అమలాపాల్‌కు ఐటీ షాక్‌ | case on amala paul | Sakshi
Sakshi News home page

Nov 24 2017 8:31 PM | Updated on Nov 24 2017 8:43 PM

case on amala paul - Sakshi

తిరువనంతపురం(కేరళ): తప్పుడు పత్రాలు సమర్పించి పన్ను ఎగవేసిన ఇద్దరు నటులపై కేరళలో కేసులు నమోదయ్యాయి. కేరళలో లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్‌పై 20శాతం (దాదాపు రూ.20లక్షల వరకు) పన్ను విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్‌ అమలాపాల్‌, హీరో ఫహద్‌ ఫాసిల్‌ తప్పుడు మార్గాన్ని అనుసరించారు. వారు తమ లగ్జరీ వాహనాలను  తప్పుడు పత్రాలు సృష్టించి.. రిజిస్ట్రేషన్‌ చార్జీ తక్కువగా ఉండే పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. కేరళ వాసులైన ఈ ఇద్దరు నటులు కేరళలోనే వాహనాలను కొనుగోలు చేసి పుదుచ్చేరిలో రిజిస్టర్‌ చేసినట్లు తేలింది. అయితే, వారు పుదుచ్చేరిలోనే ఉంటున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులకు చూపించారని విచారణలో వెల్లడవ్వడంతో కేసులు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement