అక్షయ్ కుమార్
కరోనా వైరస్ పై పోరాడేందుకు సినిమా స్టార్స్ తమ వంతుగా ప్రభుత్వానికి, సినిమా కార్మికుల సంఘాలకు విరాళాలు ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భారీ విరాళాన్ని ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు. ‘పీఎం – కేర్స్ ఫండ్స్ కి ఏకంగా 25 కోట్ల మొత్తాన్నివిరాళంగా ప్రకటించారు అక్షయ్. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మనందరి ప్రాణాలే ముఖ్యం. మనకు ఉన్నది, తోచింది సహాయం చేద్దాం. మోదీగారి పీఎం – కేర్స్ ఫండ్స్ కి 25 కోట్లు విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు అక్షయ్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment