![Young Man murdered in Medaram - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/14/murder.jpg.webp?itok=SgDrLgT9)
సాక్షి, మేడారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. కారులో వచ్చిన దుండగులు ధర్మసాగర్కు చెందిన యువకుడిపై కత్తులతో దాడి చేశారు. అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
అతడు ప్రేమించిన అమ్మాయి తరపువారే ఈ ఘాతుకానికి పాల్పడివుంటారని అనుమానిస్తున్నారు. తన ప్రియురాలిని తీసుకువచ్చి ప్రేమవివాహం చేసుకుంటున్నాడన్న కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టివుంటారన్న మాటలు విన్పిస్తున్నాయి. మృతుడి తరపు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment