తనుశ్రీకి పిచ్చి పట్టింది | Tanushree files Rs. 10 crore defamation suit against Rakhi Sawant | Sakshi
Sakshi News home page

తనుశ్రీకి పిచ్చి పట్టింది

Published Tue, Oct 23 2018 1:27 AM | Last Updated on Tue, Oct 23 2018 8:46 AM

Tanushree files Rs. 10 crore defamation suit against Rakhi Sawant - Sakshi

రాఖీ సావంత్‌

ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై బాలీవుడ్‌లో ఇప్పటికీ వాడి వేడి చర్చ జరుగుతూనే ఉంది. కొందరు తనుశ్రీకి మద్దతుగా నిలిస్తే.. మరికొందరు నానాకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. నటి రాఖీ సావంత్‌ కూడా ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో  నానాకి మద్దతుగా మాట్లాడారు. ‘‘నానా పటేకర్, గణేశ్‌ ఆచార్యపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలు. నాకు మహిళలపై గౌరవం ఉంది. వారి గురించి తప్పుగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. 


తనుశ్రీకి పిచ్చి పట్టింది. పదేళ్లుగా కోమాలో ఉండి ఈ మధ్యే బయటికి వచ్చింది. పదేళ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చిన తనుశ్రీ అవకాశాలు లేక.. డబ్బుల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది.  నానాని తప్పుపడుతోంది’’ అన్నారు. రాఖీ సావంత్‌ వ్యాఖ్యలపై తనుశ్రీ ఫైర్‌ అయ్యారు. ఆమెపై రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement