తీర్పు అనంతరం ఏం జరుగుతుంది?
‘‘ప్రతి ఒక్కరినీ కదిలించిన ఢిల్లీ నిర్భయ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశాను. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అని చెప్పే సినిమా ఇది’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు.
ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నిర్భయభారతం’. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మట్లాడుతూ - ‘‘ఇటీవలే నిర్భయ నిందితులకు కోర్టు మరణ దండన విధించింది.
ఈ తీర్పు అనంతరం ఏం జరుగుతుంది? అనేది మా సినిమా క్లైమాక్స్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సి.గోపాలరావు, కూర్పు: మోహన్ రామారావు.