వాయిస్ ఓవర్...
సంగీత దర్శకులు వాయిస్ ఓవర్ చెప్పడం అనేది చాలా అరుదైన విషయం. కీరవాణి తన కెరీర్లోనే తొలిసారిగా ఓ చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పారు. గుణ్ణం గంగరాజు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న ‘చందమామలో అమృతం’ సినిమాకు కీరవాణి ఇటీవలే వాయిస్ ఓవర్ చెప్పారు. అవసరాల శ్రీనివాస్, హర్షవర్థన్, శివన్నారాయణ తదితరులు ఇందులో నటించారు. బుల్లితెరపై ‘అమృతం’ సీరియల్ విశేషాదరణ పొందిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపు లాంటిది ఈ సినిమా.