ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో 1,159 విద్యాసంస్థలు ఉగ్రవాద దాడులకు సులభంగా గురయ్యే ప్రమాదముందని పోలీసులు చెప్పారు. వీటిలో పలు కళాశాలలు, 22 యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. నగరంలోని 77 మార్కెట్లు, 14 ఆస్పత్రులకు కూడా ఉగ్రవాద ముప్పు ఉందని తెలిపారు. కాగా, ఈ నెల 16న పాకిస్తాన్లోని పెషావర్లో ఓ పాఠశాల విద్యార్థులపై ఉగ్రవాదుల దాడి కేసులో పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నివేదికను సిద్ధం చేశారు. 11 మంది ఉగ్రవాదులు ఈ నెల 16న లాండికోటల్ పట్టణం నుంచి పెషావర్లోకి అడుగుపెట్టగా అందులో ఏడుగురు దాడిలో పాల్గొన్నట్లు, మిగిలిన నలుగురు తిరిగి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.