవడంతో, జర్మనీ సహకారంతో రూర్కెలా స్టీల్ ప్లాంట్.. రష్యా, బ్రిటన్ ఆధ్వర్యంలో భిలాయ్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ల నిర్మాణం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), అణు ఇంధన కమిషన్ వంటి ఎన్నో ‘ఆధునిక దేవాలయాలు’ నెహ్రూ హయాంలోనే పురుడు పోసుకున్నాయి. నెహ్రూ తదనంతరం ప్రధాని పగ్గాలు చేపట్టిన లాల్బహదూర్ శాస్త్రి హయాంలోనే ఆహార ధాన్యాలు, డెయిరీ రంగంలో స్వయం సమృద్ధికి దోహదం చేసిన హరిత విప్లవం, క్షీర విప్లవం చోటు చేసుకున్నాయి. ఇందిర హయాం... బ్యాంకుల జాతీయీకరణ నెహ్రూ, శాస్త్రి వెనువెంటనే మరణించడం... దేశంలో రాజకీయ అస్థిరతకు దారితీసింది. విదేశీ మారక నిల్వలు అడుగంటడం.. చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో 1966 జూన్ 6న ప్రధాని ఇందిరా గాంధీ డాలరుతో రూపాయి మారకం విలువను ఏకంగా 57 శాతం తగ్గించి 4.76 నుంచి 7.50కు తీసుకొచ్చేశారు. దీనివల్ల ఎగుమతులకు ఊతం లభించినా, దేశంలో ధరలు విపరీతంగా పెరిగి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వ్యవసాయ రుణాలను పెంచడమే లక్ష్యంగా 1969 జూలై 20న దేశంలోని 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తున్నట్లు ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. అయితే, ప్రభుత్వ బ్యాంకుల కార్యకలాపాల్లో తీవ్ర రాజకీయ జోక్యం క్రోనీ క్యాపిటలిజానికి దారితీసి, విపరీతంగా మొండిబాకీలు పెరిగిపోయేందుకు కారణమైంది. 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిర... 1977 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. డీమానిటైజేషన్ 1.0 1977లో అధికారంలోకి వచ్చిన మొరార్జీ దేశాయ్ సారథ్యంలోని జనతాపార్టీ.. నల్లధనానికి అడ్డుకట్టవేయడం కోసం రూ.1,000, రూ.5,000, రూ.10,000 బ్యాంకు నోట్లను రద్దు చేసింది. అప్పటి పరిశ్రమల మంత్రి జార్జి ఫెర్నాండెజ్... విదేశీ కంపెనీలపై కొరడా ఝుళిపించడంతో బహుళజాతి కంపెనీలైన ఐబీఎం, కోకాకోలా ఇక్కణ్ణుంచి దుకాణం సర్దేశాయి. రాజీవ్పాలన... ఐటీ, టెలికం విప్లవానికి నాంది 1984 అక్టోబర్లో ఇందిర హత్యతో 40 ఏళ్ల వయస్సులో యువ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీ... ప్రత్యక్ష పన్నుల తగ్గింపు, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితుల పెంపు వంటి పలు సంస్కరణలు చేపట్టారు. అంతేకాదు దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), టెలికం విప్లవాలకు నాంది పలికిన ఘనత కూడా రాజీవ్కే దక్కుతుంది. పీవీ సంస్కరణల హీరో... 1991లో భారత్ చెల్లింపుల సంక్షోభంతో దివాలా అంచున నిలబడింది. దీంతో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్లు బంగారాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రుణాలు తీసుకొని దేశాన్ని గండం నుంచి గట్టెక్కించారు. లైసెన్స్ రాజ్కు అంతంతో పాటు మన ఎకానమీని మలుపు తిప్పిన విప్లవాత్మకమైన సంస్కరణలు, సరళీకరణకు తెర తీశారు. దీంతో భారత్కు విదేశీ కంపెనీలు క్యూ కట్టి, భారీగా ఉద్యోగాలకు దోహదం చేసింది. వాజ్పేయి... ప్రైవేటీకరణకు సై నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) తరఫున ప్రధాని పగ్గాలు చేపట్టిన అటల్ బిహారీ వాజ్పేయి హయాంలోనూ సంస్కరణలు జోరందుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు (డిజిన్వెస్ట్మెంట్) ద్వారాలు తెరిచి.. విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (వీఎస్ఎన్ఎల్), బాల్కో, హిందుస్థాన్ జింక్ తదితర కంపెనీలను విక్రయించారు. స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల రూపురేఖల మార్చివేత వాజ్పేయి ఘనతే. జీడీపీ వృద్ధి ‘మన్మోహనం’ 1991లో ఆర్థిక మంత్రిగా సత్తా చూపిన మన్మోహన్ సింగ్... అనూహ్యంగా 2004లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) ప్రభుత్వ సారథిగా ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వంటి పలు సామాజికాభివృద్ధి పథకాలకు మన్మోహన్ సర్కారు బీజం వేసింది. ప్రభుత్వ రంగ కంపెనీల్లో 5–20 శాతం వరకు వాటాలను విక్రయిచడం ద్వారా ఈ పథకాలకు నిధులను సమకూర్చుకోగలిగారు. పదేళ్ల మన్మోహన్ పాలనలోనే భారత్ అత్యధిక జీడీపీ వృద్ధి రేటును (8–9 శాతం) సాధించింది. అయితే, 2008లో చోటుచేసుకున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత మళ్లీ వృద్ధి పడకేసింది. అంతేకాదు, కార్పొరేట్లకు ఎడాపెడా ఇచ్చిన రుణాలు మొండిబాకీలుగా మారడంతో పాటు, 2జీ, కోల్ గేట్ వంటి పలు కుంభకోణాలు మన్మోహన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేశాయి. నోట్ల రద్దుతో మోదీ షాక్... 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ పాలనలో దేశ ప్రజలు అనేక విప్లవాత్మకమైన సంస్కరణలతో పాటు తీవ్రమైన షాక్లను కూడా చవిచూశారు. 2016 నవంబర్ 8న రాత్రికి రాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి దేశంలో అతిపెద్ద డీమానిటైజేషన్ను ప్రకటించడం ద్వారా మోదీ షాకిచ్చారు. దేశంలో తొలిసారి రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రజలు పడరాని పాట్లు పడినా, దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పడింది. మరోపక్క, దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెప్పుకునే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి తీసుకొచ్చి సంస్కరణలను కొత్తపుంతలు తొక్కించారు. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను తీసుకొచ్చారు. దివాలా చట్టం (ఐబీసీ)తో మొండిబాకీల సమస్యకు కొంతమేర పరిష్కారం చూపారు. మరోపక్క, మోదీ సర్కారు 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ కంపెనీల ప్రైవేటీకరణను వేగవంతం చేశారు. ఎల్ఐసీలో వాటానూ అమ్మకానికి పెట్టారు. ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కొత్త ఆలోచనలతో విద్యా, ఉద్యోగావకాశాల సృష్టిలో మోదీ సఫలం అయ్యారనే చెప్పొచ్చు. మోదీ హయాంలోనే భారత్ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సవాళ్లు ఉన్నా... ఉజ్వల భవిష్యత్తు నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, బ్యాంకుల్లో మొండిబాకీల దెబ్బతో మందగించిన మన ఎకానమీపై.. కరోనా పంజా విసిరింది. దేశవ్యాప్త లాక్డౌన్ ఫలితంగా 2020–21 జూన్ త్రైమాసికంలో జీడీపీ 24.4 శాతం కుప్పకూలింది. భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే అత్యంత ఘోరమైన క్షీణతను చవిచూసింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా, ఎకానమీ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరినా... ప్రజల్లో ఆర్థిక అసమానతలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తలసరి ఆదాయంలో మన పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా మనల్ని అధిగమించింది (2,227 డాలర్లు). ప్రస్తుతం 2100 డాలర్లతో తలసరి ఆదాయం విషయంలో ప్రపంచ దేశాల్లో మన ర్యాంక్ 144 స్థాయిలో అట్టడుగున ఉంది. అయితే, దేశ జనాభాలో 35 ఏళ్ల వయస్సు లోపు వారు 65 శాతం ఉండటం.. యువ భారత్ భవిష్యత్తుకు ఢోకా లేదనే నమ్మకాన్ని పెంచుతోంది. వచ్చే రెండు దశాబ్దాల పాటు ఏటా 12 లక్షల మంది కార్మిక శక్తి దేశానికి జతవుతుందని... 2030 నాటికి పని చేసే జనాభా (15–60 ఏళ్ల వయస్సు) 100 కోట్లకు చేరుతుందనేది పీడబ్ల్యూసీ తాజా అంచనా. ఇదే గనుక జరిగితే దేశంలో ఆర్థిక అసమానతలు దిగిరావడంతో పాటు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాకారం అవుతుందని, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందనేది ఆర్థికవేత్తల మాట. -
వారి ముందు చూపు వల్లే ఈ రోజు దేశం మనుగడ: శివసేన
ముంబై: మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. నెహ్రూ-గాంధీ కుటుంబం వల్లనే ప్రస్తుతం కరోనా సంక్షోభంలో భారత్ మనుగడ సాగించ గలుగుతున్నదని శివసేన పేర్కొంది. కాగా, కోవిడ్ కట్టడిలో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడింది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నదేశాలు సాయం చేయడం మన నేటి దుస్థితికి అద్దం పడుతుందని విమర్శించింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వం మాత్రం వేలాది కోట్లతో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టును ఆపేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదని తన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్లో ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశంలో కరోనా సంక్షోభ సమయంలో పేద దేశాలు భారత్కు సహాయం చేస్తుండగా, ఢిల్లీలో 20,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నిలుపుదల చేసేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా లేరని శివసేన మండిపడింది. ఒక వైపు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ వంటి చిన్న దేశాల నుంచి వైద్య సహాయం పొందుతూ మరోవైపు పార్లమెంట్ కొత్త భవన నిర్మాణం, ప్రధానమంత్రి కొత్త నివాసం నిర్మాణం కొనసాగించడంపై ఎవరూ విచారం వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని శివసేన ఎద్దేవా చేసింది. "కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న భారతదేశం నుంచి ప్రపంచానికి ముప్పు ఉందని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాపై పోరాటంలో ఎక్కువ దేశాలు భారత్కు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్ 10,000 రెమ్డెసివిర్ వైల్స్ పంపగా, భూటాన్ మెడికల్ ఆక్సిజన్ పంపింది. నేపాల్, మయన్మార్, శ్రీలంక కూడా ‘ఆత్మనిర్భర్’ భారతదేశానికి సహాయం అందించాయి" అంటూ రాసుకొచ్చింది. "స్పష్టంగా చెప్పాలంటే.. నెహ్రూ-గాంధీలు సృష్టించిన వ్యవస్థల వల్లనే భారత్ మనగులుగుతున్నది. చాలా పేద దేశాలు భారత్కు సహాయం అందిస్తున్నాయి. గతంలో పాకిస్తాన్, రువాండా, కాంగో వంటి దేశాలు.. వేరే దేశాల నుంచి సహాయం పొందేవి. దేశంలో ప్రస్తుత పాలకుల వల్ల భారత్ అలాంటి స్థితికి దిగజారుతున్నది" అని శివసేన విమర్శించింది. "కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి ఆరోగ్య మంత్రిత్వ శాఖను అప్పగించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారని, ప్రస్తుత కేంద్ర ఆరోగ్య మంత్రి పూర్తిగా విఫలమయ్యారన్నదానికి ఇదే నిదర్శనమని శివసేన విమర్శించింది. “పండిట్ నెహ్రూ, (లాల్ బహదూర్) శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలోని మునుపటి ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల వల్లనే ప్రస్తుతం దేశం మనుగడ సాధిస్తున్నది. వారు ఇచ్చిన విశ్వాసానికి దేశం ప్రస్తుతం కృతజ్ఞతలు తెలుపుతోంది" అని సామ్నా పేర్కొంది. -
జవహర్లాల్ నెహ్రూ స్కాలర్షిప్స్
న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ (జేఎన్ఎంఎఫ్).. డాక్టోరల్ స్టడీస్ చదివే దేశానికి చెందిన వారితోపాటు, ఇతర ఆసియా దేశాల విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ ఉపకార వేతనాలు అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ► పీహెచ్డీ చదివే విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ స్కాలర్షిప్స్: ► స్కాలర్షిప్ అందించే సమయం: రెండేళ్లు. ► పీహెచ్డీ విభాగాలు: ఇండియన్ హిస్టరీ అండ్ సివిలైజేషన్, సోషియాలజీ, కంపెరేటివ్ స్టడీస్ ఇన్ రిలీజియన్ అండ్ కల్చర్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిలాసఫీ, ఎకాలజీ–ఇన్విరాన్మెంట్. వీటిలో ఏదో ఒక స్పెషలైజేషన్లో పీహెచ్డీ చేసే అభ్యర్థులకు ఉపకార వేతనం లభిస్తోంది. ► అర్హత: కనీసం 60శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఫుల్టైం పీహెచ్డీ స్కాలర్ అయి ఉండాలి. ► వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, తీన్మూర్తీ హౌస్, న్యూఢిల్లీ–110011 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021 ► వెబ్సైట్: jnmf.in చదవండి: JEE Advanced 2021: అడ్వాన్స్డ్లో విజయం ఇలా..! సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో! -
బాలల దినోత్సవం: పిల్లలకు గవర్నర్ సందేశం
సాక్షి, అమరావతి: రేపు బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం రాజ్ భవన్ నుంచి సందేశం ఇచ్చారు. శనివారం(నవంబర్ 14)న పండిట్ జవహర్లాల్ నేహ్రు జన్మదినం, ఈ రోజున ప్రతి ఎడాది బాలల దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పిల్లలందరికి ఆయన హృదయపూర్వక శుభకాంక్షలు తెలిపారు. చిన్నారులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, వారే రేపటి భావి భారత పౌరులన్నారు. చిన్నారులు దేశం యొక్క నిజమైన బలమని, మనం జీవించే సమాజానికి పునాది అని పేర్కొన్నారు. మాతృభూమిని రక్షించడం, దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించడం భావి భారత పౌరులుగా వారి బాధ్యత అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
నెహ్రూకు ఠాగూర్ రాసిన లేఖ చూశారా!
సాక్షి, న్యూడిల్లీ: రవీంద్రనాథ్ ఠాగూర్ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు రాసిన లేఖను లోక్సభ సభ్యులు శశిథరూర్ శనివారం పంచుకున్నారు. నెహ్రూ బయోపిక్ తనని ఎంతగానో ఆకట్టుకుందంటూ ఠాగూర్ తన చేతితో రాసిన లేఖను శనివారం ట్విటర్ షేర్ చేసి నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేశారు. 1936 ఠాగూర్ తన చేతితో రాసిన లేఖ అని ఎంపీ తన పోస్టులో వెల్లడించారు. ‘1936లో నెహ్రూ ఆత్మకథ చదివిన తరువాత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, పండిట్ నెహ్రూకు ఇచ్చిన అసాధారమైన గమనిక ఇది’ అని ట్విటర్లో థరూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టుకు ఇప్పటి వరకు దాదాపు 7 వేలకు పైగా లైక్లు, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఎంపీ పోస్టుకు నెటిజన్లు ఫిదా అవుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నాటి మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు థరూర్కు నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఠాగూర్ రాసిన కొన్ని కవితలలోని ఫేమస్ కొట్స్ షేర్ చేస్తున్నారు. ‘ఈ రోజు వరకు ప్రపంచంలోని అత్యంత తెలివైన అసాధారమైన వ్యక్తి ఠాగుర్’, ‘అందుకే ఠాగూర్ మాటలలో, పనులలో మాస్టర్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ప్రియమైన జవహర్లాల్, నేను మీ గొప్ప ఆత్మకథ పుస్తకాన్ని చదవడం ముగించాను. మీ విజయానికి నేను మంత్రముగ్థుడినయ్యాను. అది నన్ను చాలా ఆకట్టుకుంది. అంతేగాక మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మానవత్వపు లోతైన భావాల వైపు ఈ పుస్తకం నడిపిస్తుంది. ఇది వాస్తవాల చిక్కులను అధిగమించి మమ్మల్ని గొప్ప వ్యక్తి వైపుకు నడిపిస్తుంది. మీ రవీంద్రనాథ్ ఠాగూర్’’ అంటూ ఠాగూర్ రాసుకొచ్చిన ఈ లేఖ మే 31, 1936 నాటిదని ఎంపీ పేర్కొన్నారు. This was Gurudev Rabindranath Tagore’s note to Pandit Nehru after reading his autobiography in 1936. Extraordinary and exquisite. pic.twitter.com/46PtaVJixG — Shashi Tharoor (@ShashiTharoor) July 30, 2020 -
‘కరోనా వ్యాప్తిలో భారత్ అగ్రస్థానానికి వెళ్తుంది’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్యంలోనే సువర్ణాధ్యాయాన్ని తెచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా శనివారం దేశ పౌరులకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ‘గత సంవత్సరం ఈ రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక బంగారు అధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో పూర్తికాల ప్రభుత్వానికి తిరిగి ఓటు వేశారు’ అంటూ ప్రధాని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. యశ్వంత్ సిన్హా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘శుభాకాంక్షలు ప్రధాని మోదీ గారూ... భారత ప్రజాస్వామ్యంలోకి సువర్ణాధ్యాయం తెచ్చినందుకు. వచ్చే ఏడాది దేశ పరిస్థితి మరింత అద్భుతంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కోవిడ్ కేసుల విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానానికి వెళుతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది’ అని యశ్వంత్ సిన్హా ట్వీట్ చేశారు. Congratulations to PM Modi for ushering in 'a golden chapter in the history of Indian democracy'. The next year promises to be even better when India will climb to the top in Covid cases and the economy would have collapsed totally. — Yashwant Sinha (@YashwantSinha) June 1, 2020 మోదీ-2.0 మొదటి సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా క్షీణించిందని, ఆ క్షీణత ఈ ప్రభుత్వ తప్పు వల్ల కాదని.. మాజీ ప్రధాని నెహ్రూ వల్లనే అని యశ్వంత్ సిన్హా ఎద్దేవా చేశారు. నెహ్రూ గనక 1947 నుంచి 1964 వరకూ దేశాన్ని పాలించకపోతే దేశం రెండంకెల వృద్ధి రేటును సాధించేదని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. The sharp decline in economic growth rate in the first year of Modi-2 is not because of any fault of this govt but because of Pt Nehru. If he had not ruled India from 1947 to 1964 India today would be growing at double digit. — Yashwant Sinha (@YashwantSinha) May 30, 2020 -
నెహ్రూపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
-
నెహ్రూను మించిన ప్రధాని పీవీ
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూను మించిన ప్రధాని పీవీ నరసింహారావు అని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ఆర్వీఆర్ చంద్రశేఖర్రావు కొనియాడారు. సోమవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమం సందర్భంగా పీవీకి సన్నిహితుడిగా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహారావు బహుబాషా కోవిదుడే కాదని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. లండన్లో జరిగిన లీడర్షిప్ ఇన్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్లో పీవీ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుందని, ఆయన ప్రసంగాన్ని కొనసాగించేందుకు కాన్ఫరెన్స్ను మరో రోజు పొడిగించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. పీవీకి అనుకోకుండా పదవులు వచ్చినా.. అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. పీవీని ప్రధానిగా కాంగ్రెస్ ప్రకటించే సమయంలో తాను ఢిలీల్లో ఉన్నానని, ఈ విషయాన్ని ఎన్టీఆర్కు చెప్పగా, తెలుగు వ్యక్తి ప్రధాని కావడంపై ఆయన ఎంతో సంతోషించారన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఆయన మనవడు ఎన్వీ సుభాష్ ప్రభుత్వాన్ని కోరారు. సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. -
ఆ బాలీవుడ్ నటికి బెయిల్ నిరాకరణ
అహ్మదాబాద్: దేశ తొలి ప్రధానమంత్రి జవహార్లాల్ నెహ్రూపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కేసులో బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీ ముందస్తు బెయిల్ పిటీషన్ను సోమవారం గుజరాత్లోని బుండీ కోర్టు కొట్టివేసింది. దీంతోపాటు ఆమెకు ఎనిమిది రోజులపాటు జుడీషియల్ కస్టడిని విధించింది. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ఇతర కుటుంబ సభ్యులపై అభ్యంతరకర కంటెంట్ను పోస్ట్ చేసిన పాయల్పై అక్టోబర్ 10న బుండీ పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పాయల్ దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్పై సోమవారం బుండీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కోర్టు బెయిల్ పిటీషన్ను తోసిపుచ్చింది. కాగా గాంధీ కుటుంబ సభ్యుల నుంచి తనపై చర్యలు చేపట్టాలని కోరుతూ.. రాజస్ధాన్ సీఎంపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఇటీవల నటి పాయల్ ఆరోపించిన విషయం తెలిసిందే. గాంధీ కుటుంబం సభ్యులపై అభ్యంతరకర వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాయల్పై రాజ్స్థాన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చార్మేష్ వర్మ ఫిర్యాదు చేశారని బుండీ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లోకేంద్ర పాలివాల్ తెలిపారు. చదవండి: బాలీవుడ్ నటి అరెస్ట్ -
‘రాహుల్ సావర్కర్’ వ్యాఖ్యలపై స్పందించిన శివసేన
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ‘రేపిన్ ఇండియా’ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. మహిళలపై అకృత్యాల్ని పెంచేదిగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని.. భేషరతుగా రాహుల్ జాతికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈక్రమంలో శనివారం జరిగిన కాంగ్రెస్ భారత్ బచావో ర్యాలీలో పాల్గొన్న రాహుల్ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని.. తాను ‘రాహుల్ సావర్కర్ను కాదు’ అని తేల్చి చెప్పాడు. అయితే, మహారాష్ట్రలో కాంగ్రెస్తో కలిసి అధికారంలో ఉన్న శివసేన రాహుల్ వ్యాఖ్యలపై స్పందించింది. హిందుత్వ పితామహుడు.. భరత జాతికి ఎనలేని సేవలు చేసిన వీర సావర్కర్ పేరును తక్కువ చేసి మాట్లాడొద్దని సూచించింది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ మాదిరిగా వీర సావర్కర్ కూడా దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారని శివసేన ఎంపీ సంజయ్ రావత్ గుర్తు చేశారు. సావర్కర్ గౌరవానికి భంగం కలిచించే రీతిలో మాట్లాడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా రావత్.. స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక దామోదర్ వీర సావర్కర్ భారత దేశ మహనీయుడు. ఆయన కేవలం మహారాష్ట్రకే పరిమితం కాదు. జాతిపిత మహాత్మ గాంధీ, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లాగే వీరసావర్కర్ కూడా దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారు’అని పేర్కొన్నారు. -
నెహ్రూపై సాధ్వీ సంచలన వ్యాఖ్యలు..
భోపాల్: దేశతొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో అందరికంటే నెహ్రూనే అతిపెద్ద రేపిస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార కేసులను చూస్తుంటే ప్రపంచ ‘అత్యాచారాలకు రాజధాని’గా భారతదేశం మారిపోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై సాధ్వీ ఈ విధంగా స్పందించారు. ‘భారత్ తొలినాళ్లలో మంచి దేశంగా గుర్తింపు పొందింది. ఈ దేశం రాముడు, కృష్ణుడు పుట్టిన దేశం. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాతనే అత్యాచార సంస్కృతిని తీసుకువచ్చారు. దానికి ప్రధాన కారణం తొలి ప్రధాని నెహ్రూనే. ఎందుకంటే ఆయనే పెద్ద రేపిస్ట్. టెరరిజం, నక్సలిజం, రేపిజం అన్నీ నెహ్రూ కుంటుంబం నుంచి వచ్చినవే. కాంగ్రెస్ నాయకులే దేశాన్ని సర్వనాశనం చేశారు’ అంటూ వివాదాస్పద రీతిలో మాట్లాడారు. కాగా ఉన్నావ్ ఘటనపై రాహుల్ తీవ్ర స్థాయిలో స్పందించిన విషయం తెలిసిందే. దేశంలో పెరుగుతున్న అత్యాచార కేసులను చూస్తుంటే ప్రపంచ ‘అత్యాచారాలకు రాజధాని’గా భారతదేశం మారిపోతోందని అయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని చూసి అంతర్జాతీయ సమాజం భారత్ను ఎగతాళి చేస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నా.. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
మా ముత్తాత గురించి నేను విన్న కథ!
న్యూఢిల్లీ: బాలల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన ముత్తాత, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన మధుర ఙ్ఞాపకాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. తన చిన్నతనంలో నెహ్రూ గురించి విన్న కథను ట్విటర్లో షేర్ చేశారు. ‘ మా ముత్తాత ప్రధానిగా ఉన్న సమయంలో ఓ రోజు వేకువజామున మూడు గంటలకు ఇంటికి వచ్చారట. ఎంతగానో అలసిపోయిన తన అంగరక్షకుడు ఆదమరచి తన పరుపు మీద నిద్రపోతున్న దృశ్యాన్ని చూశారట. వెంటనే తన చేతిలో ఉన్న బ్లాంకెట్ అతడికి కప్పి.. ఎదురుగా ఉన్న కుర్చీలో నిద్రపోయారట. కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఓ వ్యక్తి గురించి మనకు పూర్తిగా అర్థమయ్యేలా చేస్తాయి’ అని ప్రియాంక నెహ్రూ వ్యక్తిత్వం గురించి తన పోస్టులో రాసుకొచ్చారు. My favourite story about my great-grandfather is the one about when as PM, he returned from work at 3 am to find his bodyguard exhausted and asleep on his bed. He covered him with a blanket and slept on an adjacent chair. #JawaharlalNehru pic.twitter.com/HDDiC1hked — Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 14, 2019 కాగా చాచా నెహ్రూగా చిన్న పిల్లల అభిమానం చూరగొన్న జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా నవంబరు14ను బాలల దినోత్సవంగా జరుపుకొంటారన్న విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం సందర్భంగా ఎంతో మంది చిన్నారులు నెహ్రూ మాదిరి వేషం ధరించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. -
‘సాగర్’పై నెహ్రూకు మమకారం
సాక్షి, నాగార్జునసాగర్ : బాలబాలికలన్నా, గులాబీ పుష్పాలన్నా భారత తొలిప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఎంతో ప్రీతి. ఏ సభలోనైనా బాలబాలికలను ముద్దాడిన తర్వాతనే వేదికను అలంకరించేవారు. 1955 డిసెంబర్ 10వతేదీన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి తెలుగు ప్రజానీకం గుండెల్లో నెహ్రూ నిలిచిపోయారు. ఆధునిక భారత నిర్మాణంలో భాగంగా ఈ మానవతా మందిరానికి శంకుస్థాపన చేసిన వారంటే విజయపురి (నేటినాగార్జునసాగర్, నందికొండ) విద్యార్థులకు పౌరులకు ఎంతో అభిమానమే. నెహ్రూకు కూడా నాగార్జున సాగరమంటే ప్రత్యేక అభిమానమే. డ్యాం నిర్మాణానికి శ్రమశక్తి ప్రారంభమైన తొలిరోజులవి. ఉద్యోగులు, కార్మిక సంతానానికి డ్యాం అథారిటీయే విద్యాలయాలను ప్రారంభించింది. 1957 నవంబర్ నెలలో నాగార్జునసాగర్ చిన్నారి విద్యార్థులు పండిట్ జవహర్లాల్ నెహ్రూకు జన్మదిన శుభాకాంక్షలు పంపారు. ఆయన ఎంతో పొంగిపోతూ స్వదస్తూరితో వారికి లేఖ రాశారు. నా జన్మదినం సందర్భంగా మీరు పంపిన శుభాకాంక్షలకు నేను మిక్కిలి కృతజ్ఞుడను. మీ ఆధారాభిమానాలకు నేనెంతో ఉప్పొంగి పోయాను. నేను అందుకున్న శుభాకాంక్షలకు నాలో కల్గిన భావాలను ప్రకటించుటకు తగిన పదాలు కూడా లభించడం లేదు అంటూ ముగించారు. ఎంతమంచి మనసు ఆయనది ఈ లేఖ నేటికీ నాగార్జునసాగర్లోని హిల్కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భద్రంగా ఉంది. ఇది ఈ విద్యాలయానికి అమూల్య సంపదే. రాష్ట్రంలో వారి దస్తూరితో చిన్నారులను ఉద్దేశించి రాసిన లేఖ మరే విద్యాలయంలోనే లేదని భావించవచ్చు. భావిభారత నిర్మాణానికి నెహ్రూ సూత్రధారులని భావించేవారు. అందుకనే ఆసేతు హిమాచల పర్యంతం వారి జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటూ చాచా నెహ్రూను స్మరిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మువ్వన్నెల జెండాను ఆవిష్కరిస్తారు. సాగర్తో మరికొన్ని అనుబంధాలు 1955 డిసెంబర్ 10న సాగర్డ్యాం శంకుస్థాపన సందర్భంగా ‘నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం పవిత్రకార్యంగా భావిస్తున్నాను. భారతావనిలో నిర్మాణం చేసుకుంటున్న ఆధునిక దేవాలయాలకు ఇది చిహ్నం. మానవతా మందిరానికే ఈ శంకుస్థాపన’ అంటూ ఆయన ఈ సందర్బంగా మాట్లాడారు. నెహ్రూకు సాగరంటే ఎంత ప్రీతో సాగర్ వాసులకు అయన అంటే అంతే. 1962లో రక్షణ నిధికి ఆయన ఇచ్చిన పిలుపునకు విజయపురి పౌరులు స్పందించి నవంబర్ 7వ తేదీన రూ.1,00,001లు పంపారు. 1963డిసెంబర్ 6వతేదీన డ్యాం అథారిటీ నిర్వహణలో ఉన్న ఆస్పత్రికి చాచానెహ్రూ సతీమణి పేరు కమలానెహ్రూ ఆసుపత్రిగా ఇందిరాగాంధీచే సాగర్ వాసులు నామకరణం చేయించారు. కమలనెహ్రూ పేరిట మనరాష్ట్రంలో ఉన్న ఆస్పత్రి ఇదొక్కటే. తెలుగు ప్రజానీకం ఎంతో కృతజ్ఞత కలవారని నిరూపించుకోవడానికి సాగర్ కుడికాల్వకు జవహర్ కెనాల్గా నామకరణం చేశారు. ఆప్రేమతోనే హిల్కాలనీలోలని నెహ్రూపేరిట పార్కును నిర్మించి అందులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. -
నెహ్రూ జయంతి.. మోదీ, సోనియా నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రథమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్ దేశం ఘన నివాళి అర్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ నెహ్రూకు నివాళులర్పించారు. పండిట్ జయంతి సందర్భంగా ట్విటర్ వేదికగా ప్రధాని స్పందిస్తూ ‘మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’అని పేర్కొన్నారు. ఇక న్యూఢిల్లీలోని శాంతివనంలోని నెహ్రూ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నెహ్రూ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. కాగా, 1889 నవంబరు 14న అలహాబాద్లో జన్మించిన నెహ్రూ.. మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణిల తొలి సంతానం. జాతీయోద్యమంలో పాల్గొని రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పని చేసిన ఈయన.. స్వాతంత్రానంతరము దేశానికి తొలి ప్రధాని అయ్యారు. చిన్న పిల్లలంటే అమితంగా ఇష్టపడే నెహ్రూ.. వారికి ‘చాచా నెహ్రూ’గా మారిపోయారు. అందుకే ఆయన పుట్టిన రోజు నవంబరు 14న ‘బాలల దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. సుదీర్ఘకాలం పాటు స్వతంత్ర భారత్కు ప్రధానిగా పనిచేసిన నెహ్రూ 1964, మే 27న మరణించారు. -
సోషలిస్ట్ స్వాప్నికుడు –శ్రేయో వైజ్ఞానికుడు
స్వాతంత్య్రోద్యమ ప్రస్థానంలో కీలకమైన 1930, 1940 దశకంలో యువతను ఆకర్షించి వారిని ఉద్యమంలో భాగం చేసి విదేశాల్లో స్వరాజ్య సమర గొంతుకను వినిపించడంలో, మద్దతును కూడగట్టడంలో జవహర్ లాల్ నెహ్రూ అద్వితీయ కృషి చేశారు. స్వాతంత్య్రం తర్వాత 1947 నుండి 1964 వరకు దార్శనికత కల్గిన ప్రధానమంత్రిగా నవ్య, విశాల, వైవిధ్య బహుళత్వ భారత నిర్మాణంలో, సంక్షేమ రాజ్య ప్రజాస్వామ్య స్థాపనలో నెహ్రూ నిమగ్నమయ్యారు. విశాల భావాలు, అభ్యుదయ ధోరణి, చురుకైననాయకత్వ లక్షణాలు, వైజ్ఞానిక మేధోపటిమతో దేశాన్నిసంఘటితపరుస్తూ, సంస్థానాలను ఒక్కతాటిపైకి తెచ్చి పునర్నిర్మాణానికి దీపస్తంభమై నిలిచాడు. భారత భవిష్యత్ను సమున్నతంగా తీర్చిదిద్దడానికి వ్యవసాయ, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాలలో స్వయం స్వావలన, స్వయం సమృద్ధి కోసం, ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకోవడానికి బలమైన పునాదులను, సౌధాలను నిర్మించి చరిత్రలో చెరగని ముద్రవేశారు. నెహ్రూ అమరత్వం సందర్బంగా సుప్రసిద్ధ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఆయనను ’మేకర్ ఆఫ్మాడ్రన్ ఇండియా‘ గా అభివర్ణించింది. ది ఎకనామిస్ట్ పత్రిక సామాన్య ప్రజల ఆకాంక్షలను అకళింపుచేసుకున్న మహోన్నత వ్యక్తి అని, అతడు లేని అంతర్జాతీయ యవనిక పేదరాలిగా మారిందని వ్యాఖ్యానించింది. నవంబర్ 14, 1889 లో జన్మించిన నెహ్రూ హౌరా, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు. 1919–1920 కాలంలో జాతీయోద్యమంలో అతివాదులు, మితవాదుల మధ్య సంఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నప్పుడు నె్రçహూ గాంధీవైపు నిలిచాడు. 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో ‘సంపూర్ణ స్వరాజ్’ తీర్మా నం చేయించాడు. ఉద్యమ తీవ్రతను పెంచడం కోసం శాసనోనల్లంఘన ఉద్యమానికి యావత్తూ కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేశాడు.ఉద్యమ ప్రస్థానంలో 1921–1945 కాలంలో 3,259 రోజులు జైలు జీవితాన్ని గడిపాడు. గణతంత్ర, ప్రజాస్వామ్య రూపశిల్పిగా వ్యవహరించి రాజ్యాంగ నిర్మాణాన్ని నిర్దేశిం చాడు. ప్రతి పౌరుడికి అవకాశాల్లో సమానత, సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం అందేలా తన మేధో సహచరుడు,సామాజిక విప్లవకారుడు అంబేడ్కర్కు సంపూర్ణ తోడ్పాటు అందించాడు. బహుళ భాషా సంస్కృతులు, కుల, మతప్రాంతపరంగా అనేక వైవిధ్యాలు ఉన్న బహుళత్వ భారత్లో ఐక్యత కాపాడుకునే ఉద్దేశంతో కేంద్రానికి విశిష్ట అధికారాలు ఉండేలా నిబంధనలు రూపొందించాడు. వర్ణ వివక్ష సామ్రాజ్యవాద విధానాల వ్యతిరేక పోరులో అంతర్జాతీయ గొంతుకగా మారాడు. రష్యా విప్లవ ప్రేరణతో ప్రజాస్వామ్య సోషలిజాన్ని రూపొందించి ప్రజల ప్రగతికి, సంక్షేమానికి ఉపయోగపడే విద్య, వైద్యం, రవాణా, గనులు, అంతరిక్షం, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేశాడు. వైజ్ఞానిక దృక్పథంతో హోమిభాబా ఆధ్వర్యంలో అణుశక్తి కమిషన్ ఏర్పాటు చేశారు. అంతరిక్ష కార్యక్రమాల కోసం ఇస్రోను ఏర్పాటు చేశాడు. ప్రతిష్టాత్మక ఐఐటీ, నిట్, ఐఐఎంలు, విశ్వ విద్యాలయాలు, అన్ని పరి శోధన కేంద్రాలు, రక్షణరంగ పరిశ్రమలు నెహ్రూ ఏర్పాటు చేసినవే. బాంబే ప్లాన్ వెలుగులో మిశ్రమ ఆర్థికవ్యవస్థను ఏర్పాటు చేసి స్వదేశి పెట్టుబడి దారులకు ప్రోత్సాహాన్ని అందించాడు. హైందవ సమాజంలో స్త్రీలపై కొనసాగుతున్న వివక్ష, అణచివేత విధానాలను తొలగించడానికి అంబేడ్కర్ రూపొందించిన హిందూకోడ్ బిల్లులు ఆమోదం పొందడానికి కృషి చేశారు. 1953 సెప్టెంబర్ 20న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నెహ్రూ లేఖ రాస్తూ, తీవ్ర జాతీయవాదం దేశానికి కీడు కలిగిస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు ఆయన హెచ్చరిక నిజమని రుజువవుతోంది. నె్రçహూ దార్శనికత, రాజ్యాంగ విలువల రక్షణ కోసం పౌరసమాజం చారిత్రక భాధ్యతను చేపట్టాలి.(రేపు నెహ్రూ జయంతి ) అస్నాల శ్రీనివాస్ వాస్య కర్త తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం -
కొంపముంచిన ఫేస్బుక్ వీడియో.. నటిపై కేసు
జైపూర్: నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాక.. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకుగాను బాలీవుడ్ టీవీ నటి పాయల్ రోహత్గి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. గత నెల 21న పాయల్ రోహత్గి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తల్లిదండ్రులతో పాటు ఆయన భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతో చర్మేశ్ శర్మ అనే ఓ కాంగ్రెస్ కార్యకర్త పాయల్ రోహత్గి మీద పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ.. ‘పాయల్ జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీ లాల్ నెహ్రూతో పాటు ఆయన భార్య, తల్లిని కూడా అవమానిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాక లాల్బహుదూర్ శాస్త్రి మరణం గురించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. విదేశాలు, మన దేశం గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పర్చుకునేలా ఈ వీడియో ఉంది. పాయల్ మాజీ ప్రధానులను అవమానించడమే కాక దేశ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని తెలిపాడు. టీవీ రియాలిటీ షోల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. 2008లో బిగ్బాస్ షోలో కూడా పాల్గొన్నది. -
‘థరూర్ జీ.. ఇండియా గాంధీ ఎవరు?’
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో దేని గురించైనా చెప్పేటప్పుడు పూర్తి అవగాహనతో, సరైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలి. అలా కాకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడి, చేతికి దొరికిన ఫోటోను షేర్ చేస్తే.. ఆనక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ఈయన సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారనే విషయం తెలిసిందే. ఆంగ్ల భాషపై థరూర్కున్న పట్టు ఆమోఘం. కొత్త కొత్త పదాలతో ట్వీట్ చేస్తూ నెటిజనులను అలరిస్తుంటారు శశిథరూర్. అయితే ప్రస్తుతం మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు లభిస్తున్న విశేష ఆదరణ గురించి బీజేపీ శ్రేణులు తెగ ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో దీనికి కౌంటర్ ఇచ్చేందుకు శశిథరూర్ చేసిన ప్రయత్నం కాస్త బెడిసి కొట్టింది. వివరాలు.. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ రష్యా పర్యటన సందర్భంగా తీసిన ఫోటోని ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘1954లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇండియా గాంధీ యూఎస్ వెళ్లినప్పుడు తీసిన ఫోటో ఇది. ఇప్పుడున్నంత ప్రత్యేక పీఆర్ ప్రచారం, మీడియా పబ్లిసిటీ ఏమి లేని రోజుల్లోనే వారిని చూడటానికి ఎంతమంది అమెరికా ప్రజలు వచ్చారో చూడండి’ అంటూ ట్వీట్ చేశారు శశి థరూర్. ఈ ట్వీట్లో నెటిజన్లు రెండు తప్పిదాలను గుర్తించారు. ఒకటి ఇందిరా గాంధీ పేరును ఇండియా గాంధీగా పేర్కొన్నారు. రెండోది ఫోటోకు సంబంధించిన సమాచారం పూర్తిగా తప్పు. ఈ ఫోటోను 1956 మాస్కో పర్యటన సందర్భంగా తీసింది. ఈ తప్పులను గుర్తించిన నెటిజన్లు శశి థరూర్ను ఓ ఆట ఆడుకుంటున్నారు. Nehru & India Gandhi in the US in 1954. Look at the hugely enthusiastic spontaneous turnout of the American public, without any special PR campaign, NRI crowd management or hyped-up media publicity. pic.twitter.com/aLovXvCyRz — Shashi Tharoor (@ShashiTharoor) September 23, 2019 ‘థరూర్ జీ ఇండియా గాంధీ ఎవరు’... ‘ఈ ఫోటో 1954 అమెరికాలో తీసింది కాదు.. రష్యా, మాస్కోలో 1956లో తీశారు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై థరూర్ స్పందించారు. ‘ఈ ఫోటో అమెరికాలో తీసింది కాదు.. రష్యాలో తీసిందని నాకు తెలిసింది. మాజీ ప్రధానులకు విదేశాల్లో విశేష జనాదరణ ఉందని చెప్పడమే ఇక్కడ నా ప్రధాన ఉద్దేశం. మోదీని గౌరవిస్తున్నారు అంటే దేశాన్ని గౌరవిస్తున్నట్లే ’అంటూ మరో ట్వీట్ చేశారు థరూర్. I am told this picture (forwarded to me) probably is from a visit to the USSR and not the US. Even if so, it still doesn't alter the message: the fact is that former PMs also enjoyed popularity abroad. When @narendramodi is honoured, @PMOIndia is honoured; respect is for India. https://t.co/9KQMcR0zTD — Shashi Tharoor (@ShashiTharoor) September 23, 2019 -
‘కశ్మీర్ విముక్తి కోసం మూడు తరాల పోరాటం’
ముంబై: దేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 1947లో కశ్మీర్ను భారత్లో విలీనం చేయకుండా నెహ్రూ చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. నెహ్రూ నిర్ణయం వల్లనే కశ్మీర్లో ఉగ్రవాదం పెచ్చుమీరిపోయిందని ఆరోపించాడు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమిత్ షా ఆదివారం ముంబైలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ అంశం మాజీ హోంమంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్కు అప్పగించినట్లయితే ఎప్పుడో భారత్లో విలీనమయ్యేదని అభిప్రాయడ్డాడు. ‘కశ్మీర్లో ఉగ్రమూకలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాం. దేశం గర్వపడే అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేయడం వారి అపరిపక్వతకు నిదర్శం. బీజేపీ ఈ అంశాన్ని జాతీయవాద విజయంగా పరిగణిస్తుంది. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దును రాజకీయ సమస్యగా రాహుల్ గాంధీ చిత్రీకరిస్తున్నారు. రాహుల్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారు, కానీ కశ్మీర్ విముక్తి కోసం బీజేపీ మూడు తరాల నాయకులు పోరాడుతున్నారు. బీజేపీ ప్రధాన ఎజెండా దేశాన్ని ఐక్యంగా ఉంచడమే. ఒకే దేశం, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం అనే సిద్ధాంతానికి బీజేపీ కట్టుబడి ఉంది’ అని అమిత్ షా పేర్కొన్నారు. -
నెహ్రూపై ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నేరస్తుడని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 అమలుచేశారని నెహ్రూను క్రిమినల్గా అభివర్ణించిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలను ప్రజ్ఞా సింగ్ సమర్ధించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ దేశమాతను బాధించేవారు, దేశాన్ని ముక్కలుగా చేయాలనుకునే వారెవరైనా నేరస్తులేనని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370, 35 ఏను రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై ఆమె ప్రశంసలు కురిపించారు. మోదీ, అమిత్ షా దేశభక్తులని కొనియాడారు. ఆర్టికల్ 370 రద్దును దేశభక్తులు స్వాగతిస్తుంటే..దీన్ని స్వాగతించలేనివారు ఎన్నటికీ దేశభక్తులు కాలేరని స్పష్టం చేశారు. కాగా గతంలో మహాత్మా గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే ఎన్నటికీ దేశభక్తుడేనని సాధ్వి ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి పార్టీ చీఫ్ అమిత్ షా తీవ్రంగా ఖండించారు. -
నెహ్రు ఓ క్రిమినల్ : చౌహాన్
భువనేశ్వర్ : బీజేపీ సీనియర్ నాయకులు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెహ్రు ఓ క్రిమినల్ అని విమర్శించారు. జమ్మూ కశ్మీర్కు జరిగిన అన్యాయానికి నెహ్రునే కారణమని ఆరోపించారు. నెహ్రు తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే కశ్మీర్ పూర్తిగా భారత్ సొంతమయ్యేదని అన్నారు. ‘ భారత భద్రతా బలగాలు కశ్మీర్ నుంచి పాక్ గిరిజనులను వెళ్లగొడుతున్న సమయంలో నెహ్రు కాల్పుల విరమణను ప్రకటించి తొలి నేరానికి పాల్పడ్డారు. అందువల్ల 1/3 భూభాగం(పీవోకే) పాకిస్థాన్ చేతిలో ఉండిపోయింది. నెహ్రు ఇంకొద్ది రోజులు కాల్పుల విరమణ ప్రకటించి ఉండకపోతే కశ్మీర్ పూర్తిగా మన సొంతమయ్యేది. ఇక, జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని తీసుకురావడం ద్వారా నెహ్రు రెండో నేరం చేశారు. దీని ద్వారా ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది దేశానికి చేసిన అన్యాయం మాత్రమే కాదు నేరం కూడా’ అని శివరాజ్సింగ్ పేర్కొన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లును తీసుకువచ్చింది. దీని ప్రకారం కశ్మీర్, లదాఖ్లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా నెహ్రు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. -
కశ్మీరం పై సోషల్ ‘యుద్ధం’
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. గత నాలుగైదు రోజులు గా కశ్మీర్ పరిణామాలను గమనిస్తున్న ప్రజానీకం సోమవారం ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయింది. 370వ అధికరణ ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం, రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడంతో తెలుగు ప్రజలు సోమవారమంతా ఇదే విషయంపై చర్చలు జరిపారు. ఏ ఇద్దరు మనుషులు కలిసినా, రాజకీయ నేతలు ఎదురుపడినా కశ్మీర్ అంశంపైనే మాట్లాడుకోవడం గమనార్హం. ఏమవుతుందో ఏమో? దేశ భద్రత, భావోద్వేగాలకు సంబంధించిన విషయంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం పెరుగుతుందా.. తగ్గుతుందా అనే విషయంపై ఎక్కువగా చర్చ జరగడం తెలుగు ప్రజల చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది. దీంతో పాటు కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కశ్మీర్ ప్రజ ల్లో ఎలాంటి స్పందన వస్తుంది.. దేశ భద్రతకు సంబంధించి ఏమైనా పరిణామాలు జరుగుతాయా.. సరిహద్దుల్లో సైన్యం మోహరింపు ఎలా ఉంది.. స్థానికంగా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు.. కేంద్ర నిర్ణయం స్టాక్మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపింది.. అనే అంశాలు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. సామాజిక మాధ్యమాల్లోనూ.. సామాజిక మాధ్యమాల వేదికగా కశ్మీర్ అంశంపై భిన్న వాదనలు నడిచాయి. 370వ అధికరణ ద్వారా అక్కడి ప్రజలకు సంక్రమించిన అధికారాల విషయంలో ఇరువర్గాలు ఓ రకంగా సామాజిక మాధ్యమాల్లో యుద్ధమే చేశాయి. ఈ అధికరణ ద్వారా కశ్మీర్లో వివాహానంతర వారసత్వ హక్కులు, దేశంలోని ఇతర రాష్ట్రాలకున్న ప్రత్యేక అధికారాలు, కశ్మీర్లో కేంద్ర చట్టాలు, అత్యున్నత న్యాయస్థానాల తీర్పుల అమలు తదితర అంశాలపై పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ అధికరణ నెహ్రూ, అబ్దుల్లాల మధ్య జరిగిన చీకటి ఒప్పందమని కొందరు, దేశాన్ని విభజించి పాలించేందుకు జరుగుతున్న కుట్రను ఎదుర్కోవాలంటూ మరికొందరు సామాజిక మాధ్యమాల్లో వాదోపవాదాలు చేస్తూ పోస్టులు పెట్టారు. -
ఆ జైలు గది కూలిపోయింది!
చండీఘడ్ : చారిత్రక నేపథ్యం ఉన్న ఓ జైలు గది కూలిపోయింది. ఈ ఘటన పంజాబ్లోని ఫరీద్కోట్లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని జైతూ టౌన్లో ఉన్న ఈ జైలు గదిలో దివంగత కాంగ్రెస్ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు 1923లో కొన్ని రోజులు జైలు జీవితాన్ని గడిపారు. ఇటీవల పంజాబ్లో భారీగా కురుస్తున్న వర్షాలకు ఈ జైలు శిథిలావస్థకు చేరుకుంది. దీంతో 240 చరదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న జైలు కూలిపోయినట్టుగా.. గురువారం పంజాబ్ సీనియర్ పోలీసు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సమయంలో బ్రిటీష్ వారు ‘నాబా’ రాష్ట్రంలోకి భారతీయులు ప్రవేశించవద్దని నిషేధించారు. ఈ నేపథ్యంలో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా అకాలీలు.. జైతుటౌన్లో చేపట్టిన ‘జైతు కా మోర్చా’ పేరిటి నిరసన చేపట్టారు. వీరికి మద్దతుగా జవహర్లాల్ నెహ్రూ, కె. సంతానం, ఏటీ గిద్వానీలు నిరసనకు దిగడంతో బ్రిటీషర్లు వారిని అరెస్టు చేసి ఈ కారాగారంలో బంధించారు. ఇక 2008లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ జైలు గదిని సందర్శించి ‘దేశ మొదటి ప్రధాని’ ఈ జైలులో స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా కొన్ని రోజుల ఉన్నారన్నారు. చారిత్రక నేపథ్యం ఉన్నఈ జైలు గది కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరితే రూ.65 లక్షలు నిర్వహణ ఖర్చుల కోసం కేటాయిస్తామని ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరి పవన్ గోయాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గత పదేళ్ల కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జైలు గదిని టూరిజం శాఖలోకి తీసుకువచ్చినప్పటికీ ఏమాత్రం నిర్వహణ మెరుగుపడలేదు. చివరికి గురువారం ఇది కూలిపోయింది. -
ఉగ్రవాదానికి కారణం నెహ్రూనే
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదం, రాజకీయ సమస్యలకు భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూయే కారణమని శుక్రవారం లోక్సభలో హోం మంత్రి అమిత్ షా నిందించారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణం తాత్కాలికమైనదే తప్ప అది శాశ్వతం కాదని ఆయన అన్నారు. హోం మంత్రి అయ్యాక తొలిసారిగా అమిత్ షా లోక్సభలో ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రపతి పాలన నడుస్తోండగా జూలై 3కు ఆ గడువు ముగియనుంది. దీంతో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించారు. జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రణాళిక ప్రకటిస్తే, స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక, పారదర్శక విధానాల్లో పోలింగ్ జరుగుతుందని అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) 2019 బిల్లును కూడా లోక్సభ ఆమోదించింది. రాష్ట్రపతి పాలన పొడిగింపుపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని, ఆ భావజాలాన్ని కూడా మోదీ ప్రభుత్వం ఏ మాత్రం సహించదనీ, ఉగ్రవాదమే లేని, సరిహద్దుల్లో భద్రమైన దేశంగా భారత్ను మార్చడమే తమ లక్ష్యమని అమిత్ షా అన్నారు. ‘కశ్మీర్లో మూడింట ఒక వంతు భాగం ఈ రోజు మన దగ్గర లేదు. స్వాతంత్య్రం తర్వాత కశ్మీర్లోకి పాకిస్తాన్ చొరబడి, మూడింట ఒక వంతు భూభాగాన్ని ఆక్రమించిన తర్వాత కాల్పుల విరమణను ప్రకటించింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూయే ఆ ప్రకటన చేశారు. ఆక్రమించిన భాగం పాకిస్తాన్ వశమైంది. నాటి ఉప ప్రధాని, హోం మంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ మాటను కూడా అప్పుడు నెహ్రూ పట్టించుకోలేదు’ అని ఆరోపించారు. అదే ఆనాడు పటేల్ చెప్పిన మాటను నెహ్రూ పరిశీలించి, ఆయన చెప్పినట్లు విని ఉంటే ఇప్పటి పాక్ ఆక్రమిత కశ్మీర్ మన చేతుల్లోనే ఉండేదనీ, ఆ ప్రాంతంలో అసలు ఉగ్రవాదమే ఉండేది కాదని అమిత్ షా అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో షా స్పందిస్తూ, తాను నెహ్రూ పేరును పలకననీ, అయితే కశ్మీర్ సమస్యకు కారణం తొలి ప్రధానేనని చెప్పడంలో మాత్రం తనకు ఏ మాత్రం సందేహం లేదని స్పష్టం చేశారు. -
నెహ్రూ కారణంగానే కశ్మీర్ సమస్యన్న షా
-
ఆ వివాదానికి నెహ్రునే కారణం : అమిత్ షా
న్యూఢిల్లీ : కశ్మీర్ వివాదానికి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రునే కారణమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లుపై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు తాము ప్రజల మనోగతాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదంటున్నాయని.. కానీ నెహ్రు అప్పటి హోం మంత్రి పటేల్ అభిప్రాయం తీసుకోకుండానే.. పీవోకే ప్రాంతాన్ని పాకిస్తాన్కు ఇచ్చేశారని అన్నారు. కశ్మీర్ను అభివృద్ధి చేయడమే తమకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్ బిల్లు కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దుతో పాటు, నియంత్రణ రేఖ వెంబడి నివసిస్తున్న.. ఆర్థికంగా వెనుకబడినవారికి మేలు చేకూరుస్తుందని తెలిపారు. ఉగ్రమూకలను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు. సర్జికల్ దాడులను సమర్థించిన అమిత్ షా.. ఈ దాడిలో ఒక పౌరుడు కూడా చనిపోలేదని అన్నారు. తాము ఆర్టికల్ 356ని రాజకీయ లబ్ధికి వాడుకోలేదని పేర్కొన్నారు. మరోవైపు కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కశ్మీర్లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అంతకుముందు జమ్ము కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ అమిత్ షా పార్లమెంట్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివర్లో జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. కశ్మీర్లో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని అన్నారు. -
మానవ కంప్యూటర్
సాక్షి, కడప : కడప జిల్లాకు చెందిన లక్కోజు సంజీవరాయశర్మ గొప్ప గణిత మేధావిగా పేరు గాంచారు. దేశ, విదేశీయుల చేత ప్రశంసలు అందుకున్నారు. ఆయన ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందినవారు. 1907 నవంబర్ 28న జన్మించారు. పుట్టుకతోనే చూపులేదు. అంధుడు పుట్టాడని పెంచడం కష్టమని.. గొంతు పిసికి దిబ్బలో పూడ్చేయాలని మంత్రసాని సలహా ఇచ్చింది. మరికొందరు మహిళలు పురిటి బిడ్డ నోట్లో వడ్ల గింజలు వేశారు. అయినా ఆ పసివాడు చావలేదు సరికదా.. చక్కగా ఆరోగ్యంగా ఎదిగాడు. ప్రపంచం ఈర్ష్యపడే స్థాయికి పేరుగాంచారు. ఆ రోజులలో బ్రెయిలీ లిపి లేకపోవడంతో సంజీవరాయ శర్మ చదువుకునేందుకు వీలు కాలేదు. అక్క బడికి వెళ్లి వచ్చాక ఇంటి వద్ద పాఠాలను గట్టిగా చదువుతుంటే విని గుర్తు పెట్టుకునేవాడు. అలా ఆయనకు మామూలు పాఠాలతోపాటు గణితం బాగా వచ్చింది. అందులో అపార జ్ఞానం సాధించారు. అతని బాల్య దశలోనే తండ్రి చనిపోయారు. తల్లే పెంచింది. పల్లెల్లో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు తదితర అంశాలను సంజీవరాయశర్మ క్షణాల్లో చెప్పేవారు. రైతులు ఈ సాయానికి గానూ ఆయనకు అంతో.. ఇంతో డబ్బు ఇచ్చేవారు. ఆ వయసులోనే వయొలిన్ పట్ల ఆకర్షితుడై వాయించడం నేర్చుకున్నారు. తర్వాత వయొలిన్ వాయించడం జీవితంలో ఒక భాగమైంది. గణితంలో ప్రజ్ఞ సాహిత్యంలో కవులు అవధానాలు చేయడం తెలిసిందే. అంటే 8 మంది వరుసగా ప్రశ్నలు వేస్తుంటే ఆయా అంశాలకు వెంట వెంటనే పద్యాల రూపంలో జవాబు చెప్పాలి. అలాగే గణితంలో కూడా అవధానం ఉంది. లక్కోజు సంజీవరాయ శర్మ గణితంలో అవధానాలు చేయడంలో దిట్టగా మారారు. పుట్టిన తేదీ, సంవత్సరం, ప్రదేశం, సమయం చెప్పగానే ఆయన దానికి సంబంధించిన తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలు చెప్పేసేవారు. దాంతోపాటు క్లుప్తంగా జాతకాన్ని కూడా తెలిపేవారు. అలా ఆయన దేశమంతటా మొత్తం 6 వేల గణిత అవధానాలు చేశారు. వేలాది మంది కూర్చున్న సభలో నిమిషానికి 20, 30 కష్టమైన లెక్కలకు అడిగిన వెంటనే సమాధానాలు చెప్పేవారు. ప్రశ్న అడగ్గానే వయొలిన్ను కొద్దిగా పలికించి వెంటనే సమాధానం చెప్పేవారు. ఈ విద్య ఎలా నేర్చుకున్నావు అని అడిగితే దైవ దత్తంగా వచ్చిందని బదులిచ్చేవారు. ప్రపంచంలోనే గణితం విషయంలో బెంగళూరుకు చెందిన శకుంతలాదేవి కంప్యూటర్ను ఓడించిందంటారు. అలాంటి శకుంతలాదేవినే ఓడించిన గొప్ప వ్యక్తి లక్కోజు సంజీవరాయశర్మ. ఎంత పెద్ద లెక్క అడిగినా కూడా క్షణాల్లో బదులిచ్చేవారు. గౌరవ పురస్కారాలు గణితంలో లక్కోజు గొప్పతనం తెలిసి.. దేశమంతటా ఎందరో గొప్పవాళ్లు ఆయన అవధానాలకు వెళ్లేవారు. మరికొందరు పెద్దలు ప్రత్యేకంగా అవధానం చేయించి విని ఆశ్చర్యపోయేవారు. 1959లో నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఢిల్లీలో లక్కోజుతో గణిత అవధానాన్ని ఏర్పాటు చేయించి, తిలకించారు. ఆ కార్యక్రమానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా హాజరయ్యారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 1996లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తొలిసారిగా 1928లో గణిత అవధానం చేశారు. 1995 వరకు దేశమంతటా 6 వేల ప్రదర్శనలు ఇచ్చారు. 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ప్రధాన ఆకర్షణగా నిలిచి వందలాది లెక్కలకు బదులిచ్చారు. 19 ఏళ్ల వయసులోనే వివాహమైంది. అప్పట్లో ఆయన సతీమణి వయసు 9 ఏళ్లు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. 1994 జనవరి 5న ఆమె శ్రీకాళహస్తిలో ఉండగా మరణించారు. సంజీవరాయశర్మ హైదరాబాద్లోని కుమారుడి వద్దకు చేరుకున్నారు. 1997 డిసెంబర్ 2న కన్నుమూశారు. ప్రపంచం మొత్తాన్ని తన అద్భుతమైన గణిత విద్యతో ఆకట్టుకున్న గొప్ప వ్యక్తి ఇంత వరకు ఈ భూమిపై మరొకరు పుట్టలేదని.. ప్రపంచంలోని గణిత మేధావులంతా ఎంతో ప్రశంసించారు. -
‘నెహ్రూ భార్య విహారానికి ఎయిర్ఫోర్స్ విమానం’
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకోవడంతో వ్యక్తిగత విమర్శలు తారాస్థాయి చేరాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఐఎన్ఎస్ విరాట్ను గాంధీ కుటుంబం వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకుందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో తాజాగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ స్వామి నెహ్రూపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. నెహ్రూ తన యూరప్ భార్యల్లో ఒకరికి వైమానిక దళ విమానం కావాలని కోరుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన యూరప్ భార్య కోసం ఎయిర్ఫోర్స్ విమానం సమకూర్చాలని 1950ల్లో రక్షణ కార్యదర్శిగా ఉన్న తన మామ జేడీ కపాడియాను నెహ్రూ కోరగా అందుకు ఆయన నిరాకరించారని గుర్తుచేశారు. దీంతో ఆయనను బదిలీ చేసి తదుపరి కార్యదర్శితో తన పని చక్కబెట్టుకున్నారని నెహ్రూను ఉద్దేశిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. The Namo citing Virat misuse recalls for me the case of my father in law J.D. Kapadia ICS who as Defence Secy in the 1950s refused to give Airforce plane to ferry one of Nehru’s European mistresses. Of course he was transferred and next Secy okayed. Thus the decline be began — Subramanian Swamy (@Swamy39) May 9, 2019 -
‘వేల మందిని చంపిన పాపం నెహ్రూదే’
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మీద విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశాంబీలో పర్యటించిన మోదీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుంభమేళా నిర్వహణ విషయంలో ఎలా వ్యవహరించాయో వివరించారు. ఈ క్రమంలో 1954లో కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటను మరోసారి తెరమీదకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాను చాలా చక్కగా నిర్వహించారు. కానీ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అధ్వర్యంలో 1954లో అలహాబాద్లో కుంభమేళా నిర్వహించినప్పుడు తొక్కిసలాట జరిగింది. వేల మంది చనిపోయారు. అయితే ఈ ఘటనలో చనిపోయిన వారి పేర్లు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అంతేకాక వారికి కనీసం ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం అందలేద’ని మోదీ ఆరోపించారు. నెహ్రూను కాపాడటం కోసమే అప్పటి మీడియా ఈ వార్తలను ప్రజల దృష్టికి తీసుకురాలేదన్నారు మోదీ. అంతేకాక ఆ తొక్కిసలాటలో వేల మంది మరణించారని.. ఈ పాపం దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూదే అని ఆరోపించారు. గతంలో కూడా మోదీ.. నెహ్రూను ఉద్దేశిస్తూ.. గులాబీలు ధరించే వారికి తోటల గురించి అవగాహన ఉంటుందేమో కానీ.. రైతుల కష్టాల గురించి వారికి ఏ మాత్రం తెలియదని విమర్శించారు. -
నెహ్రూను తగ్గించాలని కాదు
సాక్షి, బళ్లారి/అమ్రేలీ/బాగల్కోట: భారత తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాధాన్యతను తగ్గించేందుకు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించలేదని ప్రధాని మోదీ తెలిపారు. సర్దార్ పటేల్ తమ నాయకుడని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు, గుజరాత్లో నర్మదా నదీతీరాన నిర్మించిన పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని ఇప్పటివరకూ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించిన మోదీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో 75 శాతం పోలింగ్.. గతంలో పుణే, అహ్మదాబాద్, జమ్మూలో తరచూ బాంబు పేలుళ్లు జరిగేవి. కానీ గత ఐదేళ్లలో ఒక్క బాంబు దాడి జరిగినట్లైనా మీరు విన్నారా? కశ్మీర్లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సందర్భంగా ఒక్క హింసాత్మక ఘటన జరగలేదు. నేను పటేల్ విగ్రహాన్ని నెహ్రూను తక్కువ చేయడానికి నిర్మించలేదు. పటేల్ విగ్రహం ఎంత ఎత్తుగా ఉందంటే, మీరు(కాంగ్రెస్ నేతలు) ఇకపై ఇతరులను తక్కువ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు’ అని అన్నారు. గుజరాత్ నన్ను దృఢంగా మార్చింది 2017లో చైనాతో డోక్లామ్ ఉద్రిక్తత సందర్భంగా కటువుగా, దృఢంగా వ్యవహరించేలా గుజరాత్ నన్ను తయారుచేసింది. గుజరాత్ ప్రజలు నాలో నైతిక విలువలను పెంపొందింపజేశారు. ఇందుకు నేను కృతజ్ఞతలు చెబుతున్నా. దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామనీ, కశ్మీర్లో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (అఫ్సా) తొలగిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అదే జరిగితే అమర్నాథ్ యాత్రికులను ఉగ్రవాదులు చంపేయరా? వైష్ణోదేవి ఆలయాన్ని భక్తులు ప్రశాంతంగా దర్శించుకోగలరా?’’ అని ప్రశ్నించారు. కేంద్రంలో మరోసారి బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మోదీ కర్ణాటక ప్రజలకు పిలుపునిచ్చారు. బాగల్కోట, ఛిక్కొడి, బెళగావిల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ..‘కేంద్రంలో కాంగ్రెస్ బలహీన, నిస్సహాయ ప్రధానిని నియమించాలని అనుకుంటోంది. బలమైన ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఢిల్లీ(కేంద్రం) వైపు చూడండి. బలహీనమైన ప్రభుత్వం ఎలా ఉంటుందంటే బెంగళూరువైపు చూడండి’ అని తెలిపారు. ఆమ్రేలీలో పార్లమెంటు భవంతి ఆకృతిలో జ్ఞాపికను అందుకుంటున్న ప్రధాని మోదీ -
అమితాబ్ సైకిల్ మీద ఇక్కడికొచ్చేవాడు..
అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ.. ఆ మధ్య వీపీ సింగ్.. కాఫీ తాగడానికి, రాజకీయ కబుర్లు చెప్పుకోవడానికి అక్కడికి వచ్చేవారు. బిగ్ బి అమితాబ్ కూడా కుర్రాడిగా ఉన్నప్పుడు సైకిల్ మీదొచ్చేవాడు. ఇప్పుడు.. 2019 సార్వత్రిక ఎన్నికల సంగతులు మాట్లాడుకోవడానికి రిక్షా కార్మికుడు, లాయర్లు, జర్నలిస్టులు, విద్యావంతులు ఇలా అన్ని రకాల వారు వస్తున్నారు. గంటల తరబడి కాఫీలు తాగుతూ రాజకీయాలపై చర్చిస్తున్నారు. అదే.. ఇండియన్ కాఫీ హౌస్. దేశంలో రాజకీయంగా కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఉన్న ఈ కాఫీ హౌస్ ఇప్పటికీ వేడివేడి రాజకీయ వార్తలకు, చర్చలకు కేంద్రంగా భాసిల్లుతోంది. ఎత్తయిన సీలింగ్, ఆర్చితో చూడగానే చర్చిగా కనిపిస్తుంది ఈ కాఫీ హౌస్. 1957 నుంచి ఉన్న ఈ కాఫీ హౌస్ నగరవాసులందరీకీ సుపరిచితమే. కాలం మారినా, రాజకీయాలు మారుతున్నా, జనాల అభిరుచులు మారుతున్నా.. ఈ కాఫీహౌస్ మాత్రం మారలేదు. లోపల ఆనాటి ఇంటీరియర్ డెకరేషనే నేటికీ ఆకట్టుకుంటోంది. కాఫీ, ఇతర తినుబండారాల రేట్లు కూడా ఎక్కువేం కాదు. కాఫీ హౌస్ కాబట్టి మొదట్లో ఇక్కడ టీ దొరికేది కాదు. కాలం మారినా కూడా ఇప్పటికీ ఇక్కడ టీకి చోటేలేదు. అలహాబాద్కు గుండెకాయనదగిన సివిల్ లైన్స్లో ఉన్న ఈ కాఫీహౌస్కు 45 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా వస్తున్న వారు కూడా ఉన్నారు. కొందరయితే కాఫీ హౌస్లో కొన్ని సీట్లను రిజర్వు చేసేసుకున్నారు. వారెప్పుడొచ్చినా అక్కడే కూర్చుంటారు. ఇక్కడకొచ్చే వారు తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తుంటారు. వాదోపవాదాలు కూడా తీవ్రంగానే జరుగుతాయి. అయితే, గొడవలు మాత్రం జరగవు. ‘ఎవరెంత గట్టిగా వాదించుకున్నా చివరికి అంతా ప్రశాంతంగానే వెళ్లిపోతారు’ అన్నారు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడి వస్తున ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ రిటైర్డ్ అధికారి అశోక్ యాదవ్. ‘అప్పట్లో నెహ్రూ, తర్వాత వీపీ సింగ్ మా కాఫీహౌస్లో కాఫీతాగి కాసేపు గడిపేవారు. అమితాబ్ బచ్చన్ కూడా సూపర్స్టార్ కాకముందు సైకిల్ మీద ఇక్కడికొచ్చేవాడు’ అంటూ ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు కాఫీ హౌస్ మేనేజర్ పీఆర్ పాండా. 45 ఏళ్లుగా ఇక్కడికి రోజూ వస్తున్నారు అవదేశ్ ద్వివేది. ‘ఇంతకు ముందు ఎన్ని చర్చలు జరిగినా ఎవరూ ఎదుటి వారిని నొప్పించేలా మాట్లాడేవారు కాదు. అదుపు తప్పకుండా వాదించుకునే వారు. ఇప్పుడలా కాదు. కుర్రాళ్లు ప్రతి దానికీ ఆవేశ పడిపోతున్నారు. తమ మాట కాదంటే చాలు ఉద్రేక పడిపోతున్నారు’ అన్నారాయన. అలాఅని ఎవరూ తమ అభిప్రాయాలను చెప్పడానికి భయపడరన్నారు. రాజకీయ నాయకులు కావాలనుకునే వాళ్లు ఇక్కడికి వస్తుంటారు. దేశ రాజకీయాలను తెలుసుకుంటుంటారు. ప్రతిపక్షాల వాళ్లు కూడా వస్తారు. ప్రభుత్వాన్ని తిట్టిపోస్తుంటారు’ అంటూ ప్రస్తుత పరిస్థితిని వివరించారు పాండే. -
నెహ్రు చేసిన తప్పిదం వల్లే : అమిత్ షా
న్యూఢిల్లీ : భారత్ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రు చేసిన తప్పిదం వల్లే కశ్మీర్ సమస్య జఠిలమైందని బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్షా అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2019లో శుక్రవారం అమిత్ షా మాట్లాడుతూ.. 1947లో నెహ్రు కశ్మీర్కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించి పెద్ద తప్పిదం చేశారని, దాని పరిహాసమే ప్రస్తుత పరిస్థితులకు కారణమన్నారు. కశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఆర్టికల్ 370, 35-ఏ విషయాల్లో ఏమైన మార్పులు చేస్తారా అన్న ప్రశ్నను ఆయన దాటేవేసారు. ఈ అంశంపై తాను మాట్లాడబోనని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు మరణించినా.. పాక్ ప్రధాని ఈ ఘటనను ఖండించకపోవడంపై షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్స్ను తమ ఎన్నికల ప్రచారానికి వాడుకోమని స్పష్టం చేశారు. మోదీ చేసిన అభివృద్ధి ఎజెండాతోనే ఎన్నికలు వెళ్తామన్నారు. మోదీ హయాంలో జరిగిన అభివృద్ధి ఎవరి హయాంలో జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం గాంధీల కోసమేనని, బీజేపీ మాత్రం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. చదవండి : (పాకిస్తాన్కు దీటుగా బదులిచ్చాం : అమిత్ షా ) -
మోదీ ప్రధాని కావడానికి కారణం అదే
రాయ్పూర్: యోగా చేసిన వారిని రాజయోగం వరిస్తుందని, అందుకే జవహర్లాల్ నెహ్రూ, నరేంద్ర మోదీ దేశ ప్రధానులయ్యారని యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. మంగళవారం రాయపూర్లో పతంజలి గ్రూప్కు చెందిన ఓ స్టోర్ ప్రారంభోత్సవంలో రాందేవ్ మాట్లాడారు. ఒత్తిడిని దూరంచేసే అతి ప్రాచీన విధానమైన యోగాను మన రాజకీయనేతలంతా అభ్యసించాలని రాందేవ్ కోరారు. నిరంతరం యోగా చేయడంతోనే రాజయోగం సిద్ధించి నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానులయ్యారని, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సైతం యోగా బాగా చేస్తారని రాందేవ్ అన్నారు. టీ అమ్ముకునే నరేంద్ర మోదీ ప్రధాని కావడానికి, సాధువైన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి యోగాతో వచ్చిన రాజయోగమే కారణమని రాందేవ్ వ్యాఖ్యానించారు. రాజకీయ రణరంగంలో గెలవాలంటే పోరాటపటిమనందించే యోగా తప్పనిసరి అని అన్నారు. బుద్ధి చెప్పాలంటే యుద్ధం చేయాల్సిందే.. పుల్వామా ఉగ్రదాడి వంటి చర్యలతో నిత్యం సమస్యలు సృష్టిస్తున్న పాకిస్తాన్కు, ఉగ్రవాదులకు యుద్ధం ద్వారానే భారత్ బుద్ధిచెప్పాలని రాందేవ్ అన్నారు. యుద్ధంలో ఓడిస్తే మరో 50 ఏళ్ల దాకా పాక్ భారత్వైపు కన్నెత్తికూడా చూడదన్నారు. పాకిస్తాన్ నైరుతి ప్రాంతమైన బలోచిస్తాన్కు స్వాతంత్య్రం ప్రకటించాలని ఉద్యమిస్తున్న అక్కడి వేర్పాటువాదులకు భారత్ అన్నిరకాల సాయం అందించాలని రాందేవ్ అభిప్రాయపడ్డారు. దేశాన్ని ద్వేషించే పాకిస్తానీయులకు భారత్ పూర్తిసాయం అందించి పాకిస్తాన్ పూర్తిగా నాశనమయ్యేలా చేయాలని రాందేవ్ అన్నారు. ‘ రాముడు ముస్లింలకు సైతం పూర్వీకుడే. అందుకే రామాలయ నిర్మాణానికి ముస్లింలు కూడా ముందుకు రావాలి’ అని రాందేవ్ వ్యాఖ్యానించారు. -
బాల్యమా! ఓ ప్రాణమా!! ఎక్కడున్నావ్?
బాల్యానికి గంతలు కట్టేస్తున్నారు.అలాగే అనిపిస్తోంది. అందరూ చెప్పేవాళ్లే కానీ.. జీవితాన్ని చూపించేవాళ్లు తక్కువైపోయారు. చూపులేని వాళ్లను నడిపించినట్లు నడిపిస్తున్నారే కానీ.. రెక్కలు కట్టి ఎగరమని చెప్పడం లేదు. నిజానికి.. బాల్యం చెక్కినట్లు జీవితాన్ని మరేదీ చెక్కలేదు. బాల్యమా! ఓ ప్రాణమా!! ఎక్కడున్నావ్? రేపటి పౌరులు మాత్రమేనా పిల్లలంటే! నేటి మన సంతోషానికి, నిన్నటి మన జ్ఞాపకాల చిరునవ్వులకు, రోజూ ఉదయాన్నే జీవితంపై ఆశతో మనం నిద్రలేవడానికి ఒక అర్థవంతమైన కారణం పిల్లలు. లోకం తీస్తున్న పరుగులన్నీ పిల్లల కోసమే. లోకం నిండా ప్రేమ ఉన్నది పిల్లలకు పంచడానికే. అక్షరాలున్నది పిల్లలకు నేర్పించడానికే. మేడలు నిర్మిస్తున్నది పిల్లల సౌఖ్యానికే. పిల్లలు.. కుటుంబానికే కాదు, లోకం మొత్తానికే వెలుగు. వాళ్లొక్క నవ్వు నవ్వితే ప్రకృతి పరవళ్లు తొక్కుతుంది. వాళ్లొక్కమారు ఆడుకుంటూ గిర్రున తిరిగితే విశ్వాంతరాళమే వారి చుట్టూ పరిభ్రమిస్తుంది. వాళ్ల కళ్లలోని కాంతులను చూస్తే చుక్కలు చెలిమికొస్తాయి. చెయ్యిచాచి వాళ్లడిగితే చందమామయ్య అమ్మచేతి అద్దంలోకి వచ్చేస్తాడు. ఇల వాళ్లదే, కల వాళ్లదే. భువి వాళ్లదే. దివి వాళ్లదే. రేపటి పౌరులు మాత్రమేనా పిల్లలంటే. పెద్దల్ని వాచ్ చేసేవాళ్లు, పెద్దలకు టీచ్ చేసేవాళ్లు కూడా. ఎన్ని తెలిసిన జ్ఞానికైనా, ఒకటేదో మిగిలే ఉంటుంది పిల్లల్నుంచి చేర్చుకోడానికి! ఏమీ తెలియనివారిక్కూడా.. ధైర్యమూ, దారీ ఇచ్చే సంకేతమేదో పిల్లల మాటల్లో దొరుకుతుంది. ‘ఔట్ డేటెడ్’లను నడిపిస్తారు. ‘అప్డేట్’లను కూడా అప్గ్రేడ్ చేస్తారు! జవహర్లాల్ నెహ్రూ అనే ఓ పిల్లాడుండేవాడు. పెద్దయ్యాక దేశ ప్రధాని అయ్యాడు. ప్రధాని అయ్యాక కూడా పిల్లల్తో ఆడాడు. పాడాడు. చాక్లెట్లిచ్చాడు. ఆయనకీ తెలీదు తన పుట్టినరోజు ఏదో ఒక నాటికి ‘పిల్లల రోజు’ అవుతుందని. అయింది. పిల్లలే ఆయనకిచ్చిన కానుక ‘చిల్డ్రన్స్ డే’. పిల్లలు ఏదీ ఉంచుకోరు. వెంటనే పంచుకుంటారు! కానీ మనం చేస్తున్నదేమిటి? పిల్లల కోసం బాల్యాన్ని కొద్దిగానైనా మిగల్చడం లేదు. చేస్తున్నదంతా వాళ్ల మంచి కోసమే. వాళ్ల ఫ్యూచర్ని చక్కగా ప్లాన్ చేస్తాం. కానీ వాళ్ల ప్రెజర్ని పట్టించుకోం. విజ్ఞానవంతుల్ని చేయాలని చూస్తాం. వికాసం కోసం చూడం. ఎదుగుతున్నారనే అనుకుంటాం.. లోలోపల గుదులుకుంటున్నారేమోనని చూడం. మన కలల్ని వాళ్లు నెరవేర్చాలని కోరుకుంటాం. వాళ్లకొచ్చే పీడకలల్ని అర్థం చేసుకోం. అన్నీ ఇస్తాం. అనుబంధాలను ఇవ్వం.ఆడుకోమంటాం.ప్లేగ్రౌండ్ ఇవ్వం. ఇంత హింసేమిటి? బట్టీల్లో, కర్మాగారాల్లో కనిపించే బాలల వెట్టిచాకిరీ మాత్రమే మనకు హింసగా కనిపిస్తుంది. ఇంట్లో, స్కూల్లో పెట్టే హింస కనిపించదు. చైల్డ్ లేబర్ని, చైల్డ్ ట్రాఫికింగ్ని, చైల్డ్ హెరాస్మెంట్ని, చైల్డ్ అబ్యూజ్ని అరికట్టే చట్టాలు ఉన్నాయి. ప్రయోజకుల్ని చేసే లక్ష్యంతో.. ఎదుగుతున్న మొగ్గల్ని చిదిమేసే హింసను అరికట్టేందుకు ఏ చట్టం ఉంది? పిల్లలకు ఎంతో ఎక్కువ చేస్తున్నాం అనుకుంటున్న మనం.. తక్కువ చేస్తున్నదేమిటో కూడా ఈ బాలల దినోత్సవం రోజు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. డిజి బిజి ఓ ముప్పయ్ ఏళ్ల కిందట... పిల్లలు గ్రౌండ్లో ఆటల్లో మునిగిపోతే, సాయంత్రం దాటి చీకట్లు ముసురుకుంటున్నా ఇల్లు గుర్తుకు వచ్చేది కాదు. ‘ఇక ఆడుకున్నది చాలు. ఇళ్లకు వెళ్లండి’ అని ఆ దారిన వెళ్లే పెద్దవాళ్లు ఎవరో కోప్పడే వరకు ఆటలు ఆగవు. మరీ గడుగ్గాయిలైతే... వాళ్లను వెతుక్కుంటూ తల్లులు రావాలి, చెవులు మెలేసి ఇంటికి లాక్కెళ్లాల్సిందే. సంతోషాలు రాశిపోసిన బాల్యం అది. ఆనందం చిందిన బాల్యం అది. ఆరోగ్యం నిండిన బాల్యం అది. గడిచిన తరాలు అనుభవించిన సృజనాత్మకమైన బాల్యం అది. ఈ తరానికి తెలిసిన బాల్యం ఎలక్ట్రానిక్ బాల్యం. ఇంట్లో ఉన్న ముగ్గురు మనుషులూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే రోజు గడిచిపోయే కాలమిది. అమ్మానాన్నలు ఎవరి ల్యాప్టాప్లో వాళ్లు, ఎవరి స్మార్ట్ఫోన్లో వాళ్లు మునిగిపోతున్నారు. పిల్లలు కంప్యూటర్లో హారర్ షోలతో ఉత్కంఠకు గురవుతుంటారు. టామ్ అండ్ జెర్రీ చూస్తూ కసిగా నవ్వుకుంటుంటారు. ఏడిపించి నవ్వడంలో ఆనందాన్ని వెతుక్కుంటుంటారు. ఈ తరానికి గేమ్స్ అంటే వీడియో గేమ్సే, కదలకుండా కూర్చుని మెడ వంచేసి, వత్తులేసుకున్నట్లు కళ్లు తెరుచుకుని గంటల కొద్దీ గడపడమే వాళ్లకు తెలిసిన ఆటలు. బాల గేయాలంటే సీడీలు ప్లే చేసి ‘చిట్టి చిలకమ్మ’ను చూడడమే తప్ప నోరు తెరిచి ఆలపించాలనే ఆలోచనే ఉండడం లేదు. ల్యాప్టాప్, యూ ట్యూబ్, స్మార్ట్ ఫోన్, వీడియోగేమ్స్లో కుదురుకుపోతున్నారు తప్ప ఒళ్లు కదిలించే ఆటల వైపే చూడడం లేదు. గది నిండా ఎలక్ట్రానికి డివైజ్లు. వాటిని ప్లే చేసే ఓ ప్రాణమున్న డివైజ్. ఇదే ఈ తరం ఎంజాయ్ చేస్తున్న ‘ఈ– బాల్యం’. అంతంత సేపు స్క్రీన్ చూస్తే చూపు పోతుందని కోప్పడితే, రిమోట్తో డ్రోన్ను ఎగిరిస్తారు. బయటకు వెళ్లి ఆడుకోమంటే... జేబు నిండా డబ్బులేసుకుని ప్లే స్టేషన్కెళ్లి బంపింగ్కార్స్తో ఢీ కొట్టుకోవడమే నేటి తరం ఆనందిస్తున్న ఆట. ఈ మోడరన్ టెక్ లైఫ్లో ‘నో ఫుడ్ డే’ ఉంటుందేమో కానీ ‘నో టెక్ డివైజ్ డే’ ఉండదు. డే మొత్తం కాదు ఓ గంట కూడా స్క్రీన్కు దూరంగా... తనకు తానుగా మెదడు పెట్టి, మనసుతో గడపలేకపోతోంది ఈ హైటెక్ జనరేషన్. సాంకేతికాభివృద్ధి మనిషి జీవితాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఉపయోగపడాలి.మనిషిని మరబొమ్మలా చేయకూడదు. నిజానికి అన్నింటికీ నెపాన్ని పిల్లల మీద తోసేస్తారు, కానీ వాళ్లు ఇలా మారడానికి మూలం ఏమై ఉండాలి?‘జో అచ్యుతానంద జోజో ముకుందా...’ అమ్మ ఒడిలో పడుకుని పాట వింటూ నిద్రలోకి జారిపోతుంది ఏడాది పాపాయి. ఆ పాటను అమ్మ పాడడం లేదు. పక్కనే స్మార్ట్ఫోన్లో పాట పెట్టేసి పాపాయిని ఒడిలోకి తీసుకుని జో కొడుతుందంతే. అమ్మ గొంతు వినడమే బిడ్డకు భరోసా అని, అమ్మ శ్రావ్యంగా పాడకపోయినా... పాట బాగాలేదని పాపాయి ముఖం చిట్లించదని ఆ అమ్మకు తెలియాలి. తాను జోల పాడి నిద్ర పుచ్చితే, తాను ‘చిట్టి చిలకమ్మ’ అని పలుకుతూ పాపాయికి నేర్పిస్తే... పాపాయి కూడా తన ఆట తాను ఆడుకుంటుంది. తన పాట తాను పాడుకుంటుంది. అది లేకపోతే ఎలక్ట్రానిక్ డివైజ్లు ప్లే చేయడం మాత్రమే నేర్చుకుంటుంది. తనలో క్రియేటివిటీ ఉందన్న సంగతి కూడా తెలియకుండానే పెద్దదయిపోతుంది. అందుకే... అమ్మలూ! జోల పాడండి, పాపాయికి తాను పాట వినడమే కాదు, పాడాలి కూడా అని తెలిసేలా పెంచండి. సృజనాత్మకతతో వికసించాల్సిన రేపటి తరాన్ని టెక్ సీలో ముంచవద్దు. అమ్మ, నాన్న, ఓ బిడ్డ, నాలుగు స్మార్ట్ఫోన్లు, ఓ టాబ్లెట్, ల్యాప్టాప్... ఇదీ ఇప్పటి కుటుంబ ముఖచిత్రం. బాల్య సంబంధాలు నాన్న కోప్పడితే వెళ్లి బాబాయి వీపు వెనుక దాక్కోవడానికి లేదు. లేదా నాన్న భయం లేదని తెలిస్తే బాబాయ్తో చెప్తానుండు అని అనడానికీ లేదు. తాతయ్య బజారు నుంచి వస్తూ వస్తూ చేసంచిలో కారాబూందీ పొట్లం కట్టించుకొని వచ్చి, మంచం మీద కూచుంటూ పిలిచి, బుగ్గలు పుణికి దానిని చేతిలో పెడితే, తీసుకుని తింటున్నప్పుడు తాతయ్య నవ్వే నవ్వు చూడ్డానికి లేదు. విసుక్కునే అమ్మను మందలించి దగ్గరకు తీసుకునే నానమ్మ ఒడి లేదు. ‘జామకాయలు కోద్దాం రా’ అని ఉప్పు మూట ఎక్కించుకుని పెరట్లో ఆటలాడే పిన్ని వాత్సల్యం లేదు. ఉన్న అనుబంధాలు పరిమితమైపోయాయి. ప్రతి ఇంట్లో అమ్మా నాన్న అన్న లేదా చెల్లి. నలుగురు మనుషుల కుటుంబంలో అనుబంధపు తీపి తెలుస్తున్నదా నేటి బాల్యానికి. నిన్న మొన్నటి వరకూ కనీసం సెలవుల్లో పెదనాన్న ఇంటికి వెళతాము, మేనమామ ఇంటికి వెళతాము అని అనేవారు. వెళ్లేవారు. ఇప్పుడు వెళ్లినా భరించే స్థితిలో బంధువులు ఉండటం లేదు. రోజులకు రోజులు అట్టి పెట్టుకునే ఓపిక ఉండటం లేదు. వీలు ఉండటం లేదు. బతుకులు బాదరబందీలో చెదిరిన బంధాలలో బాల్యం చాలా విలువైన అనుబంధాలను మిస్ అవుతూ ఉంది. ‘మనవాళ్లు’ అనే భావన ఎప్పుడూ పిల్లలకు భద్రతను ఇస్తుంది. నన్ను ప్రేమించే నా వాళ్లు ఉన్నారని రక్త సంబంధీకులను చూసి పిల్లలు సంబర పడతారు. ఉత్సాహ పడతారు. పిల్లలకు కజిన్స్ మొదటి స్నేహితులవుతారు. వారి రహస్యాలు పంచుకునే నేస్తులవుతారు. అలకలు, అసంతృప్తులు, కోపాలు, తాపాలు, పిల్లలు మాత్రమే ఆశించే కోరికలు ఇవన్నీ ఒట్టి అమ్మానాన్నల వల్ల తీరిపోవు. వారి ఒక్కరి సమక్షం చాలదు. బంధువులు కావాలి. రక్తసంబంధీకులు కావాలి. బాల్యం డొల్ల కాకుండా తన వారితో కూడిన జ్ఞాపకాలను వారిలో కూరాలి. వేరుగా ఉండొచ్చు కాని వేరుగా ఉంటూ కూడా పిల్లలకు పరస్పరం అనుసంధానం అవుతున్నామా అని నేటి కుటుంబాలు ఆలోచించాలి. ఇరుగు పొరుగు మీద హక్కు ఉండదు.స్నేహితుల మీద డిమాండ్ ఉండదు. కాని రక్త సంబంధీకులను నిలదీయవచ్చు. మంచిలో చెడులో భాగానికి పిలుపియ్యవచ్చు. అవి లేని ఒంటరివాళ్లుగా పిల్లలను మారుస్తున్నామేమో ఆలోచించాలి. పిల్లలు అడిగితే బర్గర్ చేతిలో పెడుతున్న తల్లిదండ్రులు ఒక బంధాన్ని చేతికి దారంలా చుడుతున్నారా? ఆలోచిద్దామా? వేరుగా ఉంటూ కూడా పిల్లలకు పరస్పరం అనుసంధానం అవుతున్నామా అని నేటి కుటుంబాలు ఆలోచించాలి. కలలు కూడా దోచుకునే... సినిమాకు వెళ్లాలంటే పెద్ద పథకం. నాన్న పర్మిషన్ అడగాలి. అమ్మకు వీలు కుదరాలి. పోపులడబ్బాలో డబ్బులు ఉండాలి. ఇంటర్వెల్లో గోల్డ్స్పాట్ తాగడం కోసం వారం రోజులుగా పోగేసిన చిల్లర జేబుల్లో ఉంటుంది. మసాలా వడలు, పునుగులు న్యూస్ పేపర్ కాగితంలో పట్టుకుని తింటూ సినిమా చూస్తుంటే మజా వస్తుంది. మరుసటి రోజు స్కూల్లో స్నేహితులకు ‘నేను నిన్న సినిమా చూశాను తెలుసా’ అని చెప్తే గొప్ప వస్తుంది. పిల్లలకు అతి చవకైన వినోదం సినిమా. తల్లిదండ్రులు కూడా సినిమా బడ్జెట్ను పెద్ద బడ్జెట్గా చూసేవారు కాదు. రోజువారి బాదరబందీలో పిల్లలతో సినిమాకు వెళ్లడం వారికీ ఓ ఆటవిడుపు. కాని ఇవాళ సినిమా వ్యవహారం మారిపోయింది. సింగిల్ స్క్రీన్స్ పోయాయి. మల్టీప్లెక్సులు వచ్చాయి. రేట్లు ఖరీదయ్యాయి. పాప్కార్న్ ప్యాకెట్, కూల్డ్రింక్ ధర టికెట్ కంటే ఎక్కువగా ఉంటుంది.ఒక కుటుంబం ఒకసారి సినిమాకు వెళ్లాలంటే పెద్ద ఖర్చు అవుతుంది. దాని వల్ల తల్లిదండ్రులు సినిమాకు వెళ్లడాన్ని నిరుత్సాహపరుస్తున్నారు.పిల్లలు ఒక ముఖ్యమైన ఆనందాన్ని మిస్ అవుతున్నారు.‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు’ అని ఒక సినిమాలో కవి అన్నాడు. పిల్లలకు రంగుల కలలు ఇచ్చే సినిమాను కూడా దూరం చేసే దొంగలు ఎవరో మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? వాల్పోస్టర్లు చూసి ఇమాజినేషన్లోకి వెళ్లగలిగిన క్రియేటివిటీని చిదిమేస్తున్నాం. ప్రభుత్వాలు పార్కులు కట్టడం లేదు. స్కూళ్లలో ప్లేగ్రౌండ్లు ఉండటం లేదు. వీధుల్లో ట్రాఫిక్. ఆటలు దూరమైన పిల్లలు కోరే కనీస వినోదం, బయటకు వెళ్లే వీలు సినిమా. అది కూడా తప్పించి టీవీ లేదా ఫోన్లో వారికి దొరికింది చూసే వీలు కల్పిస్తూ కంటి జబ్బులకు కారణం అవుతున్నాం. సినిమా బాల్యంలో ఒక ముఖ్య జ్ఞాపకం. ఇవాళ ఎంతమంది పిల్లలకు ఆ జ్ఞాపకం ఉంటోంది? కత్తి యుద్ధాలు చేసే హీరోను చూసి ఇంటికొచ్చి చీపురుపుల్లలు పట్టుకునేవారు. టేప్ రికార్డుల్లో పాట వస్తుంటే డాన్స్ చేసేవారు అటకెక్కిన ఆటలు చింటూ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఆ రోజు చింటూకి చాలా సంతోషంగా ఉంది. అమ్మనాన్నలతో కలిసి సినిమాకు వెళ్లాడు. బయట ఐస్క్రీమ్ ఇప్పించాడు నాన్న. ఇంటికి వచ్చేటప్పుడు దారిలో క్రికెట్ బ్యాట్, బాల్ కొనిచ్చాడు. బ్యాట్ పట్టుకోగానే చింటూ ముఖం మతాబులా వెలిగిపోయింది. బ్యాట్ని ఎడమచేత్తో ఛాతీమీదుగా గట్టిగా పట్టుకున్నాడు. బాల్ని షర్ట్ జేబులో కుక్కుతుంటే ‘జేబు చిరుగుతుందిరా! నే పట్టుకుంటా’ అని తల్లి అంటే ‘ఊహూ..’ అని తల అడ్డంగా ఊపి, ఆ రెంటినీ తనే గట్టిగా పట్టుకున్నాడు. అమ్మనాన్నలతో ఉన్నా చింటూ ధ్యాసంతా ఇంటి దగ్గర బంటి, చిన్ను, మున్నాలతో కలిసి ఎప్పుడెప్పుడు క్రికెట్ ఆడుకుంటానా ఉంది. ఇంటికి చేరుకునే సరికి చీకటి పడింది. తల్లిదండ్రి వారిస్తున్నా తన స్నేహితుల ఇళ్లవైపు పరిగెత్తాడు. ‘ఇప్పుడెక్కడ ఆడుకుంటారు.. రేప్పొద్దున రా!’ అనడంతో గ్రౌండ్లో ఔట్ అయిన బ్యాట్స్మెన్లో బ్యాట్ను చంకలో పెట్టుకొని దిగాలుగా ఇంటి ముఖం పట్టాడు. ‘రేపు సండే స్కూల్ లేదుగా ఎంచక్కా ఆడుకోవచ్చు’ అని తల్లి చెప్పడంతో మురిపెంగా ఆ రాత్రి బ్యాట్ని పక్కనే పెట్టుకొని పడుకున్నాడు రేపటి ఆటను కలగంటూ! తెల్లారి చింటు.. మున్నా, బంటి బ్యాట్కి పనిచెబుతూ కేరింతలు కొడుతున్నారు. ‘ఏంటా అల్లరి..? కాస్త పక్కకెళ్లి ఆడుకోండి..’ గద్దించాడు ఎదురింటి పెద్దమనిషి. రెండు బాల్స్ వేశారో లేదో ‘ఏం ఆటల్రా.. కాళ్లకు అడ్డంపడుతూ మమ్మల్ని పడేసేట్టున్నారు అరిచేసింది పక్కింటి ఆంటీ. ఇంతలో చిన్ను బ్యాట్తో బాల్ని కొడితే అది కాస్తా ఎదురింటి కిటికీకి తగిలి అద్దం పగిలింది.అంతే, ఆ ఇంటి వాళ్లతో పెద్ద గొడవ అవడంతో కోపం వచ్చి చింటూను నాలుగు బాదింది తల్లి. ‘పోయిన వారం ఇలాగే వాలీబాల్ అంటూ తీసుకొచ్చారు. ఆ బాల్తో ఆడుకుంటూ ఎదురుగా వచ్చే వెహికిల్ను చూసుకోలేదు. కాస్తయితే, ఆ వెహికిల్ కింద పడేవాడే. ఇప్పుడు చూడండి..’ అంటూ భర్తను కోప్పడి చింటూని ఇంట్లోకి లాక్కెళ్లి కూర్చోబెట్టింది. ఏడుస్తూ ఆ రోజంతా ఇంట్లోనే ఉండిపోయాడు చింటూ. మరుసటి రోజు ఇంట్లో ఆడుకుంటే బాల్ వెళ్లి సామాన్లకు తగిలి, అవి పగిలిపోతున్నాయని కొట్టింది. చింటు సైకిల్ కూడా బయట తొక్కడానికి లేదు. ఎటు నుంచి ఏ వెహికిల్ వస్తుందో అని అమ్మ భయపడుతుంది. ఇంట్లో తొక్కే స్థలం ఉండదు. అప్పుడప్పుడు ఆ సైకిల్ మీద కాసేపు కూర్చుంటాడు అంతే! చుట్టూ అపార్ట్మెంట్లు. ఇరుకిరుకుగా ఉండే ఇళ్లు. గజం స్థలం దొరికినా డజన్ ఇండ్లు కట్టేస్తున్న రోజులివి. తల్లి ఈ మధ్య ఓ కొత్త ఉపాయం కనిపెట్టింది. చింటూ ఉదయం ఏడున్నరకు స్కూల్కి వెళితే ఇంటికి వచ్చేసరికి నాలుగు దాటిపోతుంది. రాగానే బట్టలు మార్చి పాలు, స్నాక్స్ ఇస్తుంది. ఐదు నుంచి ఏడు గంటల వరకు ట్యూషన్లో చేర్చితే సరి. చింటూ ఆటలకు, అల్లరికి ట్యూషన్ చెక్ పెట్టేసింది. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ టీవీ చూస్తూ ఉంటుంది. అమ్మ స్మార్ట్ ఫోన్లో చింటు గేమ్స్ ఆడుకుంటూ ఆమె పక్కనే కూర్చుంటాడు. ఇప్పుడు అమ్మకు నిశ్చింతగా ఉంది. పిల్లవాడు ఎటూ పోవడం లేదు. స్కూల్, ఇల్లు. ఇప్పుడు ఎవరితోనూ గొడవలు లేవు. ఉదయాన్నే బద్దకంగా లేచిన చింటూ టైమ్ అయిపోతుందనే హడావుడిలో రెడీ అవుతుంటాడు. పుస్తకాల సంచి భుజాలకు తగిలించుకొని, పాలిష్ చేసిన షూస్ వేసుకొని, వాటర్ బాటిల్ని మెడకు వేసుకొని.. స్కూల్ బస్సు ఎక్కేస్తాడు. మళ్లీ సాయంత్రం ఇంటికి చేరుకుంటాడు. అటు నుంచి ట్యూషన్కి, ఆ తర్వాత ఇంటికి. సైకిల్ తొక్కడం లేదని కాళ్లకు అడ్డుగా ఉందని అమ్మ దాన్ని అటకమీదకు చేర్చింది. దాని పక్కనే ఇప్పుడు బ్యాట్ కూడా చేరిపోయింది. ఆ పక్కనే దుమ్ము కొట్టుకుపోయిన రెండు బాల్స్.. చింటూవైపు దిగాలుగా చూస్తూ ఉన్నాయి ఎప్పుడు చింటూ చేతిలో తమకు ఊపిరి ఆడుతుందో అని. చింటూ ఒక్కడే కాదు బంటి, మున్నా, చిన్ను.. ఇప్పుడు ఎంతో మంది పిల్లల జీవిత పుస్తకంలో బాల్యం పేజీ ఆటల్లేక రెపరెపలాడుతోంది పిల్లలకు కావల్సిన ఆటవస్తువులు అయితే కొనగలుగుతున్నారు. కానీ, వాటితో ఆ పిల్లలను ఫ్రీగా ఆడుకోవాల్సినంత మైదానాన్ని ఎలా ఇవ్వగలరు. గుడి బడి గుర్తుందా? చిన్నప్పుడు శ్రీరామ నవమికి పందిళ్లలో స్నేహితులతో తాగిన తియ్యటి పానకం గుర్తుందా? నానమ్మలు, అమ్మమ్మలు చెప్పిన దేవతలు, రాక్షసుల కథలు గుర్తున్నాయా? పరీక్షలప్పుడు పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికెళ్లి కొబ్బరికాయ కొట్టి ఫస్టు మార్కు రావాలని మొక్కుకోవడం జ్ఞాపకమేనా? టీవీలో చూసిన రామాయణం, మహాభారతం, బడిలో వ్యాస రచనకో, వక్తృత్వానికో బహుమతిగా ఇచ్చిన బొమ్మల భాగవతం, ధృవచరిత్ర, భక్త మార్కండేయ పుస్తకాల జ్ఞాపకాల పుటలు ఇప్పటికీ తెరుచుకునే ఉన్నాయా? సంపూర్ణ రామాయణం సినిమాలో సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తికెళ్లిపోయే సీను చూసి ఏడ్చిన జ్ఞాపకం ఇంకా పచ్చిగానే అనిపిస్తోంది కదా! దేవుళ్లకీ కష్టాలు తప్పవనీ, అయితే అవి ఎంతోకాలం ఉండవనీ, రాక్షసులు, దుర్మార్గులు చివరికి చావక తప్పదనీ పుస్తకాలలో చదివిన, సినిమాలలో చూసిన ఘట్టాలు గుర్తుండే ఉంటాయి కదా! కృష్ణాష్టమి వేడుకలలో ఉట్టి కొట్టడం, హనుమజ్జయంతికి ఉపవాసాలుండి కొబ్బరి కాయలు కొట్టి, బోలెడంత బలం వస్తుందని గట్టిగా నమ్మడం, ఆంజనేయస్వామి అంత మహాసముద్రం మీదుగా ఎగురుకుంటూ లంకకు చేరడం, తోకతో నిప్పంటించటం... ఇవన్నీ మన బాల్యజ్ఞాపకాలు కదా... అవి ఎంత బలాన్నిచ్చేవి. మానసికంగా ఎంత ధైర్యాన్ని నూరిపోసేవి! జబ్బు చేస్తే తగ్గిపోవాలని మొక్కుకోవడం, ఆ తర్వాత కుటుంబమంతా కలసి తిరుపతి కొండకో, అన్నవరానికో వెళ్లి మొక్కు తీర్చుకుని రావడం ఎంత చేదు, తీపి కలగలసిన జ్ఞాపకం? ఇప్పుడవన్నీ ఏవి? ప్రసాదం కోసం గుడికెళ్లడం, ప్రసాదంతోనే పొట్ట నింపుకోవడం, గణపతి నవరాత్రుళ్లలో భజన బృందాలతో గొంతు కలపడం, గుళ్లో పాడటం కోసం పొద్దున్నే లేచి త్యాగరాజు, అన్నమయ్య కృతులు సాధన చేయడం తలచుకుంటుంటే ఇప్పటికీ గొంతులోనుంచి తొంగి చూసే ఆ గమకాలను ఆపగలమా? మైకులో భగవద్గీత శ్లోకాలు పాడటం, పీర్ల పండుగప్పుడు స్నానాలు చేసి పీర్లు పట్టుకుని భక్తితో ఊగిపోతూ గుండాలు తొక్కుతుంటే కళ్లు ఇంతింత చేసుకుని చూడటం, రంజానుకు స్నేహితులు తెచ్చిన ఖీర్ తాగిన తియ్యటి జ్ఞాపకం, క్రిస్టమస్ పండక్కి భక్తిగీతాలు పాడటం, క్రిస్టమస్ ట్రీ తయారు చేయడం... ఇవన్నీ ఇప్పుడేమైనాయి? జ్వరం వచ్చినప్పుడు గుళ్లో పూజారిగారు నీకేం కాదురా, రేప్పొద్దుటికల్లా తగ్గిపోతుంది పో అంటూ విభూతి పెడితే తెల్లారేసరికి జ్వరం జారిపోవడం ఎంత నమ్మకం కలిగించేది? ఆధ్యాత్మికతలు ఎప్పుడూ మంచి భావనలనే పాదుకొల్పుతాయి. మన ప్రయత్నం మనం చేద్దాం.. ఆ తర్వాత అన్నిటినీ ఆ పై వాడున్నాడనే ధైర్యం ఓ టానిక్కు. చెయ్యరాని పనులు చేస్తే కళ్లు పోతాయి అనే భయం ఉంటే చెడ్డపనుల జోలికి పోతారా ఎవరైనా? బాల్యం నుంచి భక్తిగా, ఆధ్యాత్మిక వాతావరణంలో పదిమందితో కలిసి మెలిసి తిరిగితే అదెంత బలం? ఎంత ధైర్యం? బిట్టర్ చాక్లెట్ ‘‘ఎందుకలా ఉన్నావ్?’’ పన్నెండేళ్ల భూదేవి అడిగింది బాల సదన్ చూరు కింద అరుగు మీద దిగాలుగా కూర్చున్న ఆకాశ్తో. వాడికీ పదకొండు, పన్నెండేళ్లుంటాయేమో!‘‘ప్చ్.. ’’అన్నాడు నిర్లిప్తంగా చేతిలో ఉన్న రేపర్తియ్యని చాక్లెట్ను అటూఇటూ తిప్పుతూ.‘‘ప్చ్.. అంటే’’ అంది ఆకాశ్ పక్కనే కూర్చుంటూ. ‘‘ఏం లేదు’’అని తన పక్కనే కూర్చున్న ఆమెను అయోమయంగా చూస్తూ అన్నాడు.‘‘ఆ చాక్లెట్ ఎవరు ఇచ్చారు?’’ మళ్లీ ప్రశ్న భూదేవి నుంచి.‘‘కావాలా.. తీసుకో’’ అంటూ ఇవ్వబోతుంటే ‘‘నా దగ్గరా ఉంది..’’కుర్తీ జేబులోంచి తీస్తూ చూపించింది. ‘‘కొత్తగా జాయినయ్యావా? ఎవరు తీసుకొచ్చారు?’’ అడిగాడు ఆసక్తిగా.ఈసారి ఆ అమ్మాయి జవాబు చెప్పకుండా దిక్కులు చూసింది. ‘‘ఇప్పుడే కనిపిసున్నావైతే అడిగా.. ’’ ఆకాశ్. అయినా ఆమె నుంచి సమాధానం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆచాక్లెట్ను కుడిచేయి బొటనవేలు, నాలుగు వేళ్ల మధ్య ఉంచి ఆడిస్తోంది. ‘‘గర్ల్స్ అటువైపే ఉండాలి. సాయంత్రం ఆరు దాటితే ఇటు రాకూడదు’’చెప్పాడు ఆకాశ్.‘‘ఊ... తెలుసు. ఇందాక ఇటువైపు వస్తుంటే చెప్పారు.ఏడవుతోంది బాయ్స్ వైపు వెళ్లొద్దు అని’’అంది. ‘‘ఎందుకలా ఉన్నావ్?’’ మళ్లీ మొదటి ప్రశ్న భూదేవి నుంచి. ‘‘అమ్మ గుర్తొస్తోంది’’ గద్గదిక స్వరంతో ఆకాశ్. కాస్త చేరువగా జరిగి.. మోకాళ్ల మీద చేతులు కట్టుకున్నట్టుగా కూర్చున్న ఆకాశ్ భుజమ్మీద చేయి వేసింది భూదేవి అనునయంగా. ఆ స్పర్శ.. ఆలంబనకు ఆకాశ్ కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. మొహం అటువైపు తిప్పి ఆ వైపు భుజంతో కళ్లు తుడుచుకున్నాడు. వాడి పరిస్థితి అర్థమైంది అమ్మాయికి. ‘‘అమ్మ, నాన్న.. ’’ అంటూ ఆగింది. ‘‘అమ్మ చచ్చిపోయింది. నాన్నే చంపేశాడు. నాన్న జైల్లో ఉన్నాడు’’ దూరంగా ఆగిపోయిన నిర్మాణం ముందున్న ఇసుక కుప్పల వైపు చూస్తూ చెప్పాడు ఏ భావం లేకుండా!‘‘ఎప్పుడు?’’ అడిగింది వాడికి కొంచెం ఎడంగా జరుగుతూ. ఏంటీ ఎప్పుడు? అన్నట్టుగా చూశాడు. గ్రహించిన ఆమె ‘‘అమ్మ ఎప్పుడు చనిపోయింది అని’’ వివరంగా అడిగింది. ‘‘త్రీ ఇయర్స్ అవుతోంది’’ చెప్పాడు. ‘‘అప్పటి నుంచీ ఇక్కడే ఉన్నావా?’’ ఆ అమ్మాయి.మళ్లీ ‘‘ప్చ్’’ అంటూ అడ్డంగా తలూపాడు. ‘‘మరి’’ అన్నట్టు చూసింది. ఆరు చేతివేళ్లు చూపిస్తూ ‘‘సిక్స్ మంత్స్ అవుతోందంతే ఇక్కడికి వచ్చి. అంతకుముందు బాబాయ్ వాళ్లింట్లోనే ఉన్నాను. బాబాయే ఇక్కడ దింపి వెళ్లాడు’’చెప్పాడు. ‘‘కానీ.. కానీ’’ ఆగాడు. ‘‘ఏమైంది’’ అంటూ మళ్లా ఓరగా జరిగి ఆకాశ్ భుజమ్మీద చేయి వేసింది. ‘‘నాకు ఇక్కడ నచ్చట్లేదు. పారిపోవాలనిపిస్తోంది’’ ఈసారి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ‘‘ఒరేయ్ .. ఏడ్వకురా.. పర్లేదు. సర్దుకుంటుంది’’ అంటూ వాడి చేతిలోని చాక్లెట్ తీసుకుని రేపర్ విప్పి వాడికివ్వబోయింది. ‘‘ఛీ ..’’అంటూ విసిరికొట్టి అక్కడి నుంచి ముందుకు పరిగెత్తి బాదాం చెట్టు కింద ఆగాడు. హతాశురాలైంది భూదేవి. తనూ వాడి దగ్గరకు పరిగెత్తి.. ‘‘ఏమైందిరా’’ కంగారుగా అడిగింది. ‘‘అది వాడిచ్చిన చాక్లెట్. చేదు.. వాక్’’అన్నాడు వస్తున్న ఏడుపును ఆపుకొనే ప్రయత్నం చేస్తూ. ‘‘వాడెవడు?’’అడిగింది. ‘‘బాలసదన్ ప్రిన్సిపాల్ తమ్ముడు. నేనొచ్చినప్పటి నుంచీ... నన్ను.. ఆ ఇసుక తెన్నెల వైపు తీసుకెళ్లి.. నా బట్టలు.... ’’ చెప్పలేక ఆగిపోయాడు. ఏడుస్తూ నేల మీద పడిపోయాడు. ‘‘నాకు అమ్మ కావాలి అక్కా.. అమ్మ కావాలి. నేను నాన్న దగ్గరుండాలి’’ అంటూ.భూదేవి కళ్లల్లోనూ నీళ్లే. తన దగ్గరున్న చాక్లెట్ వంక చూసుకుంది. అలాంటి చాక్లెట్ ఇచ్చే.. ఆర్నెల్ల కిందట ఓ అంకుల్ తనను తీసుకెళ్లిపోయాడు. పుణే అట.. అక్కడ ఎవరో ఆంటీకి అమ్మేశాడు. ఈ ఆర్నెల్లు ఎందరో అంకుల్స్.. చాక్లెట్స్ ఇచ్చి.. నా బట్టలు కూడా.. ’’ భూదేవి మెదడు గతాన్ని గుర్తుచేస్తుంటే.. కళ్లు నీళ్లను కుమ్మరిస్తున్నాయి.. అసంకల్పితంగానే ఆ అమ్మాయీ ఆ చాక్లెట్ను విసిరి కొట్టింది. మోకాళ్ల మీద చేతులు కట్టుకున్నట్టుగా కూర్చున్న ఆకాశ్ భుజమ్మీద చేయి వేసింది భూదేవి అనునయంగా. చిట్టీ... కొట్టేది బట్టీ ‘‘మా బుజ్జిగాడు రోబోలోని చిట్టీ రా. ఎంత షార్ప్ గ్రాస్పింగ్ పవర్ తెల్సా? అలా చూస్తే ఇలా పట్టేస్తాడు. ఎప్పుడూ చదువే. ఆ చదువు తప్ప మరో లోకం తెలియదు’’ ఫ్రెండ్స్ ఇండ్లకు వెళ్లినప్పుడు వినిపించే మురిపెపు మాటలివి. అవి విన్నవాడికి తన కొడుకు గుర్తొస్తాడు. ఆ రోబోగాడెవడో కనీసం కళ్లతో స్కాన్ చేశాడు. కానీ నా కొడుక్కు ఇలా పుస్తకాన్ని టచ్ చేస్తే... అలా మెదడులోకి మెటీరియల్ పంపే ట్యుటోరియల్ ఏదైనా దొరికితే బాగుండని ఆశ.పే‘రెంట్స్’ అనే పేరున్నందువల్ల అవసరాలకనీ రెంట్స్ పే చేస్తూ చదువులకు బిల్స్ పే చేస్తున్నందున పే చేసేదానికి ఫలితం తప్పక రావాలన్నదే ఇప్పటి తల్లిదండ్రుల ఆశ. అందుకే వాళ్లు కార్పొరేట్స్కూళ్లూ, కాలేజీలలో బందీలయ్యారు. ఇంకా విపరిణామం ఏమిటంటే... నెక్ట్స్ ఇయర్ ఇంటర్లోకి వస్తున్న పేరెంట్స్ ఫోన్ నంబర్లు సంపాదించి, వాడి క్వార్టర్లీ ఎగ్జామ్స్ కంటే అర్లీగానే ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు చిన్ననాటి ఆటలు చదువులకు సాయం చేస్తున్నాయా లేదా చూద్దాం. గోడకేసి బంతి కొడుతూ ఆటాడినవాడికి న్యూటన్స్ థర్డ్లా చిన్నప్పుడే వచ్చేసి ఉంటుంది. గోలీలాడుతున్నప్పుడు గీసిన బాక్స్లో మనం గురి చూసిన గోలీని కొడితే... అసలది బయటకు వచ్చిన మన కొట్టుడుగోలీ అక్కడే కూర్చుండిపోయి మనం ఔటయ్యిన్నాడు ఉక్రోశం మాత్రమే ఉంటుందేమోగానీ... ఇంటర్కొచ్చాక మొమెంటమ్, ఫోర్సూ, డైరెక్షన్ అనే వెక్టార్స్ గురించి తెలిసిన నాడు అలనాటి ఉక్రోశం గుర్తొచ్చి ఉల్లాసం మిగులుతోంది. ఎప్పుడూ పదేళ్ల నాడు కాలేజీలో చదవబోయే అడ్వాన్స్డ్ చదువులన్నింటికీ అడ్వాన్స్గా గల్లీల్లో మనం ఆల్రెడీ ప్రాక్టికల్స్ చేసే ఉన్నామని తెలిసిపోతుంది. దాంతో చదువు గోలీలాటంత ఈజీ అవుతుంది. కాన్సెప్ట్ బుర్రలోకి గిల్లీదాండంత సిల్లీగా ఎక్కిపోయి సింపులవుతుంది. ఈలోపు మావాడు రోబో అంటూ స్వయానా ఆ తండ్రే చెబుతున్న మాటలు వింటుంటే... అదీ నిజమే కదా అని జాలేస్తుంది. సంస్కారం అడ్డొచ్చిగానీ... లేకపోతేనా ‘‘ఒరే పేరెంట్స్లారా... వాడు ఒక రకంగా నిజంగానే రోబో అవునో కాదో తెలియదు గానీ... వాడు మాత్రం కచ్చితంగా ఒరిజినల్లంత విలువ లేని కాపీలను సృష్టించే జిరాక్స్ మెషీన్ రా’’ అని అరవాలనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇంటర్లోకి వస్తున్న పేరెంట్స్ ఫోన్ నంబర్లు సంపాదించి ఫోన్లు చేస్తున్నారు. -
మళ్లీ ఐఏఎస్లు...!!
ఒకే నెలలో రెండుసార్లు ఐఏఎస్ల గురించి... ‘సేవ’ని అటకెక్కించిన అధికారులున్న నేపథ్యంలో తమిళనాడు తిరువణ్ణామలై కలెక్టరు కందసామి ఒక ఒయాసిస్సు. కలెక్టరుగా ఓ మామూలు కుటుంబానికి చేయూతనిచ్చి, స్వయంగా వంట చేసి, ఆర్డరు ఇచ్చి వచ్చారు. సేవకీ, పరిపాలనా దక్షతకీ ప్రతీకగా నిలిచే ఈ సర్వీసు బ్రిటిష్వారి పాలనలో మిగుల్చుకున్నది. అయితే ఆనాటి ఐసీఎస్ల ఆర్భాటం, హంగులు నెహ్రూగారికి నచ్చేవి కావని నెహ్రూ రక్షణాధికారి రుస్తుంజీ ‘ఐయాం నెహ్రూ షాడో’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. నాకు గత 65 సంవత్సరాలుగా ఈ ఆఫీసర్లు తెలుసు. నా పన్నెండో ఏట విశాఖకు జేపీగిల్ గ్విన్ గారు కలెక్టరుగా ఉండేవారు. సాయంకాలం సభకి బంగళా నుంచి రోడ్డు పక్క చేతులు వెనక్కు కట్టుకుని నడిచి రావడం నేను స్వయంగా చూశాను. నెహ్రూకీ, రాజేంద్రప్రసాద్కీ సెక్రటరీగా పనిచేసిన హెచ్వీఆర్ అయ్యంగా ర్ని చూశాను. ‘సురభి’ సంపాదకుడిగా ఆంధ్రాలో ఆఖరి ఐసీఎస్ వీకే రావుగారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన వయసిప్పుడు 104 సంవత్సరాలు. ఆయన కొడుకు, మేనల్లుడు ఐఏఎస్లు. వారి ఫొటో కోసం ముగ్గురు ఐఏఎస్లు కనీసం నాలుగేసిసార్లు నాకు ఫోన్లు చేసి సమకూర్చారు. ఇవాళ కలెక్టర్లు డవాలా బంట్రోతుల వెనుక మాయమవుతారు. వారు సాధారణంగా ఆకాశం నుంచి దిగి వస్తారు. మానవమాత్రులలో కలవరు. They lost their human facelong back. . అలనాటి చిత్తూరు కలెక్టరు బీకే రావుగారు– నాకు రచయితగా చేయూతనిస్తూనే జీవితంలో మనిషిగా పెద్ద రికాన్ని నష్టపోని ఉదాత్తతని నేర్పారు. నరేంద్ర లూథర్ మా నాటకంలో (వందేమాతరం) భాగంలాగా హైదరాబాదులో మాకు తోడుగా నిలిచారు. ఇంకా సీఎస్ శాస్త్రిగారు, జొన్నలగడ్డ రాంబాబుగారు వంటి అరుదైన అధికారులు ఆ పదవులకు వన్నె తెచ్చారు. వీపీ రామారావుగారు ఏకంగా నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. దయాచారిగారు నా నాటిక ‘కళ్లు’ ప్రదర్శించిన విషయాన్ని ఆనందంగా పంచుకున్నారు. కెవీ రమణాచారిగారు నా ‘దొంగగారొస్తున్నారు...’ నాటికలో ప్రధాన పాత్రని నటించారు. అభిరుచికి అగ్ర తాంబూలమిచ్చి, అధికారం అడ్డం పడకుండా పదవినీ, పరిచయాల్నీ నిలుపుకున్న పెద్దలు వీరు. ఈ గొడవంతా ఇప్పుడెందుకు? నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి– ముగ్గురు చీఫ్ సెక్రటరీలను (అరుణాచల్ప్రదేశ్, గోవా, ఆంధ్రప్రదేశ్) మూడు కారణాలకి– ఒకే రోజు నిలదీశారు. ఎందుకు? సరైన దుస్తులు వేసుకొని కోర్టుకి రానందుకు! ఒకాయన పాంటు, షర్టు దాని మీద పసుపు జాకెట్ వేసుకున్నారు. మరొకాయన పరిస్థితీ అలాంటిదే. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్గారు వారి వాంగ్మూలాన్ని వినడానికి నిరాకరించారు. కారణం– వారి దుస్తులు! ‘మీరు పిక్నిక్కి రాలేదు. మీమీ రాష్ట్రాలకు ప్రాధాన్యం వహిస్తూ వాజ్యాలను జరపడానికి వచ్చారు’ అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగారి కథ. పదవిలో ఉన్న రాష్ట్ర న్యాయమూర్తుల స్థాయిలోనే రిటైరైన న్యాయమూర్తులకు వైద్య సదుపాయాలు ఇస్తున్నారా? అన్నది వాజ్యం. ‘మేం అప్పుడే చేసేశాం సార్!’ అన్నారు చీఫ్ సెక్రటరీగారు. ‘ఏమిటి చేసేశారు?’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్న. ఈయన నీళ్లు నమిలారట. ‘మా ఆర్డర్లో రాష్ట్ర ప్రధాన అధికారి విషయాన్ని కూలంకషంగా తెలుసుకోకుండానే కోర్టుకి వచ్చారని తెలియజేస్తాం’ అన్నారు న్యాయమూర్తి. వీరు ఆయా రాష్ట్రాల ప్రతినిధులు, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో నిలిచిన ఆఫీసర్లు– కనీస మర్యాదల్ని పాటించకపోవడం, ఆ కారణంగా న్యాయమూర్తి విచారణ జరపడానికి తిరస్కరించడం ఈ తరం అధికారులు తెచ్చిపెట్టిన అపఖ్యాతి. అలనాటి ఐపీఎస్లను పాలనా దక్షతకి సలహాదారులుగా– మార్గదర్శకులుగా ఆనాటి నాయకులు భావించేవారట. ఐసీఎస్ సాధికారికమైన పాలనకు గీటురాయి. ఇది వీకే రావు గారు స్వయంగా చెప్పిన వైనం. నీలం సంజీవరెడ్డిగారి వంటి నాయకులు ఈ అధికారుల్ని నెత్తిన పెట్టుకునేవారట. అంతెందుకు? ఫొటో కోసం కూర్చున్న ఆ కాలపు ఐసీఎస్ వీకే రావుగారు 104 సంవత్సరాల మనిషి– బహుశా 45 సంవత్సరాల కిందట ఉద్యోగ ధర్మంగా వేసుకునే దుస్తుల్ని వేసుకుని కెమెరా ముందు కూర్చోవడం గమనార్హం. కొసమెరుపు: నాతో మాట్లాడిన ఒక ఐఏఎస్గారన్నారు: ‘మారుతీరావుగారూ! కోర్టులో వకాల్తాకి వచ్చిన అధికారులు ఫలానా దుస్తుల్లో ఉండాలన్న రూలు లేదు’ అని. అయితే ‘మర్యాద’కీ ‘రూలు’కీ చుక్కెదురు. కోర్టులో నిలవడం బాధ్యత. సాధికారికమైన దుస్తులు న్యాయస్థానం పట్ల అధికారులు చూపే మర్యాద. దీనికి రూలు పుస్తకం అనవసరం. వెరసి– నేటి ఐఏఎస్ల నిర్వాకమిది. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
నెహ్రూ విగ్రహాన్ని తొలగించిన యోగి
లక్నో : ఆనంద్ భవన్ సమీపంలో ఉన్న భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాది పార్టీ కార్యకర్తలు క్రేన్కు ఎదురుగా నిల్చోని నిరసన వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. దేశ ప్రథమ ప్రధానికిచ్చే కనీస మర్యాద ఇదేనా అంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాక యోగికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుందరీకరణ కోసం నెహ్రూ విగ్రహాన్నే మాత్రమే తొలగించారు, అదే వీధిలో ఉన్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. కానీ అధికారులు మాత్రం నెహ్రూ విగ్రహం తొలగింపు వెనక వేరే ఉద్దేశం లేదని తెలియజేశారు. వచ్చే ఏడాది జరగనున్న కుంభమేళా ఏర్పాట్లలో భాగంగానే నెహ్రూ విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చిందని అధికారులు తెలపారు. -
మూడుకోట్ల జనం పేరు
ఆయన గుండెల మీద తెల్లజాతి ప్రభుత్వం గురిపెట్టిన తుపాకీ పేలడానికి భయపడింది. కానీ స్వజాతి నాయకత్వం మాత్రం ఆయన గుండెలని పగలగొట్టాలని విశ్వ ప్రయత్నమే చేసింది. అయినా నమ్మినదే చేశారాయన. కుమిలిపోలేదు. విశ్వసించినదానినే గౌరవించారు. వైరాగ్యాన్ని దరి చేరనీయలేదు. తుది పైసా కూడా జాతి స్వేచ్ఛ కోసం అర్పించారు. తన కడుపులో పేగులు ఆకలితో గాండ్రిస్తున్నా వినిపించుకోకుండా, ప్రజల క్షుద్బాధనే పట్టించుకున్నారాయన. అందుకు, ఆయన ‘ఆంధ్రకేసరి’. కానీ, ఆయన అణువణువూ సింహమే, అన్నారు రాజాజీ. ఆయన ఏం చేసినా ఆంధ్రుల అభ్యుదయం కోసమే అన్నారు జవహర్లాల్. నిజమే, చరిత్రలో ఎక్కడో గాని తారసపడని ఓ కచ్చితమైన ప్రజల మనిషి. ఆయన– టంగుటూరి ప్రకాశంపంతులు. ఆంధ్రకేసరి జీవిత చరిత్ర మీద సింహావలోకనం చేసినా రోమాంచితం చేసే ఘట్టాలు కనిపిస్తాయి, అడుగడుగునా. ప్రకాశం (ఆగస్టు 23, 1872 – మే 20, 1957) చరిత్ర అంటే భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రే అనకపోవచ్చు. టంగుటూరి ఉద్యమం అంటే ఆంధ్రుల ఉద్యమ చరిత్ర అని కూడా అనకపోవచ్చు. కానీ ప్రకాశం అంటే... దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నట్టు ‘మూడుకోట్ల జనం పేరు’. అంటే నాటి ముక్కోటి ఆంధ్రుల హృదయ స్పందన. ఒంగోలు సమీపంలోని కనపర్తి అనే గ్రామంలో మేనమామల ఇంట ప్రకాశం పుట్టారు. తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి సుబ్బమ్మగారు. పూర్వీకులది టంగుటూరు. తరువాత ప్రకాశం గారి తాతగారు వల్లూరు వచ్చేశారు. కాబట్టి మాది వల్లూరే అని ప్రకాశం గారు రాసుకున్నారు. అద్దంకి, వినోదరాయుడిపాలెం, నాయుడుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరాలలో ప్రకాశం బాల్యం గడిచింది. ప్రాథమిక విద్య కూడా ఆ ప్రాంతాలలోనే జరిగింది. ప్రకాశం గారి జీవితంలో ఒంగోలు ప్రయాణం, అక్కడ నుంచి గోదావరి గట్టున రాజమహేంద్రవరానికి చేరుకోవడం ఆకస్మికంగా, నాటకీయంగా జరిగాయి. అవే ప్రకాశాన్ని తీర్చిదిద్దాయి. 1884లో గోపాలకృష్ణయ్య హఠాత్తుగా కన్నుమూశారు. దీనితో సుబ్బమ్మగారు ఒంగోలు చేరుకుని చిన్న భోజనశాలను ఏర్పాటు చేసింది. గోపాలకృష్ణయ్య మరణించేనాటికి సుబ్బమ్మగారు గర్భిణి. తండ్రి పోయిన తరువాత ఈ భూమ్మీద పడినవాడే జానకిరామయ్య. ప్రకాశం తమ్ముడు. ఆ నాలుగు మాసాల పురిటికందుతోనే, పచ్చి బాలింతగానే ఆమె ఒంగోలు వచ్చి దారుణమైన శ్రమకోర్చి ఆ చిన్న భోజనశాల నిర్వహించారు.అప్పటికి ప్రకాశం వయసు పన్నెండేళ్లు. ఒంగోలు పాఠశాలలో ఆనాటి ప్రధానోపాధ్యాయుడు బాగా చదివే పిల్లలను ఇంటికి రప్పించుకుని మరీ చదువు చెప్పేవారు. అలాంటి అవకాశం ప్రకాశంగారికి కూడా దక్కింది. అలా అని ప్రకాశం బుద్ధిమంతుడైన విద్యార్థి మాత్రం కాదు. ఒకవైపు పోకిరి పిల్లలతో కలసి అల్లరి. ఇంకోవైపు నాటకాలు. చిలిపి అల్లరి కాస్తా నేరాల స్థాయికి పోకుండా తనను కాపాడినవి నాటకాలేనని ప్రకాశంగారు భావించారు. నాటక పరిచయం ఒక కొత్త వెలుగును ఇచ్చింది. ప్రకాశం నిజ జీవితంలోకి ఒక గొప్ప పాత్రను ప్రవేశపెట్టింది రంగస్థలం. ఆయన మిడిల్ స్కూల్లో లెక్కల మాస్టారు.ఇంగ్లిష్, ఇంగ్లిష్ గ్రామర్ కూడా బాగా చెప్పేవారని ప్రతీతి. పేరు ఇమ్మానేని హనుమంతరావునాయుడు గారు. రాజమహేంద్రవరంలో మరో అంకం సాగడానికి కారకుడు కూడా నాయుడుగారే. నాయుడుగారు ముప్పయ్ రూపాయల జీతంతో పనిచేసే బతకలేని బడిపంతులే. ఆయనా, ప్రకాశం ఏ క్షణంలో కలుసుకున్నారో గాని, మానవ సంబంధాలలోనే అదొక మంచి ముహూర్తంగా చెప్పాలి. ఆయన శిష్యరికంలోనే ప్రకాశం మిడిల్ స్కూల్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. కానీ ఆ పరీక్షకు మూడు రూపాయల రుసుము చెల్లించాలి. ఇందుకోసం ఒంగోలుకి పాతికమైళ్ల దూరంలో ఉన్న బావగారింటికి నడిచి వెళ్లారు ప్రకాశం. కానీ బావ కూడా డబ్బు సర్దుబాటు చేయలేకపోయారు. చివరికి సుబ్బమ్మగారే తన పట్టుబట్టను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి కొడుక్కి ఇచ్చారు. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాక కొత్త సమస్య వచ్చింది. మిడిల్ స్కూల్ పరీక్ష ఉత్తీర్ణత మెట్రిక్తో సమానం. అందుకే, ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని బంధువుల నుంచి ఒత్తిడి వచ్చింది. అలా సుబ్బమ్మగారిని భోజనశాల పని నుంచి తప్పించాలన్నదే వారందరి కోరిక. కానీ ప్రకాశం జీవితాశయం న్యాయవాది కావడం. అదే చెప్పారు. ఆ తల్లి కూడా అందుకే మొగ్గారు. చదువు కొనసాగింది. ఆ సమయంలోనే హనుమంతరావునాయుడు తన భార్య కోరిన మీదట రాజమండ్రి యాత్రకు బయలుదేరారు. వారి వెంటే ప్రకాశం రాజమండ్రి వెళ్లారు. ఒంగోలు నుంచి బెజవాడ. అక్కడ నుంచి విజ్జేశ్వరానికి ఎడ్ల బండి. అక్కడ గోదావరి దాటి రాజమహేంద్రవర పట్టణ ప్రవేశం. మొత్తం పదిరోజులు. అనుకోకుండా నాయుడుగారు, ప్రకాశం గారు కూడా అక్కడ పాఠశాలలోనే చేరారు. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారితో పరిచయం ఆ గోదావరి తీరంలోనే జరిగింది. గయోపాఖ్యానం, పారిజాతాపహరణ నాటకాలు నాయుడుగారు, ప్రకాశం గారి కోసమే చిలకమర్తి రాశారు. గయోపాఖ్యానంలో గయుని పాత్ర నాయుడుగారిది.గయుని భార్యగా ప్రకాశం నటించారు. కానీ నాటకాలతో ప్రకాశం చదువుకు మంగళం పాడకుండా అందుకయ్యే ఖర్చంతా నాయుడుగారే భరించేవారు. మెట్రిక్యులేషన్ ఇక్కడే పూర్తి చేశారు.అప్పుడే రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చిన్న గుమాస్తా ఉద్యోగానికి దరఖాస్తు చేశారు ప్రకాశం. జీతం నెలకి పద్నాలుగు రూపాయలు. అంత చిన్న వయసులోనే ప్రకాశం గారి తల వంచని తత్వం ఎంతటిదో బయటపడింది. ఆ చిన్న కొలువుకీ అర్హత పరీక్ష అన్నారు. మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ ఉండగా మళ్లీ పరీక్ష ఏమిటి, ఈ ఉద్యోగం నాకు అక్కరలేదంటూ ప్రకాశం ఆ ఆఫీసుకి ఉత్తరం రాసి పడేశారు.అందుకే కాబోలు నాయుడుగారు ప్రకాశం గారిని రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్ఎలో చేర్పించారు. నాటక ప్రదర్శనలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రౌడీ గ్యాంగ్లతో పరిచయాలు పెరుగుతున్నాయి. ఆయన తొడగొట్టి అవతలి వాళ్లని చావగొట్టిన సంఘటనలు, వాళ్ల చేతిలో చావు దెబ్బలు తిన్న దుర్ఘటనలు కూడా జరిగిపోతున్నాయి. తన కంటూ ఒక గుంపును నిలబెట్టుకునే పనిలో బెస్తవాడలకి వెళ్లడం, వాళ్లు కల్లు తాగుతూ ఉంటే పక్కనే నిలబడడం వంటివి కూడా జరిగాయి. అవన్నీ ఎలా ఉన్నా తన ఆశయం – న్యాయవాది కావడం– గురించి ప్రకాశం మరచిపోలేదు. మద్రాస్ వెళ్లారు అందుకు. ఇదొక కొత్త అంకం. దీనికి తెర లేపిన వారు కూడా నాయుడుగారే. కొణితివాడ జమిందారు దగ్గర 90 రూపాయలు అప్పు చేసి శిష్యుడికి ఇచ్చారాయన. 1894 సంవత్సరంలో ప్రకాశం గారు రాజమండ్రి తిరిగి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించారు. మంచి పేరొచ్చింది. ఆ వెనుకే డబ్బు కూడా ఉరుకుతూ వచ్చింది. 1901లో రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యారాయన. కానీ మళ్లీ కొత్త కోరిక. చిన్న కోర్టులలో కాదు, పెద్ద కోర్టులలో, పెద్ద పెద్ద కేసులు వాదించాలి. అందుకు బారెట్లా అవ్వాలి. చాలా ప్రతిఘటనల మధ్య ఇంగ్లండ్ వెళ్లారు ప్రకాశం. లండన్ జీవితం, బారెట్లా చదువు ప్రకాశం గారికి ఒక కొత్త ఉషోదయాన్ని చూపించాయి. అంతవరకు ఆయన జీవిత గమనంలో కానరాని కొత్త కోణమది. ఈ పురాతన దేశం తనకు పడిన సంకెళ్ల బరువు, అవి తెచ్చిపెట్టిన న్యూనత ఎంత హీనమో, ఎంత అమానుషమో ఎలుగెత్తి ఘోషిçస్తున్న క్షణాలవి. జాతిలోని ఆ ఆక్రోశానికి పోరాట రూపం ఇస్తున్న స్వాతంత్య్రోద్యమ రూపశిల్పులతో యువ ప్రకాశానికి పరిచయం కలిగింది, అక్కడే.›అప్పుడే దాదాభాయ్ నౌరోజీ బ్రిటిష్ పార్లమెంట్కి పోటీ చేశారు. ప్రకాశం కూడా ప్రచారంలోకి దిగారు. ఇండియా సొసైటీతో పరిచయం ఏర్పడింది. భారత స్వాతంత్య్రోద్యమానికి విదేశాల నుంచి సాయం చేయడం, ఒక తరహా పోరాటాన్ని సమన్వయం చేయడం ఈ సొసైటీ ఉద్దేశం. అదే ‘ఇండియా’ పత్రికను కూడా వెలువరించేంది. సొసైటీ తరఫున గోపాలకృష్ణ గోఖలేని పిలిచి ఉపన్యాసం ఇప్పించారు.లాలా లజపతిరాయ్ని కూడా ప్రకాశం అక్కడే కలుసుకున్నారు. అందుకు వేదిక అయినది – శ్యాంజీ కృష్ణవర్మ నివాసం. ఈయన గదర్ వీరుడు. రమేశ్చంద్ర దత్తు, ఉమేశ్ చంద్ర బెనర్జీలు కూడా ప్రకాశం గారికి అక్కడే పరిచయమయ్యారు. బారెట్లా పూర్తి చేసిన తరువాత ఆయన మద్రాస్ హైకోర్టులో చేరారు. అక్కడ వద్దని ఎందరో నిరుత్సాహపరిచినా లెక్కచేయలేదు. పని చేసే చోటుతో కాదు, ఆ పని పట్ల ఉండే విశ్వాసం, అసలు మనిషికి ఉండవలసిన ఆత్మ విశ్వాసం విజయానికి సోపానాలవుతాయని ప్రకాశం భావించారు. అదే నిరూపించారు కూడా. న్యాయవాదిగా ఆయన ఎన్నోసార్లు న్యాయమూర్తులతో సంఘర్షణకు దిగారు. న్యాయమూర్తుల అవాంఛనీయ ధోరణులను విమర్శించడానికి ఆయన ‘లా టైమ్స్’ అన్న పత్రికను కూడా వెలువరించారు. భారతదేశంలో చిత్తరంజన్దాస్కు ఆరోజులలో యువతలో విశేషమైన ఆకర్షణ ఉండేది. ప్రకాశం కూడా ఆయనను ఎంతో అభిమానించారు. దగ్గరయ్యారు. ఇద్దరికీ మైత్రి ఏర్పడింది. ఒకసారి ఒక లక్షాధికారి కేసు కోసం బొంబాయి వెళ్లినప్పుడు పూనా కూడా Ðð ళ్లి బాలగంగాధర తిలక్ను ‘దర్శించుకుని’ వచ్చారు. అప్పుడే గోపాలకృష్ణ గోఖలే అతివాదిగా పేరొందిన తిలక్ను తీవ్రంగా వ్యతిరేకించేవారు. అయినా గోఖలే పట్ల తిలక్ చూపుతున్న మర్యాద ప్రకాశాన్ని పరవశుడిని చేసింది. అందుకు గోఖలే స్పందన ఏవగింపు కలిగించింది. తన జీవితంలో అన్నీ ఆకస్మిక ఘటనలే అని రాసుకున్నారు ప్రకాశం. 1907లో బిపిన్ చంద్రపాల్ మద్రాస్ వచ్చారు. తెలుగునాట కాకినాడ మొదలుకొని మద్రాసు వరకు ఆయన సాగించిన ప్రయాణం జాతీయవాద జైత్రయాత్రగా మారిపోయింది. మెరీనా బీచ్లో ఆయన సభకు అధ్యక్షత వహించడానికి అంతా భయపడుతున్న సమయంలో అప్పుడే ప్రాక్టీస్ ప్రారంభించిన ప్రకాశం ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కడు సాహసంతో ముందుకు వచ్చారు. తరువాత హోంరూల్ ఉద్యమంలో అనిబిసెంట్ వెంట నడిచారు. 1917 నాటి కలకత్తా సభలకు గాంధీతో పాటు ప్రకాశం కూడా పాల్గొన్నారు. అప్పటికి ఆయన ఏ మాత్రం వక్త కాదని తేల్చారు ప్రకాశం. కానీ జాతీయ కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలను ప్రచురించడానికి హిందూతో సహా పత్రికలన్నీ సహకరించలేకపోయేవి. అందుకే 1921లో ప్రకాశం స్వరాజ్య పత్రికను స్థాపించారు. 1927లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు జరిగిన ఘట్టం ప్రకాశం అంటే ఏమిటో భారతదేశానికి తెలిసే అవకాశం ఇచ్చింది. మద్రాస్ నగరంలోని పారిస్ కార్నర్ దగ్గర సైమన్ గోబ్యాక్ ఉద్యమకారుల మీద కాల్పులు జరిగాయి. ఒక భారీకాయుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడి దగ్గరకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేకపోయారు. అప్పుడే ప్రకాశం తెగించి ముందుకు వెళ్లారు. ‘మీరు బలవంతంగా వెళ్లదలిస్తే మేం కాల్చవలసి వస్తుంది’ అన్నాడు ఓ పోలీస్ ఆఫీసర్. అయితే అక్కడి గుంపులో ఉన్న ఒక మహమ్మదీయుడు ముందుకు వచ్చి, ‘ధైర్యం ఉంటే కాల్చు, మేమంతా కూడా సిద్ధంగానే ఉన్నాం.ఆయన ఎవరో నీకు తెలియదల్లే ఉంది.’ అన్నాడు. అక్కడితో ఆ ఆఫీసర్ జులం తగ్గింది. ప్రకాశం ఆ యోధుడి భౌతికకాయాన్ని చూసి, సమీపంలోనే ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ చీఫ్ మేజిస్ట్రేట్ను చూడ్డానికి వెళ్లారు. తరువాత గాంధీ పిలుపుననుసరించి (చాలా విషయాల్లో ఆయనతో విభేదించినా) లక్షలు ఆర్జించి పెడుతున్న న్యాయవాద వృత్తిని విడిచిపెట్టారు ప్రకాశం. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.అంతకు ముందే సెంట్రల్ లెజిస్టేటివ్ కౌన్సిల్కి ఎన్నికయ్యారు. ఏఐసిసి కార్యదర్శి అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజాజీ మత్రివర్గంలో రెవెన్యూ మంత్రి అయ్యారు. వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆయనే. కానీ అప్పటికే ఆయన తాను ఆర్జించిన సర్వం ప్రజలకు అర్పించేశారు. ఆయన దారిద్య్రం నుంచి వచ్చారు. ఈ పదవులు, ఆర్జనలు, హోదాలు ఒక భ్రమ అన్న రీతిలో తృణప్రాయంగా వదిలి పెటి మళ్లీ దారిద్య్రాన్ని ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు. చినిగిన దుస్తుల్లో, చిల్లులు పడ్డ శాలువతో, తిండిలేక డస్సిపోయిన ముఖంతో విజయవాడ వీధులలో, రాష్ట్రంలో అనేక చోట్ల ఆయనను చూసిన వారు ఆ దృశ్యాలను ఎప్పటికి మరచిపోలేకపోయారు. తల్లి సుబ్బమ్మగారు అంతిమక్షణాలలో కొడుకును పిలిచింది. ఒక చిన్న మూటను అప్పగించింది. ఎనిమిది వందల రూపాయలున్నాయి అందులో. ఆమె కష్టార్జితం. ‘తన అంత్యక్రియలకి’ అని చెప్పారావిడ. కన్నతల్లి రుణాన్ని తీర్చుకునే అవకాశం కూడా నాకు మా అమ్మ ఇవ్వలేదు అని విలపించారాయన. అయినా, దేశమాత రుణాన్ని ప్రకాశం గారు తీర్చుకున్న తీరు ఎప్పటికీ ఒక అద్భుతం. - డా. గోపరాజు నారాయణరావు -
నా వ్యాఖ్యల్లో తప్పుంటే క్షమించండి
సాక్షి, బెంగళూరు: భారత తొలి ప్రధాని నెహ్రూ స్వార్థపరుడంటూ చేసిన వ్యాఖ్యలపై టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా క్షమాపణ చెప్పారు. మహ్మద్ అలీ జిన్నాను ప్రధాని చేయడానికి గాంధీ అనుకూలంగా ఉన్నా, నెహ్రూ స్వార్థపూరితంగా ఆలోచించారని బుధవారం దలైలామా అన్నారు. గాంధీ కోరుకున్నట్లు జిన్నా ప్రధాని అయ్యుంటే దేశ విభజన జరిగేది కాదన్నారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో క్షమాపణ చెప్పారు. ‘నేనేదైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. గాంధీ దేశ విభజనను వ్యతిరేకించారని విని నమ్మలేకపోయా. పాక్ కన్నా భారత్లో ముస్లింల జనాభా ఎక్కువ. గడిచిందేదో గడిచిపోయింది’ అని శుక్రవారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో అన్నారు. పాక్, భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దురదృష్టకరమని, భారత్ ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ సమస్య పరిష్కారానికి చొరవచూపాలన్నారు. తమ మాతృభూమి నుంచి వేలాదిగా వలసొచ్చిన టిబెటన్లను అక్కున చేర్చుకుని సొంత మనుషుల్లా చూస్తున్నందుకు భారత్ కృతజ్ఞతలు తెలిపారు. టిబెటన్ల సంస్కృతి పరిరక్షణకు నెహ్రూ ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం కుమారస్వామి పాల్గొన్నారు. -
దళితుల ద్రోహి నెహ్రూ కుటుంబమే: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని అత్యధిక కాలం పాలిం చిన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీయే దళిత ద్రోహి అని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు. దళితుల సంక్షేమం విషయంలో బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఆ చరిత్ర తెలుసుకోవాలన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో దళితులపై జరిగిన దాడులు ఎన్నడూ జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, వేధింపుల నిరోధక సవరణ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించిన మోదీ ప్రభుత్వాన్ని దళితుల సంక్షేమంపై ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర సచి వాలయం నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ సానుకూలంగా ఉందని చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు ఆదేశాల్విండి.. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలను తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక కోరింది. దత్తాత్రేయ ఆధ్వర్యంలో వేదిక ప్రతినిధులు కృష్ణ, ప్రభాకర్రెడ్డి, సరోజ తదితరులు కేంద్ర మంత్రిని కలసి ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదని, అధికారాల బదలాయింపు కూడా జరగడం లేదని వివరించారు. -
‘ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వంటి వ్యక్తులే తప్పులు చేశారన్న తన వ్యాఖ్యల్లో ఎదైనా తప్పు ఉంటే తనని క్షమించాలని టిబెట్ బౌద్ధ గురువు దలైలామా కోరారు. ప్రతీ ఒక్కరు జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పుచేస్తారని, నెహ్రూ వంటి వ్యక్తులే తప్పులు చేశారని ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలు ఉద్దేశ పూరితంగా చేసినవి కావని, ఏమైనా తప్పుంటే తనని క్షమించాలని శుక్రవారం ట్వీట్ చేశారు. గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇటీవల దలైలామా మాట్లాడుతూ.. దేశ తొలి ప్రధానిగా మహ్మద్ అలీ జిన్నాను చేయాలని మహాత్మ గాంధీ భావించారని, దానిని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారని దలైలామా పేర్కొన్నారు. దేశ ప్రధానిగా తనకు అవకాశం ఇవ్వాలని నెహ్రూ పట్టుబట్టినట్లు కూడా ఆయన తెలిపారు. మహ్మద్ అలీ జిన్నాను గనుక ప్రధాని చేసి ఉంటే అవిభాజ్య భారత్ ముక్కలైయ్యేది కాదని దలైలామా ఇటీవల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దలైలామా వ్యాఖ్యలపై బీజేపీ-కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో దలైలామా క్షమాపణలు కోరారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవమైనవని, గాంధీ మొదటి నుంచి జిన్నాను ప్రధాని చేయాలని ప్రయత్నించారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. నెహ్రూ కేవలం తన సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారన్న వ్యాఖ్యలు నిజమైనవని, ఇలాంటి చారిత్రాత్మక విషాయాలపై మరింత లోతుగా చర్చ జరగాల్సిన అవసరముందని స్వామి తెలిపారు. My statement has created controversy, if I said something wrong I apologise: Dalai Lama on his statement, "Mahatma Gandhi ji was very much willing to give Prime Ministership to Jinnah but Pandit Nehru refused." pic.twitter.com/jjIEmc280E — ANI (@ANI) August 10, 2018 -
‘పటేల్ను నెహ్రూ ఆడ్డుకున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి (అంతరిక్ష వ్యవహారాల శాఖ ఇన్ఛార్జి) జితేంద్ర సింగ్ స్పందించారు. కశ్మీర్కు బదులుగా హైదరాబాద్ను పాకిస్తాన్కు ఇచ్చేందుకు తొలి హోంమంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్ పాక్కు ఆఫర్ చేశారని సైఫుద్దీన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జితేంద్ర సింగ్.. కశ్మీర్ విషయంలో పటేల్ జోక్యం చేసుకుని ఉంటే ఈ రోజు భారతదేశ చర్రిత మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. కశ్మీర్పై పటేల్ జోక్యం చేసుకోకుండా ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నియంత్రించారని, లేకపోతే కశ్మీర్ సమస్యకు అప్పడే శాస్వత పరిష్కారం ఏర్పడేదని పేర్కొన్నారు. హోంమంత్రి స్థానంలో ఉన్నా పటేల్ను ప్రధాని నెహ్రూ నిలువరించారని, కశ్మీర్పై నెహ్రూ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కశ్మీర్ సమస్య ఏర్పడిందని తెలిపారు. పటేల్ చర్యల కారణంగానే హైదరాబాద్ సంస్థానం విలీనం జరిగిందని, కశ్మీర్ సమస్య కూడా ఆనాడే ముగిసిపోయి ఉండేదని అన్నారు. ప్రస్తుత కశ్మీర్లో పాకిస్తాన్ భాగంగా ఉందని అది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. -
నిజానికి టోపీ వేశారు..
ఇటీవల ఆరెస్సెస్ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరై ప్రసంగించిన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ నేపథ్యంలో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా గతంలో ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరైనట్లు ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. ఈ ఫొటో 1939లో ఉత్తరప్రదేశ్లోని నైనీ అనే ప్రాంతంలో తీశారు. మరి నెహ్రూ వేసుకున్న దుస్తులు అచ్చు ఆరెస్సెస్ యూనిఫాం మాదిరిగానే ఉంది కదా అని అనుకుంటున్నారా.. అయితే ఇది కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన సేవాదళ్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తీసిన ఫొటో. ఆరెస్సెస్ యూనిఫాం కూడా ఖాకీ నిక్కరు, తెలుపు చొక్కానే. అయితే టోపీ నల్లగా ఉంటుంది. ఈ ఫొటోలో నెహ్రూ పెట్టుకున్న టోపీ తెలుపు రంగులో ఉంది గమనించారా. ఇది అప్పట్లో కాంగ్రెస్ సేవాదళ్ యూనిఫాం. దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తీసిన చిత్రాన్ని.. ఇలా తప్పుగా సోషల్ మీడియాలో ప్రచారంలోకి పెట్టారు. -
ప్రజాస్వామ్య బలోపేతానికి నెహ్రూ కృషి: ప్రణబ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య బలోపేతానికి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పట్లోనే పునాది వేశారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. నెహ్రూ జీవిత చరిత్రపై తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎ.గోపన్న రాసిన ‘జవహర్లాల్ నెహ్రూ–యాన్ ఇల్యుస్ట్రేటెడ్ బయోగ్రఫీ’ పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలకు తొలి ప్రతులను అందజేశారు. ఈ పుస్తకానికి ముందుమాటను ప్రణబ్ రాశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నెహ్రూ గురించి ఆధ్యయనం, పరిశీలన భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని, వంద కోట్ల జనాభాను నడిపించగల ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్మించాలన్న సంకల్పంతో ఆయన అప్పట్లోనే విశేష కృషి చేశారని, ఫలితంగా ఆధునిక ప్రజాస్వామ్య దార్శనికుడిగా నిలిచారని కొనియాడారు. దేశంలో భిన్న మతాలు, భాషలు ఉన్నా భారతీయులంతా ఒకటే అన్న స్ఫూర్తి కలిగేలా ప్రజాస్వామ్య వ్యవస్థల ఏర్పాటుకు నెహ్రూ కృషిచేశారని కీర్తించారు. నెహ్రూ జీవిత చరిత్రపై గోపన్న రాసిన పుస్తకాన్ని అభినందిస్తూ సోనియా గాంధీ సందేశం పంపారు. అంతకుముందు, నెహ్రూ 54వ వర్ధం తి సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ, అన్సారీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు యమునా నది ఒడ్డున ఉన్న శాంతివన్ నెహ్రూ స్మారకం వద్ద నివాళులర్పించారు. ‘భార త తొలి ప్రధాని నెహ్రూకు ఘన నివాళులు’ అం టూ ప్రధాని మోదీ ట్విటర్లో పోస్టు చేశారు. -
తొలి ప్రధాని నెహ్రూకు ఘన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 54వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళి అర్పించారు. ఢిల్లీలోని శాంతి వనంలో నెహ్రూ సమాధి వద్ద రాహుల్ గాంధీ పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశ తొలి ప్రధాని పడింట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళు అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ శాంతి వనంలో నెహ్రూకి నివాళి అర్పించారు. నెహ్రూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి జాతీయోద్యమంలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. తండ్రి మోతీలాల్ నెహ్రూ వారసుడిగా 1929లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా మొదటిసారి ఎన్నికయ్యారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ తొలి ప్రధానిగా ఎన్నికై దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం ఏర్పరచడంలో కీలక పాత్ర పోషించారు. -
‘తప్పు’లో కాలేసిన నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను విమర్శించడమన్నా, భారత సైన్యాన్ని పొగడడమన్నా మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎంతో ఇష్టం. ఇక ఈ రెండు విషయాలను కలిపి మాట్లాడటమంటే మరీ మరీ ఇష్టం. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో గురువారం నాడు ఆయన తన ఈ ఇష్టాన్ని ప్రదర్శించబోయి అనుకోని కష్టాలు తెచ్చుకున్నారు. కర్ణాటక అంటేనే ధైర్య సాహసాలకు మారుపేరని, అలాంటి కర్ణాటక గడ్డపై పుట్టి, 1948లో పాకిస్థాన్ను ఓడించిన యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఫీల్డ్ మార్షల్ కరియప్ప, భారత సైనిక కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ తిమ్మయ్యలను ప్రధాన మంత్రి నెహ్రూ అవమానించారని, అప్పటి రక్షణ మంత్రి కృష్ణన్ మీనన్ను కూడా నెహ్రూ విమర్శించారని మోదీ పేర్కొన్నారు. కరియప్ప, తిమ్మయ్యలను కర్ణాటక బిడ్డలనడంలో ఎలాంటి పొరపాటు లేదు. కానీ 1948లో జనరల్ కేఎస్ తిమ్మయ్య భారత సైనిక కమాండర్ ఇన్ చీఫ్గా లేరు. అప్పటి బ్రిటీష్ సైనికాధికారి రాయ్ బుచర్ కమాండర్ ఇన్ చీఫ్గా వ్యవహరించారు. ఆ తర్వాత ఏడాదికి అంటే, 1949లో భారత సైన్యం కమాండర్ ఇన్ చీఫ్ పదవిని అప్పగించారు. అదీ నరేంద్ర మోదీ చెప్పినట్లుగా జనరల్ తిమ్మయ్యకు కాదు, కేఎం కరియప్పకు అప్పగించారు. కరియప్పతో నెహ్రూ ఘర్షణ పడ్డమాట వాస్తవమే! అది మోదీ చెప్పినట్లు 1948లో కాదు, 1951లో. రాజకీయ అంశాలపై బహిరంగంగా తన అభిప్రాయాలను వెల్లడించినందుకు కరియప్పపై మండిపడిన నెహ్రూ ఆయన్ని ఆస్ట్రేలియాకు హై కమిషనర్గా పంపించారు. అలాగే నరేంద్ర మోదీ చెప్పినట్లుగా 1948లో భారత రక్షణ మంత్రిగా కృష్ణ మీనన్ లేరు. అప్పుడు తొలి భారత రక్షణ మంత్రిగా బల్దేవ్ సింగ్ ఉన్నారు. 1952 వరకు ఆయన అదే పదవిలో కొనసాగారు. ఇంతకు తిమ్మయ్య ఎవరు? కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలో జన్నించిన జనరల్ కేఎస్ తిమ్మయ్య 1957 నుంచి 1961 వరకు భారత ఆర్మీ చీఫ్గా పనిచేశారు. 1957, డిసెంబర్ నెలలోనే కృష్ణన్ మీనన్ కూడా రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తిమ్మయ్య, మీనన్లతోని నెహ్రూ గొడవ పడ్డారని మోదీ చెప్పడం కొంత మేరకే నిజం. వాస్తవానికి వీరు ముగ్గురు పరస్పరం విభేదించారు. అది కూడా మోదీ అనుకున్నట్లు 1948లో పాక్తో యుద్ధం ముగిశాక కాదు. 1959లో. సైన్యంపై పౌర అధికార యంత్రాంగం ఉండరాదన్నది మొదటి నుంచి జనరల్ తిమ్మయ్య వాదన. అంటే రక్షణ మంత్రి కూడా సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దన్నది ఆయన ఉద్దేశం. దీన్ని కృష్ణన్ మీనన్ వ్యతిరేకించారు. మరో పక్క అమెరికా లాబీకి లొంగరాదంటూ కృష్ణన్ మీనన్ నెహ్రూపై ఒత్తిడి చేశారు. ఆ సమయంలో చైనాతో భారత్కు సరిహద్దు గొడవ నడుస్తోంది. అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ భారత్, పాక్ దేశాల మధ్య సంయుక్త రక్షణ ఒప్పందం గురించి ప్రతిపాదన తీసుకొచ్చారు. దీన్ని ఆమోదించాలంటూ జనరల్ తిమ్మయ్య వాదించారు. దీన్ని మీనన్, నెహ్రూలు విభేదించడంతో తిమ్మయ్య రాజీనామా చేస్తానంటూ నెహ్రూకు ఓ లేఖ రాశారు. ఆ తర్వాత ఆయన 1961లో తన పదవికి రాజీనామా చేశారు. చైనాతో సరిహద్దు సంక్షోభం ఉన్న సమయంలో పదవి నుంచి తప్పుకోవడం ఏమిటంటూ ఈ విషయాన్ని నెహ్రూ పార్లమెంట్లో ప్రస్థావించారు. ఈ ముగ్గురు మధ్య తలెత్తిన వివాదాల కారణంగానే 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయిందన్నది చరిత్రకారుల విశ్లేషణ. మోదీ చారిత్రక అంశాలను ప్రస్తావించినప్పుడల్లా అందులో తప్పులే ఉంటున్నాయి. ఆవేశంగా మాట్లాడడంలో ఆయన అసలు విషయాలు మరచిపోతారా? ఎప్పుడో చదువుకున్న చారిత్రక అంశాలు మరచిపోయి ఉంటారా? స్క్రిప్టు రైటర్లు ఇచ్చే కాగితాలను ఆదరాబాదరాగా చదువుకోవడం వల్ల ఇలా జరుగుతుందా? ఆయనకే తెలియాలి! -
ఇదేందయ్యా ఇది?
సాక్షి, న్యూఢిల్లీ ; గూగుల్లో చోటు చేసుకున్న ఓ తప్పిదంపై సెటైర్లు పేలుతున్నాయి. భారత దేశ తొలి ప్రధాని ఎవరు అన్న సమాధానానికి నెహ్రూకి సంబంధించిన సమాచారం రాగా.. ఫోటో మాత్రం నరేంద్ర మోదీది ప్రత్యక్షం కావటంతో చాలా మంది కంగుతున్నారు. అయితే అది వైరల్ కావటం.. అదే సమయంలో విమర్శలకు దారితీయటం జరిగింది. దీంతో పొరపాటున గమనించిన గూగుల్.. ఆ తప్పిదాన్ని సరిచేసుకుంది. ఇక ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ప్రతినిధి దివ్య స్పందన స్పందించారు. గూగుల్ ఇండియా.. ఏ ప్రతిపాదికన ఇలా చేశారు? అంటూ ఆమె ట్వీట్లో మండిపడ్డారు. మరోవైపు ప్రముఖ జాతీయ ఛానెళ్లలో కూడా ఈ తప్పిదంపై కథనాలు ప్రసారం అయ్యాయి. మరికొందరు సోషల్ మీడియాలో దీనిని ట్రోల్ చేస్తూ గూగుల్పై సెటైర్లు వేస్తున్నారు. .@Google @GoogleIndia what algorithm of yours allows this?! You’re so full of junk- pic.twitter.com/GHyxh3fEWm — Divya Spandana/Ramya (@divyaspandana) 25 April 2018 When we search "India first PM" on Google, Narendra Modi image appears. Why? — I_am (@thenagawalrus) 25 April 2018 Surprised seeing the result of Ist PM pic in google search as "India first PM" @narendramodi @akashbanerjee @atanubhuyan @tulika_devi @pranaybordoloi #IndiafirstPM #google pic.twitter.com/5uhnLlTlJc — Afrida Hussain (@afrida786) 25 April 2018 -
దీవికీ, దేశానికీ మధ్య ‘సౌహార్దం’
ఆదిత్య హృదయం ఈరోజు సాధారణమైన ఈస్టర్ ఆది వారం కాదని మీలో ఎంతమందికి తెలుసు? శతాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురై ప్రపంచం మర్చిపోయిన మధ్యధరా ప్రాంత దీవి జాంటే నేడు తన స్వాతంత్య్రాన్ని పొందనుంది. ఆ దీవితో భారత్కు ఉన్న విశిష్టమైన అనుబంధం కారణంగా మూడు వారాల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ జాంటే రాజధాని మిస్ట్రాలినోను సందర్శిస్తున్న తొలి భారత ప్రభుత్వాధినేత కానున్నారు. ఇది జాంటియన్ స్వాతంత్య్రానికి అంతర్జాతీయ గుర్తింపునిచ్చే ఘటన కానుంది. జాంటే చరిత్ర అసంపూర్ణమైనదే కానీ ఆసక్తిని కలిగిస్తుంది. జాంటే పేరు చరిత్రలో తొలిసారిగా 480 బీసీలో థెర్మోపైలే యుద్ధకాలంలో నమోదైంది. లియోనిడిస్ రాజు నేతృత్వంలోని స్పార్టన్స్ పర్షియన్ చక్రవర్తి జెరెక్స్ ది ఫస్ట్ను ఓడించిన సందర్భం అది. ఒకానొక పెనుతుఫాను సమయంలో స్పార్టన్ నావికా బలగం జాంటెయన్ జలాల్లో విడిది చేయాలని ప్రయత్నించింది. ఆ సందర్భంగా కొంతమంది స్పార్టన్ నావికా దళసభ్యులు జాంటేలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరిలో ఒకరు హెలెన్ ఆఫ్ ట్రాయ్ మనవడు అని చెబుతున్నారు. అయోనియన్ ప్రశాంత జలాల్లో నెలకొన్న ఈ చిన్న సుందరదీవి అనంతరం 2 వేల సంవత్సరాల పాటు గ్రీస్లో అంతర్భాగంగా ఉండిపోయింది. కానీ 16వ శతాబ్దం మొదట్లో ఇది మళ్లీ మరొకరి అదీనంలోకి వెళ్లిపోయింది. ఈసారి వెనీస్ పట్టణాధిపతి జాంటేపై ఆధిపత్యాన్ని ప్రకటించుకున్నాడు. తర్వాత జాంటే విస్తరిస్తున్న వెనిస్ నగరరాజ్య వాణిజ్యానికి సరుకుల గిడ్డంగిలా మారి పోయింది. ఈ అధికార మార్పిడిని సూచిస్తూ సాంస్కృతిక పునరుజ్జీవన కాలపు అద్భుత చిత్రకారుడు మిస్ట్రాలినో కొన్ని గొప్ప చిత్రాలు గీశారు. అలాగే గ్రీక్కి బదులుగా ఇటాలియన్ జాంటే అధికార భాష అయిపోయింది. పందొమ్మిదో శతాబ్దం మధ్యలో రాజకీయ గందరగోళపు సంవత్సరాల్లో గిసెప్పె గారిబాల్డీ ఇటలీని ఐక్యపర్చడానికి ముందు, జాంటే వెనీషియన్ అజమాయిషీ నుంచి బయటపడి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పడింది. దాని నూతన పాలకులు ఒక బిషప్, ఒక సాహసికుడు కావడం వింతగొలుపుతుంది. వీళ్లెవరంటే అలెగ్రా బిషప్, పొరుగున ఉన్న ప్రిన్సిపీ స్వయంప్రకటిత అధికారి. ఇక్కడ అభాస ఏమిటంటే, ఈ అస్తవ్యస్త పాలనా వ్యవహారాలే జాంటేకి సరిగ్గా అవసరమైనట్లుంది. ఈ బిషప్, ఈ సాహసికుడు ఇద్దరూ జాంటే తమ సొంతం అనే విషయం త్వరలోనే మర్చిపోయారు. వీరి నిర్లక్ష్యంతో మిస్ట్రాలినోలోని కాన్సిగ్లియారి కౌన్సిల్ ఈ దీవిపై స్వయంపాలనను ప్రకటించుకుంది. తర్వాత 150 ఏళ్లపాటు జాంటియన్ వైన్, పుచ్చకాయలు జాంటే కీలక ఎగుమతులుగా స్థానం సంపాదించుకున్నాయి. స్థానిక జానపద నృత్యరూపమైన సిర్తకి జాంటే ద్వీపంలో ప్రముఖ వినోద కార్యక్రమంగా మారింది. ఈ విస్మృత ద్వీపం సుదీర్ఘ కాలం స్తబ్దుగా ఉండిపోయినప్పటికీ బాగా సంపద్వంతంగా మారిందన్న విషయం తరచుగా మర్చిపోతుంటారు. సంపద పెరుగుతున్నందున ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఆ తర్వాత హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో చదువుతున్న అతి పెద్ద విదేశీ విద్యార్థుల బృందంగా జాంటియన్లే గుర్తింపు పొందారు. ఈరోజు ఈ ద్వీపం సంపూర్ణంగా ద్విభాషా ద్వీపంగా మారిపోయింది. ఇక్కడ బ్రిటిష్, అమెరికన్ యాసలు రెండింటితో పాటు ఇటాలియన్ సాధారణ భాషగా ఉనికిలో ఉంటోంది. బహుశా యువ జవహర్లాల్ నెహ్రూ కేంబ్రిడ్జ్, ఇన్నర్ టెంపుల్లో చదువుకున్న కాలంలో జాంటేని విడిదిగా మార్చుకున్నది ఇందుకోసమే కావచ్చు. హారోలో ఉంటున్నప్పుడు నెహ్రూ టీచర్ జాంటియన్ ప్రాంతానికి చెందినవాడని చెబుతుంటారు కానీ ఇది సందేహాస్పదమే కావచ్చు. వాస్తవం ఏమిటంటే, మిస్ట్రాలినో నడిబొడ్డులో గుర్రపుస్వారీ చేస్తున్నట్లు ఉండే 20 ఏళ్ల యువ జవహర్లాల్ శిలా విగ్రహం కనిపిస్తూ ఆసక్తి గొలుపుతుంటుంది. ఇక్కడ నెహ్రూ బసచేసిన చిన్న బోర్డింగ్ హౌస్లో తన పేరు ఉన్న నీలి ఫలకం ఇప్పటికీ కనిపిస్తుంది. స్థానికులు దీన్ని నేటికీ ‘నెరూ హౌస్’ అని యాసతో పిలుస్తుంటారు. ఇప్పుడు కాన్సిగ్లియారి కౌన్సిల్, భారత స్వాతంత్య్రానంతరం తొలిసారి తమ దేశంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీని ఆహ్వానించినప్పుడు ప్రధాని సంతోషంగా అంగీకరించారు. నిస్సందేహంగా ఈ ఔదార్యం గాంధీలతో ప్రధాని సంబంధాలపై ప్రభావాన్ని చూపుతుంది కూడా. ఈలోగా, జాంటెయన్ సాయుధపోలీసులు మన ‘జనగణమన’ను అభ్యసించడంలో బిజీగా ఉన్నారు. నేడు జాంటే ద్వీపం దానికే ప్రత్యేకమైన ఊదా, హరిత వర్ణాలతో శోభాయమానంగా అలంకృతమవుతున్న ఈ సందర్భంలో, స్వాతంత్య్రం పొందుతున్న జాంటే ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను. మీకందరికీ మాత్రం హ్యాపీ ‘ఏప్రిల్ ఫూల్స్’ డే మరి! - కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
దేశ విభజనకు కారణం నెహ్రూనే
జమ్ము: దేశ విభజన అంశంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ విభజనకు జవహర్లానెహ్రూనే కారణమని ఆరోపించారు. శనివారం జమ్మూలోని షేర్–ఇ–కశ్మీర్ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘దేశ విభజనకు మహ్మద్ అలీ జిన్నా కారణం కాదు.. అప్పటి జాతీయ నేతలు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్లే కారణం. ముస్లింలకు మైనారిటీ హోదా ఇచ్చేందుకు ఈ ముగ్గురు నేతలు అంగీకరించకపోవటమే విభజనకు దారి తీసింది. మొదట్లో జిన్నా పాకిస్తాన్ కావాలని అడగలేదు. ముస్లింలకు, సిక్కులకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించటంతో ప్రత్యేక దేశం డిమాండ్ వైపు జిన్నా మొగ్గు చూపటానికి దారి తీసిందని నేను భావిస్తున్నాను. లేకుంటే దేశం విడిపోయేది కాదు..బంగ్లాదేశ్, పాకిస్తాన్లు ఉండేవికావు, భారత్ మాత్రమే ఉండేది’ అని తెలిపారు. మతాన్ని రాజకీయాల్లో వాడుకోవటాన్ని ఆయన ఖండించారు. మతం ఆధారంగా దేశాన్ని విభజించవద్దని ఆయన బీజేపీని కోరారు. ఇది దేశ అభివృద్ధికి, ఐక్యతకు, శాంతికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. దేశ విభజనకు కారకులెవరనే అంశంపై గత కొన్నేళ్లుగా సర్వత్రా చర్చ సాగుతోంది. పాకిస్తాన్ విడిపోవటానికి నెహ్రూ కారణమని కొందరు.. కాదు, జిన్నానే కారణమని మరికొందరు వాదిస్తున్నారు. -
దేశ విభజనకు నెహ్రూనే కారణం
-
గాంధీ, నెహ్రూల ఖాతాలున్న బ్యాంక్కే కన్నం..
సాక్షి, న్యూఢిల్లీ : ఎంతో ఘన చరిత్ర కలిగిన ‘పంజాబ్ నేషనల్ బ్యాంక్’ పరువు ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కారణంగా నేడు నీట మునిగింది. దాదాపు 123 ఏళ్ల క్రితం, అంటే భారత్కు స్వాతంత్య్రం రాకముందే 1895లో పాకిస్థాన్లోని లాహోర్ కేంద్రంగా ఈ బ్యాంక్ ఆవిర్భవించింది. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు లాలా లజ్పతి రాయ్ ఈ బ్యాంకును ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్యసమాజ్ సభ్యుడైన ఓ మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు ‘ఇండియన్ మనీ, ఇండియన్ మెన్’ అనే నినాదంతో ఈ బ్యాంకు ఏర్పాటుకు రాయ్ కృషి చేశారు. 1894, మే నెలలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవస్థాపక బాడీ ఏర్పాటయింది. అప్పటికీ పంజాబ్ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన లాలా హరికిషన్ లాల్, ‘ది ట్రిబ్యున్’ ఆంగ్ల దినపత్రిక వ్యవస్థాపక సభ్యుడు దయాల్ సింగ్ మజీతియాలు ఆ బాడీలో ఉన్నారు. రెండు లక్షల రూపాయల పెట్టుబడి, 20 వేల రూపాయల మూలధనం పెట్టుబడితో 1895లో బ్యాంక్ మొదటి బ్రాంచి ప్రారంభమైంది. బ్యాంకులో తొలి ఖాతాను లాలా లజ్పతి రాయ్ తెరిచారు. ఆ తర్వాత భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, జాతిపిత మహాత్మా గాంధీలు కూడా ఇందులో ఖాతాదారులయ్యారు. అనతి కాలంలోనే ఈ బ్యాంకు అనేక బ్రాంచీలుగా విస్తరించినప్పటికీ 1929లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల ఈ బ్యాంకు కూడా దిబ్బతిన్నది. ఏకంగా 92 బ్రాంచీలను మూసుకోవాల్సి వచ్చింది. దేశ విభజనకు కొన్ని నెలల ముందు బ్యాంక్ తన ప్రధాన కార్యాలయాన్ని పాకిస్థాన్లోని లాహోర్ నుంచి న్యూఢిల్లీకి మార్చుకుంది. దేశ విభజన సందర్భంగా మొత్తం డిపాజిట్లలో 40 శాతం డిపాజిట్లను కోల్పోవాల్సి వచ్చింది. బ్యాంకును ఏర్పాటు చేసిన తొలి 60 ఏళ్ల కాలంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 270 బ్రాంచీలను ఏర్పాటు చేయగలిగింది. 1950, 1960 దశకంలో భారత్ బ్యాంక్, ఇండో కమర్షియల్ బ్యాంకులను కలుపుకొని మరింత బలపడింది. 1969లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఈ బ్యాంక్తోపాటు దేశంలోని మరో 13 బ్యాంకులను జాతీయం చేశారు. అప్పటికే బ్యాంక్ 70 శాతం భారత ఖాతాదారుల డిపాజిట్లతో కళకళలాడుతోంది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా ఏడువేల బ్రాంచ్లున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వం కంపెనీల్లో ఒకటిగా ఫోర్బ్స్ జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. 2010 నుంచి 2015 మధ్య పంజాబ్ నేషనల్ బ్యాంక్తోపాటు దేశంలోని పలు ప్రభుత్వ బ్యాంకులు తీవ్రంగా నష్టపోయాయి. అవినీతికి అలవాటుపడిన అధికారులు అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడంతో వడ్డీలు పడిపోయి నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి. దీన్ని అరికట్టడం కోసమే భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2015, డిసెంబర్ నెలలో కఠిన నియమ, నిబంధనలను ప్రకటించింది. 2016 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ బ్యాంక్ నిరర్థక ఆస్తులు 55,800 కోట్ల రూపాయలకు చేరుకుంది. పైగా అదే సంవత్సరానికి 3,974 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. భారతీయ బ్యాంకుల చరిత్రలోనే ఇంతటి నష్టం ఏర్పడడం ఇదే మొదటిసారి. 2017 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్కు చెందిన 9వేల కోట్ల మొండి బకాయిలను రద్దు చేశారు. 2018, మార్చి నెల నాటికి 5,473 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాంకు కోలుకుంటుందని భావిస్తున్న సమయంలో నీరవ్ మోదీ కుంభకోణం వెలుగుచూసింది. -
నెహ్రూపై సంచలన ఆరోపణలు
సాక్షి, భోపాల్ : జనరల్ నాలెడ్జి పరీక్ష పేరుతో బీజేపీ యువవిభాగం నిర్వహించిన పరీక్ష కాస్త వివాదానికి తెరలేపింది. అందులో అడిగిన ప్రశ్నలు ప్రతిపక్షాలకు మంటపెట్టేలా ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మంగళవారం సుభాష్ చంద్రబోస్ జయంతి నేపథ్యంలో బీజేవైఎం(భారతీయ జనతా యువ మోర్చా) విభాగం ఓ జనరల్ నాలెడ్జి పరీక్ష నిర్వహించింది. భోపాల్లోని ఎంవీఎం కాలేజ్ క్యాంపస్లో ఈ పరీక్ష ఏర్పాటుచేయగా అంతకుముందు ‘మేరే దీన్ దయాళ్’ అనే పేరుతో ఉన్న పుస్తకాన్ని పరీక్ష రాసే వారికి అందించారు. అందులో మాజీ ప్రధాని జవహార్ లాల్పై వారు సంచలన ఆరోపణలు చేశారు. నెహ్రూకు అధికారంపై వ్యామోహం అని పేర్కొన్నారు. అందుకోసమే దేశాన్ని విడదీస్తున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. అదే సమయంలో పాకిస్థాన్ పిత మహ్మద్ అలీ జిన్నా కూడా అలాంటి వ్యక్తేనని పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని 47వ పేజీలో అఖండ్ భారత్ అనే చాప్టర్లో 'ఎలాంటి విభజన లేకుండానే భారత్కు స్వాతంత్ర్యం వస్తుందని దీన్దయాళ్ ఉపాధ్యాయ్ నమ్మారు. కానీ, తమకు అధికారం దక్కాలనే దురాశతో అవిభక్త భారతదేశానికే స్వాతంత్ర్యం అనే ఆలోచనను పక్కన పడేసి నెహ్రూ, జిన్నాలు బ్రిటీష్ వాళ్ల వ్యూహంలో పడ్డారు' అని పేర్కొన్నారు. అంతేకాకుండా జీకే పరీక్ష కోసం కూర్చున్నవారికి ఇచ్చిన ప్రశ్నా పత్రంలో కేవలం దీన్ దయాళ్కు సంబంధించినవి 4 ప్రశ్నలు అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకొచ్చిన 11 పాలసీల మీద మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ పరీక్షపై పెద్ద స్థాయిలో విమర్శలు వచ్చాయి. కాగా, దీన్ దయాళ్ గురించి నేటి తరానికి తెలియాలనే ఉద్దేశంతోనే తాము ఆ పరీక్ష పెట్టామే తప్ప దురుద్దేశంతో కాదని అన్నారు. -
దిగజారుతున్న విలువలు
సందర్భం పార్లమెంట్ చర్చలు అంటే శిఖరప్రాయులైన వక్తలు, అద్భుత వాదనా పటిమ, నిఖార్సయిన గణాంకాలు, గౌరవప్రదమైన ముగింపు అనే రోజులు పోయాయి. ఇప్పుడది పరస్పర ఘర్షణగా, దూషణల పర్వంగా దిగజారిపోయింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భద్రతకోసం ఒక రోజుకు రూ. 25వేలు ఖర్చుపెడుతున్నారంటూ రామ్మనోహర్ లోహియా 1963లో ఒక కరపత్రం రాశారు. అప్పట్లో రోజుకు 3 అణాపైసలపై బతుకీడుస్తున్న భారతీయ నిరుపేదల రోజువారీ దుర్భర జీవి తంతో పోలిస్తే ఇది చాలా పెద్ద వ్యత్యాసం. తర్వాత నెహ్రూ దానిపై పార్లమెంటులో చర్చిస్తూ, ప్రణాళికా సంఘం గణాంకాలను ప్రస్తావిస్తూ భారతీయుల రోజు వారీ ఆదాయం 15 అణాపైసలుగా ఎత్తిచూపారు. ఈ సందర్భంగా ఆర్థిక అసమానతలకు సంబంధించి లోహియా, నెహ్రూ గొప్ప చర్చకు నాంది పలికారు. ఈ మేటి చర్చకు ముగింపు పలకడం కోసం ఏంపీలు సీరియస్గా చర్చించారు. కానీ ఆ చర్చ అత్యంత నాగరిక రీతిలో సాగింది. శిఖరప్రాయులైన వక్తలు అత్యద్భుత వాదనా పటిమతో, నిఖార్సయిన గణాంకాలతో తమతమ వాదనలను వినిపించారు తప్పితే మొత్తం చర్చాక్రమంలో చిన్న అంతరాయం కానీ, దూకుడుతనాన్ని కానీ ప్రదర్శించడం జరగలేదు. కాని మన రాజకీయ చర్చలు క్రమేణా దిగజారుతూ వచ్చాయి. అలాగే హిందూ న్యాయ స్మృతి బిల్ని చూడండి. 1948లో బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో ఎంపిక కమిటీ రూపొందించిన దీని ముసాయిదా అత్యంత వివాదాస్పదమైంది. అది హిందువులు, జైనులు, బౌద్ధులు, ఆదివాసులకు వర్తించే పర్సనల్, స్థానిక పౌర చట్టాలను క్రోడీకరించిన చట్టంతో మార్చడానికి చేసిన ప్రయత్నం. కులానికి ఉన్న చట్టపరమైన ప్రాధాన్యతను తగ్గించడం, విడాకులను సులభతరం చేయడం, వితంతువులకు, మహిళలకు కూడా ఆస్తి హక్కులో భాగం కల్పించడం ఈ బిల్లులో ముఖ్యాంశాలు. హిందూ కోడ్ బిల్లుపై చర్చను ప్రారంభించిన మోషన్ తీర్మానంపై 50 గంటలపాటు చర్చ జరిగింది. పార్లమెంటులో, డాక్టర్ రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖులు సైతం ఈ బిల్లును రౌలట్ చట్టంతో పోల్చారు. కొంతమంది సభ్యులు హిందూ మతమే ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అంబేడ్కర్ వంటివారు హిందూ సమాజం కాలానుగుణంగా పరిణమించాలని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీలు చేసిన గొప్ప ప్రసంగాలు పార్లమెంటుకే ప్రమాణంగా నిలిచిపోయాయి. 1949 నవంబర్లో అంబేడ్కర్ ‘అరాజకపు వ్యాకరణం’పై చేసిన ప్రసంగం.. ఇకనుంచి సహాయ నిరాకరణ, సత్యాగ్రహం, శాసనోల్లంఘన వంటి పోరాటరూపాలను పరి త్యజించాలని చెప్పడమే కాకుండా, సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ విధానాలను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. తర్వాత భారత్ తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిన సందర్భంలో ప్రముఖ పార్లమెంటేరియన్ పీలూ మోడీ, నాటి ప్రధాని ఇందిరాగాంధీని గుచ్చి గుచ్చి అడుగుతూ, ‘మేడమ్ ప్రైమ్ మినిస్టర్, మన శాస్త్రజ్ఞులు సాంకేతికరంగంలో గొప్ప విజయాలు సాధిస్తున్నారు. కానీ మన టెలిఫోన్లు ఎందుకు పనిచేయడం లేదో మీరు వివరిస్తే మేమంతా కాస్త సంతోషపడతాం’ అన్నారు. స్వాతంత్య్రానంతర భారత్ ఒక రకంగా చూస్తే అదృష్టవంతురాలు అనే చెప్పాలి. నెహ్రూ, పటేల్, లోహియా వంటి దిగ్గజ నేతలు దూషణలకు తావు లేకుండా అనేక అంశాలపై చర్చకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజాస్వామిక అభినివేశాన్ని ప్రోత్సహించాలని చూసేవారు. నెహ్రూ నుంచి వాజపేయి దాకా పార్లమెంటు కార్యకలాపాలను భక్తిభావంతో కొనసాగించడం కోసం అనేక ఉత్తమ సంప్రదాయాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి, శాసన సంబంధమైన లక్ష్యాల సాధనపై వీరు ప్రముఖంగా దృష్టి పెట్టేవారు. ఒకప్పుడు అద్భుత ప్రసంగాలకు, వాదనాపటిమకు తావిచ్చిన మన పార్లమెంటరీ చర్చాప్రక్రియ జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, సమస్యలపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. ఈ చర్చా సంప్రదాయాన్ని వారసత్వంగా స్వీకరించడానికి బదులుగా, రానురానూ ఎంపీలు వాగాడంబరత్వానికి, అరువుతెచ్చుకున్న పదప్రయోగాలకు దిగజారిపోయారు. మృదు చర్చల స్థానంలో దూకుడుతనం ప్రవేశించింది. మన పార్లమెంటు ఎలాంటి చారిత్రక క్షణాలను ఆస్వాదించిందో ఒక్కసారి చూద్దాం. రాజాజీ ఒకసారి లోక్సభలో ప్రవేశపెట్టిన సవరణను సభ తిరస్కరించినప్పుడు నెహ్రూ ప్రసంగిస్తూ, ‘మెజారిటీ నా వైపే ఉంది రాజాజీ’ అన్నారు. దానికి రాజాజీ జవాబిస్తూ, ‘మెజారిటీ మీవైపే ఉండవచ్చు నెహ్రూజీ, కానీ తర్కం నా వైపే నిలిచింది’ అన్నారు. ప్రస్తుత పార్లమెంటులో ప్రమాణాలు పూర్తిగా అడుగంటిన చర్చాప్రక్రియను చూస్తుంటే పరస్పర ఘర్షణగా, రాత్రి 8 గంటల వార్తాప్రసార పోరాటాల స్థాయికి దిగ జారిపోయినట్లు అనిపిస్తుంది. ఒకప్పుడు పార్లమెంటులో రాకెట్ ప్రయోగాల గురించి చర్చ సాగితే ఇప్పుడు పురాతన చరిత్రపై ఏకపక్ష ప్రదర్శన జరుగుతోంది. ఒకప్పుడు గౌరవనీయ కళగా సాగిన రాజకీయ వాక్పటిమ నెహ్రూ, బర్క్, చర్చిల్ వంటి గొప్ప వక్తలను రూపొందించింది. ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కోవడమే ప్రధానమైపోయింది. ఈ నేపథ్యంలో మురికి రాజకీయ తెట్టును శుద్ధి చేయాలంటే ఉత్తమశ్రేణి పార్లమెంటేరియన్లు మళ్లీ ఆవి ర్భవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరుణ్ గాంధీ వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్ : fvg001@gmail.com -
కేంద్రం చరిత్రను వక్రీకరిస్తోంది
♦ క్విట్ ఇండియా ప్రసంగంలో నెహ్రూను విస్మరిస్తారా? ♦ మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా పోరాడుతాం ♦ ఉత్తమ్కుమార్రెడ్డి సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి 14ఏళ్లపాటు జైలులో ఉన్న భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరును ప్రధాని తన ప్రసంగంలో కావాలనే విస్మరించారని, ఇది బీజేపీ చిన్న మనస్థత్వానికి నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. 75వ క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో నెహ్రూ పేరును విస్మరించడమే మిటన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో, స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ పాత్ర మరువ లేనిదని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో విలేకరుల సమావే శంలో మాట్లాడారు. బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా పనిచేసిన వారిని బీజేపీ, జాతీ య నేతలుగా పొగుడుతూ, నిజంగా దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని విస్మరిస్తోం దని, చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని ఉత్తమ్ అన్నారు. కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభు త్వాలు ప్రజలకు కనీస మానవ హక్కులు లేకుండా చేస్తున్నాయని, దళితులు, గిరిజ నులు, మైనారిటీలు, మహిళలకు ఎలాంటి హక్కులు లేకుండా అణచివేస్తున్నారని మండి పడ్డారు. అణగారిన వర్గాలకు అండగా ఉంటా మని, వారికి న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడుతామని తెలిపారు. గాంధీభవన్లో ఉత్సవాలు... గాంధీ భవన్లో క్విట్ ఇండియా వేడుకల సందర్భంగా మండలి విపక్ష నేత షబ్బీర్ అలీతో కలసి ఉత్తమ్ పార్టీ జెండాను ఎగురవేసి మాట్లాడారు. దేశంలో మతతత్వం, నిరంకు శత్వం పెరిగిపోయిందని, ప్రజల హక్కులు కాలరాస్తున్నారని ఈ సందర్భంగా ఉత్తమ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్య క్షుడు మల్లురవి, కిసాన్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి, సేవాదళ్ చైర్మన్ జనార్దన్రెడ్డి తదితరలు పాల్గొన్నారు. అహ్మద్ పటేల్ విజయంపై హర్షం గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ విజయం సాధించడంపై ఉత్తమ్, ఇతర నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేశారు. అహ్మద్ పటేల్ ఎన్నిక విషయంలో బీజేపీ అవాంతరాలు సృష్టిం చినా ప్రజాస్వామ్యం విజయం సాధించిం దని, ఇది బీజేపీకి చెంపపెట్టు వంటిదని టీసీపీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఇకనైనా బీజేపీ రాజ్యం గేతర పనులు చేయకుండా ప్రజోపయోగ పనులపై దృష్టిసారించాలని హితవు పలికారు. -
‘వారిది అద్భుత అనుబంధం’
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్వీనాల మధ్య నెలకొన్న సంబంధంపై సరికొత్త విషయాలు వెలుగు చూశాయి. తాను రాసిన ‘డాటర్ ఆఫ్ యాన్ ఎంపైర్: లైఫ్ యాజ్ ఎ మౌంట్బాటన్’ అనే పుస్తకంలో వీరి అనుబంధంపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు మౌంట్బాటన్ కూతురు పమేలా హిక్స్నీ మౌంట్ బాటన్ ప్రయత్నించారు. మౌంట్బాటన్తో పాటు 17 ఏళ్ల వయసులో పమేలా భారత్కు వచ్చారు. ‘నెహ్రూ, ఎడ్వీనాల మధ్య అద్భుత అనుబంధం, పరస్పర గౌరవాభిమానాలు ఉండేవి కానీ.. అందరూ అనుకున్నట్లు వారిద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. నిజానికి అందుకు అవసరమైన ఏకాంతమూ వారికి లభించే పరిస్థితి లేదు. వారి చుట్టూ ఎప్పుడూ సిబ్బంది, పోలీసుల ఎవరో ఒకరు ఉండేవారు’ అని పమేలా పుస్తకంలో వివరించారు. నెహ్రూ, అమ్మ(ఎడ్వీనా)ల మధ్య ఉన్న వాస్తవ సంబంధమేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి నాకూ ఉండేది. అయితే, నెహ్రూ రాసిన లేఖల్లో అమ్మ గురించి ఆయన భావనలు చదివాక వారిమధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నా. తాను కోరుకున్న వ్యక్తిత్వం, మేధస్సును అమ్మ పండిట్జీలో చూసింది’ అని పేర్కొన్నారు. భారత్ నుంచి వెళ్లిపోయేముందు తనకిష్టమైన ఎమరాల్డ్ ఉంగరాన్ని నెహ్రూకివ్వాలని ఎడ్వీనా అనుకుందని, నెహ్రూ అందుకు అంగీకరించరని తెలిసి, ఆ ఉంగరాన్ని ఆయన కూతురు ఇందిరకు ఇచ్చిందని పమేలా తెలిపారు. -
ఆ డాక్టరేట్కు ఎంతో గౌరవం
- ఇప్పటివరకు 47 మందికి ఓయూ గౌరవ డాక్టరేట్లు - ఠాగూర్ నుంచి నెహ్రూ దాకా ఎందరో ప్రముఖులు.. సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా.. అంతర్జాతీయ ఖ్యాతిని తన సిగలో ఇముడ్చుకున్న విశ్వవిద్యాలయం! ఈ వర్సిటీ డిగ్రీకి మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ చదువుకునేందుకు దేశ విదేశీయులు సైతం క్యూ కడుతుంటారు. మరి అలాంటి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందుకోవడమంటే అషామాషీ కాదు. ఎంతో నిపుణత ఉండాలి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన శాస్త్ర, సాంకేతిక నిపుణులు, మేధావులు, రాజకీయ, సాహితీవేత్తల సేవలను గుర్తించి వారిని గౌరవ డాక్టరేట్తో సత్కరించడం అనవాయితీగా వస్తోంది. 1917లో ప్రెసిడెన్సీ కాలేజీ బెంగాల్ లఖ్నవ్ కాలేజీలో అరబిక్ ప్రొఫెసర్గా పని చేసిన నవాజ్ ఇమాదుల్ ముల్క్ బహదూర్ ముల్క్కు తొలి గౌరవ డాక్టరేటు(డాక్టర్ ఆఫ్ లాస్)ను ప్రధానం చేసింది. ఆ తర్వాత సాహితీవేత్త రవీంద్రనాధ్ ఠాగూర్, భారత మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, సి.రాజగోపాలాచారి సహా మొత్తం 47 మందికి గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేసింది. 2001లో చివరి సారిగా అరుణ్ నేత్రావలికి(డాక్టర్ ఆఫ్ సైన్స్ విభాగం)గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేసింది. ఆ తర్వాతి నుంచి ఇప్పటివరకు గౌరవ డాక్టరేట్లను ఎవరికి ప్రకటించలేదు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడంతోపాటు మరో 51 మంది నిపుణులను ఘనంగా సన్మానించాలని భావించింది. ఆ మేరకు ఆయా రంగాల్లోని ప్రముఖులను ఎంపిక చేసింది. అయితే ఈ ఎంపికపై విద్యార్థులు, మేధావుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు వర్సిటీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, అభిప్రాయబేధాలు వల్ల గౌరవ డాక్టరేట్ ప్రదానంతో పాటు సన్మానాలను వాయిదా వేసింది. ఓయూ గౌరవ డాక్టరేట్లు పొందిన కొందరు ప్రముఖులు.. 1. రవీంద్రనాధ్ ఠాగూర్ (డాక్టర్ ఆఫ్ లిటరేచర్) 1938 2. సి.రాజగోపాలాచారి (డాక్టర్ ఆఫ్ లాస్)1944 3. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ (డాక్టర్ ఆఫ్ లాస్)1947 4. బాబూ రాజేంద్రప్రసాద్ (డాక్టర్ ఆఫ్ లాస్)1951 5. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (డాక్టర్ ఆఫ్ లిటరేచర్) 1953 6. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (డాక్టర్ ఆఫ్ లిటరేచర్)1953 7. బూర్గుల రామకృష్ణరావు (డాక్టర్ ఆఫ్ లాస్)1956 8. యాసర్ అరాఫత్ (డాక్టర్ ఆఫ్ లాస్) 1982 9. డాక్టర్ వై.నాయుడమ్మ (డాక్టర్ ఆఫ్ సైన్స్) 1982 10. డాక్టర్ మన్మోహన్ సింగ్ (డాక్టర్ ఆఫ్ లిటరేచర్) 1996 11. డాక్టర్ అరుణ్ నేత్రావలి (డాక్టర్ ఆఫ్ సైన్స్) 2001 -
మోదీ.. థర్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్!
జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత అత్యంత విజయవంతమైన మూడో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీనే అని ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్రగుహా అభిప్రాయపడ్డారు. 66 ఏళ్ల మోదీ ఛరిష్మా, అప్పీల్.. ప్రాంతాలు, కులాలు, భాషలకు అతీతంగా దేశమంతా పాకిపోయిందని వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ భారతీయ సదస్సు-2017లో గుహా ప్రసంగిస్తూ మోదీ ఆధిపత్యం, ఆయన విశాల భారత దృక్పథం ఆయనను నెహ్రూ, ఇందిర సరసన నిలబెట్టాయని పేర్కొన్నారు. 'నరేంద్రమోదీ భారత చరిత్రలో మూడో అత్యంత విజయవంతమైన ప్రధానమంత్రిగా నిలువబోతున్న లేదా నిలిచిన కాలంలో మనం నివసిస్తున్నాం. ఆయన కలిగి ఉన్న అధికారం, సమగ్ర భారతీయ దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుంటే నెహ్రూ, ఇందిరల సరసన ఆయనను నిలబెట్టగలం' అని అన్నారు. 'నెహ్రూ, ఇందిర తర్వాత అంతటి అధికార ఆధిపత్యం, ఛరిష్మా, ప్రాంతాలు, కులాలు, భాషలకతీతంగా అపీల్ కలిగిన ప్రధానమంత్రి మరొకరు లేరు' అని గుహా అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీని, బీజేపీని విమర్శించవద్దంటూ తనకు బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయని కొన్నిరోజుల కిందట గుహా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
అమరజీవికి ఏపీసీసీ ఘనంగా నివాళి
హైదరాబాద్: అమరజీవి పొట్టి శ్రీరాములు పట్టువీడని మహనీయుడని, తెగింపు గలవాడని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్పూర్తి దాయకమని ఏపీసీసీ పేర్కొంది. ఆంధ్రరాష్ట్ర సాధన కోసం పోరాడి, ప్రాణత్యాగం చేసిన మహాపురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 117 జయంతి జరుపుకోవడం గర్వించదగ్గ విషయం అని ఏపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం అన్నారు. ఇందిరా భవన్లో విలేఖరుల సమావేశంలో గంగాధరం మాట్లాడుతూ... పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న నెల్లూర్ జిల్లాలోని పెద్దమట్టపల్లి గ్రామంలో జన్మించారు. శ్రీరాములు లాంటి అకుంటిత దీక్ష వ్యక్తులు 10 మంది ఉంటే మన దేశానికి సంవత్సర కాలంలోనే స్వాతంత్ర్యం తీసుకువస్తానని ఆనాడే మహాత్మాగాంధీ చెప్పారని మరొసారి గుర్తు చేశారు. అతని దేశభక్తికి, పట్టుదలకు గాంధీజీ మాటలే నిలువెత్తు సాక్ష్యాలన్నారు. అంతేకాక శ్రీరాములు ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని గంగాధరం శ్రీరాములు దేశభక్తిని గుర్తు చేశారు. ఆనాడు మద్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1952 అక్టోబర్ 19న నిరాహార దీక్షను ప్రారంభించారన్నారు. అతని 58 రోజుల దీక్షకు మద్దతుగా ప్రజలు ధర్నాలు, సమ్మెబాట పట్టారని ఆనాటి రోజులు గుర్తు చేశారు. కానీ శ్రీరాములు 1952 డిసెంబర్ 15న మరణించారు. అతని మరణ వార్త విన్నప్రజలు ఆవేశాలతో హింసాత్మక చర్యలకు పాల్పడి చెన్నై నుంచి విశాకపట్నం వరకు ఆందోళనలు చేశారని పేర్కొన్నారు. డిసెంబర్ 19న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఆయన కృషి ఫలితంగా కర్నూల్ రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. -
నెహ్రూకు పోటీగా.. మోదీ?
►జనాదరణలో జవహర్లాల్తో పోటీపడుతున్న నరేంద్రుడు ►ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో ఇందిరను వెనక్కి నెట్టిన ప్రధాని న్యూఢిల్లీ: జనాదరణ విషయంలో జవహర్లాల్ నెహ్రూ ఎంత ఉన్నతుడో ఒక సందర్భంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ వివరించారు. అప్పట్లో ముంబైలో కాంగ్రెస్ నిర్వహించిన ఒక సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఆ సమయంలో పటేల్ అమెరికా జర్నలిస్ట్ విన్సెంట్ షీన్తో మాట్లాడుతూ.. ‘‘వారు వచ్చింది నాకోసం కాదు. జవహర్ కోసం’’ అని చెప్పారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. భారీ మెజార్టీతో ఉత్తరప్రదేశ్ పీఠాన్ని దక్కించుకున్న తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రానంతరం నేతలలో నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగారని చెప్పారు. అయితే.. ఇప్పటి వరకూ ఉక్కుమహిళగా పేరొందిన ఇందిరాగాంధీతో మోదీని పోల్చుతున్నారు. అమిత్ షా మాత్రం మరో అడుగు ముందుకు వేశారు. ప్రస్తుత ప్రధాని తొలి ప్రధానినే అధిగమించేశారని అన్యాపదేశంగా వ్యాఖ్యానించారు. భారత చరిత్రను అధ్యయనం చేస్తున్నవారికి, విశ్లేషకులకు అమిత్ షా వ్యాఖ్యలు ఒక అతిశయోక్తిగానే కనిపిస్తాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీ తర్వాత స్థానం నెహ్రూదే. తిరుగులేని ఆయన శక్తిని తరచూ ‘‘నెహ్రూ స్వామ్యం’’గా అభివర్ణించేవారు. స్వాతంత్య్రం తదనంతర దేశ నిర్మాణంలో ఆయన పాత్ర గణనీయమైనది. అయితే అమిత్ షా వ్యాఖ్యలు ఏమంత తీసిపారేయతగ్గవి కూడా కాదు. ఇప్పటి మోదీ జనాదరణ అప్పటి నెహ్రూ జనాదరణతో పోటీ పడుతోంది. 2014లో చిన్న విజయం.. లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే గత ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీల కంటే ఆ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ మాత్రం చాలా తక్కువగా ఉంది. 1977లో కాంగ్రెస్ సాధించిన ఓట్ షేర్ను కూడా బీజేపీ చేరుకోలేకపోయింది. అయితే కాంగ్రెస్ దిగ్గజ నేతలతో పోటీలో మోదీ వెనకబడ్డారని చెప్పలేం. మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తన అధికారంతో రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ షేర్ (దాదాపు 40 శాతం) చూస్తే.. ఇందిరాగాంధీ నేతృత్వంలో ఆ రాష్ట్రంలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఓట్ షేర్ను అధిగమించేసింది. అంతేగాక 1962లో నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ సాధించిన ఓట్ షేర్ (36 శాతం) కన్నా చాలా ఎక్కువగా ఉంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో సాధించిన ఈ విజయం సాధారణమైనదికాదు. మోదీ గుజరాత్ను వదిలి ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయడం మొదలు దీని వెనకాల ఎంతో కృషి ఉందని చెప్పవచ్చు. అలాగే ఒక్కో రాష్ట్రంలోనూ బీజేపీ పాగా వేస్తూ వస్తోంది. 1967లో కాంగ్రెస్ 10 రాష్ట్రాలను పాలిస్తే.. 2017లో బీజేపీ 15 రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తోంది. దీనిని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మోదీ స్వామ్యం.. అప్పట్లో నెహ్రూకు ఉన్న జనాదరణతో పార్టీలో ఉన్న రైటిస్టులు కూడా కిమ్మనకుండా ఉండేవారు. దీంతో నెహ్రూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవారు. పథకాలు, చట్టాలు రూపకల్పన చేశారు. పురాతన హిందు సంప్రదాయాలు స్థానంలో ప్రగతిశీల చట్టాలను తీసుకొచ్చారు. లౌకిక విధానాన్ని అవలంభించి దేశ విభజన తర్వాత భారత్లోని ముస్లింలకు భద్రత కల్పించే చర్యలు తీసుకున్నారు. అయితే నరేంద్ర మోదీది రైటిస్ట్ భావజాలం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేయడంతో ఆ ప్రభావం ఆయనపై ఉంటుంది. నెహ్రూ స్థాయిలో ఆయన అధికారాలు ఉంటే దేశాన్ని తన భావజాలంవైపు తీసుకెళ్లవచ్చు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బీజేపీ పోటీకి దింపలేదు. ఈ విజయం పూర్తిగా హిందు ఓట్ బ్యాంకుపై ఆధారం. తానో హిందు శక్తిగానే కనిపించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. -
చేగువేరాను ఇండియాకు పంపిన క్యాస్ట్రో!
‘‘జవహర్లాల్ నెహ్రూ నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు’’ అని చెప్పేవారు ఫిడెల్ క్యాస్ట్రో. 1960లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనడానికి న్యూయార్క్ వెళ్లిన క్యాస్ట్రోను అదే సమావేశానికి హాజరైన నెహ్రూ, క్యాస్ట్రో బస చేసిన చోటుకు వెళ్లి మరీ కలిశారు. అప్పుడు క్యాస్ట్రో వయసు 34 ఏళ్లు. అనుభవం లేదు. అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనటానికి ముందున్న టెన్షన్ ఉంది. అలాంటి సమయంలో నెహ్రూ చూపిన ఆత్మీయతను తాను ఎన్నటికీ మరవలేనని అనేవారు క్యాస్ట్రో. నెహ్రూ మీదే కాదు, భారత్ అన్నా కూడా క్యాస్ట్రోకు ఎంతో అభిమానం. క్యూబాలో క్యాస్ట్రో పాలన మొదలయ్యాక, ఆ ప్రభుత్వాన్ని గుర్తించిన తొలి దేశాల్లో ఇండియా ఒకటి. అందుకే భారత్తో సంబంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా చేగువేరాను ఇండియాకు పంపారు క్యాస్ట్రో. అలా రెండు వారాల పర్యటన నిమిత్తం చే బృందం 1959లో ఇండియా వచ్చింది. అందులో చేతో పాటు మరో ఆరుగురు– ఒక ఆర్థికవేత్త, ఒక మ్యాథమెటీషియన్, విప్లవబృందంలో పనిచేసిన ఒక కెప్టెన్, రేడియో బ్రాడ్కాస్టర్, ఒక బాడీగార్డు– ఉన్నారు. వాళ్లు జూన్ 30న పాలం విమానాశ్రయంలో దిగారు. తెల్లారి తీన్ మూర్తి భవన్లో నెహ్రూను కలిశారు. ఇరు దేశాల్లో దౌత్య కార్యాలయాలను నెలకొల్పుకోవడం గురించీ, పరస్పర వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం గురించీ చర్చించారు. సమావేశానంతరం నెహ్రూ, ఏనుగు దంతం పిడివున్న ఒక కత్తిని చేకు బహూకరించారు. క్యూబా రాజధాని హవానాలోని చే మ్యూజియంలో ఇప్పటికీ అది భద్రంగా ఉంది. 1960లో హవానాలో భారత్ తన దౌత్యకార్యాలయాన్ని ప్రారంభించింది. ఇరు దేశాలూ ఎన్నో అంశాల్లో పరస్పరం సహకరించుకున్నాయి. 1990ల్లో క్యూబాలో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు భారత్ పది వేల టన్నుల గోధుమలూ, మరో పదివేల టన్నుల బియ్యమూ పంపింది. 2008లోనూ గుస్తావ్ తుఫాను క్యూబాను అల్లకల్లోలం చేసినప్పుడు భారత్ 20 లక్షల డాలర్ల ఆర్థిక సాయం అందించింది. అలాగే, భద్రతాసమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలన్న విషయంలో క్యూబా మొదటినుంచీ మద్దతునిస్తోంది. -
'నెహ్రూను కావాలనే తక్కువ చేస్తున్నారు'
హైదరాబాద్: ఉద్దేశ పూర్వకంగానే ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం నెహ్రూను కించపరుస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. నెహ్రూ 127వ జయంతి సందర్భంగా అబిడ్స్ లోని నెహ్రూ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన అనంతరం నిరసన దీక్షకు దిగారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను, దేశానికి నెహ్రూ అందించిన సేవలను మోదీ ప్రభుత్వం మర్చిపోయిందని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆయనకు నిమ్మరసం ఇచ్చి మరో కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క దీక్షను విరమింపజేశారు. అనంతరం భట్టి మాట్లాడుతూ నెహ్రూ ఇమేజ్ ను తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. బాలల దినోత్సవానికి ఇచ్చిన ప్రకటనల్లో నెహ్రూ ఫొటో లేకపోవడం చూస్తుంటే ఆయనను తక్కువ చేయాలనే కుట్ర మోదీ ప్రభుత్వం చేస్తుందని తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గాంధీ, నెహ్రూలను కించపర్చొద్దు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ను తక్కువ చేసి మాట్లాడటం ప్రధాని మోదీకి సరికాదని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గుజరాత్కు చెంది న వ్యక్తి కావడం వల్లనే పటేల్ను ప్రధాని కానివ్వలేదని మోదీ ఆరోపించడం సరికాదన్నారు. నెహ్రూ అనుభవాన్ని, దార్శనికతను గమనించిన తర్వాతనే ప్రధానిగా చేయడానికి గాంధీ సిద్ధపడ్డారన్నారు. -
18న జిల్లా స్థాయి సీనియర్స్ ఖోఖో ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్ : హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 18వ తేదీన జిల్లా స్థాయి సీనియర్స్ ఖోఖో ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు వరంగల్ ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు 18న ఉదయం 9గంటలకు జేఎన్ఎస్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 30 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ 98492 10746 నెంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. -
బ్యాక్లాగ్స్ బెడద తప్పాలంటే..
ఇంజనీరింగ్లో ఫెయిలయ్యే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తాజాగా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం- హైదరాబాద్ పరిధిలో వెలువడిన ఇంజనీరింగ్ ఫస్టియర్ ఫలితాల్లో కేవలం 27.86 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. తొలి అడుగులోనే ఇలాంటి తడబాటు కనిపిస్తుంటే.. ఇక మిగిలిన విద్యా సంవత్సరాల గురించి చెప్పనక్కర్లేదు. విద్యార్థులకు ఈ బ్యాక్లాగ్స్ గుదిబండలా తయారవుతున్నాయని, వీలైనంత త్వరగా సబ్జెక్టులను క్లియర్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పదో తరగతి, ఇంటర్లో టాప్ మార్కులు పొందినవారు సైతం ఇంజనీరింగ్ ఫస్టియర్లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్నారు. ఇంజనీరింగ్లో బట్టీ విధానం కంటే అప్లికేషన్ ఓరియెంటేషన్కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. స్పూన్ ఫీడింగ్కు అవకాశం లేదు కాబట్టి.. సెల్ఫ్ లెర్నింగ్ను అలవర్చుకోవడం తప్పనిసరి. కైైఇట, ూ్కఖీఉఔ తదితర మార్గాల ద్వారా సబ్జెక్టులపై సొంతంగా అవగాహన పెంచుకోవాలి. సందేహాలను నివృత్తి చేసుకోవాలి సబ్జెక్టుకు సంబంధించిన సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. నిజానికి మీకున్న అనుమానాలే క్లాసులో చాలామందికి ఉంటాయి. మీరు చొరవ చూపడం వల్ల భవిష్యత్తు కెరీర్కు అవసరమైన నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. క్లాసులో కుదరదనుకుంటే లెక్చరర్ను స్టాఫ్రూంలో కలిసి, సందేహాలు తీర్చుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీరు ఆ సమస్య పరిష్కారానికి ఎంత శ్రమపడ్డారో తెలియజేసే రఫ్వర్క్, నోట్స్ వంటి ఆధారాలను చూపాలి. అప్పుడే మీ ప్రశ్నకు విలువ పెరుగుతుంది. అంకితభావం, నిబద్ధత పాఠ్యపుస్తకాలు, రిఫరెన్స్ పుస్తకాలు చదవడం వల్ల సందేహాలను తీర్చే వివరణలు, ఆయా సిద్ధాంతాలపై ఎక్కువ ఉదాహరణలు లభిస్తాయి. ఇవి కాన్సెప్ట్లను బాగా తెలుసుకోవడానికి, పరీక్షల్లో వివరణాత్మకంగా సమాధానాలు రాయడానికి ఉపయోగపడతాయి. ఒక సమస్యను సొంతంగా సాధించేందుకు మరీ ఎక్కువసార్లు ప్రయత్నించకూడదు. అలాంటి సమయంలో స్నేహితుల సహాయం తీసుకోవాలి. గ్రూప్ స్టడీ వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రస్తుతం అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. సందేహాల నివృత్తికి, సబ్జెక్టుపై పట్టు సాధించేందుకు దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఏ రోజు పాఠాలు ఆ రోజే ముఖ్యంగా ఏకాగ్రతను పెంచుకుంటూ ఏరోజు పాఠాలను ఆ రోజే పూర్తిచేసుకోవాలి. క్లాస్కు వెళ్లేముందు ఆ రోజు బోధించే అంశానికి సంబంధించి కొంత సమాచారం తెలుసుకొని వెళ్లాలి. లెక్చరర్ నోట్స్తోపాటు రిఫరెన్స పుస్తకాల సహాయంతో నోట్స్ సిద్ధం చేసుకోవాలి. రోజూ ఆ నోట్స్ను చదువుకుంటూ.. పరీక్షల సమయంలో ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తే బ్యాక్లాగ్స్ సమస్య ఎదురుకాకుండా చూసుకోవచ్చు. నాలుగు పద్ధతులు.. విద్యార్థులు ఏ విషయాన్నైనా నాలుగు పద్ధతుల్లో నేర్చుకుంటారని పరిశోధనల్లో తేలింది. వాటిలో మీకు ఏ పద్ధతి అనుసరణీయమో గుర్తించాలి. అవి.. నేను ఆచరణాత్మక, నిజ జీవిత సంఘటనలను చూసి ప్రభావితమవుతాను. నేను ఉదాహరణలతో వివరించినప్పుడు బాగా అర్థం చేసుకుంటాను. నేను ఫార్ములాలు, సిద్ధాంతాలు కాకుండా ఒక యంత్రం పనిచేసే విధానం తెలుసుకోవడం వల్ల నేర్చుకుంటాను. నాకు బొమ్మలు, ఫ్లో ఛార్టులు, ఇతర వివరణాత్మక అంశాలపై ఆసక్తి ఉంది. వాటి సహాయంతో పుస్తకాలను చదివిన దానికంటే ఎక్కువగా అర్థం చేసుకుంటాను. ఇంజనీరింగ్లో చేరినప్పటి నుంచి సబ్జెక్టులను, పాఠాలను నిర్లక్ష్యం చేయకుండా మొదటి నుంచి చదువుపై శ్రద్ధ పెట్టాలి. అన్ని సబ్జెక్టుల్లో మొదటి ప్రయత్నంలోనే పాస్ అయ్యే విధంగా జాగ్రత్తపడాలి. సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతుంటే విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్కు హాజరయ్యే అవకాశం కోల్పోతారు. పేరున్న కంపెనీలు బ్యాక్లాగ్స్ లేని విద్యార్థులనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్స్కు అనుమతినిస్తున్నాయి. అలాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో వీసాలను తిరస్కరిస్తున్నారు. డిగ్రీ పట్టా.. సమయానికి చేతికి రాకుంటే ఉద్యోగ సాధన కూడా కష్టమవుతుంది. - ప్రొఫెసర్ జె.ప్రసన్నకుమార్, ప్లేస్మెంట్ ఆఫీసర్, ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. -
మా ముత్తాత ఎన్నో త్యాగాలు చేశారు!
లక్నో: దేశ ప్రథమ ప్రధానమంత్రి, కాంగ్రెస్ నాయకుడు జవహర్ లాల్ నెహ్రూపై బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. ’దేశ ప్రథమ ప్రధాని అయిన నెహ్రూ ఒక రాజులాగా విలాసవంతమైన జీవితాన్ని గడిపారని ప్రజలు అనుకుంటారు. వారికి తెలియనిదేమిటంటే.. నెహ్రూ 15 ఏళ్లు జైలులో గడిపితే ఆ పదవి వచ్చింది’ అని వరుణ్గాంధీ అన్నారు. లక్నోలో జరిగిన ఓ యూత్ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ’ఎవరైనా వచ్చి నిన్ను జైలులో ఉంచి 15 ఏళ్ల తర్వాత ప్రధానిని చేస్తామంటే.. నేను మాత్రం ’క్షమించండి ఇది చాలా కష్టం’ అని చెప్తాను’ అని అన్నారు. దేశానికి విముక్తి సాధించడానికి నెహ్రూ తన జీవితాన్ని, కుటుంబాన్ని త్యాగం చేశాడని, గాయాలపాలయ్యాడని, ఆయన త్యాగాలను యువత గుర్తించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటకాలంలో చిత్రంజన్ దాస్, నెహ్రూ భావజాలపరంగా ఒకవైపు నిలబడితే, లాలా లజపతిరాయ్ మరోవైపున నిలబడ్డారని అన్నారు. ’ అప్పట్లో వారి భావజాలాలు భిన్నమైనవి. ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్లో భావజాల సిద్ధాంతాలు ఉన్నాయని ఎవరైనా గుండెలపై చేయి వేసుకొని చెప్పగలరా’ అంటూ ఆయన ప్రశ్నించారు. దేశంలో భావప్రకటనా స్వేచ్ఛకు ముప్పు పొంచి ఉందని వరుణ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
'ఆయన అలా మాట్లాడటం సరికాదు'
హైదరాబాద్: జవహార్లాల్ నెహ్రూ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడటం సరికాదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. గురువారం శైలజానాథ్ హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశం కోసం బీజేపీ పెద్దలు చేసిన త్యాగాలేంటి అని శైలజానాథ్ ప్రశ్నించారు. -
నెహ్రూ పటిష్ట ఆర్థిక పునాది వేశారు: భట్టి విక్రమార్క
దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాంతం పోరాటం చేసి జైలు జీవితం అనుభవించి, దేశం కోసం నిరంతరం పాటుపడ్డ వ్యక్తి మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క కొనియాడారు. స్వాతంత్ర్యానంతరం దేశానికి దిశా నిర్ధేశం చేసిన గొప్ప వ్యక్తి నెహ్రూ అని భట్టి అన్నారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్దంతి గాంధీభవన్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా నెహ్రూ చిత్ర పటానికి నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నెహ్రూ ఈ దేశానికి పటిష్టమైన ఆర్థిక పునాది నిర్మించారని, నేడు ప్రపంచంలో మన దేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఆయన అవలంభించిన విధానాలే కారణమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎంపీ వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి కుమార్ రావులతోపాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు ఆబిడ్స్లోని నెహ్రూ విగ్రహానికి పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నాటా సభల కోసం అమెరికాకు ఉత్తమ్.. నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ (నాటా) ఆహ్వానం మేరకు మే 28, 29 తేదీలలో అమెరికాలోని డల్లాస్లో జరగనున్న నాటా సభలలో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం రాత్రి అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. డల్లాస్లో జరగనున్న ఈ సభలలో ఆయన పాల్గొంటారు. అనంతరం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జూన్ 3, 4 తేదీలలో డల్లాస్ లో జరగబోయే సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాల తర్వాత జూన్ 5వ తేదీన తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. -
నెహ్రూను పొగిడిన కలెక్టర్ కు ఝలక్..!
భోపాల్: సీనియర్ ఐఏఎస్ అధికారి ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ పై మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో ఆ కలెక్టర్ ను వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. అజయ్ సింగ్ గంగ్వార్ మధ్యప్రదేశ్ లోని బర్వానీలో కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన వారం రోజుల కిందట మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇక అంతే ఈ పోస్ట్ వైరల్ గా మారింది. చివరికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వారం రోజుల తర్వాత కలెక్టర్ ఆ పోస్ట్ డిలీట్ చేశారు. రాజకీయ అంశాలపై అధికారులు కామెంట్లు చేయరాదన్న నియమాన్ని ఆయన ఉల్లంఘించారని, ప్రభుత్వాన్ని వ్యతిరికించేలా పోస్ట్ చేశాడంతో ఇది తీవ్ర చర్యగా భావించి ఆయనను అక్కడి నుంచి బదిలీ చేశారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ప్రభుత్వాన్ని, వ్యవస్థను టార్గెట్ చేస్తూ అజయ్ గంగ్వార్ పోస్ట్ ఉందని బీజేపీ నేత వివ్ఆస్ సారంగ్ తెలిపారు. ఇస్రో, ఐఐటీ, బార్క్, ఐఐఎస్బీ, ఐఐఎం, బీహెచ్యిఎల్, థర్మల్ ప్రాజెక్టులు, డ్యాములు ఎన్నో నిర్మించారంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. నెహ్రూ సెక్యూలర్ తత్వాన్ని కూడా కలెక్టర్ అజయ్ సింగ్ ప్రస్తావించారు. ఈ పోస్ట్ విషయం తెలిసి అధికారులు విచారణ చేసి చివరకి కలెక్టర్ అజయ్ ఈ పోస్ట్ చేశారని తెలుసుకుని ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం బీజేపీపై మండిపడుతోంది. దేశంలో అసహనం ఉందనడానికి ఇది నిదర్శనమని, స్వాతంత్ర్య సమరయోధుడిని పొగడటం కూడా తప్పేనా అని ప్రశ్నించింది. నెహ్రూను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేస్తే కలెక్టర్ అజయ్ సింగ్ గంగ్వార్ ను బదిలీ చేశారంటేనే సామాన్య ప్రజల్లో ఇంకెన్ని భయాలున్నాయోనని కాంగ్రెస్ నేత అఫ్జల్ వ్యాఖ్యానించారు. -
ఆరాటం అసలుకు ముప్పు
జాతిహితం నెహ్రూ, అరుణాచల్ తెగలను క్రైస్తవ బోధకులకు దూరంగా ఉంచి, హిందీ మీడియం విద్య ద్వారా జాతీయ-జాతీయవాద-ప్రధాన స్రవంతిలోకి తెచ్చారు. ఆ తర్వాతా ఇదే వైఖరి కొనసాగింది. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ అక్కడి తెగలను మెల్ల మెల్లగా హైందవీకరణ, భారతీయీకరణ చెందిస్తూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఇప్పుడిక అక్కడ కాంగ్రెస్కు బీ టీం కాదు. హైందవీకరణ వేగంగా సాగాలని అది కోరుతోంది. ఈ కోణం నుంచి చూస్తేనే అరుణాచల్ గవర్నర్ అసహనంగానీ, అస్సాం, త్రిపుర గవర్నర్ల కొన్ని ప్రకటనలుగానీ అర్థమవుతాయి. ‘నేఫాలో నెహ్రూ’ అనే ఆసక్తికర కథనం ఉంది. అయితే నమోదై ఉన్న చారిత్రక ఆధారం చూపి దాన్ని ధృవీకరించలేను. కాకపోతే, ఈశాన్య భారతంలో మీరు కొంత కాలం గడిపేట్టయితే పాత తరం వారి ద్వారా ఆ కథనం మీకు నమ్మకం కలిగించేంత తరచుగా వినిపిస్తుంది. 1952 అక్టోబ ర్లో నెహ్రూ అపాతని తెగ ప్రధాన భూభాగమైన జిరోను సందర్శించారు. తనతో పాటూ ఆయన తన కుమార్తె ఇందిరను కూడా తీసుకెళ్లారు. తెగ పెద్ద ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. ఇందిరంటే ఇష్టపడ్డాడు. నువ్వు మీ తెగకు పెద్దవు, నేను నా తెగకు పెద్దను. నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యొ చ్చుగా? నీకు భారీగా కన్యాశుల్కాన్ని చెల్లిస్తానన్నట్టు మాట్లాడాడు. ఇవ్వజూ పిన కన్యాశుల్కంలో కొన్ని వందల మితున్లు కూడా ఉన్నాయి. అవి ఆవుల కంటే ఎక్కువగా గేదెలనే పోలి ఉండే పశువులు. పాల కోసం కాక, మాంసం కోసం, బలివ్వడానికి, వ్యాపారానికి వాటిని పెంచుతారు. అలాంటి ఓ మితున్ను రాజ్భవన్ ముందు బలిచ్చినందుకు ఆగ్రహించిన ప్రస్తుత గవర్నర్, ముఖ్యమంత్రికి ఉద్వాసన పలికారు. అయితే, నాడు నెహ్రూ మాత్రం అపాతని తెగ పెద్ద మాటలకు నవ్వి, అతని కోరిక తనను ఎంత గానో కదలించిందనీ, కానీ ఇప్పటికే తన కుమార్తెను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసేశానని చెప్పినట్టు తెలిసింది. మితున్ను బలివ్వడాన్ని, నేటి గవర్నర్ రాజ్కోవాకు భిన్నంగా నెహ్రూ అతిథికి చేసే అత్యున్నత సత్కారంగానే చూశాడు తప్ప అవమానంగా భావించలేదు. ఈ ఉదంతంలో ఆ తదుపరి కొంత వర్ణనాత్మకత చేరివుండొచ్చు. అయినా అది, ఈశాన్యమంటే నెహ్రూకు ప్రేమను వ్యక్తంచేస్తుంది. అలా అని వారసత్వంగా సంక్రమించిన ఆ ప్రాంత సమస్యలతో సక్రమంగా వ్యవహరించడం ఎలాగో ఆయనకు తెలుసని కాదు. ఆయన కొన్ని సమస్యలను పరిష్కరించారు, మిగతా వాటిని సంక్లిష్టం చేశారు.అదే క్రమంలో ఆయన ఆ ప్రాంతాన్ని పరిరక్షించి, పాలించి, రిపబ్లిక్లో విలీనం చేసే మూడు సిద్ధాంతాలకు పునాదులను కూడా వేశారు. ఈశాన్యానికి నెహ్రూ మూడు సిద్ధాంతాలు మొదటిది, ఆ ప్రాంత జాతి వైవిధ్యానికి రాజకీయాలలో విశాలమైన స్థానాన్ని కల్పించడం. దాని పర్యవసానంగానే 10 లక్షలు లేక అంతకంటే తక్కువ జనాభాగల నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, చివరకు అరుణా చల్ప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. భాషాప్రాతిపదికకు భిన్నంగా ఆప్రాంతంలో రాష్ట్రాలను జాతి ప్రాతిపదికపై విభజించాల్సి వచ్చింది. ఇక రెండవది, తిరుగుబాటు బెల్ వక్రరేఖా సిద్ధాంతమని నేను పిలిచేది. నాడు అస్సాంలో భాగమైన నాగా పర్వత ప్రాంతంలో 1950లలో తిరుగుబాటు బద్ధలైంది. నెహ్రూ సైన్యాన్ని పంపాడు. ఆ పోరాటం ఎంత తీవ్రంగా సాగిందంటే తిరుగుబాటుదార్లు ఐఏఎఫ్కు చెందిన ఒక డకోటా విమానాన్ని కూల్చేశారు. పెలైట్లను ‘‘బందీలు’’గా పట్టుకున్నారు. అయితే, నెహ్రూ, ఫిజో నేతృత్వం లోని తిరుగుబాటుదార్లతో చర్చలను మాత్రం నిలిపివేయలేదు. ప్రభుత్వం తిరుగుబాటుకు వ్యతిరేకంగా పోరాడుతుంది, నిర్దాక్షిణ్యంగా అణచేస్తుందే తప్ప, చర్చలకు తలుపులను మాత్రం మూసేయదు... అనేది చివరకు ఆయన వైఖరి ఆవిష్కరించిన సిద్ధాంతం. తిరుగుబాటుదార్లు తాము ఎన్నటికీ గెలు పొందలేమని గుర్తించగలిగనపుడు తిరుగుబాటు హింసకు సంబంధించిన బెల్ వక్రరేఖ అధోముఖ స్థానాన్ని చేరుతుంది. ఎటు ఎందరి ప్రాణాలు పోయాయనే స్కోర్తో దానికి నిమిత్తం లేదు. ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం రాజకీయవేత్తలు, గూఢచారులు ఎదురు చూసేది సరిగ్గా అలాంటి సమ యం కోసమే. కొన్ని దశాబ్దాల కాలంలో ఈశాన్యంలోని అన్ని ప్రధాన తిరుగు బాటు గ్రూపులు రాజకీయాధికారానికి బదులుగా శాంతికి అంగీకరించాయి. ప్రభుత్వం ఈ విషయంలో అతి తీవ్రస్థాయి వెసులుబాటు వైఖరిని చూపాలి. రాజ్యాంగపరమైన సృజనాత్మకతను సైతం ప్రదర్శించాలి. సువిశాలమైన ఆర్టికల్ 370 నీడలో నాగాలలో ఉన్న కొన్ని ఆందోళనలకు భరోసాను కల్పించేలా ఆర్టికల్ 371 ఏ (1)ని అలా చేర్చినదే. ‘‘మెల్లగా త్వరితంచేయడం’’ ఇక మూడవ సిద్ధాంతం, అది ఈశాన్యంలోని అత్యంత మారుమూల నున్న విశాలమైన ఉత్తర అంచు నుంచి ఆవిర్భవించినది. అది పశ్చిమాన భూటాన్ నుంచి హిమాలయాలతోపాటే తూర్పున మయన్మార్ వరకు విస్తరించిన వలయాకారపు అంచు. అందులో చాలా భాగం టిబెట్ (చైనా) సరిహద్దున ఉన్నది. బ్రిటిష్ పాలకులు సైతం ఆ ప్రాంతానికివాయవ్య సరిహద్దు ప్రాంతం (ఎన్డబ్ల్యూఎఫ్పీ) లాంటి ప్రత్యేక పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కన్యాశుల్కం, ప్రతీకార పరిహారం సహా ఆదివాసీ చట్టాలే ప్రధానంగా అమలు కావడాన్ని అనుమతించారు. ఆ ప్రాంతాన్ని ఎన్ఈఎఫ్ఏ (నేఫా) లేదా ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ అన్నారు. అది ప్రధాన భారతానికి అతి సుదూరంగా ఉన్న, అతి తక్కువ జనసాంద్రతగలిగిన ప్రాంతం. అయినా, ఈ వారంలో జరిగిన అల్లర్ల వరకు అక్కడ ఎన్నడూ వేర్పాటువాదం లేదా హింసాత్మకవాదం సవాలు ఎదురుకాలేదు. కానీ చైనావారు అది తమదేనని వాదించడం మొదలైంది, 1962లో చైనా ఆ ప్రాంతంపై దురాక్రమ ణకు పాల్పడింది. ఈశాన్య ప్రాంతాన్ని నెహ్రూ సాధారణ ఐఏఎస్ అధికారు లకు వదిలేయలేదు. అక్కడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన భారత సరిహద్దు పాలనా సేవల (ఐఎఫ్ఏఎస్) అధికారులను పంపాడు. వారిలో ఎక్కువమంది అధికారులు సాహసికులు, అన్వేషణాత్మక వైఖరి కలవారు. ఈ ఉన్నతాధికారుల గురించి నేను ఎరిగిన వాటిలో చాలా వరకు నారీ రుస్తుంజీ నుంచి తెలుసుకున్నవే. ఆ అధికారులలో అత్యంత ప్రముఖుడైన ఆయన ‘‘ఇంపెరిల్డ్ బోర్డర్స్: ఇండియాస్ నార్త్ఈస్టర్న్ బోర్డర్ లాండ్స్’’ (ఓయూపీ, 1983) అనే అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. నెహ్రూ అక్కడి తెగల గురించి మరింత మంచి అవగాహనను కోరుకున్నారని, ఇంగ్లిష్ మానవ జాతుల శాస్త్రవేత్త వెరియర్ ఎల్విన్ను సంప్రందించారని తెలిపారు. భారతదేశంలోని ఆదివాసులపై ఆయన అత్యంత ముఖ్యమైన అధ్యయనాన్ని చేశారు. ఆదివాసులకు సంబంధించి ఎల్విన్ సలహాలపై నెహ్రూ విశ్వాసం ఉంచారు. ఆదివాసులను ‘‘బయటి’’ ప్రభావాల నుంచి, వారిని ‘‘నాగరికు లను చేయడం’’ అనే బయటివారి ప్రమాదకరమైన, తప్పుడు అభిప్రాయం నుంచి పరిరక్షించడం ఎల్విన్ పద్ధతిలోని ముఖ్యాంశం. రుస్తుంజీ దాన్ని ‘‘మెల్లగా త్వరితంచేయడం’’ అన్నారు. నెహ్రూ ఆ భావన ను స్వీకరించారు. నెహ్రూకు కూడా నేఫా ప్రాంతానికి చైనీయుల నుంచి ముప్పు ఉందనే ఆందోళన ఉండేది. ైచైనా మద్దతుతో సాగుతున్న నాగా తిరుగుబాటు వైరస్ నేఫాకు సోకితేనో? తూర్పుకొసన నాగాలాండ్తోపాటూ, అరుణాచల్ప్రదేశ్కు కూడా చైనాతో సరిహద్దు ఉంది. చైనావారు నడుచుకుంటూ ఇటు వచ్చేయ వచ్చనేట్టుండేది. నాగాల తరఫు ప్రతినిధులుగా విదేశీ క్రైస్తవ పాస్టర్లతో చర్చలు జరపాల్సి రావడం గురించి నెహ్రూ కలత చెందుతుండేవాడు. కాబట్టి నే డు అరుణాచల్ప్రదేశ్గా పిలుస్తున్న నేఫా ప్రాంతాన్ని క్రిస్టియన్ మత ప్రబోధకులకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. హిందీ మీడియం విద్య ద్వారా అక్కడి తెగలను జాతీయ-జాతీయవాద-ప్రధాన స్రవంతిలోకి తెచ్చారు. అది, ఈశాన్యంలో హిందీ మాట్లాడే ఏకైక రాష్ట్రం. కేంద్రమంత్రి కిరణ్ రిజీజుతో హిందీలోనే మాట్లాడవచ్చు. నెహ్రూ తర్వాత కూడా ఇదే వైఖరి కొనసాగింది. అరుణాచల్లో చర్చి ప్రవేశం కంటే, హిందూ మతబోధ కులు, రామకృష్ణ మిషన్, ఆర్ఎస్ఎస్ల ప్రవేశాన్ని కోరుకుంటానని ఇందిరా గాంధీ, నానాజీ దేశ్ముఖ్తో అన్నారనే కథనాన్ని నేను పూర్తిగా విశ్వసిస్తాను. 1978లో (కేంద్రంలో జనతా ప్రభుత్వం ఉండగా) అరుణాచల్ శాసనసభ మత స్వేచ్ఛ చట్టాన్ని చేసి, మతమార్పిడిని దాదాపు అసాధ్యం చేసింది. ఆ చట్టం ఇంకా బతికి బట్టకడుతుందోంటే దానికి కారణం కాంగ్రెస్- ఆర్ఎస్ఎస్ల మధ్య ఉన్న అంతకంటే పెద్ద సూత్రబద్ధమైన అంగీకారం వల్లనే. అందుకే కేంద్రంలో అధికారం చేతులు మారినప్పుడల్లా, అరుణాచల్ ప్రభుత్వం మొత్తంగానే అటు ఫిరాయించేస్తుంటుంది. జిగాంగ్ అపాంగ్ ‘అరుణాచల్ కాంగ్రెస్’ పేరిట యూపీఏ భాగస్వామిగా ఉన్నారు. ఆ తర్వాత అదే శాసనసభా పార్టీతో బీజేపీ ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. కాంగ్రెస్ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడంతోనే ఆయన మళ్లీ దానిలో చేరిపోయారు. విచ్ఛిన్నమవుతున్న కాంగ్రెస్-ఆర్ఎస్ఎస్ ఐక్యత అక్కడ బీజేపీ ఎదుగుదలతో ఆ ఐక్యత ఇప్పుడు విచ్ఛిన్నమైపోతోంది. ఆర్ఎస్ఎస్కు ఆ ప్రాంతం అంటే వ్యామోహం ఎక్కువ. దాని కీలక భావజాల కర్తలు కొందరు ఆ ప్రాంతం కోసం తమ జీవితాలను అంకితం చేశారు. అయితే, అరుణాచల్ తెగలలో కొన్ని బౌద్ధాన్ని అనుసరించేవి. కొద్ది సంఖ్యలో వైష్ణవులూ ఉన్నారు. గతంలో ప్రకృతి అరాధకులుగా (యానిమిస్టులు) పిలిచినవారే ఎక్కువమంది. అతి పెద్ద తెగలైన ఆది (జిగాంగ్ అపాంగ్), నియిషి (నబోం టుకి), అపాతని (మాజీ సీఎం టోమో రిబా) తెగలవారు దొన్యి-పొలొ అనుయాయులు లేదా సూర్య, చంద్రుల ఆరాధకులు. హిందు వులు అనాదిగా గ్రహ దేవతలను ఆరాధిస్తున్నారాయె. కాబట్టి ఇది ప్రకృతి ఆరాధన ఎలా అవుతుంది? అనేది ఆర్ఎస్ఎస్ దృష్టి. పైగా శని ఆలయం ప్రస్తుతం పతాక శీర్షికల్లో ఉంది. నాగాలు, జిజోలు, ఖాసీలు, గారోలకు విభి న్నమైన రీతిలో కాంగ్రెస్ ఇన్ని దశాబ్దాలుగానూ అరుణాచల్ తెగలను మెల్ల మెల్లగా హైందవీకరణ, భారతీయీకరణ చెందిస్తూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఇప్పుడిక అరుణాచల్లో కాంగ్రెస్కు బీ టీం కాదు. అది ఇప్పుడు హైందవీ కరణ వేగంగా సాగాలని కోరుతోంది. అది ఎంపిక చేసి మరీ నియమించిన అరుణాచల్ గవర్నర్ అసహనంగానీ, అస్సాం, త్రిపుర గవర్నర్ల కొన్ని ప్రకటనలుగానీ ఈ కోణం నుంచి చూస్తేనే అర్థమవుతాయి. నబోమ్ తుకి నియిషీ తెగవాడే అయినా ఆయన అరుణాచల్లో అరుదుగా కనిపించే క్రైస్తవంలోకి పరివర్తన చెందిన వ్యక్తని తెలిసిందే. శేఖర్ గుప్తా, twitter@shekargupta -
నెహ్రూ లేఖపై మళ్లీ రాజుకున్న వివాదం
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ మాజీ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీకి భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1945, డిసెంబర్ 26వ తేదీన రాసినట్టుగా ప్రచారం జరుగుతున్న ఓ లేఖపై మళ్లీ వివాదం రాజుకుంది. అందులో బోస్ను బ్రిటిష్ యుద్ధ నేరస్థుడిగా నెహ్రూ పేర్కొనడం పట్ల రభస జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన వంద ఫైళ్లను నరేంద్ర మోదీ ప్రభుత్వం శనివారం బయటపెట్టిన నేపథ్యంలో మళ్లీ నెహ్రూ వివాదాస్పద లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఈ లేఖ పూర్తిగా నకిలీదని, ఎవరో దురుద్దేశంతోనే సోషల్ మీడియాలో ఈ లేఖను ప్రచారం చేస్తున్నారని, వారందరిని వెతికి పట్టుకొని తగిన శిక్ష పడేలా చూస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ హెచ్చరించారు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత బ్రిటన్ రూపొందించిన ‘యుద్ధ నేరస్థుల’ జాబితాలో సుభాష్ చంద్ర బోస్ పేరు లేదనే విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ, రక్షణ శాఖ 2001లో భారత్కు స్పష్టం చేసిన విషయం తెల్సిందేనని శర్మ వ్యాఖ్యానించారు. ఈ రోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం బోస్కు సంబంధించి విడుదల చేసిన వంద ఫైళ్లలో నెహ్రూ రాసినట్టుగా ప్రచారం అవుతున్న లేఖ, లేకపోవడం గమనార్హం అని చెప్పారు. అయినా ఈ దశలో మోదీ ప్రభుత్వం బోస్కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేవలం మోదీ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ఫైళ్లను బయటపెట్టిందని విమర్శించారు. బోస్ను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ స్వాతంత్య్ర యోధుడిగానే గుర్తిస్తుందని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని అన్నారు. వాస్తవానికి బీజేపీకిగానీ, దాని సంఘ్ పరివార్కుగానీ భారత స్వాతంత్య్ర పోరాటంతో ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘డియర్ మిస్టర్ అట్లీ, మీ యుద్ధ నేరస్థుడు, సుభాష్ చంద్ర బోస్ రష్యా దేశంలోకి ప్రవేశించేందుకు స్టాలిన్ అనుమతించారనే విషయం నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెల్సింది. బ్రిటిష్, అమెరికన్లకు మిత్ర దేశాంగా ఉంటున్న రష్యా, బోస్ను తమ దేశంలోకి అనుమతించడం రష్యన్ల విశ్వాసాలను దెబ్బతీయడమేకాదు, మోసం చేయడం కూడా....ఇట్లు జవహర్లాల్ నెహ్రూ’ అని నెహ్రూ లేఖ రాసినట్లు ప్రచారం జరగుతోంది. -
నేతాజీ అదృశ్యంపై నెహ్రూ ఏం చెప్పారంటే..!!
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర పోరాటయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి శనివారం ఆయన జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించిన వర్గీకృత పత్రాల్లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజా పత్రాల ప్రకారం.. నేతాజీ చనిపోయారనే విషయాన్ని 1962లోనే ఆయన కుటుంబ సభ్యులకు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తెలియజేశారు. బోస్ సోదరుడు సురేశ్ చంద్రబోస్ ఈ మేరకు 1962 మే 13న నెహ్రూ ఓ లేఖ రాశారు. అయితే నేతాజీ మరణం గురించి కచ్చితమైన, ప్రత్యక్షమైన ఆధారాలేవీ తాను పంపలేకపోతున్నానని, అయితే, నేతాజీ మరణం గురించి పరిస్థితులను బట్టి లభిస్తున్న ఆధారాలను విచారణ కమిషన్కు అందజేశానని ఈ లేఖలో ఆయన వెల్లడించారు. 'ఎక్కడోచోట నేతాజీ రహస్యంగా బతికి ఉంటే ఆయనను గొప్ప ఆనందంతో, ఆత్మీయతతో భారత్కు ఆహ్వానించవచ్చు. కానీ ఆ అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సమయం కూడా చాలా మించిపోయింది. ఇది పరిస్థితులకు అనుగుణమైన ఆధారాలకు బలం చేకూరుస్తోంది' అని నెహ్రూ తన లేఖలో పేర్కొన్నారు. నేతాజీ చనిపోయిన విషయాన్నే పశ్చిమ దేశాలు కూడా చెప్తున్నాయని నెహ్రూ పేర్కొన్నారు. తైవాన్లోని తైపీలో 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్టు ఈ అంశంపై 25 ఏళ్లపాటు జరిగిన దర్యాప్తు స్పష్టం చేస్తున్నదని బ్రిటన్కు చెందిన ఓ వెబ్సైట్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. -
నెహ్రూ వల్లే కశ్మీర్ సమస్య!
సోనియా తండ్రి ఫాసిస్టు జవాను! కాంగ్రెస్ పత్రికలో తీవ్ర విమర్శలు కంటెంట్ ఎడిటర్ తొలగింపు సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: ‘నెహ్రూ.. పటేల్ మాట వినివుంటే కశ్మీర్ సమస్య, చైనా, పాక్తో వివాదాలు ఉండేవి కావు. పటేల్ వారిస్తున్నా వినకుండా ఆయన కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి చేతిలో ఉంచారు.. సోనియా గాంధీ తండ్రి ఫాసిస్టు సైనికుడు. సోనియా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న తర్వాత 62 రోజుల్లోనే పార్టీ అధ్యక్షురాలయ్యారు..’ ఈ తీవ్ర విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్కు బద్ధశత్రువైన బీజేపీనో, మరో పార్టీనో చేసినవి కావు. సాక్షాత్తూ కాంగ్రెస్ అధికార పత్రిక ఉద్ఘాటించినవి. పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకునేవేళ కాంగ్రెస్ను ఇవి ఊబిలో పడేసి, ముఖాన్ని కందగడ్డలా మార్చాయి. ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ(ఎంఆర్సీసీ)కి చెందిన హిందీ పత్రిక ‘కాంగ్రెస్ దర్శన్’ డిసెంబర్ సంచికలో వ్యాసకర్తల పేర్లు లేకుండా వచ్చిన రెండు వ్యాసాల్లో ఈ విమర్శలు ఉన్నాయి. చిత్రంగా ఈ సంచికను సోనియా గాంధీకే అంకితం చేసి కవర్ పేజీపై ఆమె ఫొటో ముద్రించారు. సోనియా కాంగ్రెస్ చీఫ్ అయ్యాక పార్టీకి చేసిన సేవలను, ఆమె సాధించిన విజయాలనూ ప్రస్తావించారు. ఈ వ్యాసాలపై కాంగ్రెస్ అధిష్టానం సోమవారం కన్నెర్రజేసింది. దీంతో పత్రిక ఎడిటర్, ఎంఆర్సీసీ చీఫ్ సంజయ్ నిరుపమ్ క్షమాపణలు చెప్పారు. ఎడిటోరియల్ కంటెంట్ ఇన్చార్జి సుధీర్ జోషీని ఆ పదవి నుంచి తప్పించారు. తప్పు చేశాను: నిరుపమ్ ఈ వ్యాసాలతో తనకు సంబంధం లేదని తొలుత పేర్కొన్న ఎడిటర్ నిరుపమ్ తర్వాత తప్పు చేసినట్లు అంగీకరించారు. ‘తప్పు ఒప్పుకుంటున్నాను. తప్పు చేసిన సంపాదక విభాగంపై విచారణ జరుపుతాం. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కానివ్వం’ అని చెప్పారు. మాకు సంబంధం లేదు: కాంగ్రెస్ ‘కాంగ్రెస్ దర్శన్’తో తమకు సంబంధం లేదని, నిరుపమ్ను ఆ పత్రిక ఎడిటర్గా తాము నియమించలేదని కాంగ్రెస్ పేర్కొంది. ‘అది మూతపడిన పత్రిక. పునరుద్ధరణ ప్రయత్నాల్లో ఉంది’ అని పార్టీ ప్రతినిధి టోమ్ వడక్కన్ ఢిల్లీలో అన్నారు. నిరుపమ్ను ఎంఆర్సీసీగానే నియమించామన్నారు. ఆయన అంతా వ్యక్తిగతంగా చేశారని, పత్రిక ఎడిటోరియల్ కంటెంట్ ఎడిటర్ తొలగింపుతోనూ తమకు సంబంధం లేద ని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్టీ నేతలు సల్మాన్ ఖుర్షీద్, రాజ్ బబ్బర్లు పేర్కొన్నారు. వ్యాసాల్లో వాడిన పదజాలం ఆరెస్సెస్ నిఘంటువు నుంచి తీసుకున్నారని మహారాష్ట్ర మాజీ మంత్రి నసీమ్ ఖాన్.. నిరుపమ్పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు ముంబైలోని ఆ పత్రిక కార్యాలయం వద్దకు చేరుకుని నిరుపమ్ వెంటనే పార్టీకి, పత్రిక కు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుపమ్ క్షమాపణలు చెప్పారని, నిర్ణయాన్ని ఎంఆర్సీసీకి వదిలేయాలని పీసీసీ చీఫ్ అశోక్ చవాన్ అన్నారు. శివసేనలో ఉన్నప్పుడు సోనియాను విమర్శించిన నిరుపమ్కు ఇంకా బుద్ధిరాలేదని ముంబై కాంగ్రెస్ నేత ఒకరు అన్నారు. నిరుపమ్కు బీజేపీ అభినందనలు కాంగ్రెస్ ‘సొంత బురద’లో చిక్కుకోవడంతో బీజేపీ సంబరపడిపోయింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.. నిరుపమ్ను అభినందించారు. ‘కాంగ్రెస్ దర్శన్ను ‘సత్యదర్శన్’ అని పిలవాలి. ప్రధాని అయ్యేందుకు పటేల్కు కాంగ్రెస్లో చాలినంత మద్దతు ఉండేది. అయితే గాంధీజీ పటేల్ను పక్కన పెట్టి నెహ్రూ పేరు ప్రతిపాదించారు. పటేల్ 562 సంస్థానాలను భారత్లో విలీనం చేయగా, నెహ్రూ కేవలం కశ్మీర్కు మాత్రమే బాధ్యుడు. అది ఇప్పటికీ సమస్యలా మిగిలింది. ఇది బీజేపీ, నేను అంటున్నమాట కాదు, కాంగ్రెస్ పత్రికే అంది. కాంగ్రెస్ దాచిపెడుతున్నది బయటికొచ్చింది’ అని ఢిల్లీలో అన్నారు. కాంగ్రెస్ పటేల్ గురించి రాయదని, ఇప్పుడు నిజం చెప్పిందని పేర్కొన్నారు. నిరుపమ్ గతంలో శివసేన పత్రిక ‘దోపహర్కా సామ్నా’ సంపాదకుడిగా ఉన్నప్పుడూ ఇలాంటి వ్యాసాలకు ప్రసిద్ధి అని చెప్పారు. నెహ్రూ-గాంధీయేతర కుటుంబాలకు చెందిన పీవీ, లాల్బహదూర్ శాస్త్రి వంటి వారికి కాంగ్రెస్ న్యాయం చేయలేదని అన్నారు. పత్రిక కంటెంట్ ఎడిటర్ను తొలగించడం వాస్తవాలపై కాంగ్రెస్ అసహన వైఖరికి నిదర్శనమని బీజేపీ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ విమర్శించారు. నిరుపమ్ నిజం చెప్పారని, ఆయనను అభినందిస్తున్నామని శివసేన కూడా పేర్కొంది. నెహ్రూ పెడచెవిన పెట్టారు! ‘కాంగ్రెస్ దర్శన్’లో వచ్చిన రెండు వ్యాసాల్లో ఒకదాంట్లో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను విమర్శించారు. తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ వర్ధంతి(ఈ నెల 15) సందర్భంగా రాసిన ఈ వ్యాసంలో పటేల్ను దార్శనికత గల నేత అని కొనియాడారు. నెహ్రూతో ఆయన విభేదాలను ప్రస్తావించి, పటేల్ మాటలను తొలి ప్రధాని పెడచెవిన పెట్టారని ఆరోపించారు. ‘ఆనాడు పటేల్ అభిప్రాయాలను నెహ్రూ పరిగణనలోకి తీసుకుని ఉంటే కశ్మీర్, చైనా, టిబెట్, నేపాల్కు సంబంధించిన సమస్యలు ఇప్పుడు ఉండేవి కావు. కశ్మీర్ అంశాన్ని నెహ్రూ ఐరాస ముందుకు తీసుకెళ్లే యత్నాన్ని పటేల్ వ్యతిరేకించారు. పటేల్ అభిప్రాయాలను నెహ్రూ పట్టించుకోకపోవడంతో ఇద్దరి అనుబంధం తెగే స్థితికి వచ్చింది. పటేల్ ఉప ప్రధాని, హోంమంత్రి అయిన్పటికీ విదేశీ విధానంలో ఆయన ముందుచూపుతో నెహ్రూ ఏకీభవించలేదు. ఒక దశలో పరిస్థితి పటేల్ రాజీనామా చేయాలనుకునేదాకా వెళ్లింది’ అని పేర్కొన్నారు. టిబెట్ విషయంలో చైనాను నమ్మొద్దని, అది భారత్కు శత్రువు అవుతుందని 1950లో పటేల్ రాశారంటూ ఓ లేఖను ఉటంకించారు. 62 రోజుల్లోనే అధ్యక్ష పదవి మరో వ్యాసంలో సోనియా గాంధీ తొలినాళ్ల వ్యక్తిగత జీవితాన్ని వివరించారు. ఆమె ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్న విషయాన్ని ఉటంకించారు. ‘సోనియా తండ్రి స్టెఫానో మైనో ఫాసిస్టు సైనికుడు. రెండో ప్రపంచయుద్ధంలో ఓడిన ఇటలీ సైన్యంలో ఆయన పనిచేశారు’ అని తెలిపారు. సోనియా వేగవంతమైన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ..‘ఆమె 1997లో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న తర్వాత కేవలం 62 రోజుల్లోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. మెజారిటీ లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు విఫలయత్నం చేశారు’ అని విశ్లేషించారు. ఘనంగా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారమిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, గులాం నబీ ఆజాద్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమం తర్వాత కాసేపు కార్యాలయంలో మాట్లాడుకున్న సోనియా, రాహుల్లు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. -
సోనియా తండ్రి 'ఫాసిస్టు సైనికుడు'!
-
సోనియా తండ్రి 'ఫాసిస్టు సైనికుడు'!
న్యూఢిల్లీ: ఆవిర్భావ దినోత్సవం నాడే కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఎదురైంది. సాక్షాత్తూ సొంత పత్రికలోనే పార్టీ తాజా, మాజీ అధినేతలపై విమర్శలు చేస్తూ వ్యాసాలు వెలువడటం కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. 'కాంగ్రెస్ దర్శన్' పత్రికలో దేశ మొదటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ దిగ్గజ నేత జవహర్లాల్ నెహ్రూపైనే కాదు.. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీపైనా తీవ్ర ఆరోపణలు ప్రచురితమయ్యాయి. సోనియాగాంధీ తండ్రి ఓ ఫాసిస్టు సైనికుడంటూ ఆరోపణలు పత్రికలో దర్శనమివ్వడం కాంగ్రెస్ నేతల్ని బిత్తరపోయేలా చేసింది. సోనియా తండ్రి ఇటాలియన్ ఫాసిస్టు సైన్యంలో సభ్యుడని, ప్రపంచయుద్ధంలో రష్యా చేతిలో ఈ సైన్యం ఓడిపోయిందని 'కాంగ్రెస్ దర్శన్'లో పేరు లేకుండా వెలువడిన ఓ వ్యాసం పేర్కొంది. సోనియా తండ్రి స్టెఫానో మైనో మాజీ ఫాసిస్టు సైనికుడని తెలిపింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ అతి తక్కువకాలంలో అధ్యక్షురాలిగా ఎదిగారని వ్యాఖ్యానించింది. రాజకీయాల్లోకి రాముందు ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రముఖంగా ప్రస్తావించింది. సోనియా ఒకప్పుడు ఎయిర్హోస్టెస్ కావాలనుకున్నారని వ్యాసంలో పేర్కొంది. '1997లో కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా నమోదైన సోనియాగాంధీ కేవలం 62 రోజుల్లోనే పార్టీ అధ్యక్షురాలిగా మారారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆమె కొన్ని విఫలయత్నాలు చేశారు' అని ఈ వ్యాసం పేర్కొంది. 'కాంగ్రెస్ దర్శన్' ముంబై యూనిట్ పత్రికలో కశ్మీర్, చైనా, టిబెట్ విషయంలో తొలి ప్రధాని నెహ్రూ అనుసరించిన విధానాన్ని తప్పుపడుతూ వ్యాసం వెలువడిన సంగతి తెలిసిందే. జాతీయ కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవంగా పార్టీ అధికార పత్రికలో వచ్చిన ఈ వ్యాసాలతో ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్ పార్టీ 'కాంగ్రెస్ దర్శన్' కంటెంట్ ఎడిటర్ సుదీప్ జోషిపై వేటు వేసింది. -
నెహ్రూపై మండిపడిన 'కాంగ్రెస్ దర్శన్'
-
నెహ్రూపై మండిపడిన 'కాంగ్రెస్ దర్శన్'
సొంత పార్టీ పత్రికలో.. తమ పార్టీకే చెందిన దివంగత నేత, అది కూడా భారతదేశ తొలి ప్రధాని.. జవహర్లాల్ నెహ్రూను నిందించడం కాంగ్రెస్ తలకు చుట్టుకుంది. ఆ పార్టీ అధికార పత్రిక 'కాంగ్రెస్ దర్శన్' (హిందీ)లో భారతదేశ నెహ్రూను నిందిస్తూ ఓ వ్యాసం ప్రచురితమైంది. కాంగ్రెస్ 131వ వ్యవస్థాపక దినాన్ని పురస్కరించుకొని ఈ పత్రికలో ప్రచురించిన కథనం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. చైనా, టిబెట్ దేశాలతో విదేశీ వ్యవహారాల విషయంలో అప్పటి ప్రధాని నెహ్రూ.. స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ మాటను పెడచెవిన పెట్టారని విమర్శించింది. అంతర్జాతీయ వ్యవహారాల మీద పట్టున్న పటేల్ సలహాలను నెహ్రూ పాటించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ దర్శన్ (హిందీ ఎడిషన్) డిసెంబర్ సంచికలో డిసెంబర్ 15న పటేల్ వర్ధంతి సందర్భంగా పటేల్కు నివాళులర్పింస్తూ ప్రచురించిన ఈ వ్యాసంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా 1950లో పటేల్ రాసిన లేఖలను ఉటంకించారు. చైనాకు అనుకూలంగా ఉన్న నెహ్రూ వైఖరిని పటేల్ తప్పుబట్టారని, నేపాల్ విషయంలో కూడా ఆయన ధోరణిని తప్పుబట్టారని వ్యాసంలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇండియాకు చైనా పెద్ద శత్రువుగా మారబోతోందని పటేల్ వ్యాఖ్యానించినట్టు తెలిపారు. అలాగే కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లడాన్ని వ్యతిరేకించారన్నారు. విదేశీ వ్యవహారాల్లో ప్రవీణుడైన పటేల్ సలహాలను పాటించి ఉంటే గోవా పదేళ్ల ముందుగానే స్వాతంత్ర్యాన్ని పొంది ఉండేదంటూ వ్యాఖ్యానించడం కాంగ్రెస్ విధేయులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానం, హిందూ - ముస్లిం ఐక్యతతో పాటు, అప్పటి ఇద్దరు కాంగ్రెస్ అగ్రనేతల మధ్య ఘర్షణలను విమర్శిస్తూ దాదాపు 6 పేజీల్లో సాగిన ఈ కథనం తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. పటేల్ ఉప ప్రధాని, హోం మంత్రిగా ఉన్నా. ఇద్దరు నాయకుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, ఇరు నేతలు వివిధ సందర్భాల్లో రాజీనామా చేస్తామని బెదిరించారని వ్యాసంలో రాశారు. పటేల్ దూరదృష్టిని నెహ్రూ అంగీకరించి ఉంటే, అంతర్జాతీయ వ్యవహారాల్లో అనేక సమస్యలు తలెత్తేవి కావని చెప్పారు. అయితే పొరపాటు జరిగిందని, ఇది తనకు తెలిసి జరిగింది కాదని బాధ్యులపై చర్య తీసుకుంటామని ముంబై కాంగ్రెస్ చీఫ్, పత్రిక సంపాదకుడు సంజయ్ నిరుపమ్ ప్రకటించారు. ఒకవైపు అధికార బీజేపీ ఉక్కుమనిషి పటేల్ను కీర్తిస్తూ, నెహ్రూపై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో స్వయంగా తమ పార్టీ అధికార పత్రిలో వివాదాస్పద కథనం రావడం సంచలనం రేపింది. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
ఆధునిక దేవాలయానికి 60 ఏళ్లు
నాగార్జునసాగర్కు పునాదిరాయి పడింది ఈ రోజే ♦ పూర్తిగా మానవశక్తితో నిర్మించిన మహా ప్రాజెక్టు ♦ ఉభయ రాష్ట్రాల అన్నపూర్ణ.. పసిడి పంటల చిరునామా ♦ ప్రాజెక్టుకు తొలి ప్రధాని, కాలువలకు ఇందిర శంకుస్థాపన ♦ ఆధునీకరణ పూర్తి కాకపోవడంతో నేటికీ చేరని ఆయకట్టు లక్ష్యం నాగార్జునసాగర్: ‘‘ఇది భారత ప్రజా సౌభాగ్య మందిరానికే శంకుస్థాపన. ఈనాడు మనం ఆసేతుహిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న నవ దేవాలయాలకు ఇది చిహ్నం’’.. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన సంద ర్భం గా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసి న వ్యాఖ్యలివీ! తెలుగు నేలను పసిడిమయం చేసే దిశగా 1955, డిసెంబర్ 10న నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ఆధునిక దేవాలయానికి గురువారంతో సరిగ్గా 60 ఏళ్లు నిండనున్నాయి. ఆనాడు నెహ్రూ కన్న కలలను నిజం చేస్తూ కోట్లాది మంది ప్రజలకు జీవనాధారంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అన్నపూర్ణగా ఈ ప్రాజెక్టు విరాజిల్లుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో మానవశక్తితో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. సాగునీటి కోసం కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. కుడికాలువను జవహర్ కాలువగా, ఎడమ కాలువను లాల్బహుదూర్ కాలువగా పిలుస్తారు. జవహర్ కాలువ సాగర్ రిజర్వాయర్ నుంచి ఆనకట్టకు కుడివైపు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కాలువ పనులను అప్పటి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 10 అక్టోబర్ 1956న ప్రారంభించారు. దక్షిణ విజయపురి వద్ద ఈ కాలువ సొరంగ మార్గం ప్రారంభమై 392 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. దీని ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లా ల్లో 11.74 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్ ఎడమ వైపు నుంచి ప్రారంభమయ్యే కాలువ... పొట్టిచెలమ నుంచి చల కుర్తి వరకు సొరంగమార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ కాలువ నిర్మాణ పనులను నాటి గవర్నర్ భీమ్సేన్ 1959లో ప్రారంభించారు. దీని పొడవు 349 కిలో మీటర్లు. దీని కింద 10.37 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. 132 టీఎంసీలను కేటాయించారు. రిజర్వాయర్ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు కుడి కాలువ లాగే ఈ కాలువకు కూడా నీటిని విడుదల చేయొచ్చు. సాగర్ ప్రాజెక్టు ఒకసారి నిండితే ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1967, ఆగస్టు 4న కుడి, ఎడమ కాలువలకు నీటిని వదిలారు. దేదీప్యమానంగా ప్రాజెక్టు 60 ఏళ్ల సాగర్ అందంగా ముస్తాబైంది. శంకుస్థాపన పిల్లర్తోపాటు డ్యాం ప్రధాన ద్వారాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. డ్యాంపై 22, 41 బ్లాకు వద్ద సిగ్నల్స్ కోసం ఏర్పా టు చేసిన శిఖరాలకు దీపాలంకరణ చేశారు. గురువారం ఉదయం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే ప్రత్యేక నిధులు లేకపోవడంతో షష్టిపూర్తి ఉత్సవాలు లేనట్లేనని అధికారులు చెబుతున్నారు. అప్పటి లక్ష్యం నేటికీ చేరని వైనం సాగర్ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నేటికీ నెరవేరలేదు. నాడు తవ్విన కాల్వలు, సిమెంటు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రస్తుతం కాలువల చివరి భూములకు నీరు చేరే పరిస్థితి లేదు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సాగర్లో స్వర్ణోత్సవాలు జరిపారు. కాలువల ద్వారా చిట్టచివరి ఎకరం కూడా తడవాలన్న ఉద్దేశంతో సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. ప్రపంచబ్యాంకు నిధులు మంజూరు కాకున్నా వాటి కోసం ఎదురుచూడకుండా పనులు మొదలు పెట్టారు. ఆయన మరణం తర్వాత ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరైనా ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.1600 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రూ.900 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ.200 కోట్లు చెల్లిస్తే పనులు పూర్తికానున్నాయి. మెయిన్ కెనాల్స్ పనులు 90 శాతం పూర్తికాగా పంట కాల్వల పనులు కేవలం 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. రెండు పంటలకు చాలని నీరు నాగార్జునసాగర్ జలాశయంతో పాటు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయంలో పూడిక చేరడంతో రెండు పంటలకు నీరు సరిపోవడం లేదు. దీనికితోడు నీటి విడుదల ఆలస్యం కావడంతో కొన్నిసార్లు నీరు వృథాగా పోతోంది. ఇప్పటికీ ఏ తూము ద్వారా ఎంత నీటిని విడుదల చేస్తే ఎన్ని ఎకరాలు పారుతుందన్న కచ్చితమైన సమాచారం అధికారుల వద్ద లేదు. ఇన్నేళ్లకు కూడా నేటికీ చివరి భూములకు నీరు చేరడం లేదంటే అధికారుల పనితీరును అర్థం చేసుకోవచ్చు. -
నెహ్రూ నేరం ఏమిటి?
త్రికాలమ్ కాంగ్రెస్, బీజేపీ రెండు కూటములకు నాయకత్వ స్థానంలో నిలిచాయి. అదే రకమైన భావజాలాల ప్రాతిపదికగా సమాజంలోనూ సమీకరణాలు జరుగుతున్నాయి. ఇవి మర్యాదకు లోబడి, చర్చకు పరిమితమైనంత కాలం ప్రమాదం లేదు. అభిప్రాయభేదాలు ఉండవచ్చు. అది ఆరోగ్య లక్షణమే. కానీ షారుఖ్ ఖాన్ని పాకిస్తాన్కు వెళ్ళిపొమ్మనడం, ఆర్ఎస్ఎస్ను ఐఎస్ఐతో పోల్చడం దారుణమైన తీవ్రవాద వైఖరులే. నెహ్రూ స్వప్నించిన భారత్ను ఛిద్రం చేసేవే. దేశంలో ప్రబలుతున్న అసహనం పట్ల ఆగ్రహంతో ఒక ప్రదర్శన, అసహనంపై ఆగ్రహం పట్ల అభ్యంతరం వెలిబుచ్చుతూ పోటీ ప్రదర్శన. ఒకటి కాంగ్రెస్ అధ్య క్షురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో. రెండోది బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నేతృత్వంలో. మతసహనంపైన పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలు కలిగిన రెండు శ్రేణుల ప్రతినిధులనూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలుసుకొని వారి వాదనలు విని పంపించివేశారు. ప్రణబ్దా స్వయంగా అసహనంపైన రెండు వారాలలో రెండు విడతలు వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో ఒక రాష్ట్రపతి దేశంలో మతసహనం ఆవశ్యకతను నొక్కివక్కాణించిన సందర్భం ఇదే. పండిట్ జవహర్లాల్ నెహ్రూ 125వ జయంత్యుత్సవాలు జరుగుతున్న సందర్భంగా మతసామరస్యంపైన వేడి, వాడి చర్చకు ఢిల్లీ వేదిక కావడం విశేషం. భిన్న మతాలూ, భాషలూ, ప్రాంతాలూ, సంస్కృతులకు వేదికైన దేశంలో ఏమి జరిగే ప్రమాదం ఉన్నదని నెహ్రూ భయపడ్డాడో సరిగ్గా అదే జరుగుతోంది. స్వేచ్ఛ, బహు ళత్వం, లౌకికవాదం, శాస్త్రీయ దృక్పథం మాత్రమే భిన్నత్వంలో ఏకత్వం సాధించి ఇండియాను సమైక్యంగా ఉంచగలవని ప్రగాఢంగా విశ్వసించిన ప్రజానాయకుడు నెహ్రూ. భారత స్వాతంత్య్ర సమరానికి గాంధీజీ సారథ్యం వహిస్తే, వందల సంస్థానాలను విలీనం చేసి స్వతంత్ర భారతదేశానికి సమగ్ర స్వరూపం ప్రసాదించిన ఘనత సర్దార్ పటేల్ది. నవభారత నిర్మాణా నికి బలమైన పునాదులు వేసిన దార్శనికుడు పండిట్ నెహ్రూ. ఎవరు అవు నన్నా, కాదన్నా ఇది చరిత్ర. నెహ్రూ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, ప్రధానిగా ఏ భావజాలాన్ని అయితే నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాడో దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్రమోదీ 2014 లోక్సభ ఎన్నికలలో ఘనవిజయం సాధించి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ క్షణం నుంచి నెహ్రూ విధానాలకూ, భావాలకూ, విలువలకూ గ్రహణం పట్టబోతున్నట్టు ప్రచారం ఆరంభమైంది. గాంధీ-నెహ్రూ వంశ పాలనపై ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తిన మోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడంతో ఈ ప్రచారం ఊపందుకున్నది. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడే ముగ్గురు నేతల హత్యలు జరగడం, కొందరు బీజేపీ నాయకులు బాధ్య తారహితంగా ప్రకటనలు చేయడంతో చాలామంది కళాకారులూ, రచయితలూ సాహిత్య అకాడెమీ అవార్డులనూ, పద్మపురస్కారాలనూ తిరిగి ఇచ్చివేయడంతో దేశంలో పెద్ద దుమారమే చెలరేగింది. ‘అవార్డు వాపసీ’ కార్యక్రమం వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నదనీ, కాంగ్రెస్ హయాంలో అవార్డులూ, రివార్డులూ పొందినవారు మోదీనీ, ఆయన ప్రభుత్వాన్నీ పలచన చేయడానికి నిరసన పేరు మీద అవార్డులు తిరిగి ఇచ్చి వేస్తున్నారనీ ప్రస్తుత పాలకులకు సానుకూలురైన రచయితలూ, కళాకారులూ విమర్శిస్తున్నారు. ఇదివరకు కొందరిని సూడో సెక్యులరిస్టులు అంటూ అపహాస్యం చేసినట్టుగానే ఇప్పుడు ‘సోకాల్డ్ ఇంటలె క్చువల్స్’ అంటూ అవార్డులు వెనక్కి ఇస్తున్నవారిని వెక్కిరిస్తున్నారు. అరుంధతీ రాయ్ని, పుష్పాభార్గవ్ని, ఆనంద్ పట్వర్థన్ని, నయనతారా సెహగల్ని ‘సోకాల్డ్ ఇంటలెక్చువల్స్’ అంటే వారికి వచ్చే నష్టం ఏమీ లేదు. వారు రచయితలుగా, శాస్త్రవేత్తలుగా, సినీ దర్శకులుగా సుప్రసిద్ధులు. ఇది కృత్రిమంగా సృష్టించిన అసహనమే కానీ సహజ సిద్ధమైనది కాదనీ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పదే పదే చెబుతున్నారు. అసహనంపైన వ్యాఖ్యానించినందుకు హీరో షారుఖ్ ఖాన్పైన బీజేపీ గోరఖ్పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్, సాధ్వీ ప్రాచీ పేలిన అవాకులూ చెవాకులకూ బిహార్ ఎన్నికలకూ సంబంధం ఉన్నదో లేదో తెలియదు. ఇక్కడ బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్లోని ఉగ్రవాదులు సంబరాలు చేసుకుంటారంటూ బిహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్షా వ్యాఖ్యానించడం, ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానంటున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఓబీసిల రిజర్వేషన్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రధాని మోదీ ఆరోపించడం ఓటర్లను మత ప్రాతిపదికపైన ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నాలుగానే చూడవలసి వస్తుంది. ఉదార విలువల పాతర అసహనం పేరుమీద జరుగుతున్న నిరసన ప్రదర్శనలకీ, చరిత్రలో నెహ్రూ స్థానం తగ్గించేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నదనే ఆరోపణకీ సంబంధం ఉన్నదా? నెహ్రూ బోధించిన, పాటించిన ఉదారవాద విలువలకు ఇప్పుడే ప్రమాదం ముంచుకొచ్చిందనే కాంగ్రెస్ ప్రచారంలో నిజం ఉన్నదా? వాస్తవా నికి భారత ప్రధానులలో ఉదారవాదులుగా చెప్పుకోదగినవారు ఇద్దరే- జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజపేయి. నెహ్రూ ఉదారవాదానికి ఆయన కుమార్తె ఇందిరాగాంధీ ఎమర్జన్సీ ప్రకటించి గండికొట్టిన వాస్తవాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఇతరత్రా ఇందిర సాధించిన విజయాలు ఏమైనప్పటికీ న్యాయవ్యవస్థనూ, పార్లమెంటరీ వ్యవస్థనూ భ్రష్టుపట్టించింది ఆమె హయాం లోనే. ముఖ్యమంత్రులను సీల్డ్ కవర్లతో నియమించింది ఇందిరే. శిలాన్యాస్కు అనుమతించడం, షాబానో కేసులో ముస్లిం మహిళల ప్రయోజనాలకు విఘా తం కలిగించడం ద్వారా నెహ్రూ మనమడు రాజీవ్ గాంధీ లౌకిక విలువలకు భంగం కలిగించాడు. నిజానికి, నెహ్రూ తర్వాత కాంగ్రెస్ నాయకులలో అత్య ధికులు ఇండియాను రెండు మతాల (హిందూ, ఇస్లాం) సమాఖ్యగానే భావిం చారు. ముస్లింలను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ పార్టీ పరిగణించిందనే మిత వాదుల వాదనలో నిజం లేకపోలేదు. కనుక నెహ్రూ విలువలకు మోదీ ఇప్పుడు కొత్తగా పాతర వేస్తున్నాడనే విమర్శ అర్ధరహితం. నెహ్రూ విధానాలపైన బీజేపీ చేస్తున్న దాడిని కాంగ్రెస్ ఒంటరిగా ఎదుర్కోగలదంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రకటించడం హాస్యాస్పదం. ఢిల్లీ వీధులలో జరుగుతున్న ప్రదర్శనలు రాజకీయ నాయకులలో, రచయితలలో, మేధావులలో, కళాకారులలో పెరుగుతున్న అసహనానికి సంకే తమా? అతివాద, మితవాద శిబిరాలుగా సమాజం చీలిపోతున్నదనడానికి నిదర్శనమా? బిహార్ శాసనసభ ఎన్నికల సమయంలో ఢిల్లీలో, ముంబైలో సంభవించిన పరిణామాల ప్రభావం ఎన్నికల ఫలితాలపైన ఏ మేరకు ఉంటుం దనే ప్రశ్నకు ఈ రోజు సమాధానం లభిస్తుంది. కానీ అసహనంపైన చర్చ బహుశా వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ కొనసాగుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టవలసిన అవసరం ఉన్నదని రాజకీయ పార్టీలు భావించినప్పుడు అస్థిరత అనివార్యం. ఇండియా వంటి దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. బిహార్ తర్వాత పశ్చిమబెంగాల్, అస్సాం, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చర్చ బాధ్యతాయుతంగా, వాస్తవాల ప్రాతిపదికపైన జరగకుండా నిగూఢమైన ప్రయోజనాల కోసం వాస్తవాల వక్రీకరణ జరిగినప్పుడూ, తమ వాదనకు బలం చేకూర్చే అంశాలను మాత్రమే స్వీకరించి, బలహీనపరిచే అంశాలను బుద్ధి పూర్వకంగా విస్మరించినప్పుడూ అది టీవీలలో నిత్యం చూస్తున్న రచ్చ అవు తుందే కానీ నిర్మాణాత్మకమైన చర్చ కాజాలదు. దేశంలో అసహనం ఇప్పుడే పెరిగిందా? 1984లో సిక్కుల ఊచకోత జరిగి నప్పుడు మీరెక్కడున్నారు? ఎందుకు అవార్డులు అప్పుడు వాపసు చేయలేదు? 1992లో బాబరీ మసీదు విధ్వంసం తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగిన ప్పుడు ఎందుకు నిరసన ప్రకటించలేదు? అంటూ ప్రశ్నించే మేధావులూ, టీవీ యాంకర్లూ 2002 నాటి గుజరాత్ పరిణామాలను ప్రస్తావించరు. గుజరాత్ గురించి మాట్లాడేవారు సిక్కుల మారణకాండ గురించి ప్రస్తావించరు. అన్ని వాస్తవాలనూ పరిగణనలోకి తీసుకొని సమస్య పరిష్కారానికో, మార్గదర్శ నానికో ప్రయత్నిస్తే ప్రయోజనం ఉంటుంది. మూడు గ్రంథాలు స్వాతంత్య్ర సమర కాలంలో నెహ్రూ పదేళ్ళ జైలు జీవితంలో మూడు బృహత్ గ్రంథాలు రచించాడు. ఒకటి, కుమార్తె ఇందిరకు రాసిన లేఖలు- గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. రెండు, డిస్కవరీ ఆఫ్ ఇండియా. మూడు, ఆత్మకథ. 1947 ఆగస్టు 15న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు మాసాలకే నెహ్రూ ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం ప్రారంభించాడు. రెండు వారాలకు ఒక లేఖ చొప్పున ఆయన అధికారంలో ఉన్న 17 సంవత్సరాలూ బీరుపోకుండా రాశాడు. 1964లో కన్నుమూయడానికి కొన్ని మాసాల ముందు వరకూ ముఖ్య మంత్రులతో లేఖల ద్వారా సంభాషణ సాగుతూనే ఉన్నది. దేశం చీలిపోయి పంజాబ్లో వేలమంది హిందువులూ, సిక్కులూ, ముస్లింలూ మరణించిన సమయంలో, మతోన్మాదం జడలు విప్పి కరాళనృత్యం చేస్తున్న పాడుకాలంలో నెహ్రూ ప్రధానిగా పగ్గాలు చేతబట్టారు. అయిదు మాసాలు తిరక్కుండానే మహాత్మాగాంధీ హత్య జరిగింది. ఆర్ఎస్ఎస్ భావజాలం గాంధీని బలి తీసుకున్నదని నెహ్రూ అభిప్రాయం. ఆర్ఎస్ఎస్పైన శాశ్వత నిషేధం విధిం చాలని వాదించాడు. దేశీయాంగమంత్రి సర్దార్ పటేల్ అందుకు అంగీకరిం చలేదు. నిషేధం విధించి కొంత కాలం తర్వాత ఎత్తివేశారు. దేశం చీలిపోవ డానికి నెహ్రూ కారకుడని ఆర్ఎస్ఎస్ బలంగా నమ్ముతోంది. ‘ఇండియా విన్స్ ఫ్రీడం’లో మౌలానా ఆజాద్ నెహ్రూనీ, పటేల్నీ దోషులుగా నిలబెడతారు. జిన్నాతో సమాలోచనలు జరపడానికి వీరిద్దరూ నిరాకరించారనీ, దేశ విభజనే వారి అభిమతమనీ ఆజాద్ అభిప్రాయం. కానీ నెహ్రూ కంటే పటేల్నే ప్రధాన కారకుడుగా (ది ఫౌండర్ ఆఫ్ పార్టిషన్) ఆజాద్ అభివర్ణించాడు. చైనాతో యుద్ధం హిమాలయ సదృశమైన వైఫల్యం అనడంలో అతిశయోక్తి లేదు. షేక్ అబ్దుల్లాను అరెస్టు చేయడం నెహ్రూ చేసిన అనేక తప్పిదాలలో ఒకటి. దాదాపు అర్ధ శతాబ్దం రాజకీయాలలో అత్యంత కీలకస్థానంలో ఉన్న వ్యక్తి కొన్ని పొర బాటు నిర్ణయాలు తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు. బహుళార్థ సాధక నీటి ప్రాజె క్టులను నిర్మించి, వివిధ దేశాల సహకారంతో ఐఐటీలను నెలకొల్పి, ఉక్కు కర్మా గారాలనూ, అణుశాస్త్ర పరిశోధనకూ, అంతరిక్ష పరిశోధనకూ అవసరమైన వ్యవస్థలనూ సమకూర్చిన నెహ్రూ నిస్సందేహంగా నవభారత నిర్మాత. స్వాతం త్య్రం సిద్ధించిన సమయంలో దేశ సమగ్రతనూ, సమైక్యతనూ పరిరక్షిస్తూ ప్రణాళికాబద్ధమైన ప్రగతి సాధించేందుకు అవసరమని భావించిన ఆర్థిక విధా నాలు అమలు చేశాడు. వాటిని ప్రజలు ఆమోదించారు. అనంతరం సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలింది. సోవియట్ యూనియన్ పతనంతో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. నెహ్రూ నిర్మించిన అలీనోద్యమం అప్రస్తుతమైపోయింది. ఆర్థిక సంస్కరణలు అమలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. రాజకీయాలలో రెండు భావజాలాలకు ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్, బీజేపీ రెండు కూటములకు నాయకత్వ స్థానంలో నిలిచాయి. అదే రకమైన భావజాలాల ప్రాతిపదికగా సమాజంలోనూ సమీకరణాలు జరుగుతు న్నాయి. ఇవి మర్యాదకు లోబడి, చర్చకు పరిమితమైనంత కాలం ప్రమాదం లేదు. అమెరికాలో డెమొక్రాట్లకూ, రిపబ్లికన్లకూ మధ్య, బ్రిటన్లో లేబర్, కన్స ర్వేటివ్ పార్టీలకూ మధ్య అనేక అంశాలపైన భిన్నాభిప్రాయాలు ఉన్నట్టే ఇండి యాలో కూడా అభిప్రాయభేదాలు ఉండవచ్చు. అది ఆరోగ్య లక్షణమే. కానీ షారుఖ్ ఖాన్ని పాకిస్తాన్కు వెళ్ళిపొమ్మనడం, ఆర్ఎస్ఎస్ను ఐఎస్తో పోల్చ డం దారుణమైన తీవ్రవాద వైఖరులే. నెహ్రూ స్వప్నించిన భారత్ను ఛిద్రం చేసేవే. నెహ్రూకు నివాళి అర్పించవలసిన పద్ధతి ఇది కాదు. కె.రామచంద్రమూర్తి -
‘ఉదారవాద’ శవపరీక్ష
జాతిహితం నెహ్రూవాద ఉదారవాద భారతమనే భావనను ఆయన వారసులు ధ్వంసం చేస్తున్నప్పుడు మన ఉదారవాద వామపక్షంలో చాలావరకు అందుకు సహకరించింది. అసహనం, సంకుచితత్వం ఎలాంటిదయినా వ్యతిరేకించి తీరాల్సిందే. అయితే, ప్రస్తుత నిరసనల్లో కొంత ఏడుపు కూడా వినవస్తోంది. అది ప్రభుత్వ ఆదరణను కోల్పోయామన్న ఆక్రోషం నుంచి పుట్టుకొస్తున్నది. నేటి కొత్త తరం వామపక్ష- ఉదారవాదమనే పాత ఫక్కీ భావనను అంగీకరించదు. కాబట్టి హిందూ ఉదారవాదాన్ని ఎదుర్కోవడానికి కొత్త ప్రధాన స్రవంతి ఉదారవాదం అవసరం. ఈ ప్రశ్నను మీరు చాలా రకాలుగా అడగొచ్చు. భారత ఉదారవాదులది ఏపాటి ఉదారవాదం? వారు ఎంతగా వామపక్షం? లేదా భారత వామపక్ష వాదులు ఎంతగా ఉదారవాదులు? ఇంకా చెప్పాలంటే, భారత ఉదారవాద భావన ముప్పును ఎదుర్కొంటోందా? అదే నిజమైతే, దేశం దాన్నెలా ఎదు ర్కోవాలి? అసలు దాన్ని ఎందుకు ఎదుర్కోవాలి? అసలు మనమంతా ఆందోళన చెందుతున్నది నెహ్రూవాద ఉదారవాద భావన గురించేనా? అందుకే అయితే దాని పరిరక్షణకు సమయం మించిపోయి దశాబ్దాలు గడచి పోయాయి. భూస్థాపితమైన నెహ్రూ ఉదారవాదం సోవియట్ యూనియన్కు జూనియర్ భాగస్వామిగా ఉండటానికి అంగీక రిస్తూ ఆ దేశంతో వ్యూహాత్మక ఒప్పందంపై నెహ్రూ కుమార్తె సంతకం చేస్తున్న ప్పుడే ఆ పని చేయాల్సింది. 1969లో, మితవాది అని అస్పష్టంగా అని పించిన వారిని సైతం కాంగ్రెస్ నుంచి గెంటిపారేసి, కంటికి కనిపించిన ప్రతి దాన్నీ ఆమె జాతీయీకరణ చేసేస్తున్ననాడే దాన్ని పరిరక్షించాల్సి ఉండింది. ఇక ఆమె విధించిన అత్యవసర పరిస్థితి ఇంకా ఏమైనా మిగిలి ఉన్న అసలైన నెహ్రూవాద భారతదేశమనే భావన అవశేషాలను సైతం తుడిచి పెట్టేసింది. 1969-1989 మధ్య రెండు దశాబ్దాల కాలంలోనే మనం మన అలీన విధా నాన్ని, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఇంకా మిగిలి ఉన్న కొద్దిపాటి ఆర్థిక స్వాతం త్య్రాలను కోల్పోయాం, అత్యవసర పరిస్థితిని భరించాం. తిరుగుబాటు ఉద్య మాలు పెచ్చరిల్లడం, ఆర్టికల్ 356ను ప్రయోగించి అలవోకగా ప్రజలు ఎన్ను కున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేయడం, పుస్తకాలు, సినిమాలపై నిషేధం విధించడం, షాబానో కేసు తీర్పును తిరగరాయడం, అయోధ్య తాళాలు తెరవడం, రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన (శిలాన్యాస్) జరగడం, రామరాజ్యాన్ని తెస్తామనే వాగ్దానంతో రాజీవ్ గాంధీ అయోధ్య (ఫైజాబాద్) నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం చూశాం. ఉదారవాద సమాజం ఈ రెండు దశాబ్దాల్లో ఎన్నడూ బారికేడ్ల వద్ద కానరాకపోవడం కొట్టవచ్చినట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనలను, న్యాయ వ్యవస్థను ‘‘సామాజికంగా శక్తివంతమైనది, సమంజసమైనది’’గా చేయడం కోసం అందులో జోక్యం చేసుకోవడాన్ని, స్వేచ్ఛా వాణిజ్యాన్ని నాశ నం చేయడాన్ని, క్యాంపస్లపై భావజాల దురాక్రమణలను వాస్తవానికి వారు ప్రశంసించారు. దర్బారీ సృజనాత్మక వర్గాలు, కవులు, సంగీత కళాకారులు, బాలీవుడ్లలో ఏ ఒక్కరూ నోరెత్తింది లేదు. జయప్రకాష్ నారాయణ్ సోష లిస్టు అనుచరులు, లౌకికవాదేతర మితవాదులైన జనసంఘ్, దాని అను బంధ సంస్థలు, శిరోమణీ అకాలీదళ్లే అత్యవసర పరిస్థితికి వ్యతిరేక పోరా టం సాగించారు. నాడు నిరసన తెలిపిన ఏకైక సినిమా స్టార్ దేవానంద్ మాత్రమే. కుహనా ఉదారవాదుల శోకాలు నెహ్రూవాద ఉదారవాద భారతమనే భావనను ఆయన వారసులు ధ్వంసం చేస్తుండిన ఈ రెండు దశాబ్దాల కాలంలో మన ఉదారవాద వామపక్షంలో చాలావరకు అందుకు సహకరించిందనేదే దీని సంక్షిప్త సారాంశం. దర్బారు వారికి ప్రవేశించాల్సిన సొగసైన స్థలమైంది. అధికారానికి దగ్గరగా ఉండటం వల్ల వారికి క్యాంపస్లపైన, బోధనాంశాలపైన ఆధిపత్యం చలాయించగల, ప్రత్యామ్నాయ దృక్కోణాలకు చెందిన ఆలోచనల పీక నులిమేయగల శక్తి లభించింది. భారత మితవాదపక్షం నుంచి వచ్చిన నిజమైన, ఆరోగ్యవం తమైన, వివేకవంతమైన భావనలను సైతం అభివృద్ధి చెందనీయలేదు. దాని ఫలితంగానే నేడు బుద్ధితక్కువ మితవాదం తలెత్తింది. గోపూజ, దానికి తోడు గోబర్ గ్యాస్ కలిసి వారి ఆలోచనలను, పక్షపాత వైఖరులను పవిత్రమైనవిగా మార్చాయి. వారి చారిత్రక జ్ఞానం జానపద గాథలకు, విజ్ఞానశాస్త్రం ‘‘వేద’’ కాల్పనికతలకు పరిమితమైనది. భారత ప్రజలు ఇప్పుడు ఆ శక్తులనే అధికారంలోకి తెచ్చారు. అసహనం, సంకుచితత్వం ఎలాంటిదయినా వ్యతిరేకించి తీరాల్సిందే. అయితే, ప్రస్తుతం సాగుతున్న నిరసనల్లో కొంత ఏడుపు కూడా వినవస్తోంది. అది ప్రభుత్వ ఆదరణను కోల్పోయినామన్న ఆక్రోషం నుంచి పుట్టుకొస్తు న్నది. ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ ఆర్ఎస్ఎస్కు, ఐఎస్కు మధ్య పోలికలను చూడటమే అందుకు మంచి ఉదాహరణ. ఆర్ఎస్ఎస్ చింతనలో చాలానే తప్పుంది, దాన్ని తిరస్కరించాల్సిందే. అయితే చర్చించాల్సినది కూడా అందులో చాలా ఉంది. కానీ దాన్ని హిందూ ఐఎస్గా పిలవడం అసలుకే ఎసరు తెస్తుంది. హిందూ మితవాదులు, తమ విమర్శకులను పాకిస్తాన్కు పొమ్మ నడం లేదా యోగి ఆదిత్యనాథ్, షారుఖ్ ఖాన్ను హఫీజ్ సయీద్తో పోల్చడం లాగే అది కూడా అంతే దూషణ, అసహనం. అదీ ఓటమివాదమే, ప్రజాస్వామ్యాన్ని అవ మానించడమే. ఆర్ఎస్ఎస్ మన ఐఎస్ అయినట్టయితే మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? నాగపూర్ మీద, జందేవాలన్(ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం) మీద బాంబులు వేయమని అమెరికావాళ్లనో, ఫ్రెంచివాళ్లనో, ఇరాన్వాళ్లనో పిలుస్తారా? దర్బారు ఉదారవాదం వామపక్ష మేధో కపటత్వానికి సంబంధించి ఇది అత్యంత పెడధోరణే. కానీ అలా అని ఇది ఏదో ఒక్క ఉదంతం మాత్రమే కాదు. అలాంటిదే మరొకటి వినాయక్ సేన్ వ్యవహారం. మావోయిస్టులకు సహాయం చేస్తున్నారంటూ ఆయనను రాజద్రోహ నేరం కింద విచారించారు. ఆ చట్టం బ్రిటిష్ వాళ్లు చేసినది కాబట్టి తక్షణమే ఉదారవాదులు దాన్ని ఒక జనాకర్షక ఉద్యమంగా మార్చేశారు. సేన్ను ఉదారవాద హీరోగా ఆకాశానికెత్తారు. బెయిల్పై బయ టకు వ చ్చిన ఆయనను ప్రణాళికా సంఘానికి చెందిన ఒక కమిటీ సభ్యునిగా కూడా నియమించారు. మావోయిస్టులకు సహాయపడే వారు ఎవరైనా గానీ, నేను వారిపట్ల సానుభూతిచూపను. కానీ ఆ చట్టాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం చాలానే ఉంది. గుజరాత్ నుంచి తమిళనాడు వరకు, పాటిదార్ నేత హార్దిక్ పటేల్ నుంచి జానపద గాయకుడు ఎస్ కోవన్ వరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఇటీవలి కాలంలో అదే చట్టాన్ని ప్రయోగించాయి. ఇదే ఉదార వాద నాయకులు ఆ ఘటనల పట్ల తెలిపిన నిరసన దాదాపు శూన్యం. సేన్ వామపక్ష సానుభూతిపరుడు, కార్యకర్త. పటేల్, కోవన్లు వారి సహప్రయా ణికులు కారు. సంస్కరణలపట్ల గుడ్డి వ్యతిరేకత యూపీఏ పాలనలో ప్రభుత్వాన్ని నియంత్రించినది ప్రధానికాదు, 10 జన్పథ్ (సోనియా నివాసం) దర్బారు వాసులు. అందువల్ల ఆ కాలమంతటా ఈ కార్యకర్తలు మరింత ఎక్కువ అధికారాన్ని అనుభవించారు. యూపీఏ చేపట్టిన ప్రతి సంస్కరణవాద చర్యను... విమానాశ్రయాల ప్రైవేటీకరణ నుంచి ఎఫ్డీఐ పరిమితుల పెంపుదల, డబ్ల్యూటీఓ, పేటెంట్లు, ఉన్నత విద్యాసం స్కరణ, చివరికి ఆధార్ను సైతం వారు వ్యతిరేకించారు. సోనియా గాంధీ/ ఎన్ఏసీ జనాకర్షక పథకాలనన్నిటినీ వారు ప్రశంసించారు. ప్రస్తుత నిరసనల్లో ముందు వరుసన ఉన్న ప్రముఖులలో చాలా మంది ఆ కోవకు చెందినవారే. ఒక్కరి గురించి మాత్రమే చెబుతాను. రిటైర్డ్ నౌకాదళం అధిపతిగా పదవీ విరమణ చేసిన అడ్మిరల్ రామ్దాస్ మనిషిగానూ, సేనాయోధునిగానూ కూడా అద్భుతమైన వ్యక్తి. యూపీఏ ప్రభుత్వాన్ని అడ్డగించడానికి లేదా అస్థిరీకరించడానికి చేపట్టిన ప్రతి చర్యలోనూ ఆయన పాల్గొన్నారు. భారీ మౌలికసదుపాయాల ప్రాజెక్టులను, ఉన్నతస్థాయి నియామకాలను సైతం వ్యతిరేకించారు. ఆయన ఇప్పుడు స్వేచ్ఛను కోల్పోయామంటూ నిరసన తెలియజేస్తున్నారు. నయా ఉదారవాదియైన మన్మోహన్సింగ్ పట్ల వారి అయిష్టం ఎంతటి ప్రబలమైనదంటే... మన వామపక్ష మేధావివర్గం ఆయన ప్రభుత్వాన్ని కూలదోయడానికి తీవ్ర మితవాదపక్షంతో చేతులు కలిపింది. 9 శాతం వృద్ధిని నమోదు చేసిన ఆయన పాలనా కాలాన్ని ‘‘91 శాతం వినాశం’’గా దూషిస్తూ హేళన చేసింది. యూపీఏను కూలదోయడానికి ప్రవేశ పెట్టిన విశ్వాసరాహిత్య తీర్మానానికి అనుకూలంగా రాజకీయ వామపక్షం, బీజేపీతో కలిసి ఓటు వేయడానికి, ఇది సరిగ్గా సరిపోయింది. పనిచేయనివ్వని ప్రభుత్వంతో నెట్టుకురావడం కంటే నిర్ణయాత్మక ప్రభుత్వమైతే చాలనుకు నేటంతగా ఓటర్లు విసిగిపోయారు. సరికొత్త ఉదారవాదాన్ని నిర్మించాలి వామపక్షవాద మేధావివర్గం ఆధునిక భారత చింతనపై ఆధిపత్యం వహిం చింది. దీనికి తోడు గాంధీ వంశం దానికి గట్టిగా అంటిపెట్టుకోవడం... ‘‘లౌకికత’’ అనే పదం ముస్లింకు పర్యాయపదంగా మారేటంతటి సోమరి, నిశ్చల రాజకీయాలకు దారితీసింది. పావు దశాబ్దకాలపు సంస్కరణ భావజా లానంతర, వ్యాపార దక్షతగల కొత్త తరం భారతీయులను సృష్టించింది. తమ ఊహాశక్తులను ప్రజ్వరిల్లజేయగల నూతన భావాలు, నేతలు వారికి అవసరం. అలాంటి నేత రాహుల్ గాంధీ కాదు, నరేంద్ర మోదీ అని వారు నిర్ణయిస్తే... అందుకు మీరు వారిని తప్పు పట్టలేరు. ఆర్ఎస్ఎస్ అంటే ఐఎస్ లాంటిదే వంటి ప్రేలాపనలు వారిని మెప్పించలేవు. దరిద్రగొట్టువాదం అన్నా కూడా వారు విసిగిపోయారు. రాజకీయంగా, వామపక్షం ఇప్పుడు దేశవ్యాప్తంగా క్షీణించిపోతున్న శక్తి, బిహార్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కుల రాజకీయాలు కూడా అలా క్షీణించిపోతున్న బాపతే. ఈ కొత్త తరం, అతిజాతీయవాద ధోర ణిగలదే గానీ, కచ్చితంగా సంకుచి తమైనది కాదు. ఆదిత్యనాథ్ ప్రలాపాల్లాగే ఇర్ఫన్ హబీబ్ ప్రలాపాలను కూడా వారు నవ్వుకోవాల్సినవిగా తీసిపారేస్తారు. వారికి ఉద్యోగాలను కల్పిం చడంలో, వృద్ధిని సాధించడంలో నే టి ప్రభుత్వం విఫలమైతే... ఓట్లను కూడగ ట్టుకోవడం కోసం బీజేపీ చేపడుతున్న నిలువునా ప్రజలను చీల్చే వైఖరి కూడా ఆమోదయోగ్యమైనది కాదని గుర్తిస్తారు. అంతేగానీ, వారు హైఫన్ సహిత ఉదారవాదమనే (వామపక్ష-ఉదారవాదం) పాత ఫక్కీ భావనను మాత్రం అంగీకరించరు. కాబట్టి హిందూ ఉదారవాదానిదే పైచేయి అవు తుంది. దాన్ని ఎదుర్కోవడానికి మీరు కొత్త ప్రధాన స్రవంతి ఉదారవాదాన్ని నిర్మించాల్సి ఉంటుంది. భావజాల ప్రలాపాలను పేలవమైన జోకులుగా తీసిపారేస్తారు. శేఖర్ గుప్తా (twitter@shekargupta) -
చైనాతో యుద్ధంలో..అమెరికా సాయం కోరిన నెహ్రూ!
సీఐఏ మాజీ అధికారి బ్రూస్ రీడెల్ వెల్లడి వాషింగ్టన్: దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1962 చైనాతో యుద్ధం సమయంలో అమెరికా సహాయాన్ని కోరారని సీఐఏ మాజీ అధికారి ఒకరు వెల్లడించారు. చైనా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు యుద్ధ విమానాలను పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అప్పటి యూఎస్ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీకి లేఖ రాశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను సీఐఏ మాజీ అధికారి బ్రూస్ రీడెల్ తన ‘జేఎఫ్కే-ఫర్గాటన్ క్రైసిస్: టిబెట్, ది సీఐఏ అండ్ సినో-ఇండియన్ వార్’ పుస్తకంలో వెల్లడించారు. తృతీయ ప్రపంచ దేశాల్లో తిరుగులేని నేతగా నెహ్రూ ఎదుగుదలను అడ్డుకోవటానికే 1962 సెప్టెంబర్లో మావో ఆ యుద్ధానికి పూనుకున్నాడని బ్రూస్ పేర్కొన్నారు. ‘ యుద్ధంలో భారత్ భారీగా భూభాగాలను, సైనికులను కోల్పోతుండడంతో నెహ్రూ ఆందోళనతో కెన్నడీకి రెండు లేఖలు రాశారు. యుద్ధంలో సాయం చేయాలని, 12 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలను, రవాణా విమానాలను పంపాలని కోరారు. దాదాపు 350 యుద్ధ విమానాలు, 10 వేల మంది సైనికులు, సిబ్బందిని పంపాలన్నారు. బాంబర్లను పాక్పై వేయబోమని హామీ ఇచ్చారు. ఈ లేఖను అమెరికాలోని అప్పటి భారత రాయబారి నేరుగా కెన్నడీకి అందజేశారు. బ్రిటన్ ప్రధానికి కూడా ఇదే తరహాలో నెహ్రూ లేఖ రాశారు. నెహ్రూ లేఖపై కెన్నడీ సానుకూలంగానే స్పందించి.. యుద్ధానికి సన్నద్ధమయ్యారు. కానీ అమెరికా తగిన చర్యలు చేపట్టేలోపే చైనా ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించి, యుద్ధాన్ని నిలిపేసింది’ అని బ్రూస్ పుస్తకంలో పేర్కొన్నారు. భారత ఈశాన్య ప్రాంతంలోని చాలా భూభాగంలోకి, కోల్కతా వరకూ చొచ్చుకువచ్చిన చైనా... అమెరికా, బ్రిటన్లు యుద్ధంలోకి దిగుతున్నాయన్న భయంతోనే ఒక్కసారిగా వెనక్కితగ్గిందన్నారు. ఈ పుస్తకం నవంబర్లో మార్కెట్లోకి విడుదల కానుంది. -
నెహ్రూను అవమానించడానికే ఆ యుద్ధం!
వాషింగ్టన్: మూడో ప్రపంచదేశాల నాయకుడిగా భారత ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ ఎదుగుతుండటంతో ఆయనను అవమానించాలనే ఉద్దేశంతోనే అప్పటి చైనా పాలకుడు, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపకుడు మావో జెడాంగ్ 1962లో యుద్ధానికి దిగారు. ఆనాటి చైనా దురాక్రమణను తరిమికొట్టేందుకు నెహ్రూ అమెరికా సాయాన్ని కోరారు. చైనాను ఎదుర్కొనేందుకు ఫైటర్ జెట్ విమానాలు సమకూర్చాలని అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీకి లేఖ కూడా రాశారు. ఇలా ఆనాటి భారత్-చైనా యుద్ధానికి సంబంధించిన ఎన్నో అంశాలతో ఓ కొత్త పుస్తకం విడుదలైంది. 'జేఎఫ్కేస్ ఫార్గాటెన్ క్రైసిస్: టిబెట్, ద సీఐఏ అండ్ సినో-ఇండియన్ వార్' పేరిట సీఐఏ మాజీ అధికారి బ్రూస్ రీడెల్ ఈ పుస్తకాన్ని రాశారు. "మావో దృష్టి అంతా నెహ్రూపైనే. అయినా భారత్ను ఓడించడమంటే మావో శత్రువులైన నికిటా క్రృచ్చెవ్, కెన్నడీకి ఎదురుదెబ్బే' అని ఆయన ఈ పుస్తకంలో రాశారు. యుద్ధంలో భారత భూభాగం చైనా ఆధీనంలోకి వెళుతుండటం, పెద్దసంఖ్యలో తమ సైనికులు చనిపోతుండటంతో 1962 నవంబర్లో నెహ్రూ, కెన్నడీకి లేఖ రాశారు. చైనా దురాక్రమణను ఎదుర్కోవడానికి గగనతల రవాణా, ఫైటర్ జెట్ విమానాలు కావాలని కోరారు. మీరు, మన మిత్రులు ఇందుకు ఎంతో సహకరించాలని లేఖలో అభ్యర్థించారు. "పీపుల్ లిబెరేషన్ ఆర్మీ'ని ఓడించడానికి చైనాకు వ్యతిరేకంగా గగనతల యుద్ధంలో పాల్గొనాల్సిందిగా నెహ్రూ కెన్నడీని కోరారు. ఇది చాలా పెద్ద అభ్యర్థన. అప్పటికి దశాబ్దం కిందటే కొరియా విషయమై అమెరికా బలగాలు, చైనా బలగాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు చైనాకు వ్యతిరేకంగా కొత్త యుద్ధం చేయాల్సిందిగా భారత్ కెన్నడీని కోరింది' అని ఆయన పుస్తకంలో తెలిపారు. అమెరికా వాయుసేనకు చెందిన 12 స్కాడ్రన్లను తమకు పంపాల్సిందిగా అడిగిందని ఆయన పేర్కొన్నారు. -
నేతాజీ కుటుంబంపై 20 ఏళ్ల నిఘా
* సుభాష్ అన్న కొడుకుల కదలికలపై కన్ను * ఉత్తర ప్రత్యుత్తరాలపైనా నిఘా.. దేశంలోనే అతి పెద్ద గూఢచర్యం * సమరయోధుడి కుటుంబంపై నెహ్రూ సర్కారు చర్య * న్యాయవిచారణకు నేతాజీ కుటుంబం డిమాండ్ న్యూఢిల్లీ: ‘‘నాకు జవహర్లాల్ నెహ్రూ చేసినంత నష్టం మరెవరూ చేయలేదు’’ నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన అన్న కుమారుడు అమీయనాథ్ బోస్కు 1939లో రాసిన ఓ లేఖలోని సారాంశం ఇది. ఇన్నేళ్ల తర్వాత ఈ లేఖ బయటపడింది. ఇది ఆయన కుటుంబ సభ్యులు విడుదల చేసిన లేఖ కాదు. స్వాతంత్రం వచ్చాక నెహ్రూ ప్రభుత్వం నేతాజీపైనా, ఆయన కుటుంబంపైనా ఏకధాటిగా నిర్వహించిన గూఢచర్యం ఫలితంగా దాచిన ఫైళ్లలోని పత్రమిది. తెల్లవాళ్లు వెళ్లిపోయాక వాళ్లను తలదన్నేలా మనవాళ్లే సమరయోధుడిపై నిఘా పెట్టిన వ్యవహారం తాజాగా బయటపడటం నేతాజీ మాటలను నిజం చేస్తోంది. నేతాజీ కుటుంబంపై ఏకంగా రెండు దశాబ్దాల పాటు భారత ప్రభుత్వం గూఢచర్యం చేయించింది. ఇందులో ఎక్కువ భాగం.. 16 ఏళ్లు పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారత ప్రధానిగా ఉన్న కాలం కావటం గమనార్హం. నేతాజీకి సంబంధించిన పత్రాలలో కొన్ని పశ్చిమబెంగాల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ముఖ్యకార్యాలయంలో ‘అత్యంత రహస్య పత్రాలు’గా ఉండిపోయాయి. బెంగాల్ ఐబీ ఆఫీసులోని ఈ పత్రాలను ‘రహస్య పత్రవిభాగం’ నుంచి కేంద్ర హోం శాఖ తొలగించటంతో వాటిని ఢిల్లీలోని జాతీయ ప్రాచీన దస్తావేజుల భాండాగారం(నేషనల్ ఆర్కైవ్స్)కు తరలించారు. దీంతో ఈ పత్రాలలోని సమాచారం బహిర్గతమైంది. వీటిలో కొంత సమాచారాన్ని నేతాజీ కుటుంబ సభ్యుడు, టీఎంసీ ఎంపీ సుగతా బోస్ సేకరించారు. వీటి ప్రకారం 1948 నుంచి 1968 వరకు సుభాష్ అన్న శరత్చంద్రబోస్ కుమారులు శిశిర్ కుమార్ బోస్, అమీయ నాథ్ బోస్లపై భారత ప్రభుత్వం నిఘా నిర్వహించింది. బోస్ కుటుంబం నివసించే కోల్కతాలోని ఎల్గిన్ రోడ్లోని 38/2 వుడ్బర్న్ పార్క్ ఇళ్లపై ఐబీ నిరంతర గూఢచర్యం చేసింది. వీరిద్దరూ నేతాజీకి చాలా దగ్గరి వాళ్లు కావటం వల్ల వారి ప్రతి కదలికనూ ఐబీ వర్గాలు నీడలా పరిశీలిస్తూ వచ్చాయి. వారు ఇంటి నుంచి బయటకు వెళ్లినా, విదేశాలకు వెళ్లినా.. ఎవరితో మాట్లాడినా.. నీడలా వెంటాడాయి. వారి కి వచ్చిన లేఖలను రహస్యంగా చించి చదివి వాటి కాపీలను సైతం దాచాయి. ఈ వ్యవహారంపై నేతాజీ కుటుంబం తీవ్రంగా మండిపడింది. ఇది స్వాతంత్య్ర సమరయోధులందరినీ అవమానించినట్లని నేతాజీ మనవడు సుగతాబోస్ అన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
కదలిక
మామునూరులో విమానాశ్రయం! ఐదున్నర దశాబ్దాల కల నెరవేరే వేళ తాజా పరిస్థితిపై నివేదిక కోరిన కేంద్రం 1,200 ఎకరాల భూమి అవసరం.. నిధులిస్తే మిగతా భూసేకరణకు ఏర్పాట్లు గాలిమోటార్పై జిల్లావాసుల్లో ఆశలు హన్మకొండ అర్బన్ :జిల్లాలో విమానాశ్రయంపై తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లావాసుల్లో ఆశలు చిగురిస్తున్నారుు. గాలిమోటార్లో తిరిగే అవకాశం వస్తుందని భావిస్తున్నారు. మామునూరులో ఏరుుర్పోర్టు ఏర్పాటైతే ప్రయోజనకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం జిల్లా యంత్రాంగం, నాయకులు తమవంతు ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో కేంద్రం సుముఖత వ్యక్తం చేయడం.. గతంలో రాష్ట్రం నుంచి పంపిన ప్రతిపాదనలపై తాజాగా నివేదిక కోరడంతో మామునూరు విమానాశ్రయం విషయంలో కదలికవచ్చింది. తొలి ప్రధాని వచ్చినప్పటి కల.. జిల్లాలోని మామునూరులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని డిమాండ్ ఇప్పటిది కాదు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలిసారిగా వాయుదూత్ విమానంలో మామునూరులో దిగారు. అప్పటి నుంచి జిల్లా యంత్రాంగం భవిష్యత్ అవసరాల దృష్ట్యా మామునూరులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతూనే ఉంది. అప్పటి నుంచి మొదలైన భూసేకరణ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇంతకాలం ఆశించిన స్థాయిలో మామునూరువిమానాశ్రయంలో ఏర్పాటుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. 1960కి ముందే భూసేకరణ మామునూరులో విమానాశ్రయం ఏర్పాటునకు 1960 కన్నా ముందే భూసేకరణ చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నారుు. ఆ సమయంలో ఏనుమాముల గ్రామం పరిధిలో 320 ఎకరాలు, నక్కలపల్లి గ్రామం పరిధిలో 96 ఎకరాలు, తిమ్మాపురం పరిధిలో 290 ఎకరాలు మొత్తం 706 ఎకరాలు సేకరించారు. విమానాశ్రయానికి రన్వే, టర్మినల్, ఇతర అవసరాల కోసం కనీసం 1,200 ఎకరాలకు తగ్గకుం డా భూమి ఉండాలని చెప్పడంతో అదనంగా 450 ఎకరాలు సమీపంలో ఉన్న గ్రామాల రైతుల నుంచి భూసేకరణ చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో గాడిపల్లి పరిధిలో 243 ఎకరాలు, ఇతర సమీప గ్రామాల్లో మరో 184 ఎకరాలు మొత్తం 427 ఎకరాలు సేకరించేందుకు భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం భూసేకరణకు ప్రాథమిక అంచనాగా 2011 లెక్కల ప్రకారం రూ.28 కోట్లు అవసరమవుతాయని.. వాటి ని విడుదల చేస్తే రైతులకు 80 శాతం చెల్లింపులు చేసి భూమి స్వాధీనం చేసుకోవచ్చని అప్పట్లోనే అధికారులు ప్రభుత్వానికి లేఖ పంపించారు. 2008లో కేంద్ర బృందం పరిశీలన 2008 సంవత్సరంలో ఒకసారి కేంద్రం నుంచి ఏయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం జిల్లాకు వచ్చింది. కలెక్టర్తో భేటీ తర్వాత మామునూరు విమానాశ్రయం ఏర్పాటు స్థలం పరి శీలించింది. అయితే అధికారులు చెప్పినట్లు అక్కడ 706 ఎకరాలు స్థలం లేదని అందులో సుమారు 11 ఎకరాల వరకు ఆక్రమణలకు గురయిందని గుర్తించింది. దీనిపై స్థలం కాపాడాలని కోరుతూ కలెక్టర్కు లేఖ రాశారు. ఇదిలా ఉండగా ఇందులోనే 142.11 ఎకరాల స్థలాన్ని జిల్లా యంత్రాంగం పశు సంవర్ధక శాఖకు కేటాయించింది. రూ.కోటి కేటాయింపు జిల్లా యంత్రాంగం నుంచి 2012 ప్రారంభంలో భూ సేకరణ కోసం రూ.28 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం రూ.కోటి విడుదల చేసింది. అయితే ఇందుకు సంబంధించి పరిపాలనా పరమైన అనుమతులు వెంటనే రాలేదు. దీంతో అధికారులు భూసేకరణ ప్రక్రియ ప్రారంభానికి ప్రకటన జారీ చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తరువాత పనుల్లో పురోగతి లేదు. అయితే 2012లో భూసేకరణ చట్టంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయడం వల్ల అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు రాలేదని అధికారులు ముందుకు కదల్లేదు. ప్రాంతీయ విమానాశ్రయం? కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటు విషయం తెరపైకి తేవడంతో మా మునూరు విషయం మరోసారి ముందుకు వచ్చిం ది. అయితే మిగతా జిల్లాలతో పోల్చి చూస్తే భూసేకరణ, ఇతర అంశాల విషయంలో మామునూరుకు అన్నీ అనుకూల అంశాలు ఉండటంతో స్వరాష్టలో అయినా విమానాశ్రయం చూడాలన్న జిల్లావాసుల కలనెవేరుంతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. -
‘నీతి’ ఉపాధ్యక్షుడిగా పనగరియా
కొలంబియా వర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్ గుజరాత్ అభివృద్ధి నమూనాకు గట్టి మద్దతుదారు న్యూఢిల్లీ: ప్రణాళికాసంఘం స్థానంలో కేంద్రప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్కు తొలి ఉపాధ్యక్షుడిగా స్వేచ్ఛా మార్కెట్ ఆర్థికవేత్త అరవింద్ పనగరియా(62) నియమితులయ్యారు. మరో ఆరుగురు సభ్యులను, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులను కూడా సోమవారం ప్రభుత్వం నియమించింది. వారిలో ఆర్థిక వేత్త బిబేక్ డెబ్రొయ్, డీఆర్డీఓ మాజీ డెరైక్టర్ జనరల్ వీకే సారస్వత్లను పూర్తిస్థాయి సభ్యులుగా, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్(హోం), అరుణ్ జైట్లీ(ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు), సురేశ్ ప్రభు(రైల్వే), రాధామోహన్సింగ్(వ్యవసాయం)లను ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించారు. నితిన్ గడ్కారీ(రవాణా), స్మృతి ఇరానీ(మానవ వనరులు), తావర్చంద్ గెహ్లాట్(సామాజిక న్యాయం, సాధికారత) ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ప్రధాని నరేంద్రమోదీ వ్యవహరిస్తారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్నెంట్ గవర్నర్లు నీతి ఆయోగ్ పాలకమండలి సభ్యులుగా ఉంటారు. అలాగే, వివిధ రంగాల్లో నిపుణులైన వారు సభ్యులుగా కొన్ని ప్రత్యేక ప్రాంతీయ మండళ్లు కూడా ఉంటాయి. ఆ సభ్యులను ప్రధానమంత్రి నామినేట్ చేస్తారు. ‘నీతి’ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విధానపరమైన అంశాల్లో దిశానిర్దేశం చేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన విధానాంశాల్లో ప్రభుత్వానికి వ్యూహాత్మక, సాంకేతిక సలహాలు, సూచనలు ఇస్తుంది. సహకార సమాఖ్య విధానం లక్ష్యంగా కేబినెట్ తీర్మానం ద్వారా దీన్ని జనవరి 1న ఏర్పాటు చేశారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో 1950 మార్చి 15న ప్రణాళికాసంఘాన్ని కూడా కేబినెట్ తీర్మానం ద్వారానే ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రణాళిక సంఘంలో డిప్యూటీ చైర్మన్ కీలక బాధ్యతలు నిర్వర్తించేవారు. కాగా, నీతి ఆయోగ్లో ఆ బాధ్యతలను వైస్ చైర్మన్గా అరవింద్ పనగరియా నిర్వర్తిస్తారు. నీతి ఆయోగ్ ఏర్పాటు ప్రకటన అనంతరం మోదీ.. ‘సాధికారత, సమానత్వం ముఖ్య లక్ష్యాలుగా.. ప్రజానుకూల, సానుకూల, భాగస్వామ్యయుత అభివృద్ధి ఎజెండా అనేది నీతి ఆయోగ్ మార్గదర్శక సూత్రం’ అని ట్వీట్ చేశారు. దేశ వృద్ధి పథంలో ఈ సంస్థ కీలక భాగస్వామిగా ఉండగలదన్నారు. కాలం చెల్లిన ప్రణాళికాసంఘం స్థానంలో ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని గత ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ చెప్పడం తెలిసిందే. కాగా, ప్రణాళికాసంఘం వెబ్సైట్ ఇక గతం కానుంది. ప్రణాళికాసంఘానికి సంబంధించిన సమాచారం లభించే యూఆర్ఎల్ http://fb.me/3vZp1jjFrలింక్ను నీతి ఆయోగ్ ట్వీటర్లో వెల్లడించింది. స్వేచ్ఛావిపణి మద్దతుదారు.. అరవింద్ పనగరియా న్యూఢిల్లీ: అరవింద్ పనగరియా ప్రఖ్యాత భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్తో సత్కరించింది. ప్రస్తుతం ఆయన అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం బోధిస్తున్నారు. ఇంతకుముందు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో చీఫ్ ఎకనమిస్ట్గా మేరీలాండ్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్లో ప్రొఫెసర్, కో డెరైక్టర్గా పనిచేశారు. డబ్ల్యూటీఓ, ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), యూఎన్సీటీఏడీల్లోనూ పలు స్థాయిల్లో విధులు నిర్వర్తించారు. రాజస్థాన్లో వసుంధర రాజె ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించారు. రాజస్థాన్ వర్సిటీలో డిగ్రీ చదివిన పనగరియా ఆర్థిక శాస్త్రంలో ప్రిన్స్టన్ వర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. 15 పుస్తకాలను రచించారు. మార్కెట్ అనుకూల అభిప్రాయాలు కలిగిన గుజరాత్ అభివృద్ధి నమూనాకు గట్టి మద్దతుదారు. ప్రముఖ వాణిజ్య ఆర్థికవేత్త జగదీశ్ భగవతికి అత్యంత సన్నిహితుడు. భారత ఆర్థికరంగంపై చర్చకు రావాలంటూ ఆర్థికరంగంలో నోబెల్ పురస్కార గ్రహీత ఆమర్త్య సేన్కు వారిద్దరూ సవాళ్లు కూడా విసిరారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉండగా, ఆయన అభివృద్ధి నమూనాను పనగరియా ప్రశంసించేవారు. పనగరియా, జగదీశ్లు రాసిన ‘ఇండియాస్ ట్రస్ట్ విత్ డెస్టినీ: డీబంకింగ్ మిత్స్ దట్ అండర్మైన్ ప్రోగ్రెస్ అండ్ అడ్రెసింగ్ న్యూ ఛాలెంజెస్’ పుస్తకంలో.. గుజరాత్ అభివృద్ధి మోడల్ను వృద్ధి, ప్రైవేట్ పారిశ్రామిక విధానం ఆధారంగా సాగిన అభివృద్ధిగా.. కేరళ అభివృద్ధి నమూనాను పునఃపంపిణీ, ప్రభుత్వం కేంద్రంగా సాగిన అభివృద్ధిగా అభివర్ణించారు. ఈ ధోరణికి భిన్నంగా.. ప్రజల ఉత్పాదకత పెరిగేలా సామాజిక మౌలిక వసతుల్లో ప్రభత్వం అధికంగా పెట్టుబడులు పెట్టాలని ఆమర్త్యసేన్ వాదిస్తారు. ‘లార్’జ డెరైక్టర్.. బిబేక్ డెబ్రొయ్ ప్రస్తుతం న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆర్థిక వేత్త బిబేక్ డెబ్రొయ్(59) భారత ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంటెంపరరీ స్టడీస్లో డెరైక్టర్గా, ఆర్థిక శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగానికి కన్సల్టెంట్గా, పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సెక్రటరీ జనరల్గా, న్యాయ సంస్కరణల పరిశీలన కోసం ఏర్పాటుచేసిన ప్రాజెక్టు లార్జ్(లీగల్ అడ్జస్ట్మెంట్స్ అండ్ రీఫామ్స్ ఫర్ గ్లోబలైజింగ్ ద ఎకానమీ)కు డెరైక్టర్గా విధులు నిర్వర్తించారు. మహాభారతం ఆంగ్ల అనువాదాన్ని ఇటీవలే పూర్తిచేశారు. పశ్చిమబెంగాల్కు చెందిన డెబ్రొయ్ విద్యాభ్యాసం యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజ్లో జరిగింది. ఉస్మానియా డాక్టరేట్.. సారస్వత్ ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త. డీఆర్డీఓ డెరైక్టర్ జనరల్గా భారత క్షిపణి వ్యవస్థను బలోపేతం చేశారు. పృథ్వీ క్షిపణి రూపకల్పనలో కీలక భూమిక నిర్వర్తించారు. మధ్యప్రదేశ్కు చెందిన సారస్వత్ గ్వాలియర్లో ఇంజినీరింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఎంటెక్ చేశారు. ప్రొపల్షన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్గా పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. 1998లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. గతంలో డీఆర్డీఓ ఆర్థిక వ్యవహారాలపై కాగ్ విమర్శలు చేసిన నేపథ్యంలో.. సారస్వత్ ఆర్థిక అధికారాలపై రక్షణ శాఖ తీవ్రమైన ఆంక్షలు విధించింది. 2013లో డీఆర్డీఓ చీఫ్గా పదవీకాలం కొనసాగింపు ప్రతిపాదనను ఆమోదించలేదు. కోర్టు ధిక్కార నేరం కింద 2014 సెప్టెంబర్లో మద్రాస్ హైకోర్టు ఆయనకు 3వారాల జైలు శిక్ష విధించింది. -
మసకబారుతున్న మోదీ ప్రభ
పార్లమెంటు సక్రమంగా పనిచేయడం భారత ప్రజాస్వామ్యానికి ముఖ్యం. ప్రధాని పార్లమెంటు అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొనాలి. ఉభయ సభలలోనూ మెజారిటీ ఉన్నా జవహర్లాల్ నెహ్రూ ప్రతిపక్షం పట్ల అత్యంత గౌరవం చూపేవారు, పీవీకి లోక్సభలో మెజారిటీ లేకున్నా పార్లమెంటు నుండి తాను కావాలనుకున్నదల్లా సాధించుకోగలిగారు. పార్లమెంటుకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం రాజీలకు సిద్ధపడి సభ సజావుగా సాగేందుకు హామీని కల్పించాలి. ప్రధాని మోదీ చేపట్టాల్సింది రాజీ వైఖరే తప్ప సంఘర్షణాత్మక వైఖరి కాదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సజావుగా సాగుతోంది. హర్యానా మహారాష్ట్ర, జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ దిగ్భ్రాంతికరమైన విజయాలను సాధించింది. కాబట్టి గత సంవత్సరం విజయోత్సాహభరితంగా ముగిసి ఉండాల్సింది. కానీ పార్లమెంటు శీతాకాల సమావేశాలు విజయవంతం కాలేదు. బీజేపీకి లోక్సభ లో మెజారిటీ ఉందిగానీ రాజ్యసభలో లేదు. అలాంటి పరిస్థితుల్లో చట్టం చేయా లంటే ప్రభుత్వం ఉభయ సభలను కలిపి సమావేశపరచి ఆమోదముద్ర వేయిం చుకోవాలి. అయితే అది అరుదైన, తీవ్ర పరిష్కారం. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవ డానికి దోహదపడేపలు బిల్లులకు బీజేపీ రాజ్యసభ ఆమోదాన్ని పొందాలను కుంది. ప్రభుత్వ తక్షణావశ్యకతను గుర్తించిన ప్రతిపక్షం ఏదో ఒక సాకుతో అందుకు అడ్డంకులను సృష్టించడం ప్రారంభించింది. మరింత ప్రజా వ్యతిరేకత ను మూటగట్టుకోవాల్సి వస్తుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సమావేశాలకు విఘాతం కలిగించడానికి తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల వంటి చిన్న పార్టీలను వాడుకుంది. విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన మతమార్పి డుల సమస్యలో మోదీ ప్రతిష్టను మసకబరచే అవకాశాన్ని పసిగట్టిన ప్రతి పక్షాలు ప్రధాని ఆ అంశంపై మాట్లాడాలని పట్టుబట్టాయి. బీజేపీ సహజంగానే రాజ్యసభలో మోదీ మాట్లాడకుండా చూసింది. కానీ ప్రభుత్వం ఆర్థిక సంస్క రణలు, బీమా, భూసేకరణలకు సంబంధించిన చట్టాలను తేవాల్సి ఉంది. కాబట్టి ఆర్డినెన్స్లకు జారీ చేసి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయించుకుంది. ఆర్డినెన్స్ కూడా చట్టమేగానీ, ఆరు నెలలలోగా అది పార్లమెంటు ఆమోదం పొందాలి. అత్యంత జరూరైతే తప్ప ఆర్డినె న్స్లను జారీ చేయకూడదు. ఇలా ఆర్డినెన్సులను జారీ చేయడం ద్వారా పార్లమెంటును నియంత్రించలేని తన బలహీనతను బీజేపీ బయటపెట్టుకుంది. ప్రతిపక్షాల పట్ల మన్నన చూపడమే రాజనీతి సాధారణంగా అసహనాన్ని చూపే ప్రజలు సైతం సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం ఏర్పడిందని మోదీపట్ల సంతృప్తితోనే ఉన్నారు. పెద్ద చదువుగానీ, అనుభవంగానీ లేని మోదీ విదే శీ వ్యవహారాలను చక్కబెట్టలేరని చాలా మంది తక్కువగా అంచనా వేశారు. అది తప్పని రుజువైంది. దేశాన్ని నడపడం అంటే కేవ లం అధికారులను నియంత్రించడం కాదు. కొత్త చట్టాలను చేయాల్సిందే. కానీ పార్లమెంటు, అది సక్రమంగా పనిచేయడం భారత ప్రజాస్వామ్యానికి ముఖ్యం. ప్రధాని పార్లమెంటు అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొనాలి. ప్రతి పక్షం చిన్నదే అయినా, ప్రధాని పార్లమెంటును తోసిపుచ్చకూడదు. ఉభయ సభలలోనూ మెజారిటీ ఉన్నా జవహర్లాల్ నెహ్రూ ప్రతిపక్షం పట్ల అత్యంత గౌరవం చూపేవారు, వారి కోరికలను మన్నించడానికి ఎప్పుడూ ప్రయత్నించే వారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు (1991-96) లోక్సభలో మెజారిటీ లేదు. అయినాగానీ పార్లమెంటు నుండి తాను కావాలనుకున్నదల్లా ఆయన సాధించుకోగలిగారు. ఆయన హయాంలో దేశం ఆర్థిక సంక్షోభాన్ని, పంజాబు తిరుగుబాటును, కశ్మీర్ సమస్యను, అస్సాం హింసకాండను ఎదుర్కో వాల్సి వచ్చింది. అయినా ఆయన పార్లమెంటును తనతోపాటు నడిపించ గలిగారు. విడిగాఎంపీల పట్ల, పార్టీల పట్ల సానుకూల వైఖరి చూపేవారు. ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజపేయిని ఐరాస ప్రతినిధి బృందాలకు నేతగా నియమిం చారు. ప్రతిపక్ష ఎంపీల పట్ల మన్నన చూపాలని పీవీ తన మంత్రివర్గ సహచ రులకు చెప్పేవారు. అలా ఆయన పార్లమెంటు అభిమానాన్ని చూరగొన బట్టే 225 మంది ఎంపీలతో ఐదేళ్లూ పదవిలో ఉన్నారు. మోదీకి 280 మందికి పైగా ఎంపీలున్నారు. కానీ ఆయన పార్లమెంటులో ఉన్నది లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన విజయవంతమై ఉండవచ్చు. కానీ పార్లమెంటు, ఢిల్లీలో అధికారం నెరపడం పూర్తిగా భిన్నమైనవి. ఎంపీలకు ప్రధాని తప్పక అప్పయింట్మెంట్లు ఇవ్వాలి. చట్టం పరిధిలో వారు అడిగేవాటిని నెరవేర్చా ల్సి ఉంటుంది. పీవీ ఉదాహణను మోదీ ఏ కొద్దిగా పాటించి ఉన్నా ఆయనకు పార్లమెంటులో సమస్యే ఉండేది కాదు. ప్రతిపక్ష నేతలు సమస్యలు సృష్టించాల నుకున్నా పార్లమెంటు సభ్యులు పాల్గొనేవారు కారు. సభ సజావుగా సాగాలంటే... 1. ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాన్ని గౌరవించాలని, వారు తమ విధానాలను ఆమోదించేలా చేసుకోవాలని మోదీ, బీజేపీలు అర్థం చేసుకోవాలి, నచ్చజెప్పే పద్ధతుల్లో వారితో రాజీ పడాలి. లేకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిపక్షం మద్దతును కూడగట్టడంలో, దానితో క్రియాశీల సంబంధాలను నెలకొల్పుకోవడంలో విఫలమయ్యారు. కాబట్టే ఇటీవలి కాలంలో కొత్త చట్టాలను చేయలేకపోయారు. ఇక్కడా అదే జరుగుతోంది. 2. బీజేపీ తానిప్పుడు ప్రతిపక్షంలో లేనని అర్థం చేసుకోవాలి. పార్లమెంటు చర్చల్లో గెలవడమే ప్రధానమని అది భావిస్తోంది. కానీ వాస్తవానికి ప్రతిపక్షాలన్నీ దానికి వ్యతిరేకంగా ఐక్యమవుతున్నాయి, ప్రతిపక్షంతో సుహృద్భావ పూర్వకంగా సంభాషించగల నేతే బీజేపీలో లేనట్టుం ది. 3. బీజేపీ మంత్రుల్లో చాలా మంది వృత్తి రాజకీయవేత్తలు కారు. పైగా వారిలో ఎక్కువ మంది ఎలాంటి ప్రజాపునాది లేనివారు, రాజ్యసభ సభ్యులు. ప్రతిపక్ష ఎంపీల పట్ల మన్నన చూపాలని, వారి ఓటర్ల కోరికలను కూడా మన్నిం చి ప్రభుత్వానికి వారి మద్దతును కూడగట్టాలని తెలియదు. 4. మాజీ మంత్రులను, ఓటమిపాలైన ఎంపీలను అధికారిక నివాసాల నుండి ఖాళీ చేయించడాన్ని ప్రభుత్వం పెద్ద సమస్యను చేసి, మొత్తంగా ఢిల్లీ రాజకీయ వర్గమంతటికీ ఆగ్రహం కలిగేలా చేసింది. అది చేయాల్సిన పనే అయినా సున్నితంగా చేయవలసినది. ప్రత్యర్థి రాజకీయవేత్తలను అవమా నిస్తున్నట్టుగా గాక, 62 ఏళ్లుగా నెలకొన్న సంప్రదాయాలను పాటిస్తున్నట్టుగా ఉండాల్సింది. 5. విజయవంతమైన ప్రతి ప్రభుత్వానికి ప్రతిపక్షంతో సంబం ధాలు నెరపే దొడ్డిదారులు ఉంటాయి. బీజేపీకి ప్రతిపక్షాన్ని ఒప్పించడంలో నైపుణ్యం, లౌక్యం పూర్తిగా కొరవడ్డాయి. భారీ మెజారిటీ ఉన్నా ఇందిరాగాంధీ ప్రతిపక్షం ఆమోదాన్ని పొందడంలో విఫలమై, అప్రతిష్టపాలయ్యారు. మెజారి టీ లేకున్నా పీవీ ఆమెలా ఎన్నడూ ప్రతిపక్షాల దాడులకు గురై ఎరుగరు. అదీ తేడా. 6. మోదీ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్నారు. ప్రతిపక్ష ఎంపీలకు అందుబాటులో లేకుండా, సహాయాన్ని అందించని వైఖరిని అవలంబి స్తున్నారు. ఆయన ఆ వైఖరిని మార్చుకోవాలి. రాజ్యసభలో మెజారిటీ లభిస్తే చాలు, ఏమైనా చేయవచ్చని ఆయన అనుకుంటున్నారు. పార్లమెంటరీ వ్యవస్థ పనిచేసేది అలా కాదు. ఎంత గొప్ప మెజారిటీ ఉన్నా ప్రభుత్వం ప్రతిపక్షాన్ని కూడా తన వెంట తీసుకుపోవాలి. అదెంత కష్టమైనా చేయక తప్పదు. 7. బీజేపీ 2004 నుండి 2014 వరకు ప్రతిపక్షంలో ఉండి నిరంతరం పార్లమెంటుకు ఆటం కం కలిగించింది. ప్రతిపక్షాలకు ఉదాహరణగా మారింది. బడా కార్పొరేట్లు సైతం పార్లమెంటుతో సరిగా వ్యవహరిచలేకపోతోందని ప్రభుత్వాన్ని తప్పు పడుతుండటం ఆసక్తిదాయకం. పార్లమెంటుకు బాధ్యత వహించాల్సిన ప్రభు త్వం తీవ్ర రాజీలకు సిద్ధపడి మరీ సభ సజావుగా సాగేందుకు హామీని కల్పించా లి. పార్లమెంటు నడిచేలా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది కాదు. పలువురు మంత్రులు మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ తప్పుటడుగులు వేసేలా చేస్త్తు న్నారనే అభిప్రాయం కూడా ఉంది. నెహ్రూ, పీవీల బాటలో సాగాల్సిందే... ప్రధాని మోదీకి ఎంత జనాదరణ ఉన్నాగానీ ఆయన నెహ్రూ, పీవీల వంటి పూర్వ ప్రధానుల లాగే ప్రతిపక్షాల ఆమోదాన్ని సంపాదించుకోవాలి. మరో గుజరాతీ ప్రధాని మొరార్జీ దేశాయ్కి 1977లో 377 మంది లోక్సభ ఎంపీలుండే వారు. కానీ పట్టువిడుపులు, రాజీలేని ఆయన ధోరణి వల్ల ప్రభుత్వం మూడేళ్ల లోగానే కుప్పకూలిందని మోదీ గుర్తుంచుకోవాలి. బీజేపీ తన గెలుపుతో ఇక రాజకీయాలన్నీ అంతమైపోయాయని భావిస్తోంది. ప్రజాస్వామ్యంలో అదెన్న టికీ జరిగేది కాదు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స ఎన్నికల వరకు తనకు ఎదురే లేదనుకున్నారు. కానీ పదిహేనేళ్లుగా ఆయనకు సన్నిహితులైన మంత్రులు సైతం ఆయనను వీడుతున్నారు. రాజకీయవేత్తలు ఎప్పుడూ దెబ్బ తీయడానికి సరైన సమయం కోసం వేచి చూస్తుంటారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ ప్రత్యర్థులు పలువురిని తమ పక్షానికి తె చ్చుకోగలిగారు. కాబట్టే విజయాలు సాధించారు. బీజేపీ పార్లమెంటులో కూడా అదే వ్యూహాన్ని అనుసరించాలి. ఇప్పుడు దానికి పార్లమెంటు సజావుగా సాగేలా చేసే ఒక అమిత్ షా అవసరం. మోదీ పార్లమెంటులో తన వైఫల్యం ఎక్కడుందో, ఎందుకో సమీక్షించుకోవాల్సి ఉంది. పార్లమెంటు గౌరవాన్ని సంపాదించుకోలేకపోవడం వల్లే గొప్ప విజయా లు సాధిస్తున్నా గానీ ఆయన ప్రతిష్ట దెబ్బతింటోంది. ప్రధానిగా మోదీ తన పదవీ కాలం మొదట్లో చేపట్టాల్సింది రాజీ వైఖరే తప్ప, సంఘర్షణాత్మక వైఖరి కాదని గ్రహించాలి. సలహాదారులను పక్కకు నెట్టి, ఆయన రాజీలు చేసుకోవాలి. సమస్యాత్మకమైన అంతర్జాతీయ నేతలతో అంత బాగా వ్యవ హరించగలుగుతున్న ఆయన మన రాజకీయ నేతలతో అదే పని ఎందుకు చేయలేరు? - (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) -
జయక్వాడీ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
భారతదేశం - బహుళార్థ సాధక ప్రాజెక్టులు ‘ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు’ అని భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అన్నమాట నాటికి, నేటికీ అక్షర సత్యం. మన దేశ ప్రగతిని సరికొత్త మలుపు తిప్పినవి బహుళార్థ సాధక ప్రాజెక్టులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక (1951) నుంచి వివిధ ప్రాంతాల్లో పలు బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించారు. ఒకటి కంటే ఎక్కువ సదుపాయాల కల్పనకు ఉద్దేశించి నిర్మించిన ప్రాజెక్టునే బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటారు. భారతదేశంలో వ్యవసాయ నీటిపారుదల, గృహ, పరిశ్రమ అవసరాలకు నీటి సరఫరా, విద్యుదుత్పాదన, వరద నివారణ, స్థానిక రవాణా, భూ సంరక్షణ, మత్స్య పరిశ్రమ అభివృద్ధి, విహారయాత్ర, కృత్రిమ వనాల పెంపకం మొదలైన అనేక ప్రయోజనాల కోసం ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. బెంగాల్లో 1948లో వరదలను, వాటి అనుబంధ సమస్యలను అదుపు చేయడానికి దామోదర్ నదీ, దాని ఉపనదులపైన ప్రాజెక్టులు కట్టడం కోసం మొట్టమొదటి నదీలోయ ప్రాజెక్టు సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థను అమెరికాలోని టెన్నిస్ వేలీ అథారిటీ (టీవీఏ) నమూనా ఆధారంగా ఏర్పాటు చేశారు. 1948 ఫిబ్రవరి 18న భారత పార్లమెంట్ ఈ సంస్థను ఆమోదించడంతో ఇది దామోదర్ లోయ కార్పొరేషన్ (డీవీసీ)గా వాస్తవ రూపం దాల్చింది. డీవీసీ ఏర్పడక ముందు బెంగాల్ దుఃఖదాయినులుగా దామోదర్, దాని ఉపనదులు ఉన్నాయి. తర్వాత వాటిపై ప్రాజెక్టులు నిర్మించడంతో బెంగాల్ వరదాయినులుగా మారాయి. భారతదేశంలోని నీటి పారుదల ప్రాజెక్టులను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... 1) భారీ నీటిపారుదల పథకాలు 2) మధ్య తరహా నీటి పారుదల పథకాలు 3) చిన్న తరహా నీటి పారుదల పథకాలు {పాజెక్టు కల్పించే నీటి పారుదల విస్తీర్ణం బట్టి ప్రాజెక్టులను విభజించారు. 1. భారీ నీటిపారుదల పథకాలు 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం ఉన్న పథకాలు. వీటిని ప్రధానంగా నదులపై నిర్మిస్తారు. 2. మధ్య తరహా నీటిపారుదల పథకాలు 2,000 నుంచి 10,000 హెక్టార్ల వరకు ఆయకట్టు ప్రాంతం ఉన్న పథకాలు. వీటిని నదులపై, ఉపనదులపై నిర్మిస్తారు. 3. చిన్న తరహా నీటిపారుదల పథకాలు 2,000 హెక్టార్ల కంటే తక్కువ ఆయకట్టు గల పథకాలు. భూగర్భ జల పథకాలు, ఉపరితల జల పథకాలు ఈ తరహా పథకాల్లోకి వస్తాయి. భూగర్భ జల పథకాలు: సాధారణ బావులు, గొట్టపు బావులు. ఉపరితల జల పథకాలు: చెరువులు, జలాశయాల నుంచి నీటిని మళ్లించే పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు. ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకం నీటి పారుదల ఆవశక్యత, ఉత్పత్తి, వినియోగాల మధ్య అంతరాన్ని పూడ్చే ఉద్దేశంతో 1974-75లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో 1990లో జాతీయ జల మండలిని ఏర్పాటు చేశారు. 2008 నవంబర్ 4న గంగానదిని ‘జాతీయ నది’గా ప్రకటించారు. దేశంలోని కొన్ని ప్రధాన బహుళార్థ సాధక ప్రాజెక్టులు 1. భాక్రానంగల్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు దేశంలో నిర్మించిన మొట్టమొదటిది, అన్నిటికంటే పెద్దది. దీన్ని భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1962 అక్టోబర్ 22న జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. ఈ మూడు రాష్ట్రాలతో పాటు హిమాచల్ప్రదేశ్ కూడా లబ్ధి పొందుతోంది. సట్లేజ్ నదిపై హిమాచల్ ప్రదేశ్లో భాక్రా అనే ప్రాంతంలో భాక్రా ఆనకట్ట (226 మీటర్లు), పంజాబ్లోని నంగల్ ప్రాంతం వద్ద నంగల్ ఆనకట్ట(29 మీటర్లు)ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు 1204 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తుంది. 2. హీరాకుడ్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును ఒడిశాలో మహానదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు 4801 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. దీన్ని విద్యుదుత్పాదన, నీటి పారుదల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారు. 3. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నందికొండ గ్రామ సమీపంలో కృష్ణానదిపై నిర్మించారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల పథకం. దీనికి భారత తొలి ప్రధాని నెహ్రూ 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు 1450 మీటర్ల పొడవుతో, రాతి కట్టడపు ఆనకట్టల్లో ప్రపంచంలోనే ప్రథమ స్థానం పొందింది. దీని కుడి కాలువను జవహర్ కాలువ అంటారు. ఈ కాలువ 204 కి.మీ. పొడవుఉంది. ఇది గుంటూరు, కృష్ణా జిల్లాలకు నీరు అందిస్తుంది. దీని ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ అంటారు. ఈ కాలువ 179 కి.మీ. పొడవుతో నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నీటిని సరఫరా చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. 4. దామోదర్ నదీలోయ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం బెంగాల్ ప్రాంతాన్ని.. దామోదర్ నది, దాని ఉపనదుల వల్ల వచ్చే వరదల నుంచి కాపాడడం. ఈ పథకంలో భాగంగా తిలయ్యా, మైథాన్ ఆనకట్టలు - బరాకర్ నదిపై, పంచట్హిట్ ఆనకట్ట - దామోదర్ నదిపై, కోనార్ ఆనకట్ట - కోనార్ నదిపై నిర్మించారు. 5. బియాస్ పథకం ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. ఇది బియాస్ జలాలను సట్లేజ్ జలాలతో కలుపుతుంది. బియాస్ నదిపై ‘పోంగ్’ వద్ద ఈ ఆనకట్టను నిర్మించారు. 6. కోసి ప్రాజెక్టు దీన్ని బీహార్ - నేపాల్ సరిహద్దులోని హనుమాన్నగర్ సమీపంలో ‘కోసి’ నదిపై నిర్మించారు. ఇది అంతర్జాతీయ పథకం 7. గండక్ పథకం దీన్ని బీహార్లోని వాల్మీకినగర్ వద్ద గండక్ నదిపై నిర్మించారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ల ఉమ్మడి పథకం. 8. చంబల్ పథకం ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. దీన్ని చంబల్ నదిపై నిర్మించారు. ఈ పథకంలో మూడు ఆనకట్టలున్నాయి. అవి ... 1) గాంధీసాగర్ ఆనకట్ట 2) రాణా ప్రతాప్సాగర్ ఆనకట్ట 3) జవహర్ సాగర్ ఆనకట్ట 9. తెహ్రీడ్యామ్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాల ఉమ్మడి పథకం. దీన్ని ‘భాగీరథి’ నదిపై హిమాలయ ప్రాంతం(ఉత్తరాఖండ్)లోని భూకంపాలు సంభవించే ప్రదేశంలో నిర్మించడం వల్ల ఇది వివాదాస్పదమైంది. తెహ్రీడ్యామ్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి - సుందర్లాల్ బహుగుణ. 10. ఇందిరాసాగర్ ప్రాజెక్టు ఇది నర్మద నదిపై ఉంది. దీన్ని గుజరాత్లోని పూర్ణసా ప్రాంతంలో నిమొరి జిల్లాలో నిర్మించారు. ఇది మధ్యప్రదేశ్, గుజరాత్ల ఉమ్మడి ప్రాజెక్టు 11. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు దీన్ని నర్మద నదిపై, గుజరాత్లోని బరూచ్ జిల్లాలో బడగావ్ అనే ప్రాంతంలో నిర్మించారు. ఇది రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, గుజరాత్ల ఉమ్మడి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మేథాపాట్కర్ చేపట్టిన ఉద్యమమే- నర్మదా బచావో. మరికొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు {పాజెక్టు పేరు నది రాష్ట్రాలు ఇతర అంశాలు 1. బాగ్లీహార్ ప్రాజెక్టు చీనాబ్ జమ్మూ - కాశ్మీర్ భారత్, పాకిస్థాన్ల మధ్య 2. ధూల్హస్తి చీనాబ్ జమ్మూ - కాశ్మీర్ -వివాదాస్పదమైంది 3. నాథ్పాజాక్రి సట్లేజ్ హిమాచల్ ప్రదేశ్ - 4. రిహాండ్ రిహాండ్ ఉత్తరప్రదేశ్ - 5. రామ్గంగా రామ్గంగా ఉత్తరప్రదేశ్ ఢిల్లీ నగరానికి 200 క్యూసెక్కుల నీటి సరఫరా 6. సువర్ణరేఖ సువర్ణరేఖ బీహార్ - 7. ఫరక్కా హుగ్లీ పశ్చిమ బెంగాల్ - 8. మయూరాక్షి మురళీ పశ్చిమ బెంగాల్ - 9. జయక్వాడీ గోదావరి మహారాష్ర్ట - 10. బాబ్లీ గోదావరి మహారాష్ర్ట - 11. ఆల్మట్టి కృష్ణా కర్ణాటక - 12. ఇడుక్కి పెరియార్ కేరళ - 13. శబరిగిరి పంప కేరళ - 14. మెట్టూరు పైకారా తమిళనాడు పైకారా నది కావేరి నదికి ఉపనది 15. ఉకాయ్ తపతి గుజరాత్ - 16. కాక్రపార తపతి గుజరాత్ - 17. శ్రీరాంసాగర్ గోదావరి తెలంగాణ దీని కాలువ కాకతీయ కాలువ. దీన్ని నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద నిర్మించారు. 18. సుంకేసుల తుంగభధ్ర ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉంది 19. పులిచింతల కృష్ణానది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఉంది. దీని పేరు కెఎల్.రావు సాగర్ 20. జంఝావతి జంఝావతి నది ఆంధ్రప్రదేశ్ విజయనగరం 21. ఎల్లంపల్లి(శ్రీ పాదసాగర్) గోదావరి తెలంగాణ కరీంనగర్ మాదిరి ప్రశ్నలు 1. ‘మెట్టూరు జల విద్యుత్ కేంద్రం’ ఏ నదిపై ఉంది? 1) తుంగభద్ర 2) మహానది 3) కావేరి 4) గోదావరి 2. కిందివాటిలో ‘దామోదర్ వ్యాలీ కార్పొరేషన్’ లో భాగాలైన ఆనకట్టలు ఏవి? 1) తిలైయా 2) మైథాన్ 3) పంచట్ 4) పైవన్నీ 3. భారతదేశ జాతీయ నది? 1) గోదావరి 2) గంగా 3) కృష్ణా 4) నర్మద 4. ఆల్మట్టి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? 1) గోదావరి 2) కృష్ణా 3) పెన్గంగా 4) పూర్ణ 5. దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు ఒక? 1) జలవిద్యుత్ 2) నీటిపారుదల 3) బహుళార్థ సాధక 4) ఏదీకాదు 6. కింది వాటిలో ఏ జల విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్లో ఉంది? 1) మయూరాక్షి 2) రిహాండ్ 3) కంగ్సబతి 4) హీరాకుడ్ 7. అత్యధిక ప్రాజెక్టులను ఏ నదిపై నిర్మించారు? 1) గోదావరి 2) గంగా 3) నర్మద 4) కావేరి 8. భారతదేశంలో కెల్లా అత్యంత ఎత్తై ప్రాజెక్టు? 1) నాథ్ ప్రాజెక్టు 2) భాక్రా ప్రాజెక్టు 3) నాగార్జున ప్రాజెక్టు 4) హీరాకుడ్ ప్రాజెక్టు 9. కిందివాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు? 1) కోసి 2) చంబల్ 3) తెహ్రీడ్యామ్ 4) మయూరాక్షి 10. {పపంచంలో అతి పెద్ద రాతికట్టడపు ఆనకట్ట ఏది? 1) భాక్రానంగల్ 2) హీరాకుడ్ 3) నాగార్జున సాగర్ 4) కోసి 11. భారతదేశంలో జాతీయ జల మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1) 1975 2) 1948 3) 1951 4) 1990 సమాధానాలు 1) 3; 2) 4; 3) 2; 4) 2; 5) 3; 6) 2; 7) 3; 8) 2; 9) 1; 10) 3; 11) 4. గతంలో వచ్చిన ప్రశ్నలు 1. ‘సుంకేసుల’ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు? (కానిస్టేబుల్-2012) 1) గోదావరి 2) నాగావళి 3) తుంగభధ్ర 4) పెన్నా 2. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో జంఝావతి రబ్బర్ డ్యాం ఉంది? (కానిస్టేబుల్-2009) 1) వరంగల్ 2) శ్రీకాకుళం 3) విశాఖపట్నం 4) విజయనగరం 3. పులిచింతల ప్రాజెక్టు ఎవరి పేరుతో నిర్మించారు? (కానిస్టేబుల్-2009) 1) డి. సంజీవయ్య 2) కె.ఎల్.రావు 3) కోట్ల విజయభాస్కర్ రెడ్డి 4) జె. చొక్కారావు 4. ఇందిరాసాగర్ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు? (కానిస్టేబుల్-2013) 1) మహానది 2) చంబల్ 3) నర్మద 4) యమున 5. జపాన్ సహాయంతో పూర్తి చేసిన పైథాన్ (జయక్వాడీ) జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?(కానిస్టేబుల్ - 2013) 1) గంగ 2) గోదావరి 3) నర్మద 4) కావేరి సమాధానాలు 1) 3; 2) 4; 3) 2; 4) 3; 5) 2. -
స్మృతి సరే... రాజీవ్ 'జాతకం' సంగతేంటి?
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ జ్యోతిష్యుడ్ని కలవడంపై రాద్ధాంతం చేసిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్పై దాడికి కాషాయం పార్టీ తన అంబుల పొదలో నుంచి సరికొత్త ఆయుధాన్ని వెలికి తీసింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కోసం ఆయన తాత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రు జాతక చక్రం వేయించాలని తన సోదరి కృష్ణ హతిసింగ్ కి 1944, ఆగస్టు 29వ తేదీన రాసిన లేఖను బీజేపీ బుధవారం వెలుగులోకి తీసుకువచ్చింది. ఇదే అంశంపై నెహ్రు తన కుమార్తె ఇందిరకు కూడా లేఖ రాశారని బీజేపీ పేర్కొంది. కాగా నవంబర్ 25వ తేదీన స్మృతి ఇరానీ తన భర్తతో కలిసి రాజస్థాన్లోని భిల్వారాలో జ్యోతిష్కుడిని కలిశారు. ఈ సందర్భంగా ఆ జ్యోతిష్కుడు స్మృతి భవిష్యత్తులో దేశానికి అధ్యక్షురాలు అవుతారని చెప్పారని కథనాలు వెలువడ్డాయి. స్మృతి ...జ్యోడిష్యుడిని కలవటంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీవ్ జాతకంపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. -
ఈ విమానం.. బహు ప్రత్యేకం!!
ఈ విమానం చూశారా? సర్వసాధారణ శిక్షణ విమానంలాగే కనపడుతోందా.. కానీ దీనికో ప్రత్యేకత ఉంది. ఏమిటనుకుంటున్నారా.. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వాడిన విమానమిది. డెహవిల్లాండ్ 104 దెవన్ రకానికి చెందిన ఈ విమానం ప్రస్తుతం వాడకంలో లేదు. బెంగళూరు సమీపంలోని యలహంకలో ఉన్న వీఎస్ఎం ఏరోస్పేస్ ఏఎంఈ శిక్షణ కేంద్రంలో సేద తీరుతోంది. అప్పట్లో భారత వైమానిక దళానికి చెందిన ఈ ప్రత్యేక విమానాన్ని మాజీ ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, రక్షణ శాఖ మాజీమంత్రి వీకే కృష్ణమీనన్ దీన్ని ఉపయోగించారు. -
సీబీఐకి ‘సుప్రీం’ ముగుదాడు!
రాజ్య వ్యవస్థలోని మూడు విభాగాలు విధి నిర్వహణలో పాటించవలసిన బాధ్యతలకు సంబంధించి ‘ఇబ్బంది’ ఏర్పడినప్పుడల్లా పాలకులు నర్మగర్భంగానూ, బహిరంగంగానూ న్యాయస్థానాల్ని బెదిరించడం ఇటీవలి కాలంలో ‘ముదిరిపోతున్న జబ్బు’. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తదితరులు ఒకటికి రెండుసార్లు అదే చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పాలకులూ అలాగే ప్రవర్తిస్తున్నారు! రాజ్యాంగ స్ఫూర్తికి, ఆదేశిక సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. న్యాయవ్యవస్థ తప్పుడు చట్టాలపై భాష్యం చెప్పడం గానీ, జోక్యం చేసుకుని సన్మార్గంలో పెట్టడం గానీ సాధ్యపడని ఒక చెడు సంప్రదాయానికి మన పాలకులు క్రమంగా అలవాటు పడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు పరమ విరుద్ధమైన పరిణామం. ‘‘దేశ ప్రజలకు ఆర్థిక సమన్యాయం, అందరికీ సమాన అవకాశాలు కల్పిం చడం ద్వారా వర్గరహిత సమాజాన్ని నిర్మించడమే మన తుది లక్ష్యం. మానవా ళిని సమున్నతమైన భౌతిక, సాంస్కృతికస్థాయికి చేర్చగల ప్రణాళికాబద్ధమైన సమాజ నిర్మాణమే ఆ ధ్యేయం. అలాంటి సమాజ నిర్మాణంలో అడ్డుతగిలే ప్రతి పరిణామాన్ని, ప్రతిఘటనను సాధ్యమైనంత వరకు సౌమనస్యంతోనే తొలగించుకోవాలి, అది వీలులేని సందర్భాల్లో ఆ అడ్డుగోడలను బలవంతంగా నైనా కూల్చివేయాలి. ఈ క్రమంలో తరచుగా బలప్రయోగమే అవసరం కావొచ్చు’’ - పండిట్ నెహ్రూ భారత రాజ్యాంగం ప్రధాన లక్ష్యాన్ని, దేశ అవసరాన్నీ చాలా కాలం క్రితమే నొక్కి చెప్పిన నెహ్రూ మాటల్ని ఉదహరిస్తూ స్వతంత్ర భారత సుప్రీం కోర్టు ధర్మాసనం చైతన్యం వల్లనే ప్రజాప్రయోజనాల రక్షణకు ఒక ‘ఆయుధం’ (‘పిల్’) ప్రజల చేతికి ఒనగూడిందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ పేర్కొన్నారు. అలాంటి ‘ప్రజాప్రయోజన వ్యాజ్యం’ ఆధారంగానే రాజ్యాంగం, న్యాయవ్యవస్థ అనుమతించిన పరిధులలోనే ఏ మేరకు న్యాయాన్ని ఆవిష్కరించవచ్చునో నిరూపించిన వారు సుప్రసిద్ధ న్యాయ వాది ప్రశాంత్ భూషణ్, సుప్రీంకోర్టూ, దేశ పరిధులలో ఉన్న రేడియో తరం గాలు దేశ వనరులు, ప్రజల ఉమ్మడి సొత్తు. కాబట్టి వాటిని ఏ కొలది దేశ, విదేశ మల్టీనేషనల్ కంపెనీలో తమ లాభాల కోసం దుర్వినియోగం చేయడాన్ని అను మతించరాదంటూ, ‘2-జి’ స్పెక్ట్రమ్ కేసుల్లో ప్రభుత్వ వైఖరిని, కేసుల విచా రణలో సీబీఐ వ్యవహరిస్తూ వచ్చిన తీరునూ సుప్రీం ఘాటుగా విమర్శించింది. ముఖ్యంగా సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా ‘2-జి’ కుంభకోణాల విచారణ సంద ర్భంగా అవినీతికి పాల్పడిన కంపెనీ అధిపతుల్ని కాపాడటానికి ప్రయత్నించా రని ఆధారాలతోసహా ప్రశాంత్ భూషణ్ సమర్పించిన డాక్యుమెంట్లను ధర్మా సనం నమ్మింది, పర్యవసానంగా ‘2-జి’ కేసుల విచారణ నుంచి తప్పుకోవా లని సిన్హాను ఆదేశించింది! సిన్హాను ఎందుకు తప్పించవలసి వచ్చిందో కారణా లను బయట పెట్టడానికి కోర్టు నిరాకరించింది. అయినప్పటికీ ఒక గౌరవ విచారణ సంస్థగా ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’కు (సీబీఐ) ఉన్న ప్రతి పత్తి దృష్ట్యా, దానిపై ప్రజలకింకా కొంత విశ్వాసం ఉన్నందున తమాయించు కోవలసివచ్చిందని ధర్మాసనం హుందాగా ప్రకటించింది. కదిలిన సీబీఐ డొంక అంతకుముందు సీబీఐ డెరైక్టర్ సిన్హా తన ఇంటి నుంచి ప్రశాంత్ భూషణ్కు సమాచారం అందించిన ‘వేగు’ (విజిల్ బ్లోయర్) పేరు చెప్పాలని పట్టుప ట్టాడు. కోర్టు కూడా కోరగా ప్రశాంత్ భూషణ్ ఒక సీల్డ్ కవర్లో ఆ సమాచా రాన్ని కోర్టుకు అందజేశారు. దాన్ని పరిశీలించి, విశ్వసించిన మీదటనే ధర్మాస నం రంగంలోకి దిగింది. స్పెక్ట్రమ్ కుంభకోణాల్లో భాగస్వాములుగా నమోదైన రిలయన్స్ (ఎయిర్సెల్ - మాక్సిస్ డీలు), 2-జి కేసులో నిందితుడైన షాహిద్ బల్వాలపైన ఉన్న కేసును బలహీనపర్చడానికి చార్జిషీట్ దాఖలు కాకుండా సిన్హా అడ్డుకుంటున్నాడన్న ప్రశాంత్ భూషణ్ నిరూపణను సుప్రీం విశ్వసించిన దరిమిలానే సీబీఐ డెరైక్టర్ పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. దీనితో ‘సీబీఐ’ డొంక అంతా కదలవలసివచ్చింది! అంతేకాదు, ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తా, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ ఎ.కె.సిక్రీలతో కూడిన ధర్మాస నం, విచారణకు ముందు... కేసులో సిన్హా వ్యవహరించిన తీరుకు సంబంధిం చిన సాక్ష్యాధారాలను పరిశీలించడానికి సుప్రీం నియమించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ పిటిషనర్ల సాక్ష్యం సరైనదేనని ధ్రువీకరించింది! అంటే, సీబీఐపై ప్రజల్లో మిగిలి ఉన్న విశ్వాసాన్ని కోర్టు గౌరవించింది. అయితే సీబీఐ చాలా కాలంగా పాలకుల కనుసన్నలలో నడచుకుంటూ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏ ప్రత్యర్థులపైన, లేదా ఏ ప్రత్యర్థి రాజకీయ నేతలపైన కేసులు బనాయించాలని ఆదేశిస్తే ఆ తాఖీదుల్ని తలదాల్చేదిగానే వ్యవహరిస్తోందని ప్రజలలో నమ్మకమో, అపనమ్మకమో బలపడుతూ వచ్చింది! పాలకుల ఈ విద్వేషపూరితమైన పాక్షికత వల్లనే కోర్టులలో కేసులు కొలిక్కి రావటం లేదు. ఇది పాత, కొత్త ప్రభుత్వాలన్నిటికీ వర్తిస్తుంది. ఎందుకంటే, 2-జి కుంభకో ణాల కేసులలోని గుత్త కంపెనీలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు చెల్లవని, అవి రద్దుకావలసిందేనని కోర్టు తీర్పు చెప్పిన తరవాతనే బీజేపీ- ఆర్ఎస్ ఎస్ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తీర్పును ఆసరా చేసుకుని అది కూడా మా పద్ధతిలో మేమూ వ్యవహరిస్తామని ముందుకు వచ్చింది. అంటే, ‘‘ఎడమ చేయి స్థానంలో పురచేయి’’ ప్రవేశించింది! ‘ముదిరిపోతున్న జబ్బు’ రాజ్య వ్యవస్థలోని మూడు విభాగాలు (ప్రభుత్వ నిర్వాహకులు, న్యాయస్థానం, శాసనవేదిక) విధి నిర్వహణలో పాటించవలసిన బాధ్యతలకు సంబంధించి ‘ఇబ్బంది’ ఏర్పడినప్పుడల్లా పాలకులు నర్మగర్భంగానూ, బహిరంగంగానూ న్యాయస్థానాల్ని బెదిరించడం ఇటీవల కాలంలో ‘ముదిరిపోతున్న జబ్బు’. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ మంత్రి కపిల్ సిబల్లు ఒకటికి రెండు సార్లు అదే పనిచేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పాలకులూ అలాగే ప్రవర్తిస్తున్నారు! రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, దాని ఆదేశిక సూత్రాలకు వ్యతిరేకంగా, దాని ఉపోద్ఘాతంలో వివరించిన ఆదర్శ సమాజ నిర్మాణ సూత్రా లకు భిన్నంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. ధర్మాసన చైతన్యాన్ని నిరుత్సాహ పరచడానికి, కన్నెర్ర చేయడానికి కూడా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ సాహసిస్తు న్నది. ఈ తప్పుడు సంప్రదాయం ప్రకారం న్యాయవ్యవస్థ తప్పుడు చట్టాలపై భాష్యం చెప్పడం గానీ, జోక్యం చేసుకుని సన్మార్గంలో పెట్టడంగానీ సాధ్య పడని ఒక చెడు సంప్రదాయానికి మన పాలకులు క్రమంగా అలవాటు పడుతు న్నారు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు పరమ విరుద్ధమైన పరిణామం. రాజ్యాంగ నిర్మాతలు భావి పాలకులపై పెట్టుకున్న ఆశలకు నేటి పాలకుల ప్రవర్తన పెద్ద అపవాదు. గాడితప్పిన పాలకుల అవినీతివల్లనే దేశ, విదేశాల్లోని దేశీయ అక్రమార్జనాపరుల నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామన్న వారి శపథాలు నోటి మాటలుగా మిగిలిపోతున్నాయి! ఈ పరిస్థితుల్లో న్యాయస్థానాలపై కూడా రాజకీయ కలుషిత వాతావరణ ప్రభావం అంతో ఇంతో పడకతప్పదు. సామాజిక దృష్టి కోణంతో న్యాయం అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ వారెన్ నాటి ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్కు ఒక ఆరోగ్యకర సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ‘‘ధర్మాసన చైతన్యం ద్వారా దూరదృష్టిగల న్యాయమూర్తులు కూడా సమా జాన్ని మార్చగలర’’ని చెప్పాడు! కాని తరువాతి కాలంలో అదే గాడి తప్పి, జూనియర్ బుష్ రెండవసారి అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా, అతణ్ణి కాపాడటా నికి అమెరికా సుప్రీంకోర్టు తనకున్న ఒకే ఒక్క మెజారిటీ ఓటును దుర్వినియో గం చేయడానికి సాహసించింది! అందుకే ఒక సందర్భంలో జస్టిస్ కృష్ణయ్యర్ ‘‘న్యాయమూర్తులు ఆచరణలో సమతావాదులుగా, లౌకిక వ్యవస్థ సంరక్షకు లుగా మారితే ప్రజాప్రయోజన వ్యాజ్యానికి విప్లవాత్మకశక్తిని ప్రసాదించగలర’’ న్నారు. కానీ ఆ దశ ఇంకా పరిపూర్ణ స్థాయిలో మన న్యాయవ్యవస్థకు రాలేద న్నారు. ఎందుకంటే దృష్టికోణం మారితేగాని ఆ ఆదర్శం దగ్గరకు చేరదు, నిల దొక్కుకోదు! ఆయనే దాన్ని ఇలా వివరించారు: ‘‘సమాజ దృష్టికోణానికి దూరంగా ఉండే న్యాయమూర్తులు తమ వర్గ పక్షపాతానికి, మల్టీనేషనల్ కంపె నీల, రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతారు లేదా ప్రధానమంత్రి ప్రసంగానికి భయ పడతారు. అంతకన్నా పెద్ద పాపం ఏమంటే - ప్రభువుల స్వార్థ ప్రయోజనాల కొద్దీ చొప్పించే అవినీతికి నింపాదిగా లోబడి పోతారు. ఇది మరింత ప్రమాదకరం’’. గతంలో సరిగ్గా ఇలాంటి వాతా వరణంలోనే ప్రశాంత్ భూషణ్ ఒక అఫిడవిట్లో (7-12-2009) సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తులు 16 మందిలో ఎనమండుగురు అవినీతికి పాల్పడ్డారని చూపి సంచలనం రేపారు! కృష్ణయ్యర్ న్యాయవ్యవస్థ గురుతర బాధ్యతల్ని ఇలా గుర్తుచేశారు: ‘‘న్యాయ మూర్తులలో సామాజిక పరువు, ప్రవర్తన, నైతిక దారుఢ్యం, స్వతంత్రంగా నిలబడగల సాహసం దిగజారిపోయి ఉంటే, సామాజిక విప్లవం అసంభవం. ఎందుకంటే, ఆర్థిక సంబంధమైన తాత్త్విక చింతన లేదా సామాజిక అభ్యు దయం పట్ల అనురక్తి, అనుకంపన లేని న్యాయవ్యవస్థ - సంస్కరణలకూ ప్రజలలో చైతన్యదీప్తికీ ఆధునిక ప్రాపంచిక దృక్పథానికీ పెద్ద గుదిబండే కాగలదు’’. కనుకనే లార్డ్ జస్టిస్ స్క్రూలున్ ‘‘న్యాయవ్యవస్థలో నిష్పాక్షికతను సాధించడం ఎంత కష్టమైనదో, దాన్ని నిలబెట్టుకోవటమూ అంతే కష్ట సాధ్యమని జోస్యం చెప్పి పోయాడు. -
నెహ్రూ వారసత్వాన్ని తుడిచేస్తున్నారు
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వారసత్వంపై పోరు మంగళవారం తీవ్రమైంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆయన విలువల వారసత్వాన్ని చరిత్ర నుంచి తుడిచేసే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. నెహ్రూ స్మారక సదస్సు నిర్వహణకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించిందని విమర్శించింది. నెహ్రూ 125వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన రెండు రోజుల జవహర్లాల్ నెహ్రూ స్మారక అంతర్జాతీయ సదస్సు మంగళవారమిక్కడ ముగిసింది. ముగింపు సమావేశంలో పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ప్రసంగించారు. నెహ్రూ వారసత్వాన్ని కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ రాహుల్, సోనియాలు మోదీ సర్కారుపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. తొలి ప్రధాని భావనలు, రాజకీయ అభిప్రాయాలు ఇప్పటికీ అనుసరణీయమేనని రాహుల్ అన్నారు. ‘ఆయనను, ఆయన అపురూపంగా అందించిన వారసత్వాన్ని దేశం నుంచి తుడిచిపెట్టేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఎవరి మాటనూ నిరాకరించని ఆయన వారసత్వాన్ని మనం 70 ఏళ్లుగా కాపాడుకుంటున్నాం. ఇకపైనా కాపాడుకోవాలి’ అని పేర్కొన్నారు. సోనియా మాట్లాడుతూ.. ‘నెహ్రూ భావనలకు ప్రస్తుతం సవాలు ఎదురవుతోంది. మనం వాటిని కట్టుబడి ఉండడమేకాకుండా ప్రజాస్వామ్యాన్ని, సమీకృతత్వాన్ని, లౌకికవాదాన్ని బలోపేతం చేయడానికి గట్టిగా పోరాడాలి’ అని పిలుపునిచ్చారు. నెహ్రూ ప్రేమాదస్పదుడని, దృఢవిశ్వాసాలున్న గొప్ప నాయకుడని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొనియాడారు. నెహ్రూ అనుసరించిన ప్రజాస్వామ్యం, సాధికారతలకు ఎప్పుడూ విలువ ఉంటుందని సదస్సు తీర్మానం చేసింది. ‘నెహ్రూ ప్రాపంచిక దృక్పథం, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్న ఈ తీర్మానాన్ని ఘనా మాజీ అధ్యక్షుడు కుఫోర్ చదివి వినిపించారు. ‘సదస్సు ప్రభుత్వానికి ఇష్టం లేదు’ సదస్సు నిర్వహణకు మోదీ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టించిందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఆరోపించారు. ‘సదస్సు జరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. విజ్ఞాన్భవన్ ఈ నెల 14న(నెహ్రూ జయంతి) ఖాళీగా ఉన్నా ఆ రోజు కార్యక్రమం జరుపుకోవడానికి మాకు అనుమతివ్వలేదు. సదస్సుకు సంబంధించి ప్రపంచనేతలు ఎవరైనా వాకబు చేస్తే నేరుగా కాంగ్రెస్ పార్టీని సంప్రదించాలని భారత ఎంబసీలకు చిన్న సర్క్యులర్ జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ఇంకా మరెన్నో ఆటంకాలు సృష్టించారు’ అని ఆరోపించారు. -
నెహ్రూ విధానాలను వక్రీకరిస్తున్నారు
లౌకికత్వం లేకుండా దేశానికి అస్తిత్వం లేదు: సోనియా నెహ్రూ విధానాలను తక్కువగా చూపే ప్రయత్నం జరుగుతోంది న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మనకు వారసత్వంగా అందించిన లౌకికత్వం (సెక్యులరిజం) వంటి విధానాలు ఇప్పుడు తప్పుడు వ్యక్తీకరణకు, వక్రీకరణకు గురవుతున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. సెక్యులరిజం లేకుండా భారతదేశానికి అస్తిత్వం లేదన్నారు. నెహ్రూ 125వ జయంతి సందర్భంగా ఢిల్లీలో సోమవారం నెహ్రూ స్మారక అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీని, ఇతర బీజేపీ నేతలను ఆహ్వానించకుండా నిర్వహిస్తున్న ఈ సదస్సు సాక్షిగా సోనియా బీజేపీ, సంఘ్పరివార్ పేర్లు ప్రస్తావించకుండా కాషా య శక్తులపై మండిపడ్డారు. ఎన్డీఏయేతర పార్టీలకు చేరువ కావడానికి కాంగ్రెస్ వినియోగించుకుంటున్న ఈ సదస్సుకు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఎం నుంచి ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, జేడీయూ అధ్యక్షడు శరద్యాదవ్, సీపీఐ నుంచి డి.రాజా, ఎన్సీపీ ప్రధానకార్యదర్శి డి.పి.త్రిపా ఠి, ఆర్జేడీ నేత జైప్రకాశ్ నారాయణ్ యాదవ్తో పాటు అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఘనా నుంచి జాన్ కుఫోర్, నైజీరియా నుంచి ఒబాసాంజో, నేపాల్ మాజీ ప్రధాని మాధవ్, పాకిస్థాన్ హక్కుల కార్యకర్త ఆస్మా జహంగీర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం అనంతరం సోనియాగాంధీ ప్రసంగించారు. ‘నెహ్రూ జీవితాన్ని, ఆయన చేసిన కృషిని తక్కువచేసే ప్రయత్నం కొద్దిరోజులుగా జరుగుతోంది. ఆయన విధానాలు తప్పుడు వ్యక్తీకరణకు గురవుతున్నాయి. అందు లో నెహ్రూ నమ్మి, పాటించిన లౌకకవాదం కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కుంటోంది. మత విషయాల్లో తటస్థంగా ఉండే రాజ్యం, అన్ని మతాలకు సమాన గౌరవం నెహ్రూ లౌకికవాద భావనకు కీలకం. లౌకికత్వం లేకుండా భారత్గాని, భారతీయతగాని లేవు. ఇది ఒక లక్ష్యం కంటే గొప్పది. ఎంతో విభిన్న పరిస్థితులున్న మన దేశానికి అది ఎంతో అత్యవసరం.’ అని ఆమె పేర్కొన్నారు. వేర్వేరు సంస్కృతులు, మతాలు, భాషలు, ప్రాంతీయతలు ఉన్న మన దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి పార్లమెంటరీప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యం దోహదపడతాయని నెహ్రూ విశ్వసించారని.. ఇదే సరైన విధానమని నిరూపణ అయిందన్నారు. సరైన మార్గంలో ఓటమి ఎదురైనా సరే.. లోక్సభ ఎన్నికలతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి నుంచి బయటపడలేకపోతున్న నేపథ్యంలో.. సోనియా నెహ్రూను ఉటంకిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో గెలిచినవారు దానిని తలకు ఎక్కించుకోవాల్సిన అవసరం లేదని, ఓడినవారు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని నెహ్రూ చెప్పేవారు. గెలిచామా? ఓడామా? అన్న ఫలితం కంటే.. అందుకు అనుసరించిన మార్గమే ముఖ్యమని.. తప్పుడు మార్గంలో గెలిచే బదులు, సరైన మార్గంలో వెళ్లి ఓడిపోవడమే నయమని నెహ్రూ చెప్పేవారు.’’ అని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల్లోకి మతం ప్రవేశిస్తే వచ్చే పరిణామాలను గురించి నెహ్రూ ముందుగానే హెచ్చరించారన్నారు. నెహ్రూ తన విధానాలతో అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి హీరోగా మారారన్నారు. నెహ్రూ విధానాలు ఆచరణీయమని హమీద్ కర్జాయ్ సహా పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఈ సదస్సు మంగళవారం సాయంత్రం ముగియనుంది. క్షీణిస్తున్న అదృష్టానికి నిదర్శనం: బీజేపీ నెహ్రూ స్మారక సదస్సుకు ఆహ్వానితుల జాబితాను చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని అధికార బీజేపీ ఎద్దేవా చేసింది. నెహ్రూ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించినవారిని ఆ సదస్సుకు ఆహ్వానించడం.. క్షీణిస్తున్న కాంగ్రెస్ పార్టీ అదృష్టానికి చిహ్నంగా కనబడుతోందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ వ్యాఖ్యానించారు. నెహ్రూ విధానాలను వ్యతిరేకించిన వామపక్షాలను, రాంమనోహర్ లోహి యా అనుచరులను ఈ సదస్సుకు ఆహ్వానించ డం ఏమిటన్నారు. కాగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకొనేందుకే కాంగ్రెస్, లెఫ్ట్ లతో వేదిక పంచుకున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఒక అంతర్జాతీయ సదస్సులో కాంగ్రెస్, తృణమూల్తో వేదిక పంచుకోవడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్కరత్ పేర్కొన్నారు. -
సీనియర్ కాంగ్రెస్ నేతల డుమ్మా!
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని, దివంగత జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా రెండు రోజులు నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఆ పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, కమలనాధ్, కపిల్ సిబాల్ కనిపించలేదు. కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు కూడా హాజరుకాలేదు. జైరామ్ రమేష్ విదేశాలకు వెళ్లారు. ఏకే ఆంటోనీ అనారోగ్య కారణంగా హాజరుకాలేదు. ఈరోజు సదస్సుకు ఎన్డీయేతర పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జై, ఘనైనా అధ్యక్షుడు జాన్ కుఫూర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, మాజీ ప్రధాని దేవగౌడ, సీపీఐ నేత సీతారామ్ ఏచూరి, రాజా, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. అంతేగాక కాంగ్రెస్ ఆహ్వానం మేరకు దాదాపు 50 దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. -
బీజేపీయేతర పార్టీల ఐక్యతకు కాంగ్రెస్ వ్యూహం
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి వేడుకల ద్వారా అన్ని బీజేపీయేతర, ఎన్డీఏయేతర పార్టీలను లౌకికవాదం గూటికి చేర్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. నెహ్రూ వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన బీజేపీ వ్యతిరేకులనే ఆహ్వానించింది. వామపక్ష పార్టీలు, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ సహా లౌకికవాద సిద్ధాంతాన్ని విశ్వసించే వారిని సదస్సుకు పిలిచింది. ద న్యూఢిల్లీ కాన్ఫరెన్స్ పేరిట నిర్వహిస్తున్న ఈ సదస్సులో సమ్మిళిత ప్రజాస్వామ్యం, ప్రజల సాధికారత, 21వ శతాబ్దానికి నెహ్రూ ఆలోచనా విధానం అనే అంశాలపై చర్చ జరగనుంది. -
చాచా నెహ్రూకు ఘన నివాళి
125వ జయంతి సందర్భంగా శాంతివనం వద్ద ప్రముఖుల నివాళి న్యూఢిల్లీ: భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని శాంతివనం వద్ద పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ తదితరులు నెహ్రూ సమాధి వద్ద పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నెహ్రూ జాతికి చేసిన సేవలను కొనియాడి.. ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు. అనంతరం విద్యార్థులు సంగీత వాయిద్యాలను వాయిస్తుండగా.. మూడు రంగుల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు. అయితే శాంతివనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులుగానీ, ప్రభుత్వ ప్రతినిధులుగానీ హాజరుకాలేదు. అదే సమయంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమాలకు సోనియా దూరంగా ఉన్నారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైద్ధాంతిక ప్రత్యర్థులపై నెహ్రూ ఎప్పుడూ శత్రుత్వం చూపలేదని, అందువల్ల రాజకీయ ప్రత్యర్థులపై శత్రుత్వం కూడదని పరోక్షంగా రాహుల్ గాంధీకి చురకలంటించారు. ఈ కార్యక్రమానికి సోనియా బదులు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత ఖర్గే హాజరయ్యారు. కాగా, నెహ్రూ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ‘‘బాల స్వచ్ఛతా అభియాన్’’ను ప్రారంభించారు. ఆధునిక భారత రూపశిల్పి నెహ్రూ: ప్రణబ్ నెహ్రూ 125వ జయంతి, బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 110 స్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ సందర్భంగా వారినుద్దేశించి ప్రసంగించారు. ఆధునిక భారతదేశ రూపశిల్పి నెహ్రూ అని ప్రణబ్ కొనియాడారు. భవిష్యత్లో మీలో ఒకరు రాష్ట్రపతి భవన్లో కూర్చుంటారని, అది ప్రజాస్వామ్య గొప్పదనమని పేర్కొన్నారు. విద్యార్థులు స్కూళ్లను, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, తద్వారా ‘క్లీన్ ఇండియా’ను విజయవంతం చేయాలని సూచించారు. నెహ్రూకు నివాళులర్పించిన ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక సంబంధాల వెబ్సైట్ ట్విట్టర్ ద్వారా చాచా నెహ్రూకు నివాళులర్పించారు. ‘‘ఈ రోజు(శుక్రవారం) భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి. ఆయనకు నా నివాళులు’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామం సందర్భంగా నెహ్రూ చేసిన సేవలు, తొలి ప్రధానమంత్రిగా ఆయన పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. గ్రామాల దత్తత...: గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోదీ చేపట్టిన ‘సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ పథకం కింద కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్లు తమతమ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని చెరొక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. రాయ్బరేలీ నియోజకవర్గంలోని ఉద్వా గ్రామాన్ని సోనియా దత్తత తీసుకోగా అమేథీ నియోజకవర్గం పరిధిలోని దీహ్ గ్రామాన్ని రాహుల్ గాంధీ దత్తత తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
నెహ్రూ అడుగుజాడల్లో నడవాలి
శ్రీకాకుళం అర్బన్ : శాంతిదూతగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని తత్వవేత్తగా ఖ్యాతినార్జించిన భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అడుగుజాడల్లో బాలలు నడవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ సమకాలీకుడిగా, భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి దేశాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. నెహ్రూకి గులాబీలన్నా, చిన్నారులన్నా ఎంతో ఇష్టమన్నారు. అందుకే నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ నేతలు అంధవరపు సూరిబాబు, ఎం.వి.పద్మావతి, ఎన్ని ధనుంజయ్, టి.కామేశ్వరి, మండవిల్లి రవి, కె.ఎల్.ప్రసాద్, శిమ్మ రాజశేఖర్, గుడ్ల మల్లేశ్వరరావు, కోరాడ రమేష్, గుడ్ల దామోదరరావు, రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత నెహ్రూ దేశ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని మాజీ కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అన్నారు. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని ఇందిరావిజ్ఞానభవన్లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం అగ్రగామిగా నిలబడేందుకు నెహ్రూ ఎంతగానో కృషిచేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డోల జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, కోండ్రు మురళీమోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నాల నరసింహమూర్తి, చౌదరి సతీష్, కిల్లి రామ్మోహనరావు, గంజి ఆర్.ఎజ్రా, తైక్వాండో శ్రీను, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బాలల హక్కులు పరిరక్షించాలి బాలల హక్కులు పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి అన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బంగారు భారతావనికి బాలలే పునాదులన్నారు. పిల్లలను స్వేచ్ఛగా చదువుకోనివ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ బాల్యదశ ఒక స్వర్ణయుగమన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం ఒక శుభపరిణామమన్నారు. 30 సంవత్సరాలుగా బాలల హక్కులపై పోరాడుతున్న కైలాస్ సత్యార్థికి నోబుల్ బహుమతి లభించడమే ఇందుకు నిదర్శనమన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పిల్లల హక్కులను సంరక్షించి వారి అభివృద్ధికి తగిన స్వేచ్ఛను ఇస్తే జాతి రత్నాలుగా ఎదుగుతారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకోవాలని, ప్రభుత్వం కూడా విద్యార్థుల అభివృద్ధికి పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులకు బాల బాలికలు రక్షాబంధన్ కట్టారు. అనంతరం చైల్డ్లైన్ సే దోస్త్ గోడపత్రికను అతిథులు ఆవిష్కరించారు. బడి మానివేసిన 23 మంది పిల్లలకు నెలకు రూ.500చొప్పున మూడు సంవత్సరాల పాటు స్కాలర్షిప్ అందేలా ప్రొసీడింగ్స్ను అతిథుల చేతులమీదుగా అందించారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భార్గవ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ చక్రధరరావు, ఆర్వీఎం పీవో ఆర్.గణపతిరావు, అమ్మా ఫౌండేషన్ డెరైక్టర్ ఉత్తమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా చిల్డ్రన్స్డే వేడుకలు
-
వైసీపీ కార్యాలయంలో నెహ్రూ జయంతి వేడుకలు
-
మాజీ ప్రధాని నెహ్రూకు వైఎస్ జగన్ నివాళి
వైఎస్సార్ జిల్లా: భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. శుక్రవారం నెహ్రూ 125 జయంతి వేడుకల్లో భాగంగా వేంపల్లి ఉర్దూ బాలిక గురుకుల పాఠశాలకు విచ్చేసిన జగన్.. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో జగన్ ముచ్చటించారు. ఈ క్రమంలోనే పాఠశాలలో సౌకర్యాలు సరిగా లేవంటూ విద్యార్థులు జగన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జగన్.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
నెహ్రూకు నరేంద్ర మోదీ ఘన నివాళి
బ్రిస్బెన్: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి పురస్కరించుకుని ప్రధాని మోదీ శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ పోషించి పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. అలాగే స్వాతంత్ర్యం అనంతరం తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశానికి గణనీయమైన సేవలందించారని నెహ్రూపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ నగరానికి చేరుకున్నారు. అంతకుముందు మయన్మార్ రాజధాని నేపిటాలో జరిగిన ఆసియన్ తూర్పు ఆసియా దేశాల సదస్సులో మోదీ పాల్గొన్నారు. -
నెహ్రూ నాటి స్ఫూర్తి నేడేది?
సమకాలీనం 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించింది. కానీ, ‘‘అంకెలున్నాయి. పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అంతమాత్రాన మేం ప్రభుత్వాన్ని పరిమిత రాజకీయ దృష్టితో చూడటంలేదు. ఇది అందరి ప్రభుత్వం, పార్టీలకతీతంగా జాతీయ ప్రభుత్వంగానే పరిగణిద్దాం. పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్న దేశ ప్రజల మనోభావాలు ప్రతిబింబించేలా మనమంతా కలసి మహాన్ భారత్ను ఆవిష్కరిద్దాం’’ అని నెహ్రూ సభ్యుల భావోద్వేగాల మధ్య ప్రకటించారు. ఆ స్ఫూర్తి నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొరవడింది. 1 2 4 8 16 ....? (తదుపరి ఏంటి?) ఇది బ్యాంకింగ్ రంగమో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులోనో ‘ఆప్టిట్యూడ్ టెస్ట్’ ప్రశ్నలా లేదూ? ఒక తెలుగు జాతి, రెండు రాష్ట్రాలు, నాలుగు చట్టసభలు, ఎనిమిది పార్టీలు, పదహారు ప్రజా సమస్యలు, ...........? (ఫలితం ఏంటి?) ఇది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రాజకీయ పక్షాల ‘ఆటిట్యూడ్’ను టెస్ట్ చేసే ప్రశ్నలా ఉంది కదూ! అవును. ఇప్పుడదే సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. చట్టసభల్లో రాజ కీయపక్షాల వైఖరి ప్రజాహితంలో ఉందా? అన్న ప్రశ్న ప్రజాస్వామ్యవాదుల మెదళ్లను తొలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగి, రెండు చోట్లా కొత్త ప్రభుత్వాలు కొలువుతీరి 150 రోజులు దాటింది. అంతకుముందు, ముఖ్యంగా ఏడాదిపాటు ప్రత్యేక-సమైక్య వాదనలతో రాష్ట్రం అట్టుడికి అటు, ఇటు ఇరుప్రాంత ప్రజల్లోనూ భావోద్వేగాలు మిన్నంటాయి. అందరిలోనూ అనుమానాలు, అపోహలే కాదు ఆశలు, ఆకాం క్షలు కూడా తారస్థాయికి చేరాయి. ఎన్నికల తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాల వైపు ప్రజలు ఆశగా చూశారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలుగాని, రెణ్ణెల్ల కింద జరిగిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గాని ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని పరిగణనలోకి తీసుకొని వారి అంచనాల్ని ప్రతి బింబించేలా మాత్రంలేవు. ఉమ్మడి నిర్ణయాలతో ప్రజలకు ప్రయోజనం కలి గించే యోచనకన్నా రాజకీయ ఆధిపత్య ధోరణే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొత్తగా రూపుదాల్చిన రెండు రాష్ట్రాల్ని, తొలి ప్రభుత్వాలుగా తమదైన పంథాలో తీర్చిదిద్దుకోవడానికి లభించిన గొప్ప అవకాశాన్ని ఈ ఆధిపత్యపోరులో చేజార్చుకుంటున్నాయి. సంకుచిత రాజకీయ దృష్టి కోణంతో యోచించే పరి మితుల చట్రం నుంచి బయటపడలేకపోతున్నాయి. తాము అనుసరించేదే సరైన బాట అని చెప్పుకునే ఎవరి వాదన వారికి ఉండవచ్చు! కానీ, అంతిమం గా చట్టసభల ఔన్నత్యాన్ని నిలిపి, ప్రజాస్వామ్యపు పరమ లక్ష్యాన్ని సాధించే దిశలో మాత్రం నడక సాగటం లేదు. ఆరు దశాబ్దాల కింద మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటులో అన్నమాటల వెనుక స్ఫూర్తిని మనమి ప్పుడు గుర్తుతెచ్చుకోవాలి. 1952 ఎన్నికలప్పుడు అన్నీ తానై నెహ్రూ దేశవ్యా ప్తంగా ప్రచారం చేశారు. నలభై వేల కిలోమీటర్ల మేర పర్యటించి మూడున్నర కోట్ల మందినుద్దేశించి ప్రసంగాలు చేశారు. 489 లోక్సభ స్థానాలకుగాను 364లో గెలిచినా... ‘‘అంకెలున్నాయి. పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అంత మాత్రాన మేం ప్రభుత్వాన్ని పరిమిత రాజకీయ దృష్టితో చూడటం లేదు. ఇది అందరి ప్రభుత్వం, పార్టీలకతీతంగా జాతీయ ప్రభుత్వంగానే పరిగణిద్దాం. పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్న దేశ ప్రజల మనోభావాలు ప్రతిబింబిం చేలా మనమంతా కలసి మహాన్ భారత్ను ఆవిష్కరిద్దాం’’ అని సభికుల భావోద్వేగాల మధ్య ప్రకటించారు. ఆ స్ఫూర్తి నేడు కొరవడింది. తెలంగాణలోనూ తేలిపోతోంది! శాసనసభ తొలి సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాట్లాడుతూ, ‘ప్రతి కీలక విషయంలోనూ అఖిలపక్షం నిర్వహించి పరిష్కారం కనుగొంటామ’న్నారు. ఒక్క ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తప్ప మరే అంశంలోనూ అఖిలపక్ష భేటీ జరగలేదు. బడ్జెట్ సమావేశాల తొలి రెండు, మూడురోజులు ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపించినా, కడకు రాజకీయ ఆధిపత్య పోరుకే పాలక-ప్రతిపక్ష టీడీపీలు యత్నిస్తున్నాయని తేటతెల్లమైంది. ఇప్పటివరకు కాంగ్రెస్ సంయమనంతోనే ఉంది. ప్రతిపక్షాల్ని కలుపుకొని పోతున్న భావన కలిగించడానికి ముఖ్యమంత్రి కొంత యత్నించారు. ‘పెద్దలు జానారెడ్డి, జీవన్రెడ్డి, మిత్రుడు రేవంత్రెడి’్డ అని సంబోధిస్తూ వ్యక్తిగతంగా సభలో కొంత సాన్నిహిత్యం కనబరచినా, పార్టీలపరమైన వైఖరి మాత్రం ఎడ మొగం పెడమొకంగానే ఉంది. మంత్రి హరీష్రావు కూడా తెలివిగా, ‘పద్ధతులు తెలియకుంటే ఎలా? కావాలంటే సీనియర్లు గీతక్క, అరుణక్కలను అడిగి తెలుసుకోండి’ అని తెలుగుదేశం జూనియర్ సభ్యులకు చెబుతూ విపక్ష సభ్యుల మధ్య స్పర్థను రగిలిస్తున్నారు. ముఖ్యమంత్రి కూతురైన ఎం.పి.పై వచ్చిన అభియోగాలపై రెండు రోజులు సభా సమయాన్ని వృధాచేయడం, కడకు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయడం పాలకపక్ష ఏకపక్ష ధోరణికి నిదర్శనం. విపక్షం చేసిన అభియోగం తప్పయితే, సరైన సమాచారమిచ్చి అది తప్పని నిరూపించ డం ప్రభుత్వానికి అవకాశం మాత్రమే కాదు బాధ్యత కూడా. మాటకారితన మున్న కొంతమంది మంత్రులు ఎక్కువ సభాసమయం తీసుకుంటూ ప్రభు త్వం, పాలకపక్ష భావజాలాన్ని జనబాహుళ్యంలోకి పంపే అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. విపక్షాలు లేవనెత్తే కీలక ప్రజాసమస్యలపై ప్రభుత్వ చిత్తశుద్ధి కొరవడుతోంది. రైతు ఆత్మహత్యలే ఇందుకు ఉదాహరణ. ‘ఇవి ఇప్పుడే మొదలయ్యాయా?’ ‘గతంలోనూ ఉన్నాయి కదా!’ అన డాన్ని మించి బాధ్యతారాహిత్యమేముంటుంది! అదే సమయంలో విపక్షం కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాకుండా నిర్మాణాత్మక సూచనలు చేయాలి, కానీ, ఆ జాడలే లేవు. అయితే, సభలో కొన్ని మంచిపోకడలూ లేకపో లేదు. సభా నాయకుడైన సీఎం ఒక వాడి, వేడి చర్చ తర్వాత నేరుగా విపక్ష బెం చీల వద్దకు వెళ్లి, సీనియర్ సభ్యుడైన జీవన్రెడ్డి పక్కన కూర్చొని కొంత నచ్చ జెప్పేయత్నం చేయడం సభలో సుహృద్భావాన్ని పెంచే బలమైన సంకేతమే. ఇది కొత్తేం కాదు. శాసనసభావ్యవహారాల మంత్రిగా లోగడ రోశయ్య కూడా ఇలా చేశారు. ఇటువంటివి ఇప్పుడు మామూలు విషయాలుగా కనిపించినా, దీర్ఘకాలంలో చట్టసభల్లో సత్ సంప్రదాయాల్ని బలోపేతం చేస్తాయి. వాయిదా తీర్మానాల డిమాండ్తో ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథాచేయొద్దని, ఆ అంశాన్ని తదనంతరం చేపట్టాలని సదుద్దేశంతో పాలకపక్షం చేసిన ప్రతిపాదనకు విప క్షాలు సహకరించడం మంచిపరిణామం. విద్యుత్తు విషయంలో పొరుగు రాష్ట్రంవల్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి కేంద్రం వద్దకు వెళ్లాలని ఏకగ్రీవంగా తీర్మానించడానికి విపక్షాలన్నీ సహకరించడం వంటివి సానుకూ లాంశాలు. ఈ వాతావరణాన్ని పెంచడం పాలక-విపక్షాల కనీస ధర్మం. ఆంధ్రప్రదేశ్ సభలో అధ్వానం తెలంగాణ శాసనసభలో విపక్షమైన తమ గొంతునొక్కుతున్నారని గగ్గోలు పెట్టే టీడీపీ, రెండుచోట్లా ఒకే నాయకుని నేతృత్వంలో ఉంటూ ఏపీ శాసన సభలో పాలకపక్షంగా చేసిందేమిటి? అక్కడ ఏకైక విపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ గొంతునొక్కడమే కదా! ఇద్దరు, ముగ్గురు తెలంగాణ మంత్రులు మాట్లాడితే అంతా ఒకటై ఎదురుదాడి చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. మరి, అక్కడ అరడజను మంది మంత్రులు విపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై ఒంటి కాలిపై లేవటాన్ని ప్రజలు చూడరనుకుంటారా? అక్కడ సభలో ఉన్నది మూడు రాజకీయ పార్టీలే. మిత్రపక్షమైన బీజేపీ పాలకపక్షం టీడీపీ చంకన జేరడంతో ఇక మిగిలింది వైఎస్సార్సీపీ ఒక్కటే! ప్రజాసమస్యల ప్రస్తావన రానీకుండా, వ్యక్తిగత ఆరోపణలు, దూషణలతో విపక్షనేతపై పాలకపక్షం ఒంటికాలిపై లేచిన ఘటనలెన్నో! అవకాశాలు కల్పించడంలోనూ వివక్ష. సభావ్యవహారాల సలహా సంఘం(బీఏసీ)లో ప్రాతినిధ్యం విషయంలోనూ నానారభస చేశారు. ప్రజా సమస్యల స్పృహ-సభ నడుపుకునే ప్రభుత్వాల బాధ్యతను విస్మరించి, ప్రతి సెషన్లో, రోజులో, పూటలో, నిర్దిష్ట చర్చలో ఇలా అంతటా ఆధిపత్య ధోరణి చూపడం, సంఖ్యాబలంతో అణచివేసే పంథా అనుసరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. సభ ఎన్నిరోజులపాటు జరపాలనే విషయంలోనూ నియం తృత్వ ధోరణే తప్ప సంప్రదింపుల సత్సాంప్రదాయమేలేదు. ‘చట్టసభలు వీలై నన్ని ఎక్కువరోజులు పనిచేయాలనే అంశాన్ని పార్లమెంటరీ ప్రిసైడింగ్ అధి కారుల వార్షిక సదస్సు ప్రతియేటా నొక్కి చెబుతోంది, కానీ ఆచరణలో జరగటం లేదు’ అని శాసనసభ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్రెడ్డి తరచూ చెబుతుంటారు. తద్వారా సుపరిపాలన అందించే చట్టాల్ని చేయడమేకాకుండా ప్రజాసమస్యల్ని చర్చించి పరిష్కారాలు కనుక్కునే అవకాశం పెరుగుతుందని ఆయన విశ్లేషి స్తారు. ప్రజల తరపున వారి ప్రతినిధుల విస్తృతాభిప్రాయాల వెల్లడికి చట్ట సభలు వేదిక కావాలి. అప్పుడు రాజ్యాంగం పరిధిలోని ఇతర సంస్థల అనుచిత జోక్యాలూ తగ్గుతాయి. అన్ని వైపుల ఆలోచనల్ని ఆహ్వానించే నెహ్రూ దృక్ప థమే, ఈ దేశాన్ని వలసవాద పాలనా వారసత్వంలోకి జారనీకుండా కాపా డింది. ‘‘వస్తువినిమయ మార్కెట్కన్నా, ఆలోచనా వినిమయ పథంపైనే సామ్య వాది నెహ్రూకు అచంచల విశ్వాసం’’ అని నెహ్రూ జీవిత చరిత్ర రాసిన సర్వేపల్లి గోపాల్ (డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడు) అంటారు. ఆ స్ఫూర్తిని అం దిపుచ్చుకొని చట్టసభల్ని విశాల దృక్పథంతో నడపడమే 125వ జయంతి సందర్భంగా నెహ్రూకు మనమిచ్చే ఘన నివాళి! -
'కాంగ్రెస్ పార్టీది చిన్న హృదయం'
గాంధీనగర్:మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 125 జయంతి ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఆహ్వానించకపోవటాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తప్పుబట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టమైందంటూ విమర్శించారు. 'కాంగ్రెస్ పార్టీది చాలా చిన్న హృదయం. దేశ తొలి ప్రధాని నెహ్రూ జయంతి ఉత్సవాలకు ప్రస్తుతం ప్రధాని మోదీని ఆహ్వానించలేదు. ఇది కాంగ్రెస్ వైఖరిని తెలియజేస్తోంది' అని వెంకయ్య ఎద్దేవా చేశారు. గుజరాత్ లో జరుగుతున్న రాష్ట్ర వేడుకకు మోదీని విస్మరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ ఆదర్శాలు వేరంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను వెంకయ్య తిప్పికొట్టారు. దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తి ఏ పార్టీ అయితే ఏంటని ప్రశ్నించారు. భారతదేశంలో చాలా రాజకీయ పార్టీల ఉన్నాయని ప్రతీ పార్టీకి ఒక్కో ఆదర్శం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. -
నెహ్రూ విమర్శ..మధుర జ్ఞాపకం
మతం, భాష మనుషులను కలిపి ఉంచలేవని, సంస్కృతి మాత్రమే ఆ పని చేయగలదని నా జీవితం నేర్పింది. శరణార్థిగా ఇక్కడకు వచ్చిన నన్ను,నా కుటుంబాన్ని, లక్షలాది ఆశ్రీతులను భారతీయ సమాజం కొద్దిరోజుల్లోనే తమ వారిగా మలుచుకుంది. ఆంధ్రరాష్ట్రంలో అధికారిగా, పూర్వ ఆంధ్రప్రదేశ్లో సమాచార-ప్రజాసంబంధాల డెరైక్టర్గా ఇక్కడి నా జీవితం నిత్యనూతనంగా గడిచింది. తెలుగు-ఉర్దూ-హిందీ-ఇంగ్లిష్ భాషలలో ప్రముఖులతో వ్యాసాలు రాయించి ఆంధ్రప్రదేశ్ పత్రికను నాలుగు భాషల్లో తెచ్చాను. అప్పట్లో ప్రముఖ పత్రికలు ఇచ్చే పారితోషికాల కంటే అదనంగా ఆంధ్రప్రదేశ్ పత్రిక వ్యాసకర్తలు పారితోషికాన్ని పొందేవారు. నాలుగు భాషలకు వ్యాసకర్తలకు వెరసి, రూ.37 వేలు చెల్లించేవాళ్లం. ఆంధ్రప్రదేశ్ పత్రికను అప్పటి ఇతర పత్రికలూ ప్రశంసించేవి! విజయవాడలో బుక్ ఎగ్జిబిషన్స్ జరిగితే ఆంధ్రప్రదేశ్ పత్రిక తరఫున ఒక స్టాల్ను తీసుకున్నాం. వామపక్షభావాల కేంద్రంగా ఉన్న విజయవాడలో కాంగ్రెస్ ప్రభుత్వపు పత్రికను ఆదరిస్తారా? అని మంత్రులు అనేవారు! భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరచడమే కదా ప్రజాస్వామ్యం అన్న అభిప్రాయాన్ని గౌరవించేవారు. పత్రికలో రాష్ట్ర మంత్రివర్గం ఫొటో ఒక్కటంటే ఒక్కటే ప్రచురించేవారం. మిగిలిన అంశాలన్నీ సామాజికమే! అలాంటి వాతావరణంలో ఒక విమర్శ గురించి ప్రస్తావిస్తాను ! నందికొండ-నాగార్జున సాగరం వరదలను నివారించడం, కృష్ణానదికి ఇరుప్రాంతాలలోని మెట్ట ప్రాంతాలకు తాగు నీరు అందించడం, విద్యుత్ను ఉత్పత్తి చేయడం తదితర బహుళార్థాలను సాధించేందుకు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తలపెట్టారు. 1955 డిసెంబర్ 10న నల్లగొండ జిల్లాలోని పైలాన్లో ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ను నందికొండ ప్రాజెక్ట్ అనేవారు. ఆంధ్రరాష్ట్రం-హైద్రాబాద్ స్టేట్ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తొలినాళ్లలో ఈ ప్రాజెక్ట్ను నాగార్జునసాగర్ ప్రాజెక్ట్గా మార్చారు. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వాడే! బౌద్ధ ధర్మాన్ని, వజ్రయానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు! ఆధునిక మానవతా దేవాలయంగా తాను అభివర్ణించిన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణగతిని ప్రధాని నెహ్రూ ప్రత్యేకంగా గమనించేవారు. శ్రామికుని ప్రమిద! మహాత్మాగాంధీ ఆశించిన గ్రామస్వరాజ్యాన్ని సాధ్యం చేయాలనే తలంపుతో 1959 అక్టోబర్ 2న రాజస్థాన్లోని నాగూర్లో దేశంలో తొలి గ్రామ పంచాయతీ సమితిని ప్రధానమంత్రి నెహ్రూ ప్రారంభించారు. మరుసటి వారం విజయదశమి రోజున అక్టోబర్ 11న రాష్ట్రంలో తొలి పంచాయతీని షాద్నగర్లో ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం తనకెంతో ఇష్టమైన నాగార్జునసాగర్ను సందర్శించారు. అక్కడ ఆనకట్టను వాటర్ క్యూరింగ్ చేస్తోన్న ఒక శ్రామికుడిని ఆయన పలకరించారు. ఆ శ్రామికుడు నెహ్రూతో ‘ఇది నీవు వెలిగించిన దీపం’ అన్నారు. ఇతను ఏమంటున్నాడు ? అని నెహ్రూ ముఖ్యమంత్రి సంజీవరెడ్డిని అడిగారు. ‘ఇట్ వజ్ ల్యాంప్ లెటైన్డ్ బై యు’ అని సంజీవరెడ్డి ఇంగ్లిష్లో చెప్పారు! ఆ మాటను వింటున్నప్పుడు నెహ్రూ మోములో వెలిగిన దీపాన్ని నేను గమనించాను! శ్రామికుని గుండెలోతుల్లోంచి వచ్చిన మాట కదా! నా శరీరమూ పులకరించింది! ‘మనం మన జీవితాల్లో కొత్త దీపాలను వెలిగిస్తామా? లేక ఉన్న దీపాల వెలుగులను ఆర్పేస్తామా! మనం మన జీవితాలను కొత్త వెలుతురులు ప్రసరించడం ద్వారా అర ్థవంతం చేసుకోవాలి..’ అని నెహ్రూ వివిధ సందర్భాల్లో అన్నారు కూడా! సరే, ఆంధ్రప్రదేశ్ తర్వాత సంచికకు కంటెంటూ దొరికిందని నేను అదనంగా ఆనందించాను! పీఎంవో నుంచి ‘దీపపు సెగ’! రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమూ సమాజ అభ్యుదయానికి తోడ్పడే ఎన్నెన్నో కొత్త కార్యక్రమాలను, ప్రాజెక్టులను చేపడుతోంది అనే భావంలో ‘ఎన్నో కొత్త దీపాలను వెలిగిస్తోంది’ అని ఒక ప్రకటనను కవితాత్మకంగా రూపొందించాను. ప్రధానమంత్రితో శ్రామికుడు అన్నమాటలను వగైరా..వగైరా ఉదహరించాను. ఆంధ్రప్రదేశ్ పత్రికలో రాష్ట్రప్రభుత్వం తరఫున ఆ ప్రకటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి ! ఒక రోజు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి ఫోన్ వచ్చింది. ఆయన కార్యదర్శి క్లుప్తంగా ఒక్కమాట అన్నారు. ఏమని ? ప్రైమ్ మినిస్టర్ డస్ నాట్ లైక్ టు యూస్ హిస్ నేమ్ ఇన్ అడ్వర్టయిజ్మెంట్ (ప్రధానమంత్రి తన పేరును ప్రకటనలలో వాడటాన్ని ఇష్టపడరు) అని!ఈ విమర్శ నా జీవితంలో మధురమైన అనుభవం! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
నెహ్రూ, పటేల్ ఇద్దరూ స్మరణీయులే
త్రికాలమ్ వాస్తవాలు పవిత్రమైనవి. వాటిని వక్రీకరించకూడదు. వ్యాఖ్యానం మీ ఇష్టం (ఫ్యాక్ట్స్ ఆర్ సేక్రెడ్, కామెంట్ ఈజ్ ఫ్రీ). ఆ విధంగా రాసిన చరిత్రను ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు అన్వయించుకోవచ్చు. అన్వయస్వేచ్ఛ చరిత్ర రాసేవారికే కాదు. చదివేవారికీ ఉంటుంది. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఇది మెట్టవేదాంతం కాదు. వర్తమాన రాజకీయాలు చెబుతున్న గుణపాఠం. ఇంత కాలం నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని విశ్వసించాం. ఇప్పుడు నవభారత నిర్మాణం చేసిన అధినాయకుడు సర్దార్ పటేల్ అంటూ ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటిస్తున్నారు. చరిత్ర ఎప్పటికీ ఒకే తీరుగా ఉండదు. రాజ్యం ఎవరి చేతుల్లో ఉంటుందో చరిత్ర కూడా వారు చెప్పినట్టే నడుస్తుంది. పాలకులు మారినప్పుడు, కొత్త భావజాలాలకు ఆధిపత్య స్థానం దక్కినప్పుడు చరిత్రలో దిద్దుబాటు ప్రయత్నం జరగడం సహజం. అందుకు ప్రతిఘటన ఎదురు కావడం అంతే సహజం. ఒక తప్పును దిద్దే క్రమంలో మరో తప్పు చేసే అవకాశం కూడా లేకపోలేదు. చరిత్ర సృష్టించినవారికి కూడా చరిత్రలో శాశ్వత స్థానం ఉంటుందనే నమ్మకం లేదు. చరిత్ర గతితో పాటు చరిత్ర పురుషులకూ స్థానభ్రంశం అనివార్యం. ఈ సత్యం తెలిసినవారు చరిత్రను చదివే సమయంలో పాలకవర్గ భావజా లాన్నీ, సిద్ధాంతాలనూ మదిలో పెట్టుకుంటారు. మినహాయింపులూ, జోడింపులూ చేసిన తర్వాతనే చరిత్రను సవ్యంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. స్మృతికి రంగులు పులమొద్దు మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ల జయంతి, వర్ధంతులు మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించాలనీ, ఇతర నాయకుల పుణ్యతిథులను వారి ట్రస్టులో, కుటుంబ సభ్యులో నిర్వహించాలనీ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. శుక్రవారం నాడు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా మరో అడుగుగా చెప్పుకోవచ్చు. ఇందిరాగాంధీ వర్ధంతి కూడా అదే రోజు అని గుర్తు చేస్తూ, ఆమె మరణం తర్వాత సిక్కుల ఊచకోత దేశ సమైక్యతపైన ఖడ్గ ప్రహారం వంటిద ంటూ మోదీ వ్యాఖ్యానించడం మానుతున్న గాయాన్ని రేపడమే. దీనికి ప్రతిగా లౌకికవాదులుగా చెప్పుకునేవారు గోధ్రాలో ముస్లింల ఊచకోత గురించి ప్రస్తావించి అటువంటి వ్యాఖ్యలే చేయవచ్చు. ప్రయోజనం ఏమైనా ఉంటుందా? పటేల్ను అభినవ బిస్మార్క్గా అభివర్ణించి నవభారత చరిత్రలో ఆయనకు సముచితమైన స్థానం కల్పించాం. అంతకంటే ఉన్నతమైన స్థానం కల్పిం చాలని కొత్త పాలకులు అనుకుంటే అందుకు అభ్యంతరం లేదు. ఆ క్రమంలో అంతే ఉన్నతులైన ఇతర నాయకుల స్మృతిని కించపరచడం అనవసరం. చరిత్రలో కొందరు మహానుభావులకూ, త్యాగమూర్తులకూ అన్యాయం జరిగిం దనే అభిప్రాయం ఈ దేశంలో చాలామందికి ఉంది. నెహ్రూ ఆలోచనా విధానం, మార్క్స్ తాత్వికత కలబోసి సమన్వయం సాధించి స్వాతంత్య్రానంతరం చేసిన చరిత్ర రచనలో పాఠకులకు లౌకిక దృష్టి ప్రసాదించాలనే సంకల్పం ఉండి ఉంటుం ది. బాలల మస్తిష్కాలలో సర్వమత సహనాన్ని ప్రోదిచేయాలన్న తాపత్రయం కూడా ఉండి ఉండవచ్చు. లేకపోతే అక్బర్ చక్రవర్తిని కీర్తించే పాఠ్యాంశాలు ఉండేవి కావు. చరిత్రలో దిద్దుబాట్లు అవసరమనే అభిప్రాయం నరేంద్రమోదీకి ప్రధాన మంత్రి అయిన తర్వాతనే వచ్చిన ఆలోచన కాదు. 2012 మేలో ఉదయపూర్లో రాణాప్రతాప్ 472వ జయంత్యుత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ ఇదే రకమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. స్వీయచరిత్రను విస్మరించినవారు చరిత్ర సృష్టించజాలరనే గొప్ప సత్యాన్ని ఆనాడే చెప్పారు. రాణా ప్రతాప్ గోవులనూ, మహిళలనూ, పాఠశాలలనూ, దేవాలయాలనూ రక్షించాడు కనుక ఆయన ఈ రోజు జీవించి ఉంటే కుహనా లౌకికవాదులు ఆయన మీద కూడా రాళ్ళు వేసేవారంటూ ధ్వజమెత్తారు. సముజ్వలమైన గతాన్ని, దేశంకోసం ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావులను విస్మరించడం ఈ జాతి దురదృష్టమని అంటూ త్యాగాలు చేసింది ఒక్క కుటుంబం మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. శ్యామాజీ కృష్ణ వర్మ, భగత్సింగ్, రాజగురు. వీర సావర్కర్ వంటి త్యాగపురుషులను గౌరవించాలంటూ ఉద్బోధించారు. అవాస్తవాల గుచ్ఛం చరిత్రను సవరించే ప్రయత్నాలు జరగడం ప్రపంచంలో ఇదే ప్రథమం కాదు. సోవియెట్ యూనియన్లో కృశ్చెవ్ అధికారంలోకి రాగానే స్టాలిన్ ఆనవాలు లేకుం డా చేశాడు. పైగా స్టాలిన్ డాన్స్ చేయమంటే మేమంతా డాన్స్ చేసేవాళ్ళం అంటూ పూర్వాధినేతను అవహేళన చేసేవాడు. బ్రెజ్నేవ్ పగ్గాలు చేతబట్టిన తర్వాత కృశ్చెవ్కూ అదే మర్యాద జరిగింది. యూరీ గగారిన్ అంతరిక్ష యానం చేసి తిరిగి వచ్చిన చారిత్రక సందర్భంలో అతనికి స్వాగతం చెబుతూ కృశ్చెవ్ పుష్పగుచ్ఛం ఇచ్చాడు. బ్రెజ్నేవ్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోవియెట్ యూనియన్ టెలివిజన్ చానల్స్లో అప్పటి దృశ్యాన్ని సందర్భవశాత్తూ చూపించినప్పుడు గగారిన్ పుష్ప గుచ్ఛం అందుకుంటూ కనిపించేవాడు కానీ దాన్ని అందిస్తున్న కృశ్చెవ్ కనిపించే వాడు కాదు. చేయి మాత్రమే కనిపించేది. కృశ్చెవ్ కనిపించకుండా కత్తిరించేవారు. ఈ ఉదంతాన్ని గ్లాస్నోస్త్, పెరిస్త్రోయికా గురించి రాస్తూ గోర్బచేవ్ స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు రష్యాలో సర్వత్రా పుతిన్ ఒక్కడే. చైనా రాజకీయం కొంచెం భిన్నం. మావో హయాంలో జరిగిన సాంస్కృతిక విప్లవం ఘోరమైన తప్పిదం అంటూ 1956 అనంతర మావో పాలనను నిశితంగా విమర్శించే తీర్మానాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ 1981లో ఆమోదించింది. అయినప్పటికీ మావోను మహానాయకుడుగా, చైనా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా, సిద్ధాంతకర్తగా డెంగ్ ప్రభుత్వం గుర్తించి స్మృతిశాల నిర్మించింది. 1966లో మొదలైన సాంస్కృతిక విప్లవంలో అప్పుడు అధికారిగా ఉన్న డెంగ్ను మావో ప్రభుత్వం జైల్లో కుక్కింది. డెంగ్ కుటుంబ సభ్యులను వేధించింది. అయినా సరే, మావో స్మృతికి భంగం కలగకుండా డెంగ్ ఉదాత్తంగా వ్యవహరించాడు. తొలి ఎన్డీఏ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి బంగ్లాదేశ్ విమోచన తర్వాత ఇందిరాగాంధీని దుర్గగా, విజయేందిరగా ప్రస్తుతించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అటల్జీ అట్లా అనలేదని భారతీయ జనతా పార్టీ నాయకులు అంటారు. కానీ నెహ్రూ పట్లా, ఇందిరాగాంధీ పట్లా, చివరికి తనకంటే చిన్నవాడైన రాజీవ్గాంధీ పట్లా వాజపేయి మర్యాదగానే వ్యవహరించేవారు. మోదీ తరహా వేరు. ఆయన వ్యక్తిత్వం వేరు. చరిత్రలో కొన్ని అంశాలు ఎప్పటికీ వివాదాస్పదంగానే మిగిలిపోతాయి. ఇప్పటికీ స్వాతంత్య్ర సమరంలో బ్రిటిష్ బలగాలను ఓడించామని అమెరికన్లు చెప్పుకుంటారు. కానీ బ్రిటిష్వారు మాత్రం తాము అమెరికన్లకు స్వాతం త్య్రం ప్రసాదించామని అంటారు. ఇండియాలో మైసూరు యుద్ధంపైనా, కెరిబియన్ వలస దేశాలలో ఫ్రెంచ్, డచ్ సైనికులతో పోరాడటంపైనా దృష్టి కేంద్రీకరించిన బ్రిటిష్ ప్రభుత్వం సైన్యాన్ని అటు మళ్ళించింది. అమెరికాలోని పదమూడు కాలనీల కోసం పోరాటం వృథాప్రయాస అని నిర్ణయించుకుంది. ఇది బ్రిటిష్ చరిత్రకారుల వాదన. చరిత్ర ఎవరు రాస్తున్నారనే అంశంపైన కథనం ఆధారపడి ఉంటుంది. రొమెల్లా థాపర్ వంటి నెహ్రూ-మార్క్స్ తాత్విక చింతన కలిగిన చరిత్రకా రులు చేసిన నిర్ధారణలతో ఏకీభవించడం సాధ్యం కాని విశ్వాసాలు మోదీకీ, ఆయన ఉన్నతికి కారకమైన సంఘ్ పరివారానికీ ఉన్నాయి. ఇంతవరకూ చరిత్రను లౌకిక వాదులు వక్రీకరించారనే బలమైన అభిప్రాయం వారిది. లౌకికవాదులు రాసిన చరిత్రలో వేదకాలం నుంచి బుద్ధుడు, మహావీరుడు తదితరులు జీవించిన కాలం వరకూ చారిత్రకాంశాలను పరిగణనలోకి తీసుకోలేదని వారి ఫిర్యాదు. చరిత్రను రచించే క్రమంలో హిందూ మత గ్రంథాలనూ, హిందూ కథానాయకులనూ చిన్న చూపు చూశారని అరోపణ. తప్పులను సవరించాలని తపన. అవకాశం వచ్చింది కనుక సవరణలు చేయాలన్న ఆరాటం. వాస్తవానికి సంఘ్ పరివారం స్వయంగా కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నది. బాబా సాహెబ్ అంబేద్కర్కు పెద్ద పీట వేస్తున్నది. అంబేద్కర్ను పట్టించుకోని వామపక్షాలు మాత్రం ఇప్పటికీ తమ వైఖరిని సవరించుకోలేకపోతున్నాయి. వామపక్షాలు దళితులను పట్టించుకోలేదనీ, దళితులు వామపక్షాలను ఆదరించలేద నే అభిప్రాయం ఉండనే ఉంది. పవిత్రమైనవి వాస్తవాలు తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే తెలంగాణలో అన్ని పథకాలకూ ఇందిర, రాజీవ్ పేర్లే కొనసాగేవి. టీఆర్ఎస్ అధికా రంలో ఉంది కనుకనే ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఒక విశ్వవిద్యాలయానికి పెట్టారు. కాళోజీ స్మారక మందిరాన్ని గొప్పగా నిర్మించాలని నిర్ణయించగలిగారు. కొమురం భీమ్కూ, ఐలమ్మకూ, బతుకమ్మకూ మునుపెన్నడూ లేని గౌరవం లభించింది. గోలకొండ దశ తిరిగింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కనుక ఇక అన్ని పథకాలకూ ఎన్టీ రామారావు పేరు పెడతారు. మే ఎన్నికలలో తెదేపా ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొంది ఉంటే అవే కార్యక్రమాలకు వైఎస్ పేరు పెట్టేవారు. అధికారం ఎవరిదన్నదే ప్రశ్న. ఢిల్లీకి రాజైన మోదీ కత్తికి ఇప్పట్లో ఎదురులేదు. చరిత్రను తిరగరాయక తప్పదు. కొత్త చరిత్ర ఉంటుంది. లౌకికవాదులు రాసిన పాత చరిత్రా ఉంటుంది. బహుళత్వాన్ని స్వాగతించవలసిందే. కానీ వారూ, చరిత్రకారులు ఒక్క నియమం పాటిస్తే చాలు. జర్నలిజంలో పాటించే మౌలికమైన సూత్రం: వాస్తవాలు పవిత్రమైనవి. వాటిని వక్రీకరించకూడదు. వ్యాఖ్యానం మీ ఇష్టం (ఫ్యాక్ట్స్ ఆర్ సేక్రెడ్, కామెంట్ ఈజ్ ఫ్రీ). ఆ విధంగా రాసిన చరిత్రను ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు అన్వయించుకోవచ్చు. అన్వయస్వేచ్ఛ చరిత్ర రాసేవారికే కాదు. చదివేవారికీ ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదన్న సత్యాన్ని చరిత్ర రాసేవారూ, రాయించేవారూ గుర్తుపెట్టుకుంటే మేలు. -
గాడ్సే.. నెహ్రూను లక్ష్యంగా చేసుకోవాల్సింది
ఆర్ఎస్ఎస్ మలయాళ వారపత్రికలో వివాదాస్పద వ్యాసం న్యూఢిల్లీ/తిరువనంతపురం: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను కించపరిచేలా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందిన మలయాళ వారపత్రిక ‘కేసరి’లో వ్యాసం ప్రచురితం కావడం దుమారం రేపింది. జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సే.. గాంధీకి బదులుగా దేశ విభజనకు కారణమైన నెహ్రూను లక్ష్యంగా చేసుకొని ఉండాల్సిందంటూ గోపాలకృష్ణన్ అనే బీజేపీ నేత (లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు) ఈ నెల 17 నాటి సంచికలో రాసిన వ్యాసం వివాదానికి దారితీసింది. ఈ వ్యాసంతో తమకు ఎటువంటి సంబంధం లేదని, హింస ఏ రూపంలో ఉన్నా తాము ఖండిస్తామని ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య శనివారం ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం ఆర్ఎస్ఎస్, బీజేపీలపై విరుచుకుపడింది. నెహ్రూను కించపరచడం ద్వారా చరిత్రను వక్రీకరించేందుకు సంఘ్ పరివార్ మరోసారి ప్రయత్నించిందని దుయ్యబట్టింది. -
‘విధి’ క్రీడలో ఓ సౌజన్యమూర్తి!
నిజాం హయాంలో ఆత్మసాక్షిగా విధినిర్వహణ చేసిన అరుదైన వ్యక్తుల్లో మెహదీ అలీ ఒకరు. అలీగఢ్లో విద్యాభ్యాసం చేసిన మెహదీ అలీ 24వ ఏట 1941లో హైదరాబాద్ స్టేట్ సివిల్ సర్వీసెస్లో చేరారు. 1948లో ఖమ్మం జిల్లాలోని మధిరలో డిప్యూటీ కలెక్టర్గా నియుక్తులయ్యారు. రజాకార్ల ఆగడాలకు హద్దుల్లేని రోజులు. ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ప్రభావం చూపుతున్నారు. రైలులో ఒక మార్వాడీ బృందాన్ని పట్టుకున్నారు. పచ్చళ్ల జాడీల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని అభియోగం మోపారు. తనిఖీల్లో బంగారం లేదని తెలిసినా, డిప్యూటీ కలెక్టర్ హోదాలో వారిని విడిచి పెట్టమన్నా పోలీసులు రజాకార్ల ఒత్తిడి మేరకు 12 గంటల పాటు వ్యాపారులను హింసించారు. మెహదీ అలీ బాస్ వరంగల్ కమిషనర్గా పనిచేస్తున్న అరబ్ వ్యక్తి హబీబ్ మొహమ్మద్. మంచివాడే! రజాకార్ల ప్రభావం పెరిగేకొద్దీ కరడు తేలాడు, హిందువుల రక్తాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తా అనేంతగా! బాస్ అతి ధోరణి నచ్చకపోయినా కింది స్థాయి ఉద్యోగిగా మెహదీ అలీ ఏం చేయగలడు? భయవిహ్వలమైన హిందూ మతస్తులు నైజాం స్టేట్ చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్లడం మొదలుపెట్టారు. అరబ్ల దోపిడీ! తాలూకాల్లో జిల్లాల్లో నిజాం కోశాగారాలను అరబ్లు కాపలా కాసేవారు. ఖజానాపై కన్నేసేందుకు ఎవ్వరూ సాహసించనంత నిబద్ధతతో పనిచేసేవారు. పరిస్థితులు విషమిస్తున్న కొద్దీ అరబ్ కాపలాదారులు తామే చట్టంగా వ్యవహరించారు. మధిరకు ఐదు కిలోమీటర్ల దూరంలోని దిందుకూరు అనేగ్రామంపై ఒకరోజు అరబ్ కాపలాదారులు దాడి చేశారు. లూటీ.. దోపిడీ.. బలాత్కారాలు.. మహిళల మంగళసూత్రాలు సైతం తెంచుకుపోయారు. మహిళలు మౌనప్రదర్శన చేసి, దుండగులపై చర్యతీసుకోవాలని మెహదీ అలీని డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్ మెహదీ ఇంటి ఎదురుగానే ఉంది. ఆగడాలు చేసిన అరబ్లపై చర్యతీసుకోవాలని ఆ సమయంలో తన పక్కనే ఉన్న సంబంధిత పోలీసు అధికారి హబీబుల్లాతో అన్నాడు. ఊ కొట్టిన అధికారి, పోలీసులు మిన్నకుండి పోయారు. రజాకార్లు లూటీ చేసిన సొమ్ముతో రైల్వేస్టేషన్లో విహారం చేస్తూ రైలొచ్చాక తాపీగా వెళ్లిపోయారు. క్షోభించిన మెహదీ అలీ పై అధికారికి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ కలెక్టర్ తన సోదర విశ్వాసులతో సవ్యంగా లేని నేపథ్యంలో అతడిని బదిలీ చేయాలని కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశాడు. పద్ధతులు మార్చుకోకపోతే ‘విపరీత’ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ‘అసహజ లైంగిక కృత్యాల కేంద్రా’నికి బదిలీ కావాల్సి ఉంటుందనే అంతరార్థంతో ఖాసిం రజ్వీ.. మెహదీ అలీకి లేఖ రాశాడు. మెహదీ అలీకి బదిలీ అయ్యింది కూడా! అదే సమయంలో ‘పోలీస్ చర్య’ జరగడం, హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర భారతంలో భాగమైంది. ‘విపరీత పరిణామాల’ను ఎదుర్కొనే ప్రమాదం మెహదీ అలీకి తప్పిపోయింది! ప్రమోషన్లకు ఫుల్స్టాప్! తనతో సహా ఎనిమిది మంది అధికారులకు కలెక్టర్గా పదోన్నతి రావాల్సిన లిస్ట్లో మెహదీ అలీ పేరు లేదు! పదోన్నతులందరూ హిందువులే! నిజాం ధోరణి నచ్చని ఏడుగురు మీర్జాలలో ఒకరైన ముల్లా బాసిత్ అలీ ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను కలసి స్వయంగా వివరించారు. నెహ్రూ వెంటనే నమ్మలేదు. ఉత్తర్వుల కాపీ చూసి చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ బాక్లేకు వెంటనే ఫోన్ చేశారు. సంభాషణా సారాంశం ఏమిటి? ‘గతంలో హిందువులకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని ప్రయత్నించాం, సర్’ అని బాక్లే సమాధానం! ‘నిదానంగా వెళ్లండి, ప్రభుత్వం వివక్ష చూపిస్తోందనే భావనను కలిగించకండి’ అని నెహ్రూ హితవు పలకడంతో ఎనిమిది మందిలో ముగ్గురు ముస్లింలు కలెక్టర్లుగా నియుక్తులయ్యారు అందులో మెహదీ అలీ ఒకరు! ఎదుగూ బొదుగూ లేని స్థితి! కలెక్టరయ్యారు కాని, అక్కడ మెహదీ అలీ పదోన్నతులు ఆగిపోయాయి. తోటి వారంతా పదోన్నతులు పొందుతున్నారు. తనకు రావడం లేదు? కారణం! ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు ‘ఇతని విధేయతలు పలు రకాలు’ అని రాసేవారు! రాజ్య పాలకుడైన నిజాం సైతం రజాకార్లకు జడిసిన వాతావరణంలో న్యాయం వైపు ధర్మం వైపు ఉన్న మెహదీ అలీ పట్ల స్వతంత్ర భారత ప్రభుత్వంలో ఎంతటి అమానుష ధోరణి? పోలీస్ చర్య తర్వాత వేలాది ముస్లింలు పాకిస్థాన్ వెళ్లారు. తనలా వెళ్లలేదు. క్షుభితుడైన మెహదీ అలీ మౌనంగా ఉన్నాడు. ‘విధి’విలాసంగా భావించారు! పదేళ్ల కిందట పరమపదించారు. అంతకు కొన్నేళ్ల క్రితం ఎనభయ్యో వడిలో ఉన్న మెహదీ అలీని కలుసుకున్నాను. ప్రశాంతంగా ఉన్నారు. గతంలో తాను అనుభవించిన క్లేశానికి సంబంధించిన ఆచూకీ ఎక్కడా కనపడలేదు. మత్సరాలను తొలగించుకోలేని మనుషులను క్షమించే దయాసాగరుని నవ్వు! -
మోడీ అధ్యక్షతన నెహ్రూ జయంతి ఉత్సవ కమిటీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని జవహార్లాల్ నెహ్రూ 125వ జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీని పునర్వవస్తీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతను కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో కాంగ్రెస్ పార్టీ నేతలు గులాం నబీ అజాద్, మల్లికార్జున ఖర్గే, కరణ్ సింగ్లకు స్థానం దక్కింది. కాగా ఏఐసీసీ అధినేత్రి సోనియా కుటుంబ సభ్యులకు ఒక్కరికీ కమిటీలో చోటు దక్కలేదు. -
చరిత్ర చెక్కిలిపై చెరిగిన జ్ఞాపకం
నవభారత్కు సమయ నిర్దేశం చేసిన దేశీయ తొలి చేతి గడియారాల తయారీ సంస్థ హెచ్ఎంటీ వాచెస్. కోట్లాది భారతీయుల హస్తాభరణమై నిలిచిన ఈ మేటి సంస్థ అయిదు దశాబ్దాల ప్రయాణంలోనే కాలం కడుపున తలదాచుకోనుండటం మహా విషాదం. అదొక వైభవోజ్వల యుగం.. వల్లకాటి అధ్వాన్న శకం అంటూ ‘రెండు మహానగరాలు’ నవల మొదట్లో సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత చార్లెస్ డికెన్స్ ఫ్రెంచ్ విప్లవానికి ముందు పరిస్థితిని వర్ణించారు. స్వతంత్ర భారత్ తొలినాళ్లలో పురుడు పోసుకుని వికసించిన హిందుస్తాన్ మెషిన్ టూల్స్ (హెచ్ఎంటీ) ఉత్థాన, పతనాలకు కూడా ఈ వ్యాఖ్య వర్తిస్తుంది. దశాబ్దాల పాటు భారతీయులను అలరించిన ఈ సంస్థ వాచీల తయారీ విభాగం అటు కొనేవాళ్లు లేక, ఇటు నష్టాలు పూడ్చుకోలేక సెలవు ప్రకటించనుంది. స్వయంకృతాపరాధమో, పోటీలో నిలబడలేకపోవడమో.. కార్యనిర్వహణ లోపమో.. కారణాలు ఏవైనా కావచ్చు... హెచ్ఎంటీ వాచీ మన కళ్లముందే చరిత్ర గర్భంలో తలదాచుకోనుంది. దేశభక్తి, సమయపాలన రెంటికీ పట్టం గట్టిన నెహ్రూ యుగంలో అవతరించిన ఈ గొప్ప ఉత్పత్తి కొన్ని తరాల భారతీయుల జీవితాల్లో భాగమై నిలిచింది. జాతికి కాలగమనాన్ని నిర్దేశించిన హెచ్ఎంటి గడియారం.. ఇకపై టిక్ టిక్ అనలేదు. దశాబ్దకాలంగా వరుస నష్టాలతో కోలుకోలేని దెబ్బలు తింటూ వస్తున్న హెచ్ఎంటి గడియారాల తయారీ విభాగాన్ని పూర్తిగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా వార్తలు పొక్కాయి. వెంటనే దేశవ్యాప్తంగా షాపుల్లో, ఆన్లైన్ షాపుల్లో మిగిలివున్న సంస్థ గడియారాలు హాట్కేక్ల లాగా అమ్ముడయ్యాయి. హిందుస్తాన్ మెషిన్ టూల్స్ ఇకపై ఒక హిందుస్తాన్ మెమొరీ మాత్రమే. కోట్లాది మధ్యతరగతి భారతీయుల హస్తాభరణమై భాసిల్లిన హెచ్ఎంటీ గడియారం ఇక ఒక పురా జ్ఞాపకం. తన జీవితకాలంలో కొన్ని కోట్ల గడియారాలను అవిరామంగా సృష్టించిన హెచ్ఎంటీ డిమాండ్ లేని దుర్బలతకు గురైంది. పునరుద్ధరణకు కనుచూపు మేరలోనూ అవకాశం లేని నేపథ్యంలో ముగిం పు అనివార్యమైంది. భారతీయ వస్తూత్పత్తి చరిత్ర స్వర్ణయుగంలో మెరిసిన హెచ్ఎంటీ వాచీ ఇప్పుడు అంబాసిడర్ కారు, బజాజ్ స్కూటర్ల సరసన మ్యూజియంలో చేరబోతోంది. స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో దేశభక్తితోపాటు సమయ పాలనకూ ప్రాధాన్యం ఇవ్వాలన్న తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ దార్శనికతనుంచి హెచ్ఎంటీ వాచెస్ సంస్థ ఏర్పడింది. ఇది భారత్ రూపొందించిన మొట్టమొదటి దేశీయ మాన్యువల్ వాచ్. నాటి నుంచి హెచ్ఎంటీ గడియారం భారతీయ మధ్యతరగతికి సరికొత్త రుచిని చూపింది. జపాన్ కంపెనీ సిటిజన్ వాచ్ సంస్థ సహకారంతో 1961లో బెంగళూరులో ఏర్పడిన హెచ్ఎంటీ వాచీల విభాగం భారీ స్థాయిలో చేతి గడియారాలను తయారు చేసింది. 1970లలో యంత్రాల ద్వారా తొలిసారిగా ఆటోమేటిక్, క్వార్జ్ వాచీలను ప్రవేశపెట్టింది. జనతా, సోనా, విజయ్, ప్రియా, అపూర్వ తదితర పాపులర్ వాచీలతో ఇది అచ్చమైన దేశీ బ్రాండ్గా వెలుగొందింది. హెచ్ ఎంటీ వాచ్ ధరించడం అంటే మునుపటి తరాలకు ఒక హోదా. నలభైఏళ్లుగా దాన్ని వాడుతూనే ఉన్నామని నేటికీ ప్రజలు గర్వంగా చెబుతుంటారు. భారత్లో లైసెన్స్ పర్మిట్ రాజ్ రాజ్యమేలుతున్న కాలంలో హెచ్ఎంటీ గడియారం నవ్యత్వానికి, సాహసానికి మారుపేరుగా నిలిచింది. కాని 1991 ఆర్థిక సంస్కరణల అనంతరం లెసైన్స్ రాజ్ తగ్గుముఖం పట్టి ప్రయివేట్ వాచీల తయారీ కంపెనీలు మార్కెట్లోకి దూసుకొచ్చిన నేపథ్యంలో ఈ సంస్థ తన పురా ప్రాభవాన్ని కోల్పోయింది. చివరి సంవత్సరాల్లో ఇది ఏటా రూ.200 కోట్ల నష్టాలతో కుంగిపోయింది. ప్రైవేట్ సంస్థలతో పోటీ పడలేక, కాలానుగుణంగా మారలేక, తన పునాదులను తానే బలహీనపర్చుకుంది. పచ్చిగా చెప్పాలంటే ప్రైవేట్కు పట్టం గడుతూ పబ్లిక్ సంస్థలపై శీతకన్ను వేస్తున్న పాలనా విధానాలకు హెచ్ఎంటీ పతనం తిరుగులేని తార్కాణం. 1961లో దేశీయ తొలి చేతి గడియారాన్ని నెహ్రూ ఆవిష్కరించడంతో మొదలైన హెచ్ఎంటీ ప్రస్థానం 53 ఏళ్లపాటు కొనసాగింది. 1981లో క్వార్జ్ వాచీలు, 85లో సోలార్, టవర్ క్లాక్ల తయారీతో పతాక స్థాయికి చేరింది. గత అయిదు దశాబ్దాల కాలంలో 11 కోట్లకు పైగా వాచీలను ఉత్పత్తి చేసి, అమ్మింది. తొలి వివాహ బహుమతిగా ప్రజల హృదయాల్లో నిలిచింది. టైమ్ కీపర్ పతనం 1981లో క్వార్జ్ వాచీల తయారీకి మళ్లిన హెచ్ఎంటీ వాచెస్ అత్యధిక ధరల వాచీల విభాగంలో పై చేయి సాధించగలిగింది కానీ, అప్పుడప్పుడే చౌక ధర వాచీలవైపు మళ్లుతున్న మార్కెట్ నాడిని పసికట్టడంలో వెనుకబడింది. మొదట్లో ఆల్విన్తో పోటీలో తడబడిన సంస్థ తర్వాత టాటాల ప్రవేశంతో చతికిలబడింది. సంస్థ అంతర్గత సంక్షోభం లో ఉన్నతాధికారులు టాటా సంస్థలో చేరడం, ప్రభుత్వం కూ డా పట్టించుకోకపోవడంతో ఇతర ప్రభుత్వ రంగసంస్థల కోవలోకి చేరిపోయింది. నేటికీ 18 మాన్యుఫాక్చర్ విభాగాలున్న హెచ్ఎంటీ ఇకపై ట్రాక్టర్ల వంటి ఉత్పత్తులకే పరిమితం కానుం ది. ఏదేమైనా తరాలుగా కొనుగోలుదారుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన హెచ్ఎంటీ దేశీయ తొలి వాచీల ఉత్పత్తిదారుగా జాతికి గర్వకారణమే. 53 ఏళ్లపాటు జాతికి సమయాన్ని నిర్దేశించిన ఈ టైమ్ కీపర్, ‘దేశ్ కీ దడ్కన్’కు వీడ్కోలు. -మోహన -
సుస్వరలక్ష్మి
సత్వం: ‘నేను మామూలు ప్రధానిని; నువ్వు సంగీత సామ్రాజ్ఞివి,’ అన్నారు జవహర్లాల్ నెహ్రూ, సుబ్బులక్ష్మి ఆలపించిన ‘వైష్ణవో జనతో...’ విన్న తన్మయత్వంలో. ఆమె గానానికి ముగ్ధులైనవాళ్లలో మహాత్మాగాంధీ, హెలెన్ కెల్లెర్, యెహుదీ మెనుహిన్, బడే గులాం అలీఖాన్ వంటివారు కొందరు మాత్రమే! ‘రవ్వంత సాంస్కృతిక జ్ఞానం’ ఉన్న ప్రతి భారతీయుడూ ఎమ్మెస్ను ఏదోరకంగా ఎరిగివుంటాడు! ఆమె గొంతులో పదాలెంత అందంగా పలుకుతాయో, పదాల మధ్య విరామమూ అంతే అందంగా వినబడుతుంది. పారిజాతాల్ని గుప్పిట్లోకి తీసుకున్నట్టు, పావురాళ్లను ప్రేమగా నిమిరినట్టు, యోగులెవరో ఉమ్మడిగా వరమొసగినట్టు, స్వర్గద్వారంలోకి బేషరతుగా ప్రవేశించినట్టు, దైవసన్నిధిలో తీరిగ్గా నడుము వాల్చినట్టు అనుభూతి కలుగుతుంది. గాయకీ, శ్రోతా ఏకకాలంలో అమరులవుతారు. పుట్టుకతో కాకపోయినా, తన ఆహార్యంతో మరింత బ్రాహ్మణురాలిగా ఆమె కనబడేవారు. కాంచీపురం పట్టుచీర, వజ్రం పొదిగిన నాసికాభరణాలు, తిలకం, విభూతి దిద్దుకున్న నుదురు, ముఖ్యంగా ఎంతటి సంక్లిష్టమైన రాగంలోనూ చెదరని ఆమె వదనపు ప్రసన్నత... కళను ఊపిరిగా బతికిన దేవదాసీల పరంపరలో ‘మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి’గా ఆమె జన్మించారు. పసిప్రాయంనుంచే సంగీత సరస్సులో ఈదులాడారు. ‘శకుంతల’(1940), ‘మీరా’(1945) లాంటి తమిళచిత్రాల్లో నాయికగా నటించారు. దుష్యంతుడి పాత్ర పోషించిన జి.ఎన్.బాలసుబ్రమణియంను ఆయన గానం సహా ఇష్టపడ్డారు. ఇక ఒక్క క్షణం కూడా మీనుంచి నేను వేరుపడి ఉండలేను, అని ఇరవైల్లోవున్న సుబ్బులక్ష్మి ఒక లేఖలో రాశారు. ‘కన్నా’ ‘అన్బే’(ప్రియమైన) లాంటి సంబోధనలతో జీఎన్బీకి సుబ్బులక్ష్మి రాసిన ఉత్తరాల్ని ఆమె జీవితచరిత్ర ‘ఎంఎస్- ఎ లైఫ్ ఇన్ మ్యూజిక్’ రాసిన టి.జె.ఎస్.జార్జ్ చూడగలిగారు. లేకపోతే, ఆమెలోని స్త్రీత్వాన్ని పట్టించే ఘటన చరిత్రపొరల్లో దాక్కుండిపోయేదే! అయితే, వారి ప్రేమ ఫలవంతం కాలేదు. అదే శకుంతల నిర్మాత త్యాగరాజన్ సదాశివంను ఆమె పెళ్లాడారు. భార్య మరణించివున్న సదాశివంతో ఆమె పెళ్లి... ఆమెకు ఉద్వేగ పరంగా నష్టం కలిగించిందేమోగానీ సంగీతపరంగా మేలు చేసిందంటారు! వివాహం తర్వాత పూర్తిగా భారతీయ ఇల్లాలిగా భర్తకు అంకితమైపోయారు. మొదటిభార్య పిల్లలు రాధ, విజయను తన బిడ్డల్లా స్వీకరించారు. పూర్తిగా కర్ణాటక సంగీతానికే తనను సమర్పించుకోవడానికి సినిమాలను వదిలేసిన సుబ్బులక్ష్మిని చేతిలోని వజ్రంలా సానపెట్టారు సదాశివం. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవాడు, కల్కి పత్రికను నడిపినవాడు, ‘రాముడికి లక్ష్మణుడు ఎంతో, నాకు సదాశివం అంత,’ అని రాజగోపాలచారిలాంటివాడిచే అనిపించుకున్న సదాశివం... భార్య శక్తినీ, విలువనీ పూర్తిగా ఎరిగి, నిర్వహణ సామర్థ్యంతోపాటు, ప్రజాసంబంధాలూ మెరుగ్గా ఉన్న సదాశివం... సుబ్బులక్ష్మిని పద్ధతిగా ప్రపంచగుమ్మపు ఒక్కో మెట్టే ఎక్కించారు. ఏం పాడాలో, ఎలా పాడాలో, ఏది ఒత్తి పలకాలో, ఏది పునరుచ్చరించాలో లాంటి ప్రతి చిన్న వివరాన్నీ ఆయన జాగ్రత్తగా చూసుకునేవారు. ఆమె ద్వారానే ఆయన సంగీత ప్రపంచంలో జీవిస్తే, ఆయన ద్వారానే ఆమె మొత్తంగా ప్రపంచంలోనే బతికింది. అందుకే ఆయన మరణించిన తర్వాత ఏ ఒక్క కచేరీ చేయలేదు. తమిళం, తెలుగు, సంస్కృతం, హిందీ, మలయాళం, కన్నడం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో పాడిన సుబ్బులక్ష్మి... ఏ సామాజిక కారణం కోసమైనా పాడకుండా లేరు. సదాశివం షష్టిపూర్తి సందర్భంగా ఆమెకు రాధ కానుకగా ఇచ్చిన బంగారుగాజుల్ని కూడా భారత్-పాక్ యుద్ధ సమయంలో ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశారట! మానవాళితో సంభాషించడానికి తనను దేవుడు పంపిన సంగీత వాద్యంగా భావించుకున్నారీ భారతరత్నం(1916-2004). విష్ణు సహస్రనామం, భజగోవిందం, హనుమాన్ చాలీసా లాంటి వాటితో భక్తిని ఉత్సవంగా మలిచారు. ‘వేంకటేశ్వర సుప్రభాతం’ వినడానికి ఎంతటి దేవుడూ ఉత్సాహంగా నిద్ర మేలుకోవాల్సిందే! తన ఉచ్చారణతో ఉచ్చారణను దిద్దుకునేంత స్పష్టంగా, ఒక మానవ కంఠనాళపు పరిధిని కూడా దాటి పాడారు. పాడినకొద్దీ తేటపడే గొంతుక ఆమెది. మనిషికీ దేవుడికీ మధ్య దూరాన్ని తగ్గించే గొంతు వంతెన ఆమెది. -
జలధారకు 47ఏళ్లు
నాగార్జునసాగర్ :తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరప్రధాయని అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి నేటికి 47ఏళ్లు నిండాయి. బహుళార్థక ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేసి అర్ధశతాబ్దానికి చేరువవుతున్నా నేటికీ పూర్తిస్థాయి లక్ష్యం నెరవేరలేదు. కాగా ఈ ఆధునిక దేవాలయానికి 1955 డిసెంబర్ 10న జవహార్లాల్నెహ్రూ శంకుస్థాపన చేశారు. పన్నెడేళ్ల అనంతరం అంటే 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని, నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. నాటి నుంచి నేటి వరకు నల్లగొండ, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీటిని అందిస్తూ జీవనాధారమైంది. ఇదిలా ఉండగా కుడికాల్వ(జవహర్ కెనాల్) పరిధిలో 11.18లక్షల ఎకరాలు, ఎడమ కాల్వ(లాల్బహుదూర్ కెనాల్) పరిధిలో 10.39 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగినా 18లక్షల ఎకరాలలోపే సాగునీరు అందుతుంది. కాగా నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆనాటి అంచనావ్యయం రూ.70కోట్లు కాగా ఆ తర్వాత మరమ్మతుల కోసం వేలాది కోట్లు ఖర్చు చేశారు. అయినా నేటికీ కాల్వల చివరి భూములకు నీరందని పరిస్థితి. ప్రపంచ బ్యాంక్ నిధులు రూ.4,444.44 కోట్లతో చేపట్టిన సాగర్ ఆధునికీకరణ పనులు 2014 వరకే పూర్తి కావాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వంతో ఆలస్యం అవుతుండడంతో 2016 వరకు పొడిగించారు. -
నవ్విస్తూనే చురకలేసే.. కార్టూనిస్ట్
అప్కమింగ్ కెరీర్ : మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పత్రికల్లో తనపై వచ్చిన కార్టూన్లను కత్తిరించి, దాచుకొనేవారట. ప్రముఖ పొలిటికల్ కార్టూనిస్ట్ ఆర్.కె.లక్ష్మణ్ కుంచె నుంచి జాలువారిన ‘కామన్ మ్యాన్’ విగ్రహంగా మారి, కార్టూనిస్ట్ల గౌరవం పెంచాడు. మనదేశంలో అన్ని భాషల్లో ప్రసార మాధ్యమాలు విస్తరిం చడంతో కార్టూనిస్ట్లకు గిరాకీ పెరిగింది. వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, టీవీ ఛానళ్లు వంటి వాటిలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. వార్తాపత్రికల్లో పనిచేసే కార్టూనిస్ట్ లు జర్నలిస్టుల కంటే ఎక్కువ పాపులర్ కావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం యానిమేషన్, గ్రాఫిక్స్, అడ్వర్టైజ్ మెంట్ రంగాలు, ఇంటర్నెట్, కామిక్స్ బుక్స్ ప్రచురణ సంస్థల్లోనూ కార్టూనిస్ట్లకు మంచి డిమాండ్ ఉంది. పాఠకులకు నాలుగు కాలాలపాటు గుర్తుండిపోయే కార్టూన్ వేయడం ఒక కళ. దీనికి ఎంతో ఊహా శక్తి, పరిశీలనా నైపుణ్యాలు ఉండాలి. నిత్య జీవితంలో జరిగే సంఘటనల నుంచి తనకు పనికొచ్చే అంశాన్ని గుర్తించగల నేర్పు ఉండాలి. కార్టూన్ల ప్రధాన ఉద్దేశం.. నవ్విస్తూనే సున్నితంగా చురకలేయడం. కాబట్టి హాస్యరసాన్ని కాచి వడబోసిన వారే మంచి కార్టూనిస్ట్గా త్వరగా గుర్తింపు పొందగలుగుతారు. మనదేశంలోని విద్యాసంస్థల్లో కార్టూన్ల కోసం ప్రత్యేకంగా కోర్సులు లేకపోయినా పెయింటింగ్లో భాగంగా వీటిపై శిక్షణ ఇస్తున్నారు. ఫైన్ ఆర్ట్స్ సంస్థల్లో పెయింటింగ్ కోర్సులు ఉన్నాయి. అర్హతలు కార్టూనిస్ట్గా కెరీర్లో స్థిరపడాలనుకొనేవారికి పదో తరగతి, ఇంటర్మీయెట్ పూర్తిచేసిన తర్వాత పూర్తిస్థాయి డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి. కొన్ని సంస్థలు స్వల్పకాలిక కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేతనాలు ఫ్రీలాన్స్ వర్క్ చేస్తే ఒక్కో కార్టూన్కు రూ.250 నుంచి రూ.2000 వేల వరకు అందుకోవచ్చు. వార్తాపత్రిక లేదా మేగజైన్లో చేరితే ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా వేతనం లభిస్తుంది. కార్టూనిస్ట్(పెయింటింగ్) కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.jnafau.ac.in సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వెబ్సైట్: http://teluguuniversity.ac.in సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్-ముంబై వెబ్సైట్: www.mu.ac.in కళ నిత్యనూతనం ‘‘కళాత్మకమైన కోర్సులన్నీ నిత్యనూతనమే. అయితే మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కావటంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఎంతబాగా సృజనాత్మకతను ప్రదర్శించగలిగితే కళాకారుడికి అంత గొప్ప పేరు, ప్రఖ్యాతులు వస్తాయి. చిత్రకళలో అవకాశాలకు కొదవలేదు. ఎప్పటికప్పుడు ప్రతిభను నిరూపించుకోవడం పైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. కార్టూనిస్ట్లు టీచర్స్గా, ఫ్రీలాన్సర్లుగా, మీడియా రంగంలో దేశ, విదేశాల్లో పనిచేయవచ్చు’’ - కప్పరి కిషన్, ఆర్ట్ ఇన్స్ట్రక్టర్, తెలుగు విశ్వవిద్యాలయం -
ఇంత బరితెగింపా?!
పునాది స్థాయిలో స్వపరిపాలనను పటిష్టంచేస్తే దేశంలో ప్రజా స్వామ్యం పరిఢవిల్లుతుందన్న ప్రప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సదాశయ స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపహాస్యం పాలైంది. అధికారం ఉన్నదికదా అన్న అహంకారంతో... వెన్నెముకలేని అధికార యంత్రాంగం స్వాభిమానం విడిచి చెప్పినట్టల్లా ఆడుతుందన్న భరో సాతో ఎంపీపీ, జెడ్పీటీసీలను తన ఖాతాలో వేసుకోవడానికి టీడీపీ సర్కారు ప్రదర్శించిన గూండాగిరీ అందరినీ దిగ్భ్రమకు గురిచేసింది. కెమెరా కళ్లు తమనే గమనిస్తున్నాయన్న వెరపులేకుండా ప్రత్యర్థి పక్షం సభ్యులను బలవంతంగా తమ పక్షంలోకి లాక్కుపోవడానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు చేసిన ప్రయత్నాలు వారి అసలు రంగును పట్టి ఇచ్చాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీవంటివారు చూస్తుండగానే మైకులు విరిచి, విిసిరేసిన ఎమ్మెల్యే ఒకరైతే... జెడ్పీటీసీ సభ్యుల్ని ఈడ్చుకెళ్లడానికి చూసిన ఎమ్మెల్యే మరొకరు. ఈ దుశ్శాసనపర్వంలో బెదిరింపులు, దుర్భాషలకు లెక్కేలేదు. తనపై టీడీపీ దౌర్జన్యంచేసిందని, పార్టీ సహచరులు జోక్యం చేసుకోనట్టయితే వారు తనను చంపేసివుండేవారని మహిళా జెడ్పీటీసీ ఒకరు ఆరోపిం చారంటేనే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థమవుతుంది. టీడీపీకి మెజారిటీ లభించినచోట ఎలాంటి వివాదమూ లేకుండా ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ పార్టీకి అధికారం దక్కే అవకాశంలేని ఎంపీపీ, జెడ్పీల్లో మాత్రమే సమావేశాలు రణరంగమయ్యాయి. దీన్నిబట్టే ఘర్ష ణలకు మూలకారకులెవరో, వారి అంతరంగం ఎలాంటిదో అర్థమవు తుంది. కళ్లముందు మహిళా ప్రజాప్రతినిధుల చీరలు లాగుతున్నా, వారి చేతిగాజులు పగులుతున్నా కలెక్టర్లు, ఎస్పీలు గుడ్లప్పగించి చూసిన వైనం విస్మయకరం. తగినంత పోలీసు బందోబస్తు ఉన్నా టీడీపీ దౌర్జన్యాలను నిలువరించలేని ఈ ఉన్నతాధికారులు... నిబంధన లకు విరుద్ధంగా ఎన్నికలు వాయిదా వేయడమో, టీడీపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించడమో చేసి తమ ప్రభుభక్తిని చాటుకున్నారు. తమను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన అత్యున్నత సివిల్ సర్వీస్ వ్యవస్థనే నగుబాటుపాలు చేశారు. కోరం ప్రకటిం చాక ఏ సాకునైనా చూపి ఎన్నికల వాయిదా ఎలా సాధ్యమన్న ఇంగిత జ్ఞానం వారికి లేకపోవడం దారుణం. పదేళ్లపాటు గద్దెపై ఉండి సాగించిన అరాచకాలకు విసుగెత్తిన కారణంగానే బాబును రాష్ట్ర ప్రజలు మరో పదేళ్లపాటు అధికారంలేకుండా శిక్షించారు. అయినా పుట్టుకతో వచ్చిన బుద్ధిని ఆయన వదులుకోలేకపోయారని తాజా పరిణామాలు నిరూపించాయి. ఇటీవలి సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో వందలాది కోట్లు వెదజల్లి, అబద్ధపు హామీలు పుక్కిటబట్టి అరకొర మెజారిటీతో సాధించుకున్న అధికారానికి ఈ ఫలితాలు అదనంగా తోడ్పడేదేమీ లేదు. మరెందుకని టీడీపీ ఈ స్థాయికి దిగజారిందన్నది అంతుబట్టని విషయం. 13 జిల్లాల్లో 9 జిల్లాల జెడ్పీలు టీడీపీకి వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్కు రావలసిన 4 స్థానాలు ఆ పార్టీకి దక్కకుండా చేయడం కోసమే ఇంతగా బరితెగింపు. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ ఆటలు సాగకపోయినా కర్నూలులో అధికారుల ప్రాపకంతో జెడ్పీ చైర్మన్ పదవిని ఆ పార్టీ సొంతంచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ జెడ్పీటీసీలు ప్రమాణస్వీకారం చేయకున్నా ఆ పార్టీ వారందరినీ బయటకు నెట్టి ఎన్నికలు జరిగినట్టు, అందులో టీడీపీ అభ్యర్థి నెగ్గినట్టు వెరపులేకుండా ప్రకటించిన అధికా రుల సాహసానికి జనమంతా విస్తుపోయారు. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లోనూ ఇదే తంతు సాగింది. దౌర్జన్యాలు, అపహరణలు, బలవంతంగా ఓట్లేయించుకోవడంవంటివి చోటుచేసుకున్నాయి. తాము గెలిచే అవకాశం లేదని గ్రహించినచోటల్లా సమావేశమందిరాల్లో టీడీపీ కిష్కింధకాండ సృష్టించింది. కుర్చీలు, బల్లలు విరగ్గొట్టి, కాగితాలు చించేసి సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. ఒకచోటైతే నిండు గర్భిణిగా ఉన్న ఎంపీటీసీపై దౌర్జన్యం చేశారు. అధికారులు తాబేదార్లుగా వ్యవహరించిన జమ్మలమడుగువంటి చోట ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. ఎంపీపీ ఎన్నికల నిర్వహణ కిందిస్థాయి అధికారులవల్ల అలా అఘోరించిందనుకున్నవారికి జెడ్పీ ఎన్నికల తీరు చూస్తే నోటమాట రావడంలేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అధిక స్థానాలు గెలుచుకున్నా మున్సి పాలిటీల్లోగానీ, ఎంపీపీ, జెడ్పీల్లోగానీ కాంగ్రెస్ అధికారాన్ని దక్కించు కోలేకపోయింది. కానీ, అధికార టీఆర్ఎస్ పక్కా వ్యూహంతో, ఎంఐఎం వంటి పార్టీల మద్దతుతో తన స్థానాన్ని సుస్థిరపరచుకుంది. అంతేతప్ప టీడీపీ ఆంధ్రప్రదేశ్లో సాగించినట్టుగా బరితెగింపు రాజకీ యాలకు పాల్పడలేదు. అపహరణలకు, దౌర్జన్యాలకు దిగజారలేదు. ఆంధ్రప్రదేశ్లో బాహాటంగా గూండాయిజాన్ని ప్రోత్సహించిన బాబు... తెలంగాణలో టీఆర్ఎస్కు అనుకూలంగా ఓటేసిన తమ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలను పార్టీనుంచి సస్పెండ్ చేయడం మహావింత. ఈ రెండు రోజులూ చానళ్లలో టీడీపీ దౌర్జన్యాన్ని గమనించినవారికి అలా సస్పెండ్ చేసే నైతికార్హత బాబుకున్నదా అనే అనుమానం తలెత్తు తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరి గణించి తగిన చర్యలు తీసుకోనట్టయితే ఆ సంస్థ ప్రతిష్ట దెబ్బతిం టుంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరికలను బేఖాతరుచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిష్పాక్షికంగా వ్యవహరించిన అక్కడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీరా పాండేను ఆదర్శంగా తీసుకోవాలి. స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పూనుకోవాలి. గవర్నర్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎన్నికల ప్రక్రియను అపహాస్యం పాలుచేసినవారిపై చర్యలు తీసుకోవాలి.