82మంది మహిళా ఖైదీలకు ఆస్వస్థత | Women Inmates Fell Ill In Mumbai Jail | Sakshi
Sakshi News home page

82మంది మహిళా ఖైదీలకు ఆస్వస్థత

Jul 20 2018 2:43 PM | Updated on Jul 20 2018 2:47 PM

Women Inmates Fell Ill In Mumbai Jail - Sakshi

మహిళా ఖైదీలు చికిత్స పొందుతున్న జేజే ఆస్పత్రి(ఫైల్‌)

ముంబై : 82మంది మహిళా ఖైదీలు అస్వస్థకు గురైన సంఘటన శుక్రవారం ముంబై నగరంలో చోటుచేసుకుంది. ముంబైలోని బైకుళ్లా కారాగారంలో మహిళా ఖైదీలు శుక్రవారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురైయ్యారు. వారిని జైలు సిబ్బంది ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జైలు అధికారులు చెబుతున్నారు. అపరిశుభ్రమైన నీటి కారణంగానే వారు అనారోగ్యానికి గురై ఉంటారని భావిస్తున్నారు. జైలు ఉన్నతాధికారి రాజ్‌వర్థన్‌ సిన్హా మాట్లాడుతూ.. మూడురోజుల క్రితం ఓ మగఖైదీకి కలరా రాగా వెంటనే మందులు ఇచ్చామని తెలిపారు. కలరాను నివారించటానికి జైలులోని అందరికి ఆరోగ్యశాఖ వారు మందులు అందజేశారన్నారు. మహిళా ఖైదీలు అస్వస్థతకు గురైన వెంటనే జైలులోని మిగితా అందరికి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement