Inmates
-
ఖైదీల ఘర్షణ.. సిద్దు హత్య కేసు నిందితుల హతం
ఛండీగఢ్: సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసు నిందితుల్లో ఇద్దరు.. జైలు ఘర్షణలో హతమయ్యారు. పంజాబ్ టార్న్ తరణ్ జిల్లా గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలు ఆదివారం ఐదుగురు ఖైదీల మధ్య జరిగింది. ఈ ఘర్షణలో మన్దీప్ సింగ్ అలియాస్ తుపాన్ ఆఫ్ బటాలా, మన్మోహన్సింగ్ అలియాస్ మోహ్న ఆఫ్ బుద్లానాలు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. మరో ఖైదీ కేశవ్ ఆఫ్ బతిండాకు గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురు ఒకే గ్యాంగ్కు చెందిన వాళ్లని, సిద్దు హత్యకేసులో నిందితులుగా ఉన్నారని ఎస్ఎస్పీ గుర్మిత్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. తుపాన్ మూసేవాలా హత్య కేసులో షూటర్లకు వాహనాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక పంజాబీ యువగాయకుడు సిద్దూ మూసేవాలా.. 2022, మే 29న కాల్పుల్లో హత్యకు గురయ్యాడు. అంతకు ముందురోజే ఆయనకున్న సెక్యూరిటీని పంజాబ్లో కొలువు దీరిన మాన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సుమారు 30 రౌండ్ల కాల్పులు జరిపారు ఆయనపై దుండగులు. -
తినే కంచంలో ఉప్పు పోశారు.. ఆమె చేసిన ఘోరం అలాంటిది
ఓ మహిళా ఖైదీ రిమాండ్లో ఉన్న సమయంలో తోటి ఖైదీలు.. జైలులో తినే కంచంలో అధికంగా ఉప్పు కలిపి చుక్కలు చూపించారు. ఆమె చేసిన తప్పుకు తోటి ఖైదీలు సైతం అసహ్యించుకున్నారు. అందుకే ఆమె చేసిన తప్పు గుర్తుకు వచ్చేలా చేశారు. ఈ ఘటన ఇంగ్లండ్లోని ఈస్ట్ ఉడ్ మహిళల కారాగారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఎమ్మా టుస్టిన్ అనే 32 ఏళ్ల మహిళ.. 29ఏళ్ల థామస్ హ్యూస్ను రెండో పెళ్లి చేసుకుంది. తన మొదటి భార్యతో థామస్ విడిపోయినప్పటికీ.. వారిద్దరికి జన్మించిన ఆర్థర్ పోషణ బాధ్యతను తానే తీసుకున్నాడు. ఇక తనకు, థామస్కు మధ్య బాలుడు ఆర్థర్ ఉండడం ఇష్టంలేని ఎమ్మా.. ఆర్థర్ తినే కంచంలో రోజూ మోతాదుకు మించి ఉప్పును కలపడం మొదలు పెట్టింది. దీంతో ఆర్థర్ ఆరోగ్యం క్షిణించి, రక్తంలో ఉప్పు శాతం పెరిగి మృతిచెందాడు. ఈ ఘటనలో బాలుడి సవతి తల్లి ఎమ్మకు కోవెంట్రీ క్రౌన్ కోర్ట్ డిసెంబర్ 3న 29 ఏళ్ల కారాగార శిక్షను విధించింది. అయితే ఎమ్మా రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో అదే జైలులో శిక్ష అనుభవించిన ఎలైన్ ప్రిచర్డ్(మాజీ ఖైదీ).. జైలులోని జరిగిన సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. ఆరేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న ఎమ్మాకు.. ఆర్థర్ పడిన బాధను చూపించాలని జైలులో ఉన్న మహిళా ఖైదీలమంతా నిర్ణయించుకున్నామని తెలిపారు. ఎమ్మా బాలుడిని హింసించి కంచంలో ఉప్పు కలిపినట్టుగానే తామంతా.. ఆమె తినే కంచంలో ఉప్పు కలిపేవాళ్లమని తెలిపారు. తామంతా కారాగారంలో ఉన్న సమయంలో ఎమ్మా పట్ల క్రూరంగా ప్రవర్తించామని కానీ, ఆర్థర్ను హింసించి చంపినందుకు మేము(ఖైదీలు) చేసిన హింసకు ఆమె శిక్షార్హురాలని ఎలైన్ చెప్పారు. తన భర్త థామస్.. బాలుడు ఆర్థర్ను నిర్లక్ష్యం చేయడం వల్ల తను జైలు శిక్ష అనుభవిస్తున్నానని చెప్పేదని పేర్కొంది. ఆర్థర్ ఎలా చనిపోయాడనే విషయాన్ని చెప్పేది కాదని, అసలు బాలుడి ప్రస్తావన కూడా తీసుకురాలేదని ఎలైన్ పేర్కొంది. -
ఘోరం: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు
జకర్తా: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం సంభవించింది. జైలులో అగ్ని ప్రమాదం సంభవించి 41 మంది ఖైదీలు మృతువాత పడ్డారు. 8 మంది తీవ్రంగా గాయపడగా 72 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రపంచం ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. బుధవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో జైలులో మంటలు చెలరేగాయి. అయితే నిద్రలో ఉన్న ఖైదీలు ఈ విషయం తెలియకపోవడంతో అగ్నికీలలకు ఆహుతయ్యారు. ఆ దేశ రాజధాని జకర్తాలోని టాంగరింగ్ జైలులో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. జైలులోని బ్లాక్ సీలో అగ్నిప్రమాదం సంభవించిందని ఆ దేశ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదం సంభవించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళాలు వచ్చి మంటలను అదుపుపలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటలు అదుపులోకి వచ్చాక పరిశీలించగా ఖైదీలు అగ్నికీలల్లో చిక్కుకుపోయి కన్నుమూసినట్లు గుర్తించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు జైళ్ల శాఖ ప్రతినిధి రికా అప్రియంతి వెల్లడించారు. అయితే ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వాస్తవంగా అయితే బ్లాక్లో 40 మంది ఖైదీలు ఉండాల్సి ఉండగా రెట్టింపు స్థాయిలో122 మందికి పైగా ఉంటున్నారని జైళ్ల శాఖ వెబ్సైట్ తెలుపుతోంది. సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండడం.. ప్రమాదం సంభివించిన తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీలో రికార్డయ్యింది. -
లేడీ ఆఫీసర్ కాదు.. ఆమె ఒక కామపిశాచి!
విధి నిర్వహణ పక్కకుపెట్టిన ఆ అధికారిణి.. విరహంతో రగిలిపోయి అకృత్యాలకు పాల్పడింది. మూడేళ్ల పాటు జైల్లోనే దారుణాలకు తెగించింది. ఆమె కామ దాహానికి బలైన బాధితులతో పాటు అధికారుల వాంగ్మూలంతో ఎట్టకేలకు నేరం ఒప్పుకోవాల్సి వచ్చింది. కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన ఖైదీల లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎట్టకేలకు నిందితురాలికి శిక్ష పడింది. టీనా గోన్జలెజ్.. వయసు 27. కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైల్లో మగ ఖైదీల పర్యవేక్షణ, సవరణల అధికారిణిగా మూడేళ్లపాటు పని చేసేది. ఆ మూడేళ్లలో ఖైదీలపై లైంగిక వేధింపులకు పాల్పడిందన్నది ఆమెపై నమోదైన ప్రధాన ఆరోపణ. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాలని, ఫోన్ కాల్స్లో శృంగార సంభాషణలు కొనసాగించాలని ఆమె ఖైదీలను బెదిరించేది. కొందరు ఖైదీలు తెగించి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేరవేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసిన అధికారులు.. గత మే నెలలో ఆమెను అరెస్ట్ కూడా చేశారు. వికృత చేష్టలు.. దర్యాప్తు సమయంలో గోన్జలెజ్ జైల్లో పాల్పడ్డ వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. విడుదలైన ఖైదీల నుంచి, అధికారుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన అధికారులు.. ఆ వివరాల్ని జడ్జి ముందు ఉంచారు. ఖైదీలపై తన కామ వాంఛల్ని తీర్చుకునేందుకు ఆమె ఘోరంగా ప్రవర్తించేదని తేలింది. ఒకరితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు.. మిగతావాళ్లను కన్నార్పకుండా చూడాలని కండిషన్ పెట్టేది. ఇక వాళ్లకు పోర్న్ వీడియోలు చూపించి.. అందులో మాదిరి పాల్గొనాలని ఒత్తిడి చేసేది. అంతేకాదు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా తన యూనిఫామ్కు ఆమె రంధ్రాలు చేసుకునేదని నివేదిక ఇచ్చారు అధికారులు. ఆ అకృత్యాల రిపోర్ట్ను చూసి జడ్జి సైతం బిత్తరపోయాడు. జీవితం నాశనం చేసుకున్నావ్ గోన్జలెజ్ మీద వృత్తిపరమైన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఖైదీలకు రేజర్లు, సెల్ఫోన్లతో పాటు మద్యం, డ్రగ్స్ సప్లై చేసేదని, ‘సెక్స్ రిటర్న్ గిఫ్ట్’లుగా వాటికి పేరు పెట్టిందని ఓ మాజీ ఖైదీ జడ్జి ముందు వాపోయాడు. ఇక ఆమెపై నమోదైన ఆరోపణలన్నీ నిజమేనని జైలు మాజీ అధికారి, ఈ నివేదికను రూపొందించిన స్టీవ్ మెక్కోమాస్ కోర్టుకు వెల్లడించాడు. నిందితురాలి తరపున కౌన్సెలర్ మాట్లాడుతూ.. ఆ టైంలో గోన్జలెస్ వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆ బాధలోనే ఆమె అలా ప్రవర్తించిందని తెలిపాడు. ఆమె మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని క్షమించండి’ అని వేడుకున్నాడు. అయితే ఇంతటి దారుణాలకు పాల్పడ్డ ఆమెను జడ్జి ఒక ‘కామ పిశాచి’గా వర్ణించడం విశేషం. ‘నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావ్. మూర్ఖంగా వ్యవహరించావు. మిగతా జీవితం అయినా మంచిగా బతుకు’ అని తీర్పు వెలువరించే ముందు జడ్జి వ్యాఖ్యానించాడు. కాగా, ఆమెకు నేర చరిత్ర లేకపోవడంతో మూడేళ్ల ఎనిమిది నెలలు శిక్షతో సరిపెట్టాడు జడ్జి. ఇప్పటికే జైలులో గడిపినందున.. ఆ శిక్షను మైనస్ చేసి మరో రెండేళ్లు సాధారణ జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి వెల్లడించాడు. ఏ జైల్లో అయితే అధికారిణిగా అకృత్యాలకు పాల్పడిందో.. అదే జైలుకి ఇప్పుడామె ఖైదీగా వెళ్లింది. -
ఖైదీలకు తాత్కాలిక బెయిల్!
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని జైళ్లలో పరిస్థితులు, మధ్యంతర బెయిల్పై ఖైదీల విడుదల తదితర అంశాలపై చర్చించేందుకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ (లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్), జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి (హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్), హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, జైళ్ల శాఖ డీజీ మహ్మద్ అసన్ రెజాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల సమావేశమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమావేశమైన ఈ కమిటీ పలు తీర్మానాలు చేసింది. ప్రాథమికంగా 90 రోజుల పాటు.. ఏడేళ్లు అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసే సమయంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించేలా డీజీపీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి సూచనలు ఇవ్వాలి. జిల్లా జడ్జీలంతా ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని మేజిస్ట్రేట్, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లకు సూచనలు చేయాలి. గత ఏడాది కమిటీ తీర్మానాల మేరకు మధ్యంతర బెయిల్పై విడుదలై తిరిగి జైలుకు చేరిన ఖైదీలు, అండర్ ట్రయల్ ఖైదీలను మధ్యంతర బెయిల్పై విడుదల చేయాలి. ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో జైల్లో ఉన్న అర్హులైన ఖైదీలను, అండర్ ట్రయిల్ ఖైదీలను మధ్యంతర బెయిల్పై విడుదల చేయాలి. విడుదలైన తరువాత 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంటామని వారు హామీ ఇవ్వాలి. దీన్ని ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేసి కస్టడీలోకి తీసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో సొంత ప్రాంతాలకు చేరుకునేలా హోంశాఖ, జైళ్ల శాఖ తగిన రవాణా సదుపాయం కల్పించాలి. ప్రాథమికంగా మధ్యంతర బెయిల్ 90 రోజులకు మంజూరు చేయాలి. బెయిల్ బాండ్ల మొత్తం సమంజసంగా ఉండాలి. వెబ్సైట్లో వివరాలుంచాలి.. దీనికి సంబంధించి హైకోర్టులో ఓ బెంచ్ను ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రార్ జనరల్ తీర్మానాల కాపీని ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలి. ఈ మొత్తం వ్యవహారంపై సుమోటో పిటిషన్ను సిద్ధం చేయాలి. రాష్ట్రంలో జైళ్ల సామర్థ్యం, ఎంత మంది ఖైదీలున్నారన్న విషయాలను జైళ్ల శాఖ వెబ్సైట్లో పొందుపరచాలి. ఈ వివరాలను ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీతో పంచుకోవాలి. ఉన్నత స్థాయి కమిటీ గత ఏడాది చేసిన అన్ని తీర్మానాలను లీగల్ సర్వీసెస్ అథారిటీ, హోంశాఖ, హైకోర్టు వెబ్సైట్లలో పొందుపరచాలి. జైళ్లలో వేగంగా వ్యాక్సినేషన్ ఖైదీలు, సిబ్బంది విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, వైద్య సాయం, రోజూ శానిటేషన్ తదితర వివరాలను ఉన్నత స్థాయి కమిటీకి జైళ్ల శాఖ వివరించింది. ఇప్పటి వరకు 643 మంది ఖైదీలు, సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు జైళ్ల శాఖ డీజీ వివరించారు. మిగిలిన 6 వేల మంది ఖైదీలు, సిబ్బందికి వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 27న మరోసారి సమావేశం కావాలని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. -
కరోనాను జయించిన సెంట్రల్ జైల్ ఖైదీలు
రాజమహేంద్రవరం క్రైం: ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల 300 మంది ఖైదీలు కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యం పొందారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు గత నెలలో కరోనా బారినపడ్డారు. ఈ జైలులో 1,700 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 300 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కరోనా బారిన పడిన ఖైదీలకు ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి మిగిలిన ఖైదీలతో కలవకుండా చర్యలు చేపట్టి వైద్య సేవలు అందించారు. ప్రత్యేక నిధులు మంజూరు * ఖైదీలు కరోనా బారినపడిన వెంటనే పూర్తిస్థాయి వైద్యంతో పాటు బలవర్ధక ఆహారం అందించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు. * ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పరీక్షలు నిర్వహించడంతో పాటు రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న ఖైదీలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రత్యేకంగా వైద్య సేవలందించారు. * కరోనా బాధితులందరికీ చికిత్స అనంతరం పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని జైలు అధికారులు, వైద్యులు ధ్రువీకరించారు. -
కరోనా : కోలుకున్న సెంట్రల్ జైలు ఖైదీలు
ఢిల్లీ : కరోనా వైరస్ నుంచి రోహిణి జైలులోని 10 మంది ఖైదీలు, ఒక ఉద్యోగి బయటపడ్డారని మంగళవారం అధికారులు పేర్కొన్నారు. మే 15న హెడ్ వార్డెన్కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఈయనకు జలుబు, దగ్గు లాంటి కరోనా లక్షణాలేవీ బయటపడలేదు. ఇది జైలులో కరోనా వ్యాప్తి అధికం కావడానికి మరొక కారణమని అధికారులు భావిస్తున్నారు. లక్షణాలు లేకపోవడంతో అందరితో మామూలుగానే ఉండటంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందింది. (శ్రామిక రైళ్లలో అన్న పానీయాలు కరవు ) మే15న నిర్వహించిన కరోనా పరీక్షల్లో వైరస్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమై జైలు అధికారులు మిగతా సిబ్బంది, ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 16 మంది ఖైదీలు, నలుగురు సిబ్బంది వైరస్ బారినపడినట్లు గుర్తించారు. దీంట్లో ఎక్కువగా జైలులోని కరోనా సోకిన ఖైదీతో బ్యారక్ పంచుకున్న వాళ్లే ఉన్నట్లు తేలింది. దీంతో వారందరినీ స్థానిక సోనిపేట్ ఆసుపత్రిలోని క్వారంటైన్ సెంటర్కు తరలించారు. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో పదిమంది ఖైదీలు, ఒక ఉద్యోగి కోలుకున్నారని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ వెల్లడించారు. వీరికి మంగళవారం కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. వైరస్ బారిన పడ్డ మిగతా ఖైదీలు కూడా తొందరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. (6 రోజుల్లో కరోనాను జయించిన హెచ్ఐవీ పేషెంట్ ) -
కరోనా మహమ్మారి సోకాలని..
లాస్ఏంజిల్స్ : జైలు నుంచి విడుదల అవ్వడానికి ఖైదీలు వేసిన కొత్త ఎత్తుగడ బెడిసికొట్టింది. ఏకంగా కరోనా మహమ్మారిని కావాలనే అంటించుకుని ఆ సాకుతో జైలు నుంచి విడుదల అవ్వాలని ప్లాన్ వేశారు. ఈ సంఘటన లాస్ ఏంజిల్స్ కౌంటీ జైలులో చోటుచేసుకుంది. ఒకరు తాగిన నీళ్లు మరొకరు తాగుతూ, ఒకరు ఛీదిన మాస్కును మిగతా ఖైదీలు ధరిస్తూ.. ఇలా ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపించేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడంతో కేవలం రెండు వారాల్లోనే దాదాపు 30 మంది ఖైదీలకు కరోనా వ్యాధి సోకింది. జైలులోని రెండు గదుల్లో ఉన్న ఖైదీలు కావాలనే కరోనా వ్యాపించేలా వ్యవహరించిన సీసీటీవీ వీడియో ఫుటేజీని ఉన్నతాధికారి అలెక్స్ విలాను మీడియా సమావేశంలో విడుదల చేశారు. కరోనా సోకినంత మాత్రాన విడుదల చేస్తామని ఖైదీలు తప్పుగా భావించారని ఆయన చెప్పారు. ప్రస్తుతం కరోనా సోకిన ఖైదీల పరిస్థితి బాగానే ఉందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా కరోనా వ్యాధి వ్యాపించేలా చేసిన ఖైదీలపై చట్టపరంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఖైదీలెవరూ తాము కావాలనే అలా చేయలేదని చెబుతున్నారని, వారి ప్రవర్తన చూస్తే తప్పు చేసినట్టు స్పష్టంగా తెలుస్తుందన్నారు. కాగా, అమెరికా వ్యాప్తంగా దాదాపు 25000 మంది ఖైదీలకు కరోనా సోకగా, 350 మంది ఖైదీలు మృతిచెందారు. -
సెంట్రల్ జైలులో కరోనా కలకలం..
లక్నో : ఆగ్రా సెంట్రల్ జైలులో 10 మంది ఖైదీలకు కరోనా సోకినట్టు ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ డీజీ అనంద్ కుమార్ వెల్లడించారు. దీంతో జైలు సిబ్బందితోపాటు, ఇతర ఖైదీల్లో కలవరం మొదలైంది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రా సెంట్రల్ జైలులో ఉన్న ఓ ఖైదీకి కొద్ది రోజుల కిందట కరోనా సోకినట్టుగా తేలింది. దీంతో జైలులో ఆ ఖైదీకి సన్నిహితంగా ఉన్న 14 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిని ఐసోలేషన్ సెంటర్లకు తరలించారు.(చదవండి : మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం: ఖైదీల విడుదల) ఈ నేపథ్యంలో జైలులోని సిబ్బందికి, ఇతర ఖైదీలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని జైలు అధికారులు.. వైద్య అధికారులను కోరారు. జైలులో మొత్తం 1,941 మంది ఖైదీలు, అధికారులతో కలిపి 121 మంది సిబ్బంది ఉన్నారు. కాగా, ఇటీవల ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో దాదాపు 185 మంది ఖైదీలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో జైళ్లలోని ఖైదీల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని సగం మంది ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. వారిని పెరోల్ లేదా తాత్కాలిక బెయిల్పై బయటకు పంపనున్నట్టు తెలిపింది. (చదవండి : మహిళా ఖైదీకి కరోనా పాజిటివ్) -
కరోనా: 17 వేల మంది ఖైదీల విడుదల
ముంబై: దేశంలోనే ఎక్కువ కేసులతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్కడ ఎంతకూ కరోనా అదుపులోకి రావడం లేదు. నానాటికీ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో మంగళవారం అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో నుంచి సగం మందిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న 35 వేల మంది ఖైదీల్లో 17 వేల మందిని బయటకు పంపిస్తున్నట్లు వెల్లడించింది. తాత్కాలిక బెయిల్ లేదా పెరోల్ మీద వీరిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. (ఖైదీలకు కరోనా.. హైకోర్టు ఆగ్రహం) అయితే యూఏపీఏ, ఎమ్సీఓఏ, పీఎమ్ఎల్ఏ వంటి తీవ్ర నేరాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపిచబోమని స్పష్టం చేసింది. కాగా ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఖైదీలు, జైలు అధికారులతో కలిపి 100 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాంబే హైకోర్టు తీవ్రంగా మండిపడింది. జైల్లో ఉన్న ఖైదీలకు ఆరోగ్యంగా జీవించడం ప్రాథమిక హక్కు అని, ఖైదీలకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జైల్లోని ఖైదీలను బయటకు పంపించివేస్తున్నట్లు తెలుస్తోంది. (ప్లాస్టిక్ కవర్లలో శవాలు.. పక్కనే పేషెంట్లు) -
వారి ద్వారానే ఖైదీలకు వైరస్..
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఆర్థర్ రోడ్ సెంట్రల్ జైలులో 77 మంది ఖైదీలు సహా అక్కడ విధులు నిర్వహిస్తున్న 26 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో జైలును పూర్తిగా లాక్డౌన్లో ఉంచామని అయినా మహమ్మారి విజృంభించడంపై ఆరా తీస్తున్నామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పేర్కొన్నారు. జైలుకు కూరగాయలు, పాలు సరఫరా చేసే వారి ద్వారా వైరస్ సంక్రమించిందని భావిస్తున్నామని అన్నారు. అర్థర్ రోడ్ జైల్ సహా 8 జైళ్లను పూర్తిగా లాక్డౌన్ చేశామని, అయితే కూరగాయుల, పాలు సరఫరా చేసే వారు కోవిడ్-19 వాహకులుగా మారవచ్చని వ్యాఖ్యానించారు. కరోనా పాజిటివ్గా తేలిన వారికి దక్షిణ ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముంబై నగరంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మహమ్మారి బారినపడటంతో వారిలో నైతిక స్థైర్యం నింపేందుకు ముంబై నగర పోలీస్ కమిషనర్ పరం వీర్ సింగ్ జేజే మార్గ్ పోలీస్ స్టేషన్ను సందర్శించి అక్కడి సిబ్బందిని ఉత్తేజపరిచారు. చదవండి : శవాలు తీసుకువెళ్లడం లేదు.. అందుకే ఇలా -
పారిపోయిన ఖైదీలు తిరిగొచ్చారెందుకో!
సాక్షి, న్యూఢిల్లీ : వివిధ రకాల నేరాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీలు సందు దొరికితే చాలు జైలు నుంచి పారిపోదామని చూస్తారు. మరికొందరు సందు దొరక్కపోయినా గోడలకు కన్నం వేసి మరీ పారిపోదామని వ్యూహాలు పన్నుతుంటారు. ఇండోనేసియాలోని పపువా ప్రాంతంలోని సొరాంగ్ నగరంలోని జైలులో సోమవారం మంటలు వ్యాపించడంతో జైలు నుంచి పారిపోయిన 500 మంది ఖైదీలు పారిపోయారు. వారిలో 270 మంది ఖైదీలు గురువారం తిరిగి జైలుకు చేరుకున్నారు. అలా తిరిగొచ్చిన వారిలో హత్య కేసుల్లో శిక్షలు పడ్డ వారు కూడా ఉన్నారని జైలు అధికార ప్రతినిధి ఎల్లి యోజర్ మీడియాకు తెలిపారు. వారంతా ప్రాణ రక్షణ కోసమే జైలు నుంచి పారిపోయారని, మిగతా శిక్షకాలాన్ని పూర్తి చేసుకునేందుకు తిరిగొచ్చారని ఆయన చెప్పారు. ఏదో అంశంపై ఆందోళన చేస్తున్న పపువా విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆగ్రహించిన మిగతా విద్యార్థులు, స్థానికులు సొరాంగ్ నగరం జైలుకు నిప్పుపెట్టారు. ఖైదీలతో కిక్కిరిసిపోవడం వల్ల జైలు పరిశుభ్రంగా ఏమీ ఉండదని, అయితే తాము ఖైదీలను బాగా చూసుకుంటామని అందుకనే వారంతా తిరిగొచ్చారని ఎల్లీ యోజర్ తెలిపారు. బయట ఆహారం దొరక్కా జైలుకొచ్చే ఖైదీలు ఇంకా ఎక్కడైనా ఉండవచ్చేమోగానీ తమ వద్ద మాత్రం అలాంటి ఖైదీలు లేరని చెప్పారు. శిక్షాకాలం పూర్తి కాకుండా పారిపోవడం వల్ల ప్రయోజనం ఉండదని, అపరాధభావం, భయం జీవితాంతం వెంటాడుతుందని, శిక్షాకాలం పూర్తయ్యాక దర్జాగా సాధారణ జీవితం గడపొచ్చని తాము ఎప్పుడూ చెబుతుంటామని ఆయన అన్నారు. తిరిగొచ్చిన ఖైదీలు కాలిపోయిన జైలు అధికారుల గదులను శుభ్రం చేయడమే కాకుండా మరమ్మతుల్లో కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారని, అధికారుల మంచితనానికి వారూ మంచితనమే చూపారని ఎల్లి యోజర్ వ్యాఖ్యానించారు. మిగతా ఖైదీలు కూడా తమ బంధు, మిత్రుల యోగ క్షేమాలు కనుగొని ఒకటి, రెండు రోజుల్లో తిరిగొస్తారని తాము ఆశిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వం దృష్టికి చిత్రపురి సమస్యలు
‘‘చిత్రపురి కాలనీలో 24 క్రాఫ్ట్స్లో పనిచేస్తున్న సినీ కార్మికులకు కాకుండా సినిమాయేతరులకు ఇళ్లు కేటాయించారు. సుమారు 5 వేలకుపైగా నిజమైన సినీకార్మికులకు ఇళ్లు కేటాయించాల్సి ఉంది. దీనికోసం ‘చిత్రపురి పోరాట సమితి’ చేస్తున్న దీక్షల్లో న్యాయం ఉంది’’ అని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. చిత్రపురి కాలనీలో ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యుల అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ‘చిత్రపురి పోరాట సమితి’ ఆధ్వర్యంలో చేస్తున్న నిరాహార దీక్షకు ప్రతాని రామకృష్ణ గౌడ్ బుధవారం మద్దతు పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘26 రోజులుగా దీక్షలు చేపడుతున్నా హౌస్ంగ్ సొసైటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సినీ కార్మికులకు ఇచ్చిన స్థలాన్ని ‘కైరోస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్’కి కేటాయించడం చట్ట విరుద్ధం, వెంటనే ఆ స్కూల్ను తొలగించాలి. ఈ సొసైటీలో జరిగిన అవకతవకలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం కేటాంచబోయే 9 ఎకరాలను ‘చిత్రపురి పోరాట సమితి’కి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతాం’’ అన్నారు. కాగా ధర్నాలో పాల్గొంటున్నారనే కారణంతో షూటింగ్లకు పిలవని కొందరు సినీ కార్మికులకు ప్రతాని రామకృష్ణ గౌడ్ బియ్యం వితరణ చేశారు. ‘‘న్యాయం కోసం పోరాటం చేసే వారిని బెదిరిస్తున్నారని, ఎవరు బెదిరించినా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం’’ అని ‘చిత్రపురి పోరాట సమితి సభ్యుడు’, డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ అన్నారు. బి నరసింహా రెడ్డి, మహేందర్, ఓ. రవిశంకర్, మురళితో పాటు పలువురు సినీకార్మికులు పాల్గొన్నారు. -
నిమ్స్ నుంచి లక్ష్మణ్ డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ కోసమే నిరాహార దీక్ష చేశానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం నిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి అధికార మత్తులో ఉంది. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. అన్యాయాలపై నిలదీసిన నేతలను అరెస్టు చేస్తోంది. శాంతియుత పద్ధతిలో నిరాహార దీక్ష చేస్తున్న వారిని నిర్బంధించడం ఏ మేరకు సమంజసమో ప్రభుత్వం చెప్పాలి’ అని నిలదీశారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జాతీయస్థాయిలో ఉద్యమించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై త్వరలో ఆందోళనలు నిర్వహిస్తామని, బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలుస్తామని తెలిపారు. ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. అదే ఉద్యమాలను అణచివేస్తుందని ఆరోపించారు. పిల్లల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోకుండా, వారి చర్యలను వెనుకేసుకొస్తుండటం సిగ్గుచేటని లక్ష్మణ్ విమర్శించారు. ఆయన వెంట మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రాంచందర్రావు తదితర నేతలు ఉన్నారు. -
‘సింగూరు కోసం 18 నుంచి రిలే దీక్ష’
సాక్షి, హైదరాబాద్: సింగూరు జలాల కోసం ఈ నెల 18 నుంచి తాను, తన భార్య రిలే నిరాహార దీక్ష చేపడతామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. దీక్షను అడ్డుకుంటే తలెత్తే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జీవో లేకుం డా సింగూరు జలాలను తరలించడం అక్రమం కాదా అని ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించాలని కోరారు. సింగూరు జలాల తరలింపు వల్ల సంగారెడ్డికి తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందన్నారు. -
జ్ఞానమే ముక్తి మార్గం
ధర్మపరిరక్షణలో భాగంగా విశాఖ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు పంచారామ పాదయాత్ర చేశారు. ఆగమ పరిరక్షణ కోసం తిరుమల శ్రీవారి ఆస్థానమండపంలో వైఖానస ఆగమ సదస్సు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకు గోవులను పంపిణీ చేసి, వారిని ధర్మమార్గం వైపు నడిపిస్తున్నారు. విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలలో వేదపాఠశాలలను నిర్వహిస్తూ వేద పరిరక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షకోసం హృషీకేశ్లో ఉన్న స్వామి వారు 27న దీక్ష ప్రారంభిస్తారు. ఈ పర్వదినాన గురుపూజతోపాటు అనేక కార్యక్రమాలుంటాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’ కి ప్రశ్నోత్తరాల రూపంలో అందించిన ప్రత్యేక అనుగ్రహ భాషణమిది. చాతుర్మాస్య వ్రతం చేయవలసిన సమయం ఏది? ఆ సమయాన ఏమి చేయాలి? స్వామీజీ: ఆషాఢ పున్నమినాడు∙మొదలుపెట్టి కార్తీక పున్నమికి ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. శ్రీ మహావిష్ణువు నిదురించు కాలమైన ఈ నాలుగు మాసాల కాలంలో ఈ వ్రతాన్ని శైవ, వైష్ణవభేదం లేక గృహస్థులందరూ ఆహారాది నియమాలను పాటిస్తూ ఆచరించాలి. లోకానికి ఆదర్శంగా నిలచే యతీంద్రులు ఈ చాతుర్మాస్యాన్ని ఆచరిస్తారు. మానవ జన్మ లక్ష్యం ఏమిటి? విశ్వమంతటికి కారణమైన ఒకే ఒక తత్త్వం ఉన్నది. అదే బ్రహ్మం. దానికే సత్యం, అక్షరం, పురుషుడు తదితర పేర్లు. ఆ బ్రహ్మతత్వమే మనందరి నిజ స్వరూపం. సకల జీవులు ఈ బ్రహ్మ స్వరూపమే అయి ఉన్నారు. దీనికి సరియైన రీతిలో అనుభవంతో తెలిసికొనిన వారికి సంసార భయం లేదు. దీనికే మోక్షం అని పేరు. ఇదే మానవ జన్మ లక్ష్యం. పిల్లలకు మంచి అలవాట్లు ఎలా వస్తాయి? భారతీయ సంస్కృతి, నాగరికతను, జీవన విధానాన్ని పిల్లలకు తల్లిదండ్రులు అలవాటు చేయాలి. అలా చేయాలంటే ముందు వారికి అలవాటు ఉండాలి. తరువాత తమ సంతానానికి అలవాటు చేయగలుగుతారు. అలా ప్రవర్తిస్తుంటే మనం మన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాము. దీక్ష అంటే ఏమిటి? గురువునుండి శిష్యుడు పొందే అనుగ్రçహాన్ని లేక ఉపాసనను దీక్ష అంటారు. ఇది లౌకిక వ్యవహారానికి సంబంధించినది కాదు. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పాపాన్ని నిర్మూలించేది దీక్ష. శిష్యుడు సరైన మార్గం అనుసరించడానికి ఇచ్చే దీక్ష సమయదీక్ష. యోగమార్గం, మోక్షమార్గాలకు సంబంధించినది నిర్వాణ దీక్ష. వివాహితకి పతే ప్రత్యక్షదైవమంటారు. మరి దైవం ప్రధానం కాదా? స్త్రీ దైవాన్ని విడనాడాలని శాస్త్రం చెప్పలేదు. అలాగని దైవారాధనలు చేస్తూ భర్తను విస్మరించమనలేదు. అటు దైవారాధన చేస్తూనే, ఇటు భర్త చెప్పినట్లు వింటూ కుటుంబ జీవితం గడపాలి. అప్పుడు ఆ స్త్రీ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. ఈనాటి వేగవంతమైన జీవితంలో మంత్రానుష్ఠానాన్ని సావకాశంగా చేయడానికి కాలం సరిపోవడంలేదు. దీనిని సంక్షిప్తంగా చేసే మార్గం..? కాలం సరిపోవడం లేదన్నది సరియైన అంశం కాదు. కాలం నీ అధీనంలో ఉంది. నీవు కాలం అధీనంలో లేవు. మనకు శ్రద్ధ తగ్గడం చేత కాలం చాలడం లేదనే సాకు చెపుతున్నాము. నిత్యపూజను, ధ్యానాన్ని క్లుప్త పరచే వీలు లేదు. కర్మలకు ఫలితం ఉంటుందా? ‘న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకత్’ శరీరం ప్రతిక్షణం ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. మనిషి పని చేయకుండా ఒక్క క్షణమైనా ఉండజాలడు. అలాగే భూమి తిరగటం మనం చూస్తున్నామా? లేదు. అలా తిరగటం ఒక క్రియ. భూమి తన చుట్టు తాను తిరగటం వలన రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. తిరగటం అనే కర్మఫలితమే రేయింబవళ్ళు. ఇలాగే భూమి సూర్యుని చుట్టు తిరగటం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. ఈ కర్మ అంతా మనకు కన్పించదు. ఇది అవ్యక్త కర్మ. దీని ఫలితమే రాత్రింబవళ్ళు. ఋతువులు కనిపిస్తున్నాయి. ప్రత్యక్షదైవాలు ఎవరు? తల్లిని మించిన దైవం లేద’ని, ‘న మాతుః పరదైవతం’ అన్నారు. ‘మాతృదేవో భవ, పితృదేవోభవ’ అని తైత్తిరీయం. తల్లిదండ్రులను దైవంగా భావించాలని శ్రుతి ఆదేశించింది. తల్లి చల్లని చూపులు లేకపోతే లోకమే లేదు కదా? కరుణామూర్తియైన భగవంతుడే మాతృమూర్తి రూపంలో అందరిని రక్షిస్తున్నాడు. తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వరులని భావించి సేవిస్తే అంతకంటె గొప్ప ఉపాసనయే లేదు. ఇది సకల మానవులకు స్వధర్మం. దేవుడు ఉన్నాడా? మనకు కనిపించనంత మాత్రాన దేముడు లేడని చెప్పడం సరికాదు. దేముని యీ చర్మచక్షువులతో చూడడం సాధ్యంకాదు. జ్ఞానదృష్టితో అనుభవం ఆధారంగా చూడగలం. వాయువునకు రూపంలేదు. అంతమాత్రాన వాయువు లేదని చెప్పగలమా? వెన్నెల, నక్షత్ర కాంతి, గ్రహసంచారం ఆ పరమాత్ముని అనుగ్రహం వల్లనే కలుగుతున్నాయి. భగవంతుడు సర్వవ్యాపి. ఆయనకు నామరూపాలు లేవు. అది వర్ణనకు అందని చైతన్యం. మనయందే చైతన్యంగా ఉన్నాడు. దైవసాక్షాత్కారం ఎలా కలుగుతుంది? దైవసాక్షాత్కారమన్నది మామూలు విషయం కాదు. మన అజ్ఞానం వల్ల యీ దేహేంద్రియ సంఘాతమే నేను అనుకుంటున్నాము. దృఢచిత్తంతో సద్గురువుని సమీపించి శాస్త్రాధ్యయనం చేసి యీ దేహమే నేను అనే మన అపోహను తొలగించుకోవాలి. అప్పుడు మనకు గల అత్యాశ తొలుగుతుంది. జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమార్గంలో పయనిస్తూ ముందుకు సాగితే భగవదనుభూతి కలుగుతుంది. దైవీ సంపదతో కూడిన దేవతామూర్తులు గొప్పవా? గ్రహాలు గొప్పవా? హెచ్చుతగ్గులు అన్నవి లోక వ్యవహార దృష్టిలో సహజం. గ్రçహాలకు ఉన్న శక్తి గ్రహాలకు ఉంటుంది. అందువలన గ్రహశాంతి అవసరం. గ్రహశాంతులు నిత్యం చేసేవి కావు. ఆయా గ్రహాలకు సంబంధించి అవసరమైన కాలంలో గ్రహశాంతులు చేస్తారు. అనునిత్యం దైవారాధన చేయవచ్చు. దైవశక్తి ముందు ఏ గ్రహశక్తియైనా తలవంచవలసిందే. గ్రామదేవతల ప్రాధాన్యం ఏమిటి? పరాశక్తి రూపాలు అనేకం. ఈ రూపాలే గ్రామ దేవతలుగా కొలువబడుతూ గ్రామ ప్రజలను మారీ, విషూచ్యాది రోగాల నుండి, భూతప్రేతాల నుండి కాపాడుతుంటాయి. గ్రామదేవత మందిరం కొన్ని గ్రామాలలో ఊరిచివర ఉంటుంది. ఈ గ్రామ దేవతలకు బహుకొద్ది ప్రాంతాలలో నిత్యపూజలు జరుగుతాయి. మిగిలిన చోట్ల విశేష పర్వదినాలలో ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలు, ఊరేగింపులు జరుపుతారు. సాధారణంగా గ్రామదేవత పూజ అవైదికంగా ఉంటుంది. గ్రామదేవతలను అందరూ పూజించి నైవేద్యం సమర్పిస్తారు. దానధర్మాలవల్ల ఫలితం ఉంటుందా? ‘‘యజ్ఞం, దానం, తపశ్చైవ, పావనాని మనీషిణావ్ు’’ అని భగవంతుడే చెప్పి ఉన్నాడు. దానం చేత మన దారిద్య్రం తొలగుతుంది. దానం మూడు విధాలు. మనస్సు, వాక్కు, కాయము, మనస్సు ద్వారా, ఇతరులకు శుభం జరగాలనే సంకల్పంతో కాలాన్ని వినియోగించడం. దానం చేస్తూ తనదైన ఆ వస్తువును యిచ్చివేస్తున్నాననే శంక భావంలో కూడా ఉండరాదు. ఆవిధంగా సత్యహరిశ్చంద్రుడు చేసినట్లు పురాణాలలో తెలుసుకుంటాము. కర్ణుడు, శిబి, మొదలయినవారు. వారంతా తమ దానధర్మాలవల్ల ప్రసిద్ధులయి పుణ్యలోకాలకు వెళ్ళారు. అర్చనలో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఎందుకు ? భగవంతుడు సర్వవ్యాపి. యావత్తు సృష్టిని ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయనను మించి వ్యాపకం గల వస్తువు వేరొకటి లేదు. పంచభూతాలు అంటే పృథ్వి, ఆప, తేజో, వాయు, ఆకాశాల ఆధారంగా యీ సృష్ఠి కృతజ్ఞతాభావంతో మనం పూజావిధానం ద్వారా ఆయనకు అర్పిస్తున్నాము. కలలు ఎందుకు వస్తాయి? స్వప్నంలో వచ్చే విషయాలు భవిష్యత్తును సూచిస్తాయా? జాగ్రదవస్థలో జరిగిన కొన్ని అంశాలు స్వప్నంలో రావడం సహజం. అనేక జన్మల సంస్కారం వల్ల చిత్రవిచిత్రంగా తోచే కలలు వస్తూ ఉంటాయి. స్వప్నంలో వచ్చినవన్నీ వాస్తం కావాలనే నియమమేది ఎక్కడా చెప్పలేదు. మెలకువలోకి వచ్చినపుడు మాత్రమే మనం స్వప్నం గురించి చెప్పుకుంటూ అది మంచిని సూచిస్తున్నది, లేక చెడును సూచిస్తున్నది అని చెప్పుకుంటాము. ఇది అంతా మన భ్రాంతి. జపస్థానాన్ని బట్టి ఫలితం మారుతుందా? మారుతుంది. ఇంటిలో జపం చేసిన ఒక ఫలితమైతే, గోశాలలో దానికి పదింతలు, వనంలో నూరురెట్లు, చెరువునందు వేయింతలు, నదీతీరాన లక్షరెట్లు, పర్వతాగ్రాన కోటిరెట్లు, శివాలయంలో నూరుకోట్ల అధిక ఫలం కలుగుతుంది. గురుసాన్నిధ్యాన చేస్తే అనంత ఫలం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. సత్యం అంటే ఏమిటి? సత్యానికి పదమూడు రూపాలున్నాయి. వాటిని మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజునకు ఉపదేశించాడు. ఏవిధంగా నంటే సత్యం, శమం, దమం, అమాత్సర్య, క్షమ, లజ్జ, తితిక్ష, అసూయ, త్యాగం, ధ్యానం, ఆర్యత, ధృతి, అహింస ఈ పదమూడున్నూ సత్యానికి ఆకారాలు. అన్ని ధర్మాలూ సత్యంలోనే వెలిసినాయి. సత్యం అన్ని ధర్మాలకు ప్రాణం. సత్యం లేని అహింస అహింస కాదు. సత్యం లేని ఆచారం దురాచారమే. సత్యం లేని శమాదులు వ్యర్థమే. సత్యం లేని బ్రహ్మచర్యం, తపస్సు, శౌచం అంతా కపట నాటకమే. రావణుడు కూడా తపస్సు చేశాడు. కాని ఆ తపస్సులో సత్యం లేదు. దుర్యోధనుడు సదా అన్నదాననిరతుడు. కాని ఆ దానధర్మానికి సత్యం అనే ఆధారశిల లేనందున నశించిపోయాడు. సత్యం అనే ధర్మం ఒక్కటుంటే చాలు ‘శతే పఞ్చాశత్’ వందలో యాభై అణగి ఉన్నట్లు సత్యంలో అన్ని ధర్మాలు నెలకొన్నాయి. ‘సర్వం పదం హస్తిపదే నిమగ్నం’ అన్నట్లు ఏనుగు అడుగు జాడలో అన్ని ప్రాణులు ఇమిడి ఉన్నట్లు సత్యధర్మం సకల ధర్మాలను తనలో ఇముడ్చుకుంది. అద్వైత సిద్ధాంతం విగ్రహారాధనను అంగీకరిస్తుందా? అద్వైత సిద్ధాంతం విగ్రహారాధనకు వ్యతిరేకం కాదు. మంత్ర, శిల్ప శాస్త్రాలలో, పురాణాలలో విగ్రహారాధనను గూర్చి వివిరంగా చెప్పారు. స్వర్గలోకప్రాప్తి లేదా చిత్తశుద్ధి ద్వారా క్రమ ముక్తిని గూర్చి తెలిపారు. మందమధ్యమాధికారులకు విగ్రహారాధన అవసరం. తెలిసిన వారు కూడా లోకసంగ్రహం కోసం విగ్రహారాధన చేస్తారు. -
82మంది మహిళా ఖైదీలకు ఆస్వస్థత
ముంబై : 82మంది మహిళా ఖైదీలు అస్వస్థకు గురైన సంఘటన శుక్రవారం ముంబై నగరంలో చోటుచేసుకుంది. ముంబైలోని బైకుళ్లా కారాగారంలో మహిళా ఖైదీలు శుక్రవారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురైయ్యారు. వారిని జైలు సిబ్బంది ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జైలు అధికారులు చెబుతున్నారు. అపరిశుభ్రమైన నీటి కారణంగానే వారు అనారోగ్యానికి గురై ఉంటారని భావిస్తున్నారు. జైలు ఉన్నతాధికారి రాజ్వర్థన్ సిన్హా మాట్లాడుతూ.. మూడురోజుల క్రితం ఓ మగఖైదీకి కలరా రాగా వెంటనే మందులు ఇచ్చామని తెలిపారు. కలరాను నివారించటానికి జైలులోని అందరికి ఆరోగ్యశాఖ వారు మందులు అందజేశారన్నారు. మహిళా ఖైదీలు అస్వస్థతకు గురైన వెంటనే జైలులోని మిగితా అందరికి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు. -
కదం తొక్కిన నిరుద్యోగులు
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : పంచాయతీ సెక్రటరీ పోస్టుల కోసం విడుదల చేసిన జీవో 39 రద్దు చేయాలని, గ్రూపు – 2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు – 1తో కలిపి డిస్క్రిప్టు విధానంలో పరీక్ష నిర్వహించేందుకు విడుదల చేసిన జీవో 622, 623ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ నిరుద్యోగులు మంగళవారం విశాఖ నగర రోడ్లపై కదం తొక్కారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... సీఎం డౌన్ డౌనంటూ నినదించారు. వందలాది మంది నిరుద్యోగులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్కుమార్ డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన జరిగన తర్వాత విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాల విభజన కూడా జరిగిందన్నారు. ఖాళీలున్న ఉద్యోగాల సర్వేకు కమల్నాథన్ కమిటీని నియమించారన్నారు. ఆ కమిటీ చేసిన సర్వేలో రాష్ట్రంలో సుమారు 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సూచించారని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం 20వేలు ఖాళీలే ఉన్నాయని ప్రకటించి 2016 – 17 ఏడాదిలో 4వేల పోస్టులకు మాత్రమే ప్రకటన జారీ చేసిందని, అన్ని శాఖలు కలుపుకుని ఇప్పటికి 10వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. 42 నోటిఫికేషన్లతో ఇయర్ క్యాలెండర్ని కూడా ప్రకటించి ఇప్పటికి ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదని మండిపడ్డారు. కాంట్రాక్టు పద్ధతితో ఉద్యోగ భద్రతకు ప్రమాదం పంచాయతీ కార్యదర్శులుగా ఏడాది కాలపరిమితితో కాంట్రాక్టు పద్ధతిలో 1511మందిని నియమించడానికి జీవో 39ని ప్రభుత్వం జారీ చేసిందని, ఈ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.15వేలు చెల్లిస్తారని ప్రకటించారని పేర్కొన్నారు. అసలు ఈ ఉద్యోగాలకు కాంట్రాక్టు విధానాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ఉద్యోగ భద్రత కొరవడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వ ఉద్యోగాలుగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్ను నియమించిన తర్వాతే జీవో 39 విడుదల చేశారని గుర్తు చేశారు. అలాగే గ్రూప్ – 2 ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు – 1తో కలిపి డిస్క్రిప్టు విధానంగా పరీక్షను నిర్వహిస్తామని జీవో 622, 623 విడుదల చేసిందన్నారు. ఇప్పటి వరకు అబ్జెక్ట్ విధానాన్ని అనుసరిస్తూ పరీక్షకు సిద్ధమవుతుంటే కొత్తగా డిస్క్రిప్టుగా పెడతామని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. జీవో 39, జీవో 622, 623 వల్ల లాభం కంటే యువతకు జరిగే నష్టమే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ జీవోలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రూప్–1 సిలబస్ను మార్చి సివిల్ సర్వీస్ సిలబస్ పెడతానన్న ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని, తెలంగాణ తరహాలో వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని, కానిస్టేబుల్ ఉద్యోగ వయో పరిమితి రెండేళ్లు పెంచాలని, తెలంగాణ రిజర్వేషన్లతో సమానంగా ఏపీలో కూడా నాన్లోకల్ రిజర్వేషన్ చేయాలని, వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి/నిరుద్యోగ లోకం ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. నిరసనకు సెంచూరియన్ విశ్వ విద్యాలయం వీసీ ఆచార్య జీఎస్ఎన్ రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, డీవైఎఫ్ఐ, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, ఉత్తరాం«ధ్ర విద్యార్థి సేన సంఘీభావం తెలిపారు. నిరసన కార్యక్రమంలో విజయనగరం జిల్లా జేఏసీ కో ఆర్డినేటర్, రాష్ట్ర కో ఆర్డినేటర్ షేక్ మహబూబ్ బాషా, విశాఖ జిల్లా కో ఆర్డినేటర్ జగన్ విద్యార్థులు పాల్గొన్నారు. -
‘వంచన వ్యతిరేక దీక్ష’కు తరలిరండి
రాజాం : వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సోమవారం చేపడుతున్న వంచన వ్యతిరేఖ దీక్షను విజయవంతం చేయాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. ఈ దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, పార్టీ అభిమానులు, నాయకులు తరలిరావాలని కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ టీడీపీ నాలుగళ్లుగా ప్రత్యేకహోదాకు వ్యతిరేకంగా పని చేసిందని అన్నారు. కేంద్రానికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన సీఎం చంద్రబాబుపై ప్రజలంతా వ్యతిరేక జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ విధివిధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానని మోసగించిన ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంచన వ్యతిరేఖ దీక్ష జరుగుతుందని, ప్రజలంతా తరలిరావాలని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నారని స్పష్టంచేశారు. తొలి నుంచి ప్రత్యేకహోదా కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. వీటన్నింటినీ ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నించిందన్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ దీక్షలు
కోడుమూరు రూరల్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్ష కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్ విమర్శించారు. శుక్రవారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్, ఎమ్మార్పీఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ప్రత్యేక హోదా అంటే జైలుకేనంటూ దీక్షలు చేసిన వారందరిపై కేసులు పెట్టి వేధించిన టీడీపీ ప్రభుత్వం నేడు హోదా ఇవ్వాలంటూ దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న దొంగ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏఐఎస్ఎఫ్, ఎమ్మార్పీఎస్ నాయకులు నాగేష్, మహేష్నాయుడు, మధు, సురేంద్ర, లక్ష్మన్న, రవి, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు దీక్ష చేస్తున్నారా?
రాయచోటి : కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టే దీక్ష మోసపూరితమైందని ఎమ్మెల్యే జి.శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గతంలో ఏడేళ్లు, ఇప్పుడు నాలుగేళ్ల పాటు బీజేపీతో పొత్తుపెట్టుకుని రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారన్నారు. ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చనందకు నిరాహార దీక్ష చేస్తున్నారా?, లేకపోతే నిరుద్యోగలందరికి ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు దీక్ష చేస్తున్నారా? డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పూర్తిగా రుణాలను మాఫీ చేయనందుకు దీక్ష చేపడుతున్నారా? రైతన్నలను మోసగించినందుకు నిరాహారదీక్ష చేస్తున్నారా? అన్న ప్రశ్నలన్నింటికీ ముందుగా సమాధానాలు చెప్పి నిరాహార దీక్షకు పూనుకోవాలన్నారు. ఒక్క రోజు ఐదు గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష చేయడానికి 50 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడంతోనే వీళ్ల చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమవుతోందని చెప్పారు. పార్లమెంటులో అవిశ్వాసం పెడితే ఏమొస్తుంది, రాజీనామాలు చేస్తే ఏం లాభం అన్న ఆయన ఒక్క రోజు దీక్షకు ఎందుకు పూనుకొన్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నేతనని చెప్పుకునే ఆయన ఆ రోజు ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు విషయంలో నేను మోదీకి సలహా ఇచ్చానని గొప్పగా చెప్పుకున్నారన్నారు. ఆ నోట్ల రద్దు వలన ప్రజలు, వ్యాపారస్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కబడటం లేదా అని ప్రశ్నించారు. -
దీక్షను అపహాస్యం చేస్తున్న సీఎం
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 20న దీక్ష చేయాలనుకోవడం విచిత్రంగా ఉందని, దీక్షను సీఎం అపహాస్యం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు తుమ్మలకుంట శివశంకర్ విమర్శించారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగి రాష్ట్ర ప్రజల గౌరవాన్ని పెంచారన్నా రు. వారికి మద్దతుగా రాష్ట్ర ప్రజలంతా రిలే నిరాహార దీక్షలు చేశారన్నారు. సీఎం చంద్రబాబు తన పుట్టిన రోజు ఏప్రిల్ 20వ తేది ఉపవాస దీక్ష చేస్తాననని చెబుతుండటం హాస్యాస్పదమన్నారు. ఎవరి కోసం, ఏం సాధించాలని సీఎం ఈ దీక్ష చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ముఖ్య మంత్రికి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉంటే దొంగ దీక్షలు మాని ఆమరణ దీక్ష చేపట్టాలని, అప్పుడే ఆయన్ను ప్రజలు నమ్ముతారని తెలిపారు. సీనియర్ నాయకులు అన్నయ్యగారి హరినాథ్, 20వ డివిజన్ ఇన్చార్జి శ్యాంసన్, అలీ పాల్గొన్నారు. -
ఆ జైలులో ఖైదీలకు హెచ్ఐవీ..!
గోరఖ్పూర్: యూపీలోని గోరఖ్పూర్ జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా 23 మందికి హెచ్ఐవీ ఉన్నట్టు బయట పడింది. గత కొన్ని నెలలుగా వైద్యులు జిల్లా జైలులోని ఖైదీలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 23 మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. వైద్య పరీక్షలను యూపీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది పర్యవేక్షణలోనే నిర్వహించామని జైలు అధికారలు తెలిపారు. హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలిన 23 మంది ఖైదీల్లో ఓ మహిళ కూడా ఉందన్నారు. వారంతా ప్రస్తుతం బీఆర్డీ వైద్య కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. హెచ్ఐవీ సోకిన వారంతా విచారణ ఖైదీలని.. అసలు హెచ్ఐవీ సోకడానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. దీంతో పాటు జిల్లా జైలులో ఎక్కువ మంది ఖైదీలకు హై బీపీ, మధుమేహం సమస్యలున్నాయని వెల్లడైనట్టు తెలిపారు. ఎయిడ్స్ బాధిత ఖైదీలకు కౌన్సెలింగ్ చేస్తున్నామని వివరించారు. మరోవైపు యూపీలోని అన్ని జైళ్లలో ఇలాంటి ఖైదీలను గుర్తించి, సంబంధిత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జైళ్ల శాఖ ఐజీ ప్రమోద్ కుమార్ మిశ్రా తెలిపారు. ఇటీవలే ఉన్నావో జిల్లా, బంగార్మావు తాలూకా పరిధిలోని మూడు గ్రామాల్లో 58 మందికి హెచ్ఐవీ సోకినట్టు వైద్యులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. -
ప్రేమ పేరిట వంచించాడు..
నస్పూర్(మంచిర్యాల): తనను ప్రేమించి, కొతకాలంగా సహజీవనం గడిపిన ప్రియుడు మోసం చేశాడని ఆరోపిస్తూ బెల్లంపల్లికి చెందిన గంపల సుజాత అనే యువతి గురువారం నస్పూర్లోని మోతునూరి నరేష్ ఇంటి ఎదుట బైఠాయించింది. సుజాత, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని ఒక స్కానింగ్ సెంటర్లో ఆరు సంవత్సరాలుగా ఇరువురు పనిచేశారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రస్తుతం నరేష్ వేరొక ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. సుజాత ప్రతిరోజు బెల్లంపల్లి నుంచి రాకపోకలు సాగించడంతో నరేష్ ఆమెను మంచిర్యాలలో ఒక అద్దె ఇంటిలో ఉంచి సంవత్సర కాలంగా సహజీవనం కొనసాగిస్తున్నారు. సుజాత చిట్టీ వేస్తూ పొదుపు చేసుకున్న రూ.1.80 లక్షలు తన ఖర్చులకోసం వాడుకున్నాడు. ఇటీవల నరేష్ తల్లిదండ్రులు అతనికి వేరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో సుజాత తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని నిలదీసింది. దీనికి అతడు నిరాకరించాడు. దీంతో నరేష్పై మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నరేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. సీసీసీ ఎస్సై రాజేంద్రప్రసాద్ సుజాతతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష కొనసాగిస్తానని సుజాత పేర్కొంది. -
రైతు ఆత్మహత్యలపై జస్టిస్ చంద్రకుమార్ దీక్ష
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలను ఆపడానికి ప్రభు త్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్, హైకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ డిమాండ్ చేశారు. గురు వారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్ర కుమార్ ‘రైతు రక్షణ దీక్ష’ను చేపట్టారు. ఈ దీక్షకు పలు రైతు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలి పారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లా డుతూ అందరికీ ఆహారాన్ని అందించే తల్లిలాంటి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ రంగం మూతపడ్డా నష్టం జరగదని, కానీ వ్యవసాయ రంగం మూత పడితే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని అన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా రైతులను మోసం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వడ్డీ అంటే అది ముగిసిన ముచ్చట అని సీఎం అంటున్నారని, మరి రైతాంగాన్ని కాపాడటానికి ఏమి భరోసా ఇస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీతాలు పెంచారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల జీతాలను విపరీతంగా పెంచారు.. మరి రైతుల పంటకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ మార్కెట్లో కూడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను చెల్లించడం లేదన్నారు. కార్యక్రమంలో ఏఐకే ఎంఎస్ నాయకుడు కెచ్చల రంగయ్య, రైతు సంఘం కార్యదర్శి టి.సాగర్, అఖిల భారత రైతు కూలీ సంఘం నేత అచ్యుత రామారావు, రైతు స్వరాజ్య వేదిక నాయ కులు కొండల్, ఏఐకేఎఫ్ నాయకులు ప్రభులింగం, మన్నారం నాగరాజు, మాజీ ఎంపీ సోలిపేట రాంచంద్రా రెడ్డి, ప్రొఫెసర్లు అరిబండి ప్రసాద రావు, లక్ష్మణ్, పీఎల్ విశ్వేశ్వర్ రావు, చంద్రన్న తదితరులు పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. కాగా, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య రాత్రి 7 గంటలకు జస్టిస్ చంద్రకుమార్ తదితరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. -
ఆ జైలంటే ఖైదీలకు ఎంతిష్టమో...
సాక్షి, న్యూఢిల్లీ: భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ... జైలు లైఫే సో బెటరు.. అని పాడుకుంటున్నారు అక్కడి ఖైదీలు. సహజంగా జైలు నుంచి ఎప్పుడు బయటపడి తమ వారిని చూసుకోవాలా అని పరితపిస్తారు ఖైదీలు...కానీ ఆ జైలు మాత్రం వారిని ఏ మాత్రం అభద్రతకు లోనుచేయడం లేదు. బయట సమాజం కంటే ఖైదీలు జైలు జీవితాన్నే ఎంజాయ్ చేస్తున్నారు.దేశంలోనే అతిపెద్ద జైలుగా పేరొందిన తీహార్ జైలు ఖైదీలకు మెరుగైన ఆవాస కేంద్రంగా మారింది. తీహార్ జైలులో 15,000 మందికి పైగా ఉంటే వీరిలో 80 శాతం వరకూ విచారణ ఖైదీలు కాగా, వీరిలో 25 శాతం మంది తరచూ నేరాలు చేస్తూ జైలు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. బయటి సమాజంలో ఖర్చులను తట్టుకోలేక వీరు జైలు జీవితానికే మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. వీరంతా 35 సంవత్సరాల వయసు పైబడి తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన వారే. జైలు జీవితమే వీరికి సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ ఒక్కో ఖైదీది ఒక్కో అనుభవం. రెహమాన్ (పేరు మార్చాం..) అనే ఖైదీ తన 21 ఏళ్ల వయసులో కేవలం తనతో వాదించిన కారణంగా ఓ వ్యక్తిని ఆవేశంతో హతమర్చాడు. దీంతో శిక్షకు గురై తీహార్ జైలుకు వచ్చి ఐదేళ్లు గడిపాడు. అనంతరం బెయిల్పై విడుదలై వివాహం చేసుకుని ఓ కుమార్తెకు జన్మనిచ్చాడు.18 నెలలు జైలు వెలుపల గడిపిన రెహమాన్ జైలు జీవితం మిస్సవడంతో కలత చెందాడు. ఎలాగైనా మళ్లీ తీహార్ జైలుకు రావాలని గొలుసు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డాడు. అయినా పోలీసులకు పట్టుబడక పోవడంతో ఢిల్లీ వర్సిటీ విద్యార్థినిపై వేధింపులకు దిగి తిన్నగా తీహార్ జైలుకే వచ్చాడు. నేరగాళ్ల జాబితాలో అతని పేరు పునరావృతం కావడంతో మళ్లీ నేరానికి ఎందుకు పాల్పడ్డాడో వివరించడంతో జైలు అధికారులు కంగుతిన్నారు. 18 నెలలు జైల్లో ఉన్న తర్వాత అతడిని భార్య విడిపించుకుని వెళ్లింది. మళ్లీ కొన్నాళ్లకే ఏదో నేరం చేసి తీహార్ జైలుకు వచ్చేశాడు. ఈసారి కొద్దిగా ఒళ్లు చేసిన రెహమాన్ జైలు పరిసరాలు పూర్తిగా అలవాటు కావడంతో తోటి ఖైదీల పట్ల దాదాగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ వెళ్లడంపైనే దృష్టిసారించేవాడు. రెహమాన్ కూతరు పెద్దగైంది. ఒళ్లు వంచడం ఇష్టం లేక, డబ్బుల్లేక భార్యను పుట్టింటికి వెళ్లాలని బలవంతపెట్టేవాడు. ఈ క్రమంలో గత ఏడాది ఢిల్లీలో ఓ దోపిడీకి పాల్పడే క్రమంలో రెహమాన్ ఓ వ్యక్తిని హత్య చేశాడు. దీంతో మళ్లీ తీహార్ జైలు బాట పట్డాడు. పదేపదే నేరాలు ఎందుకు చేస్తున్నావని జైలు అధికారులు గద్దించడంతో అసలు విషయం బయటపెట్టాడు. తనకు ఆదాయ మార్గం లేకపోవడంతో బయట జీవితాన్ని నెగ్గుకురాలేకపోతున్నానని, జైలులో అన్నీ సమయానుకూలంగా లభ్యమవుతున్నాయని, ఆరోగ్యం బాగాలేకుంటే వైద్య సేవలు అందుతున్నాయని తనకు జైలు జీవితమే బాగుందని చెప్పాడు.ఇక్కడ తాను క్రమశిక్షణగా ఉంటున్నానని, జైలు ప్రాంగణంలోనే కార్పెంటరీ పనులు చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నానని అధికారులకు వివరించాడు. రెహమాన్ లాంటి ఖైదీలు తీహార్ జైలులో అడుగడుగునా కనిపిస్తారు. జైలు జీవితం గడిపి విడుదలైన ఖైదీలకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాలనే ఖైదీల ధోరణి ఎత్తిచూపుతోంది. ఖైదీల్లో మానసిక పరివర్తన దిశగా ప్రభుత్వాలు చొరవ చూపడంతో పాటు వారికి పునరావస ప్యాకేజ్ కల్పించాల్సిన అవసరాన్నీ తీహార్ ఖైదీల ఉదంతం ప్రతిబింబిస్తోంది. -
అత్త సొత్తు అల్లుడు స్వాహా
- ఐదేళ్లుగా వృద్ధురాలి న్యాయపోరాటం - మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట దీక్ష కోస్గి: నమ్మించి మోసం చేసి తన ఆస్తినంతా కాజేసిన అల్లుడిని శిక్షించి తనకు న్యాయం చేయాలని ఓ వృద్ధురాలు గత ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. చచ్చేలోపైన తనకు న్యాయం జరగాలని ఇప్పటికే పలు సార్లు నిరాహార దీక్ష చేసిన బాధిత వృద్ధురాలు శుక్రవారం మరోమారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షకు పూనుకుంది. వివరాలిలా.. మండలంలోని సంపల్లికి చెందిన కొత్తూరు బిచ్చమ్మకు నలుగురు కూతుళ్లు కాగా అందరికీ వివాహాలు జరిగాయి. కాగా మూడో కూతురి వివాహాన్ని అడ్డం పెట్టుకొని మండలంలోని అమ్లికుంట్లకు చెందిన పెద్ద కూతురు ప్రమీళ, అల్లుడు నారాయణరెడ్డి సంపల్లికి వచ్చారు. వివాహం అయిపోయినప్పటికీ ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో రుణం పేరుతో మాయమాటలు చెప్పి బిచ్చమ్మ పేరుతో ఉన్న భూమిని 1993లో నాలుగు ఎకరాలు, 2011లో మరో మూడెకరాలు తమ కొడుకు పేరున కొన్నట్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బిచ్చమ్మ అల్లుడిని నిలదీస్తే ఇంట్లో రూ.1.50 లక్షలు దొంగతనం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసి వృద్ధురాలిని ఆమె సొంత ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఈ నేపథ్యంలో 2012లో గ్రామంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోగా అప్పట్లో పేట ఆర్డీఓ యాస్మిన్బాష వచ్చి న్యాయం చేస్తామని చెప్పడంతో దీక్ష విరమించింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో 2013లో మరోమారు దీక్షకు దిగగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు న్యాయం చేస్తామని స్థానిక రెవెన్యూ అధికారులు సూచించడంతో రెండోసారి దీక్ష విరమించింది. నేటికీ న్యాయం జరగకపోవడంతో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షకు పూనుకోగా అధికారులు ఎవరూ లేకపోవడంతో జూనియర్ అసిస్టెంట్ రాఘవేందర్కు వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగింది. ప్రాణం పోయినా సరే తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బిచ్చమ్మ కన్నీటి పర్యంతమైంది. -
తమిళ ఖైదీల రికార్డు
► ఉత్పత్తుల తయారీ ద్వారా రూ.47.87 కోట్లు సంపాదన సాక్షి ప్రతినిధి, చెన్నై: రికార్డు సాధనకు జైలు జీవితం ఎంతమాత్రం అడ్డుకాదని నిరూపించారు తమిళనాడులోని ఖైదీలు. తమకు తెలిసిన వృత్తుల ద్వారా ఉత్పత్తులను తయారుచేసి విక్రయించడం ద్వారా 2015లో రూ.47.87 కోట్ల ఆదాయాన్ని సాధించారు. దేశంలోనే అత్యధిక మొత్తంగా రికార్డు సృష్టించారు. అనేక నేరాలకు పాల్పడి జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలకు వారివారి పూర్వానుభవాన్నిబట్టి జైల్లో పనులను అప్పగిస్తుంటారు. దేశంలో మొత్తం 1,401 జైళ్లు ఉండగా 3లక్షల 66వేల 781 మంది ఖైదీలను ఉంచగల వసతి ఉంది. గత ఏడాది డిసెంబరు 31వ తేదీ నాటి లెక్కల ప్రకారం వాటి సామర్థ్యానికి మించిన ఖైదీలను అంటే 4 లక్షల 19వేల 623 మందిని ఉంచుతున్నట్లు తేలింది. వీరిలో 5,203 మంది మానసిక వికలాంగులు, హత్య కేసుల్లో నేరస్తులు 70,827 మంది ఉన్నారు. 2,08,276 మంది రిమాండు ఖైదీల్లో 80,528 మందికి రాయడం రాదు. అలాగే 16,365 మంది పట్టభద్రులు ఉన్నారు. 2015లో తమిళనాడు జైళ్లలోని ఖైదీలకు చేనేత, చిత్రలేఖనం, తోలు ఉత్పత్తుల తయారీ, బేకరీ ఉత్పత్తుల తయారీ వంటి బాధ్యతలను అప్పగించారు. ఖైదీలతో నడుస్తున్న ఫ్రీడం బజార్ ద్వారా ఈ ఉత్పత్తుల అమ్మకాలతో రూ.47.87కోట్లు సంపాదించి తమిళ ఖైదీలు దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచారు. ఢిల్లీ ఖైదీలు రూ.31 కోట్లతో రెండో స్థానం, కేరళ ఖైదీలు రూ.22.9 కోట్లతో మూడవ స్థానంలో నిలిచినట్లు నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో (ఎన్సీఆర్ బీ) బుధవారం ప్రకటించింది. -
ఆగని పోరు
నారాయణరావుపేట మండల కోసం దీక్షలు 23 రోజులుగా నిరసనలు సీఎం, మంత్రి హరీశ్ హామీ నిలబెట్టుకోవాలంటున్న స్థానికులు సిద్దిపేట రూరల్: నారాయణరావుపేటను మండల కేంద్రం చేసేంత వరకు తమ పోరు ఆగదని ఈ ప్రాంత వాసులు హెచ్చరిస్తున్నారు. నారాయణరావుపేట మండలం కోసం గ్రామ పంచాయతీ ఎదుట చేపట్టిన సామూహిక రిలే దీక్షలు ఆదివారం నాటికి 23వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా దీక్షలో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. నారాయణరావుపేటను మండలం చేస్తానని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. అలాగే మంత్రి హరీశ్రావు సైతం పలు సందర్భాల్లో గ్రామాన్ని మండలం చేస్తానని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ఏర్పడగానే నారాయణరావుపేటను మొట్టమొదటిగా మండలం చేస్తానని అప్పట్లో మంత్రి ప్రజలకు చెప్పారన్నారు. దీంతో కేసీఆర్తో పాటు హరీశ్రావులు ఇచ్చిన హామీ మేరకు మండలం కోసం ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తున్నామని తెలిపారు. నారాయణరావుపేట భౌగోళికంగా, జనాభా ప్రతిపాదికగా అన్ని విధాలా మండలానికి అర్హత ఉందన్నారు. కానీ, హామీలను మరిచి ముసాయిదా నోటిఫికేషన్లో నారాయణరావుపేటను చేర్చక పోవడం దారుణమన్నారు. సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాలుగా ప్రకటించడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో నారాయణరావుపేట గ్రామ వాసులం క్రియాశీలకంగా పని చేశామన్నారు. స్వరాష్ట్రంలో తమ గ్రామానికి అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు. ఈ దీక్షలో గ్రామ నాయకులు గుండుకాడి నరేష్, మల్లేశం, దండు బాబు, రమేష్, రాజు, దీలిప్, సురేష్, సుధాకర్, బాబేషఠ్, దేవేందర్, కమల్ తదితరులు పాల్గొన్నారు. -
తిరగబడ్డ తెలు‘గోడు’
► పెద్దాపురంలో తిరుగుబాటు జెండా ► మాటతప్పిన ‘బాబు’పై రాజబ్బాయి ఫైర్ ► ఇంటిలోనే ఆమరణదీక్ష కాకినాడ: ‘ఏరుదాటాక తెప్ప తగలేసే.. సామెతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాగా వంటపట్టించుకుంటున్నారు. అవసరం ఉన్నంత వరకు వాడుకుని ఆనక కరివేపాకులా తీసి పడేయడంలో ఆయనకు మించిన నాయకుడు లేడంటున్నారు. ఈ మాట ఏ ప్రతిపక్షాలో అంటే రాజకీయం చేయడం కోసమని జనం అనుకుంటారు. కానీ ఆ పార్టీ కోసం కోట్లు తగలేసుకుని జండా మోసిన నాయకులే అంటే జనం నిజమని నమ్మక తప్పదు. ఇప్పుడా విషయం జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో కనిపిస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో దగాపడ్డ తెలుగు తమ్ముడు తిరుగుబాటు జెండా ఎగరేయడం పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఆ నియోజకవర్గంలో ఒకప్పుడు ముఖ్యనేతగా చలామణీ అయిన ముత్యాల రాజబ్బాయి పెద్దాపురం మండలం ఆర్బీ పట్నం గ్రామం లో తన ఇంటి వద్దనే సోమవారం చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చనందుకు నిరసనగా దీక్షకు ఉపక్రమించారు. రాజబ్బాయి గత సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి టిక్కెట్టు ఆశించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండాను భుజాన వేసుకుని తిరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గంలో పార్టీ తరఫున పోటీచేసే నాయకులకు ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలిచారు. చంద్రబాబు సహా జిల్లా ముఖ్యనేతలు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు వంటి వారు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇస్తుందని రాజబ్బాయిని నమ్మించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కోట్లు తగలేసినా, చంద్రబాబు పాద యాత్ర చేస్తున్నప్పుడు అంతటా వెంటే ఉన్నా చివరకు పెద్దాపురం టిక్కెట్టు దక్కలేదు. స్థానికేతరుడైన చినరాజప్పను పెద్దాపురం నుంచి పోటీపెడుతున్నాం, కలిసి పనిచేసి సర్కార్ వచ్చాక ఎమ్మెల్సీ ఇస్తామని నమ్మించారని రాజబ్బాయి ఆవేదన చెందబుతున్నారు. చంద్రబాబు సిఎం అయ్యారు. మాట ఇచ్చిన చినరాజప్ప, యనమల ఉపముఖ్యమంత్రి, మంత్రులై పోయారు. అది జరిగి రెండేళ్లు దాటిపోయింది అయినా రాజబ్బాయికి పార్టీలో న్యాయం జరగలేదు. కానీ పార్టీ వీడిపోయిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు వర్గీయులు తిరిగి సైకిల్ ఎక్కి తమపై పెత్తనం చెలాయిస్తున్నారని రాజబ్బాయి వర్గం మండిపడుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి అప్పుడు పోటీ నుంచి విరమించుకుంటే ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా బ్యానర్లు, పోస్టర్లకే పరిమితమయ్యే నాయకులకు వత్తాసు పలుకుతున్నారని రాజబ్బాయి వర్గీయులు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. చివరకు అందరినీ ఒకేలా చూడాల్సిన రాజప్ప కూడా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూ పార్టీ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న తమ లాంటి వారిని కరివేపాకుల్లా తీసిపడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజబ్బాయి ఆమరణదీక్షకు దిగడం చంద్రబాబు అనుసరిస్తోన్న వైఖరిని స్పష్టం చేస్తోందని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆయనకు ఏదో మొక్కుబడిగా మార్కెట్కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. ఇప్పుడేమో కనీసం ఆ పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించడం లేదని రాజబ్బాయి వర్గం రాజప్పపై నిప్పులు చెరుగుతోంది. బాబు హామీ ఇచ్చే వరకు ఆమరణ దీక్ష విడిచిపెట్టేది లేదని రాజబ్బాయి చెబుతున్నారు. జిల్లాకు బుధవారం చంద్రబాబు వస్తున్నారని తెలిసే రాజబ్బాయి ఇటువంటి బెదిరింపులకు దిగుతున్నారని, ఈ విషయంలో పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని నేతలు చెబుతున్నారు. కష్టపడ్డ వారికి పార్టీలో గుర్తింపు, పదవులు లభించడం లేదని పెద్దాపురంలో అయితే బయటపడ్డప్పటికీ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో చాపకిందనీరులా ఉందనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
దీక్ష విరమణ
గన్ఫౌండ్రీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ దీక్ష చేపట్టిన ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ బుధవారం దీక్షను విరమించారు. అబిడ్స్ మెడ్విన్ హాస్పిటల్లో దీక్ష కొనసాగిస్తున్న ఆయనకు రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. -
రాడ్లు, ఇటుకలతో పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు
ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్లో ఖైదీలు తన్నుకున్నారు. ముజఫర్ నగర్ జైల్లో రెండు గ్రూపుల మధ్య పాత కక్షల నేపథ్యంలో గొడవ జరిగి జైలు అధికారుల ముందే చిత్తుచిత్తుగా కొట్టుకున్నారు. ఈ క్రమంలో పదిమంది గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొలుత ఆ రెండు గ్రూపుల్లో ఒకరు పాత కక్షకు సంబంధించిన విషయాన్ని లేవనెత్తారు. దాంతో అవతలి వర్గం కోపంతో ఊగిపోయారు. అసమయంలోనే రెండు వర్గాల మధ్య తొలుత ఇటుకలతో దాడులు జరిగాయి. అనంతరం రాడ్లు తీసుకొని ఫైట్ చేశారు. దీంతో అదనపు పోలీసులు కూడా అక్కడికి వచ్చి వారిని విడగొట్టారు. అనంతరం జైలు భద్రతను పెంచారు. జిల్లా మేజిస్ట్రేట్ కూడా జైలుకు వచ్చి పరిస్థితిని సమీక్షించి సమాచారం సేకరించుకొని వెళ్లారు. -
అనంతలో ప్రత్యేక హోదా కోసం దీక్ష
అనంతపురం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రత్యేకహోదా సాధన సమితి నేతృత్వంలో నిరవధిక దీక్షలు చేపట్టారు. ఆదివారం ఉదయం అనంతపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద లెఫ్ట్ నేతలు సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు, సినీనటుడు శివాజీ, చలసాని శ్రీనివాస్తో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు పోరాడాలని...లేకపోతే ప్రజలు తగినా విధంగా బుద్ధి చెప్పుతారని నేతలు సూచించారు. -
జైల్లో ఘర్షణ, అధికారికి తీవ్ర గాయాలు
లక్నో: ఉత్తర ప్రదేశ్ వారణాసి జిల్లా కారాగారంలో ఖైదీలకు, పోలీసులకు మధ్య శనివారం ఉదయం తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో జైలు ఉన్నతాధికారి తీవ్రంగా గాయడ్డారు. ఖైదీలకు, జైలు పోలీసులకు మధ్య జరిగిన అల్లర్లు రణరంగాన్ని తలపించింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నత అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శనివారం ఉదయం ఇద్దరు ఖైదీలను జైలు గార్డులు చితకబాదడంతో పాటుగా, తమకు అందించే ఆహారంలో నాణ్యత సహా అనేక సమస్యలపై అసంతృప్తితో రగిలిపోతున్న ఖైదీలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహించిన జైలు అధికారులు ఖైదీలపై విరుచుకుపడ్డారు. దీంతో వివాదం మొదలైంది. పోలీసులపై తిరగబడిన ఖైదీలు రాళ్లు రువ్వడంతో జైలు ఆవరణంతా రాళ్లతో నిండిపోయింది. ఈ ఘర్షణలో డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ అజయ్ రాయ్ తలకి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది జైలు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న సీనియర్ అధికారులు గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు. జైలు చుట్టూ పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఆఫ్ దళాలు సహా అదనపు బలగాలను మోహరించినట్లు ఉన్నతాధికారి రాజ్ మణి యాదవ్ తెలిపారు. మరోవైపు ఘర్షణకు దిగిన ఖైదీలతో చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
విషమంగా వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్ల ఆరోగ్యం
తిరుపతి: చిత్తూరు జిల్లా నగరిలో సమస్యల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోగ్యం క్షీణిస్తోంది. దీక్ష చేస్తున్న కౌన్సిలర్ గౌరీ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న ఆమె బుధవారం సాయంత్రం ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయారు. దీంతో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఈటీటీ ప్లాంట్లను తక్షణమే ప్రారంభించాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సోమవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్ష చేస్తున్న కౌన్సిలర్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో తక్షణమే సమస్యలు పరిష్కారించడానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
జైలులో డ్యాన్స్ షో.. వీడియో లీక్
సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయడం గురించి ఇప్పటి వరకు మనం విన్నాం. కానీ కర్నాటకలోని విజయ్ పుర్ జైలులో ఖైదీల కోసం ఏకంగా డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. బయట నుంచి తీసుకు వచ్చిన వారితో విజయ్ పుర్ జైలులో రిపబ్లిక్ డే రోజు డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం పై ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. జైళ్ల శాఖ డీజీపీ కే. సత్యనారాయణ ఇప్పటి వరకు ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. WATCH: (26/1/16) Inmates rewarded for good behaviour with a dance show in jail in Vijaypur(Karnataka) https://t.co/ZQ3FIAH4RN — ANI (@ANI_news) January 28, 2016 -
బాక్సైట్కు వ్యతిరేకంగా వైఎస్ జగన్ బహిరంగసభ
విశాఖపట్నం: విశాఖ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చింతపల్లిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లపై అనకాపల్లిలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ విశాఖ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. విశాఖ మేయర్ పీఠమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...విజయవాడ కల్తీమద్యం మరణాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిపక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. -
'తన్నుకున్న ఖైదీలు.. ఆరుగురు మృతి'
గ్వాటెమాలా: పరిమితికి మించి ఖైదీలు ఉండే గ్వాటెమాలా జైలులో మరోసారి ఘర్షణ చోటుచేసుకొంది. ఫలితంగా ఆరుగురు ఖైదీలు ప్రాణాలుకోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బారీ సంఖ్యలో పోలీసులు, ఆర్మీ సిబ్బంది జైలు వద్దకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని అంతర్గత వ్యవహారాల డిప్యూటీ మంత్రి ఎమర్ సోసా తెలిపారు. వాస్తవానికి గ్వాటెమాలాలోని ఈ జైలు సామర్థ్యం కేవలం 600మందికి మాత్రమే సరిపోయేలా ఉంటుంది. కానీ, ప్రస్తుతం అందులో 3,092మందిని ఉంచారు. ఇక్కడ జైళ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. కాగా, ఈ జైలులో ఖైదీలుగా ఉన్న మారా 18, మారా సాల్వత్రుచా గ్యాంగ్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకొని ఈ ప్రాణనష్టానికి కారణమైంది. -
గూడు కోసం ఎన్నాళ్లు ఎదురుచూడాలి?
ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చాలని కోరుతూ తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండురోజుల నిరశన దీక్షను సోమవారం ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టి 16 నెలలు దాటినా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 400 మందికి మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తే.. ఎన్ని ఏళ్ల పాటు పేదలు గూడు కోసం ఎదురుచూడాలని పొంగులేటి ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే 4,600 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని, ఆ తరువాత వచ్చిన ఏ ప్రభుత్వాలూ పేదల గురించి ఆలోచించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్షకైనా వెనుకడేది లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ దీక్షకు ఖమ్మం ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతు పలికారు. -
గూడు కోసం ఎన్నాళ్లు ఎదురుచూడాలి?
-
మారుమోగుతున్న ప్రత్యేక నినాదం
జగన్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన {పభుత్వ మొండివైఖరిపై పెల్లుబికుతున్న ప్రజాగ్రహం ఆలయాల్లో పూజలు..రహదారులపై వంటవార్పులు ప్రత్యేకహోదా నినాదం మారుమోగుతోంది. మహావిశాఖ నగరం నుంచి మారుమూల పల్లెల వరకు ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ నినదిస్తోంది. పార్టీలు.. వర్గాలకతీతంగా ఊరూ వాడ కదంతొక్కుతోంది. విశాఖపట్నం: ప్రత్యేక హోదా సాధనకు నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం గంటగంటకు క్షీణిస్తుండడంతో జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది.ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్ష చేస్తుంటే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం పట్ల జిల్లా వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. జగన్ ఆరోగ్యం కోసం ఆలయాలు, మసీదులు, చర్చల్లో ప్రార్ధనలు చేస్తున్నారు. మరో పక్క జిల్లా వ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదివారం జాతీయ రహదారులపై వంటవార్పులు చేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో ఏమారుమూల ప్రాంతానికెళ్లినా ప్రత్యేకహోదా మారుమోగుతోంది. ఒక పక్క పార్టీ శ్రేణులు మరోపక్క మహిళలు, విద్యార్థులు, యువత రోడ్డెక్కుతున్నారు. వృద్ధులు సైతం దీక్షల్లో కూర్చొని ప్రత్యేక హోదా ఆవశ్యకతను చాటిచెబుతున్నారు.గత ఐదురోజులుగా దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ పాడేరు మోదుకొండమ్మ ఆలయంలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి జగన్కు అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అంబేద్కర్ సెంటర్లో జరిగిన వంటవార్పులో ఆమె పాల్గొన్నారు. మాడుగుల నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన రిలేదీక్షలు, వంటవార్పుల్లో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.జీవీఎంసీ వద్ద కొనసాగుతున్న రిలేదీక్షల్లో ఆదివారం పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ పాల్గొనగా మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు సంఘీభావం తెలిపారు.తూర్పు నియోజకవర్గ కోఆర్డినేటర్ వంశీకృష్ణ యాదవ్తో పాటు పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొయ్య ప్రసాద్రెడ్డి, రాష్ర్ట ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి నగర బీసీ సెల్ అధ్యక్షుడు పక్కి దివాకర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ తదితరులు ఆరిలోవ డైరీఫారంకూడలిలో జరిగిన వంటవార్పులో పాల్గొన్నారు. తాటిచెట్లపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన వంటవార్పులో ఉత్తర నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్కుమార్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ఎస్.కోట కో ఆర్డినేటర్ రొంగలి జగన్నాధం, ప్రచార కమిటీ నగర కార్యదర్శి బర్కత్ అలీ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ పార్టీ సీనియర్ నాయకులు సత్తి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.దక్షిణ కో ఆర్డినేటర్ కోలా గురువులు, పార్టీ రాష్ర్ట కార్యదర్శి జాన్వెస్లీ జిల్లా కోర్టు వద్ద జరిగిన వంటవార్పులో పాల్గొన్నారు. గాజువాకలో జరిగిన వంటవార్పులో పార్టీ కో ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డితో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. పెందుర్తి రిలే దీక్షల్లో 85 ఏళ్ల బోజంకి అప్పలనాయుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని జగన్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ కో ఆర్డినేటర్ అదీప్రాజు పాల్గొన్నారు. పెందుర్తి నాలుగు రోడ్ల కూడలిలో వంటవార్పు నిర్వహించి నిరసనవ్యక్తం చేశారు.భీమిలిలో పట్టణాధ్యక్షుడు అక్కరమాని వెంకట్రావు దీక్షల్లో పాల్గొన్నారు. భీమిలి నూకాలమ్మ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. తగరపువలస విజయదుర్గ ఆలయంలో భీమిలి పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు జగుపల్లి ప్రసాద్ అమ్మవారికి 101 కొబ్బరికాయలు కొట్టారు. పద్మనాభం జంక్షన్లో వంటవార్పు చేశారు. చోడవరం జంక్షన్లో వంట వార్పు చేశారు. బుచ్చెయ్యపేట, రావికమతం దీక్షలకు జిల్లాపార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ సంఘీభావం తెలిపారు.నక్కపల్లివద్ద జాతీయ రహదారిపై జరిగిన వంట వార్పుల పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు పాల్గొన్నారు. కోటవురట్లలో రిలేదీక్షలకు మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు సంఘీభావం తెలిపారు.యలమంచిలి కో ఆర్డినేటర్ ప్రగడ నాగేశ్వరరావు రాంబిల్లిలో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. అచ్యుతాపురంలో మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు.అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మునగపాకలో జరిగిన వంట వార్పులో పాల్గన్నారు. అరకులోయలో పార్టీ శ్రేణులు వంటవార్పు చేశారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట వంటవార్పులో పార్టీ కో ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు. -
ప్రభం‘జనం’
వైఎస్ జగన్ దీక్షకు తరలివస్తున్న గ్రామాలు ప్రతి ఇంటా, రచ్చబండల వద్ద ‘ప్రత్యేక’ చర్చ ప్రతిపక్షనేతకు అండగా ఉంటామని ప్రతిన కనకదుర్గమ్మ ఆలయాల్లో మహిళల పూజలు పెరుగుతున్న ప్రజా సంఘాల మద్దతు జగన్ను కలుస్తున్న మేధావులు, విద్యాసంస్థల అధిపతులు పల్లెలన్నీ కూడబలుక్కున్నట్టు.. ఊళ్లన్నీ ఏకమైనట్టు... ఏకతాటిపై నిలిచినట్టు ... మూకుమ్మడిగా మునుముందుకు కదులుతున్నాయి.. ప్రవాహంలా జన ప్రభంజనమై వస్తున్నాయి..! జననేత దీక్షకు మద్దతు తెలిపేందుకు.. ప్రత్యేక హోదా సాధనలో భాగస్వాములయ్యేందుకు.. పనులన్నీ పక్కనపెట్టి... రహదారుల బాటపట్టి.. సమరోత్సాహంతో సైదోడుగా నిలుస్తున్నాయి.. కర్షకులు.. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు .. వాగూవంకా, చెలమా ఏరు కలసి విస్తరించినట్టు... వందలా.. వేలా, వే వేలు... లక్షల జేజేలు.. మేలు కోరేవాడంటూ మనసారా దీవెనలు.. గుంటూరు : ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు వేదికగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు గ్రామాలకు గ్రామాలే తరలివస్తున్నాయి. దీనిని ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంగా భావించకుండా తమ భవిష్యత్కు సంబంధించినదిగా భావిస్తున్న ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ప్రభుత్వాలు దిగి వచ్చే వరకు జగన్ పోరాటానికి అండగా ఉంటామ ని ప్రతిన బూనుతున్నారు. ప్యాకేజీల పేరుతో ప్రజల్ని మరోసారి మోసగించే టీడీపీ ప్రయత్నాలను నిలువరించేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రతీ ఇంటా, రచ్చబండల వద్ద జగన్ దీక్షపై చర్చలు సాగుతున్నాయి. ప్రతి గ్రామంలో ప్రత్యేక హోదాపై చర్చ... ‘‘ప్రత్యేక హోదా వస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తవుతాయి. సాగునీటి కొరత తీరుతుంది. ఎకరాకు 40 బస్తాల దిగుబడి సాధించవచ్చు. వీటి కోసం కేంద్రం విడుదల చేసే గ్రాంటులో 90 శాతం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు’’ అని గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ గ్రామ రైతు కొల్లి శివరామిరెడ్డి ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కలిగిస్తున్నాడు. ఇలా ప్రతీ గ్రామంలో అవగాహన చర్చలు సాగుతుండటంతో రైతులు వ్యవసాయ పనుల్ని సైతం పక్కన పెట్టి జగన్ దీక్షకు తరలివస్తున్నారు. మేధావి వర్గానికి చెందిన విద్యావేత్తలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు రోజువారీ విధులు ముగించుకుని సాయంత్రం వేళ దీక్షా శిబిరానికి చేరుకుంటున్నారు. కొందరు యూనివర్సిటీ, కళాశాల విద్యార్థులు తరగతులు పూర్తయిన తరువాత దీక్షాస్థలికి వస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామికీకరణ జరిగి నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉండటంతో తమ భవిష్యత్ కోసం జగన్ చేస్తున్న దీక్షకు మద్దతు పలుకుతున్నారు. ప్రధానంగా మహిళలు, యువతరం భారీగా తరలివస్తున్నారు. కొందరు మహిళలు కనకదుర్గమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించి జగన్మోహన్రెడ్డి దీక్ష ఫలించాలనీ, ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నారు. దూరప్రాంతాల నుంచి సైతం బస్సుల్లో... వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. ఉదయం నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరితోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వాహనాలు దీక్షా శిబిరానికి బారులు తీరాయి. దీక్షాస్థలి నల్లపాడుకు సమీప నియోజకవర్గాలైన తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడుల నుంచి అభిమానులు, కార్యకర్తలు ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలపై తరలివస్తే, దూరప్రాంత నియోజకవర్గాల నుంచి ప్రైవేట్ బస్ల్లో వచ్చి జననేతను కలిసి హోదా సాధించాలనీ, తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని భరోసానిస్తున్నారు. అంతకు ముందు వీరంతా తమ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించి ఇక్కడకు చేరుకున్నారు. పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలిచ్చారు. జగన్ దీక్షకు మద్దతు పలకడమే కాకుండా ప్రత్యేక హోదా తో లభించనున్న ప్రయోజనాలు, ప్యాకేజీ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. -
అందని ద్రాక్ష.. క్షమాభిక్ష
గాంధీ జయంతికి కనిపించని కదలిక - ఖైదీలకు క్షమాభిక్షపై సర్కారు మీమాంస - వెలువడని ఉత్తర్వులు సాక్షి, హన్మకొండ: చేసిన తప్పునకు పశ్చత్తాపపడి తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆశిస్తున్న ఖైదీలు, మరికొంత కాలం జైలుజీవితాన్ని గడపకతప్పదు. గాంధీజయంతి సందర్భంగా ప్రభుత్వం తరఫున తీపి కబురు అందుతుందేమోనేని ఆశిం చిన ఖైదీలకు నిరాశే ఎదురైంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైళ్లో వెయ్యి మంది వరకు ఖైదీలు ఉండగా వీరిలో సత్ప్రవర్తన కలిగి ప్రభుత్వం ఇచ్చే క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలు 50 మంది వరకు ఉన్నారు. రెండోఏడు : శిక్షాకాలంలో సత్ప్రవర్తనతో మెలిగే ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర, గణతంత్ర, గాంధీజయంతి వంటి జాతీయపండుగల సమయంలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తోంది. రాష్ట్రంలో చివరి సారిగా 2013 గాంధీజయంతి సందర్భంగా క్షమాభిక్షను ప్రసాదించారు. అప్పటి నుంచి 2014, 2015 సంవత్సరాల్లో గణతంత్ర, స్వాంత్రదినోత్సం, గాంధీజయంతిల సంధర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. క్షమాభిక్షకు ఎవరు అర్హులు : జైళ్లో శిక్ష కాలంలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల శిక్షాకాలాన్ని తగ్గించడాన్ని రెమిషన్ అంటారు. ఈ రెమిషన్లు సాధారణ, ప్రత్యేక, ప్రభుత్వ అని మూడు రకాలుగా ఉన్నాయి. జైళ్లశాఖ నిబంధనల ప్రకారం 1) సత్ప్రవర్తనతో మెలిగితే నెలకు రెండు రోజులు 2) రోజువారి విధులను సక్రమంగా నిర్వర్తిస్తే నెలకు మూడు రోజులు 3) ఏడాది కాలంలో ఏ తప్పు చేయకుండా ఉంటే 20 రోజులు రెమిషన్ ఇస్తారు. దీన్ని సాధరణ రెమిషన్ అంటారు. ఇలా కాకుండా దుస్తులు ధరించడంలో పొదుపు, జైలు అధికారుల విధుల్లో సహాకారం అందించడం, చేతివృత్తులను బోధించడం, పరిశ్రమ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించడం, కొన్ని ప్రత్యేక సంధర్భాల్లో జైలు అధికారులకు సహాకరించడం, అధికారులను దాడుల నుంచి కాపాడటం వంటి పనులు చేసిన వారికి ఏడాదికి 30 నుంచి 60 రోజుల పాటు శిక్షాకాలంలో కోత విధిస్తారు. దీన్ని ప్రత్యేక రెమిషన్ అంటారు. సాధారణ, ప్రత్యేక రెమిషన్లు కలిపితే ఖైదీ శిక్షాకాలంలో మూడోవంతుకు మించకుండా ఉండాలి. అంటే ఒక ఖైదీకి పదేశ్లు శిక్షపడితే అందులో రెమిషన్ మూడేళ్లు మించకూడదు. అంటే సత్ప్రవర్తన కారణంగా మూడేళ్లకు మించి శిక్షాకాలాన్ని తగ్గించుకునే వీలులేదు. ప్రభుత్వ రెమిషన్ : ఖైదీల సత్ప్రవర్తనతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల స్థితి గతులను పరిగణలోకి తీసుకుని వారి శిక్షాకాలాన్ని తగ్గించడాన్ని ప్రభుత్వ రెమిషన్ అంటారు. ప్రభుత్వం రెమిషన్ ఇవ్వాలంటే విడుదల తేది నాటికి (గణతంత్ర, స్వాతంత్ర, గాంధీజయంతి) ఆ ఖైదీ ఏడేళ్ల వాస్తవ శిక్ష అనుభవించి రెమిషన్తో కలిపి పదేళ్ల శిక్ష పూర్తి చేయాలి. అదే మహిళలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధుల విషయంలో ఐదేళ్ల వాస్తవ శిక్షతో పాటు రెమిషన్తో కలిపి ఏడేళ్ల శిక్షా కాలాన్ని పూర్తి చేసి ఉండాలి. ఇలా చేసిన ఖైదీలను జాతీయ పండుగలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. క్షమాభిక్షకు అర్హులు కానీవారు : మత సంబంధమైన కేసులు, ఉరిశిక్ష నుంచి జీవితఖైదుగా మారడం, ప్రభుత్వ ఉద్యోగులకు హత్య చేయడం, నిత్యావసర వస్తువుల అక్రమరవాణా నిరోధక చట్టం, మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, మహిళలపై నేరాలకు సంబంధించి 354, 376, 498(ఏ) వంటి సెక్షన్ల కింద జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు, పెరోల్పై విడుదలై సకాలంలో రాని వారు, మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల కేసుల్లో శిక్షలు పడ్డవారు. కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక చట్టాల పరిధిలో శిక్షలు పడిన ఖైదీలు క్షమాభిక్షకు అర్హులు కారు. -
జైలుపై తాలిబాన్ దాడి..350 మంది ఖైదీల పరారీ
ఘజ్ని: అఫ్ఘానిస్తాన్లో ఓ జైలుపై తాలిబాన్ మిలిటెంట్లు దాడికి తెగబడి, వందలాది మంది ఖైదీలను విడిపించారు. ఘజ్ని నగరంలో సోమవారం వేకువజామున 2.30కి సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు జైలు ముందు కారు బాంబు పేల్చడంతో గేట్లు బద్దలయ్యాయి. 350 మందికిపైగా ఖైదీలు తప్పించుకున్నారు. ఈ ఘటనలో నలుగురు అఫ్ఘాన్ పోలీసు అధికారులు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. జైలు తమ అధీనంలో ఉందని, అమాయకులకు స్వేచ్ఛను కల్పించామని తాలిబాన్ ప్రతినిధి చెప్పాడు. -
జైల్లో ఫైట్.. ముగ్గురు మృతి
చుషింగ్(ఓక్లామా): జైల్లో తలెత్తిన గొడవ ముగ్గురు ప్రాణాల్ని బలిగొంది. ఐదుగురిని గాయపరిచింది. ఈ ఘటన అమెరికాలోని ఓక్లామా జైలులో చోటుచేసుకుంది. జైలు నిర్వహణాధికారుల సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం మెల్లగా ఏదో అంశానికి సంబంధించి గొడవ ప్రారంభమైంది. ఖైదీల తిట్ల పురాణం మొదలైంది. ఇంతలోనే చేతికి దొరికిన ప్రతి వస్తువును ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఈ క్రమంలో జైలు సిబ్బందికి గూడా గాయాలయ్యాయి. ఎవరు ఎవరినీ కొడుతున్నారో అర్థం కాలేదు. కానీ బలంగానే కొట్టుకున్నారని మాత్రం అనిపించింది. ఈలోగా జైలు సిబ్బంది జోక్యం చేసుకుంటుండగానే అప్పటికే ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొంతమంది గాయాలపాలయ్యారు. -
కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలి
అప్పటి వరకు ఆందోళనలు చేస్తాం: ఎర్రబెల్లి హైదరాబాద్: కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కాదు.. వారిని రెగ్యులరైజ్ చేసి జీతాలను అందించాలని టీటీడీపీ శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రభాకర్ చేస్తున్న దీక్ష ఆదివారానికి మూడో రోజుకు చేరుకుంది. ఆయన దీక్షకు మద్దతు తెలిపిన ఎర్రబెల్లి.. అనంతరం మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ చేస్తున్న పిచ్చి చేష్టలు సీఎంకు సంబరమనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ సమ్మె చేసిన కార్మికులను తొలగించడం సరికాదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ధర్నాలు, ఆందోళన చేస్తామన్నారు. సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులు చేస్తున్న పోరాటం రాజకీయ లబ్ధికోసం కాదని ఆకలి మంటల పోరాటమని దీన్ని కూడా రాజకీయమనుకుంటే ఇంత కన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదన్నారు. -
మన మ్యాచ్.. ఖైదీలూ చూస్తున్నారు!
హైదరాబాద్ క్రైం: భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య పోటాపోటీగా జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ ని ఇళ్లలో కూర్చున్న జనమే కాదు.. జైళ్లలో ఉన్న ఖైదీలు కూడా చూస్తున్నారు. నగరంలోని చంచల్గూడ, చర్లపల్లి జైళ్లలో ఖైదీలకు వెస్టిండీస్, భారత్ల మ్యాచ్ చూసేందుకు అనుమతినిచ్చారు. ఈ మ్యాచ్ను రెండు జైళ్లలోని ఖైదీలను చూపిస్తున్నట్లు జైళ్ల డీజీ వీకే.సింగ్ తెలిపారు. ఇందు కోసం చర్లపల్లిలో 100 టీవీలను, చంచల్గూడలో 50 టీవీలను ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు. ఖైదీలు చట్టప్రకారం దూరదర్శన్లో ప్రసారమయ్యే మ్యాచ్ను చూస్తారని సింగ్ ప్రకటించారు. -
తన్నుకున్నారని తరలించారు..
అమెరికాలోని ఓ జైళ్లో ఖైదీలంతా ఒక చోట చేరి అధికారులపై తిరగబడేందుకు ప్రయత్నించడమే కాకుండా వాళ్లల్లో వాళ్లు తన్నుకోవడంతో 500మందికి పైగా ఖైదీలను వేర్వేరు జైళ్లకు తరలించారు. అమెరికాలోని రేమాండ్విల్లే అనే చోట జైళ్లో దాదాపు 2,800మంది ఖైదీలు ఉన్నారు. గత వారం ఖైదీల్లో వాళ్లల్లో వారికే అనుకోకుండాగొడవలు తలెత్తి ఘర్షణలకు దారి తీసింది. అనంతరం వారు జైలులోని పలు వస్తువులను ధ్వంసం చేశారు. పోలీసు అధికారులపై తిరగబడేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వివాదానికి కారణమైనవారిని ప్రశ్నించి చివరికి వారిని టెక్సాస్కు ఇరువైపుల ఉన్న వేర్వేరు జైళ్లలోకి తరలించారు. -
కావలి ఎమ్మెల్యే దీక్ష భగ్నం
నేడు కావలి బంద్కు వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు కావలి: సాగు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షను శుక్రవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. దీక్ష రెండోరోజు శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో దీక్షాస్థలి వద్దకు చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతిఘటించారు. భారీగా మోహరించిన పోలీసులు కార్యకర్తలను తోసేసి వైద్యుల సాయంతో ఎమ్మెల్యేని తీసుకెళ్లారు. ఆస్పత్రిలో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఇచ్చి దీక్షను భగ్నం చేశారు. ఎమ్మెల్యే దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఏరియా ఆస్పత్రి కూడలిలో రాస్తారోకో నిర్వహించింది. శనివారం కావలి బంద్కు పిలుపునిచ్చింది. ఆరోగ్యం విషమించడంతోనే ఎమ్మెల్యే దీక్షను భగ్నం చేసినట్లు పోలీసులు చెప్పారు. అంతకుముందు దీక్షలో ఉన్న ఎమ్మెల్యేని పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని హెల్త్ బులిటెన్లో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో లక్ష్మీనరసింహ ం దీక్షా శిబిరానికి వచ్చి ఎమ్మెల్యేతో చర్చించారు. వైద్యుల సూచనమేరకు దీక్ష విరమించాలని కోరారు. ప్రభుత్వం వైపు నుంచి సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి స్పష్టమైన హామీ వచ్చేవరకు దీక్షను విరమించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆరోగ్యం సమాచారం తెలిసి ఆత్మకూరు ఎమ్మెల్యే మే కపాటి గౌతమ్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి శిబిరానికి వచ్చారు. బొమ్మిరెడ్డి కలెక్టర్కు ఫోన్చేసి దీక్ష విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తాను సమావేశంలో ఉన్నానని, తరువాత శిబిరం వద్దకు వస్తానని కలెక్టర్ జానకి చెప్పారు. సమస్యల పరిష్కారానికే పోరాటం అంతకుముందు దీక్షా శిబిరంలో చిత్తూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మె ల్యే కె.నారాయణస్వామి మాట్లాడారు. ఆత్మకూరు, నెల్లూరు రూరల్, గూడూరు ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, పాశం సునీల్కుమార్, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి శిబిరానికి వచ్చి ఎమ్మెల్యేకి సంఘీభావం తెలిపారు. -
ఖైదీలపై యువకుల దాడి...
చంచల్గూడ: తమకు మొదట పెట్రోల్ పోయాలని ఇద్దరు యువకులు ఖైదీలను దుర్భాషలాడి వారిపై దాడికి దిగిన సంఘటన మంగళవారం రాత్రి చంచల్గూడ పెట్రోల్ బంకులో చోటు చేసుకుంది. ఖైదీలతో అనుచితంగా ప్రవర్తించిన యువకులపై డబీర్పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు. చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ బి. సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పాతబస్తీకి చెందిన ఇద్దరు యువకులు సయ్యద్ అబ్దుల్ గఫర్, మహ్మద్ అహ్మద్ అలీ పెట్రోల్ కోసం వచ్చారు. వారు క్యూ పాటించకుండా మొదట తమకే పెట్రోల్ పోయాలని ఖైదీ రాములును దుర్భాషలాడి అతని చేతిలో పెట్రోల్ గన్ను లాక్కునే ప్రయత్నం చేయగా ఖైదీలు వారించారు. ఈ క్రమంలో యువకులు ఖైదీలపై దాడికి దిగారు. యువకులను సిబ్బంది వెనక్కు పంపారు. ఖైదీలు దాడి చేసినట్లు యువకులు, ఖైదీల విధులకు ఆటంకం కలింగిచారని జైలు అధికారులు డబీర్పురా పీఎస్లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. -
చెరసాలలో జల్సా
శిక్షలో భాగంగా జైలుకు వచ్చిన ఖైదీలు మహా జల్సాగా గడుపుతున్నారు. అది సబ్ జైలు నుంచి సెంట్రల్ జైలు వరకు ఎక్కడైనా ఖైదీల జల్సానే జల్సా. జైళ్లలో ఖైదీల వద్ద గుట్కా, బిర్యానీ ప్యాకెట్ల నుంచి మందు బాటిళ్లుతోపాటు నీలి చిత్రాలతో కూడిన పెన్ డ్రైవ్లు, సెల్ ఫోన్లు ఖైదీల వద్ద విరివిగా ఉంటున్నాయి. అయితే తనిఖీలకు వచ్చిన జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఖైదీల వద్ద దొరికిన వస్తువులు చూసి బిత్తరపోతున్నారు. అయితే తనకు బెయిల్ కావాలంటూ ఓ ఖైదీ చర్లపల్లి సెంట్రల్ జైలులో నుంచి ఓ న్యాయవాదికి తరచు ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. దీంతో ఖైదీగారి బెయిల్ గోల నుంచి ఉపశమనం పొందెందుకు ఓ చానెల్ను ఆశ్రయించాడు. దీంతో సోమవారం సెంట్రల్ జైలు నుంచి ఖైదీ ఫోన్ చేయడం.... న్యాయవాది సమాధానం అంతా ఆ చానల్ ప్రత్యక్ష ప్రసారం కావడంతో జైళ్ల శాఖ ఉన్నతాధికారులు మరోసారి ఉలుక్కిపడ్డారు. దీంతో మరోసారి చర్లపల్లి జైలులో మళ్లీ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీల వద్ద నుంచి ఆరు సెల్ ఫోన్లుతోపాటు 50 గ్రాముల గంజాయి ఉన్నతాధికారులు గత అర్థరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఇవన్ని ఎక్కడవని ఉన్నతాధికారి ప్రశ్నించినా.. ఖైదీల నుంచే కాదు జైలు సిబ్బంది నుంచి కూడా సమాధానం కరువైంది. దీంతో జైళ్ల శాఖ ఉన్నతాధికారి ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. మీ ప్రమేయం లేకుండా 'ఇవన్నీ' జైళ్లల్లోని ఖైదీలకు ఎలా వస్తున్నాయని అని ప్రశ్నించినా... సదరు జైలు ఉన్నతాధికారుల నుంచి సమాధానం మాత్రం పెదవి దాటడం లేదు. జైలు సిబ్బంది... ఖైదీలు అనుబంధంతో జైళ్ల శాఖలో వార్డర్ నుంచి ఉన్నతాధికారి వరకు కోట్లకు పడగలెత్తుతున్నారు. జైళ్ల శాఖలో అవినీతి చూసి ఆ శాఖ ఐజీనే ఏదో చేద్దామని పోలీసు సర్వీసులోకి వచ్చినా ఏమీ చేయలేక పోతున్నామని స్వయానా ఆయనే ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జైళ్ల శాఖలో అవినీతి ఎంతగా మేట వేసిందో ఇటే అర్థమైపోతుంది. -
తీహార్ జైలులో ఖైదీల నిరాహారదీక్ష
న్యూఢిల్లీ: తీహార్ జైలులో 50 మందికి పైగా ఖైదీలు బుధవారం నిరాహార దీక్షకు దిగారు. ఖైదీలను వారి సంబంధీకులు వారానికి ఒకసారే కలిసే వీలు కల్పిస్తూ తీహార్ జైలు డెరైక్టర్ జనరల్ విమలా మెహ్రా గత నెల 28న ఒక ఉత్తర్వు జారీ చేశారు. అత్యంత కట్టుదిట్ట భద్రత వార్డులో ఉన్న ఖైదీలు ఇంతకుముందు వారానికి రెండు సార్లు తమ కుటుంబ సభ్యులతో కలిసేవారు. అయితే కొత్త నిబంధన ప్రకారం వారు వారానికి ఒకసారి మాత్రమే తమ కుటుంబసభ్యులతో మాట్లాడే వీలుంటుంది. అదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారానే.. ఒకసారి ఐదుగురు కుటుంబసభ్యులనే అనుమతి స్తారు. దీనిపై ఖైదీలు నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పటికే జైలు ఉన్నతాధికారులకు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, జిల్లా జడ్జికి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ జనరల్ నజీబ్ జంగ్ తదితరులకు లేఖలు రాశారు. అలాగే తమను కలవడానికి 15 మంది కుటుంబసభ్యులను అనుమతించాలని ఆ లేఖలో కోరారు. తమ డిమాండ్లు తీర్చేవరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామన్నారు. -
అప్రమతమైన యానాం జైలు సిబ్బంది
-
ఖైదీని తప్పించేందుకు సబ్జైలుపై దాడికి యత్నం
యానాం : తూర్పు గోదావరి జిల్లా యానాం సబ్జైలులోకి ప్రవేశించేందుకు పదిమంది దుండగులు సినిమా ఫక్కీలో యత్నించారు. ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పుదుచ్చేరికి చెందిన ఇద్దరు ఖైదీలను తప్పించేందుకు ....దుండగులు ఈ సంఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాడు సాయంతో వీరంతా సబ్జైలు వెనక నుంచి జైల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరిలో ఎనిమిదిమంది లోనికి ప్రవేశించగా, మరో ఇద్దరు బయట వేచి ఉన్నారు. అయితే అప్రమత్తమైన హోంగార్డు.... పోలీసులకు సమాచారం అందించటంతో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. నిందితులను యానాం పోలీసు స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. మరోవైపు పరారైనవారి కోసం గాలిస్తున్నారు. గత ఏడాది పుదుచ్చేరికి చెందిన మణికంఠ అనే ఖైదీతో పాటు మరొకరిని అధికారులు యానాం సబ్ జైలుకు తరలించారు. వారిని విడిపించేందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితులు విచారణలో తెలిపినట్లు సమాచారం. కాగా మణికంఠను హతమార్చేందుకే దుండగులు వచ్చినట్లు మరో వాదన వినిపిస్తుంది. నిందితులంతా పుదుచ్చేరికి చెందినవారు. అయితే ఈ సంఘటనపై పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించలేదు.