రాడ్లు, ఇటుకలతో పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు | 10 inmates injured in clash in district jail | Sakshi
Sakshi News home page

రాడ్లు, ఇటుకలతో పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు

May 8 2016 11:46 AM | Updated on Sep 3 2017 11:41 PM

ఉత్తరప్రదేశ్లో ఖైదీలు తన్నుకున్నారు. ముజఫర్ నగర్ జైల్లో రెండు గ్రూపుల మధ్య పాత కక్షల నేపథ్యంలో గొడవ జరిగి జైలు అధికారుల ముందే చిత్తుచిత్తుగా కొట్టుకున్నారు.

ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్లో ఖైదీలు తన్నుకున్నారు. ముజఫర్ నగర్ జైల్లో రెండు గ్రూపుల మధ్య పాత కక్షల నేపథ్యంలో గొడవ జరిగి జైలు అధికారుల ముందే చిత్తుచిత్తుగా కొట్టుకున్నారు. ఈ క్రమంలో పదిమంది గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొలుత ఆ రెండు గ్రూపుల్లో ఒకరు పాత కక్షకు సంబంధించిన విషయాన్ని లేవనెత్తారు.

దాంతో అవతలి వర్గం కోపంతో ఊగిపోయారు. అసమయంలోనే రెండు వర్గాల మధ్య తొలుత ఇటుకలతో దాడులు జరిగాయి. అనంతరం రాడ్లు తీసుకొని ఫైట్ చేశారు. దీంతో అదనపు పోలీసులు కూడా అక్కడికి వచ్చి వారిని విడగొట్టారు. అనంతరం జైలు భద్రతను పెంచారు. జిల్లా మేజిస్ట్రేట్ కూడా జైలుకు వచ్చి పరిస్థితిని సమీక్షించి సమాచారం సేకరించుకొని వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement