జాదవ్‌ కేసులో పాక్‌ దుష్ప్రచారం | Pakistan Accused India Of Sponsoring Peshawar School Massacre | Sakshi
Sakshi News home page

జాదవ్‌ కేసులో పాక్‌ దుష్ప్రచారం

Feb 19 2019 6:26 PM | Updated on Feb 19 2019 8:34 PM

Pakistan Accused India Of Sponsoring Peshawar School Massacre - Sakshi

పాకిస్తాన్‌ అటార్నీ జనరల్‌ అన్వర్‌ మన్సూర్‌ ఖాన్‌ (ఫైల్‌ఫోటో)

జాదవ్‌ కేసులో ఐసీజే వేదికపై పాక్‌ దుష్ర్పచారం

హేగ్‌ : కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్ధానం (ఐసీజే)లో మంగళవారం వరుసగా రెండో రోజూ వాదనలు కొనసాగాయి. ఈ కేసులో పాక్‌ తన వాదనను వినిపించే క్రమంలో 2014 పెషావర్‌ పాఠశాలలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారత్‌ హస్తం ఉందని ఆరోపించింది. మరణ శిక్షకు గురై పాక్‌ జైల్లో మగ్గుతున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ను విడుదల చేయాలని కోరుతూ ఐసీజేను భారత్‌ ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

జాదవ్‌ను భారత గూఢచర్య సంస్థ రా కార్యకర్తగా పాకిస్తాన్‌ ఆరోపిస్తోంది. పాకిస్తాన్‌లో ఉగ్ర దాడులకు జాదవ్‌ ప్రణాళికలు రూపొందించారని పాక్‌ ఆరోపించింది. కాగా జాదవ్‌ను ఇరాన్‌లో అపహరించిన పాకిస్తాన్‌ ఆయనను బలిపశువును చేస్తోందని భారత్‌ పేర్కొంది. భారత్‌ జెనీవా సదస్సు తీర్మానాలను ఉల్లంఘిస్తోందని, 2014 పెషావర్‌ ఉగ్రదాడిలో భారత్‌ ప్రమేయం ఉందని పాకిస్తాన్‌ అటార్నీ జనరల్‌ అన్వర్‌ మన్సూర్‌ ఖాన్‌ ఐసీజే ఎదుట తన వాదనలు వినిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement