మైనే ప్యార్ కియా
ప్రదీప్ బెట్నో, ఇషా తల్వార్, కోమల్ ఝా ముఖ్య తారలుగా ఉపేంద్రకుమార్ గిరడ, సానా వెంకట్రావు నిర్మిస్తున్న ‘మైనే ప్యార్ కియా’ హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రదీప్ మాడుగుల దర్శకుడు. నాయకా నాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి శ్రీను వైట్ల క్లాప్ ఇచ్చారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘సల్మాన్ఖాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన హిందీ చిత్రం ‘మైనే ప్యార్ కియా’కీ దీనికీ సంబంధం లేదు. ఫ్రెష్ సబ్జెక్ట్తో ఈ చిత్రం చేస్తున్నాం. వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది’’ అన్నారు. ప్రేక్షకుల అభిరుచిన దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నామని, 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తామని నిర్మాతలు చెప్పారు.