clash
-
జనసేన వర్సెస్ టీడీపీ.. నేతల మధ్య కొట్లాట
సాక్షి, విజయనగరం జిల్లా: నెల్లిమర్ల మండలం బూరాడపేటలో టీడీపీ-జనసేన నేతల కొట్లాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డీలర్ పోస్ట్ విషయంలో టీడీపీ, జనసేన నేతల మధ్య వివాదం నెలకొంది. ఆదివారం గ్రామంలో గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన నేతలు కర్రలతో దాడి చేసుకున్నారు. జనసేన మండల నేత కరుమజ్జి గోవింద్తో పాటు మరో పదిమందికి గాయాలయ్యాయి. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.పెనుకొండలో టీడీపీ వర్సెస్ బీజేపీమరోవైపు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అనుచరులు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుయాయుల మధ్య భూ వివాదం రచ్చకెక్కింది. ఇరు వర్గాలు తరచూ ఘర్షణలకు దిగుతుండడంతో చుట్టుపక్కల రైతులు.. కియా కార్ల పరిశ్రమ వద్ద ఉన్న చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా తెగని భూ పంచాయితీతో పదేపదే పోలీస్ స్టేషన్కు వెళ్లడం, దారులు మూసేయడం, జేసీబీలతో రోడ్లు ధ్వంసం చేస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా రాడ్లు, కర్రలతో గొడవకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. -
టీడీపీ, జనసేన బాహాబాహి
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. తాజాగా గురువారం రాత్రి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహికి దిగారు. నియోజకవర్గంలోని డీలర్షిప్ల వాటాల విషయంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద గుమిగూడారు.నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు నిర్వహిస్తున్న నిత్యావసర సరుకుల దుకాణాల డీలర్షిప్లను తొలగించి తమకు ఇవ్వాలని, ఈ విషయంపై తమ అధినేతలు జిల్లా కలెక్టర్, ఆ శాఖ మంత్రిని ఆదేశించారంటూ బాహాటంగానే చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే పలానా డీలర్షిప్ తమకు కావాలంటే తమకు కావాలని రెండువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఆదోని టూటౌన్ పోలీసులు అక్కడకు వచ్చి రెండువర్గాలకు సర్ధిచెప్పి శాంతింపచేశారు. -
గాంధీ భవన్లో తన్నుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. కొత్తగూడెంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పార్టీ పదవులు ఇవ్వడంపై పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అర్హత లేకున్నా కొందరిని ఎంపిక చేశారంటూ కొందరు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అక్రమంగా నియామకం చేశారని అడిగితే దాడి చేశారంటూ పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ గొడవపై అధ్యక్షుడు శివ చరణ్ స్పందించారు. ఎంపికలు నిబంధనల ప్రకారమే జరిగాయన్నారు. ‘‘ఎన్నికైన వారినే ఇవాళ సమావేశానికి ఆహ్వానించాం. ఎన్నిక కానీ వారు మీటింగ్లోకి వచ్చి డిస్ట్రబ్ చేశారు. ఓడిపోయిన వారు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు. వయసుకు సంబంధించిన అంశాలన్నీ చెక్ చేసిన తర్వాతే ఫలితాలు ప్రకటించారు. బయట జరిగిన గొడవ గురించి నాకు తెలియదు. ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే దానిపై సమీక్ష చేసుకుంటాం’’ అని శివచరణ్ చెప్పారు. -
కుర్కురే తెచ్చిన రగడ.. 30 మంది అరెస్ట్
బనశంకరి: ఐదు రూపాయల కుర్కురే ప్యాకెట్పై రెండు కుటుంబాల మధ్య పెద్ద పోరాటమే సాగింది. 10 మంది గాయపడగా, అంతకుమించి పరారీలో ఉన్నారు. ఈ ఘటన దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. అతీఫుల్లా అనే వ్యక్తి కిరాణా అంగడిలో సద్దాం కుటుంబానికి చెందిన పిల్లలు కుర్కురే కొన్నారు. సద్దాం కుటుంబీకులు దగ్గరిలోనే చిన్న హోటల్ పెట్టుకున్నారు. గడువు మీరిన కుర్కేరే విక్రయించారని సద్దాం కుటుంబీకులు వచ్చి ప్రశ్నించారు. దీంతో రగడ రాజుకుంది. రెండు కుటుంబాలవారు కొట్టుకున్నారు. ఇది చాలదన్నట్లు 30 మంది అతీఫుల్లా మనుషులు రెండు వాహనాల్లో వచ్చి హోటల్లో వస్తువులను చెల్లాచెదురుగా పడేసి కొట్టారని సద్దాం కుటుంబీకులు ఆరోపించారు. ఇరు కుటుంబాలు చెన్నగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అరెస్ట్ భయంతో 25 మంది పరారీలో ఉన్నట్లు ఎస్ఐ బాలచంద్రనాయక్ తెలిపారు. కుర్కురే కోసం ఇంత గొడవ జరిగిందా అని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కొట్లాట దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఇక గాయపడిన పలువురు ఆస్పత్రిలో చేరారు. -
పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఘర్షణ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో మునుపెన్నడూ లేనివిధంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చివరకు ఘర్షణకు దారితీయడం గమనార్హం. ఇరుపక్షాల ఎంపీలు ఒకరినొకరు తోసేసుకోవడం, పరస్పరం గొడవ పడడం, ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడి ఆసుపత్రిలో చేరడం, ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, రాహుల్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని బీజేపీ మహిళా ఎంపీ కోన్యాక్ ఆరోపించడం వంటి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించాయి. మొత్తానికి పార్లమెంట్ సాక్షిగా గురువారం దిగ్భ్రాంతికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. నినాదాలు, అరుపులు, కేకలతో ఉద్రిక్తత అంబేడ్కర్పై అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఉదయం ఉభయ సభలు ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నీలం రంగు దుస్తులు ధరించి, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాం«దీ, ప్రియాంకగాంధీ వాద్రాతోపాటు కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం తదితర పారీ్టల సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తర్వాత వారంతా మకరద్వారం గుండా పార్లమెంట్ లోపలికి ప్రవేశించేందుకు ముందుకు కదిలారు. అప్పటికే అక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు బైఠాయించారు. అంబేడ్కర్ను కాంగ్రెస్ కించపర్చిందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు ప్రారంభించారు. మకరద్వారం మెట్లపై ఇరువర్గాలు పరస్పరం ఎదురుపడ్డాయి. తాము ముందుకెళ్లడానికి దారి ఇవ్వడం లేదని ఇండియా కూటమి ఎంపీలు మండిపడ్డారు. దాంతో ఎన్డీయే ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. ఇండియా కూటమి సభ్యులు సైతం స్వరం పెంచారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. తోపులాటలు, అరుపులు కేకలతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. తోపులాటలో కొందరు ఎంపీలు కిందపడ్డారు. మెట్ల మధ్యభాగంలో నిలబడిన తమను రాహుల్ గాంధీ బలంగా తోసివేశారని బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముందుకెళ్లడానికి పక్కనే తగినంత దారి ఉన్నప్పటికీ ఆయన తమపై ఉద్దేశపూర్వకంగా దురుసుగా ప్రవర్తించారని అన్నారు. రాహుల్ గాంధీ తోసివేయడంతో తమ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్పుత్ గాయపడ్డారని చెప్పారు. నడవలేని స్థితిలో ఉన్న సారంగిని చక్రాల కురీ్చలో అంబులెన్స్ దాకా తీసుకెళ్లారు. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అయితే, బీజేపీ ఎంపీలే దారికి అడ్డంగా నిల్చొని, రాహుల్ గాం«దీని ముందుకు వెళ్లనివ్వలేదని కాంగ్రెస్ సభ్యులు చెప్పారు. తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించారని బీజేపీ సభ్యులపై విరుచుకుపడ్డారు. మోదీ పరామర్శ పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఘర్షణలో గాయపడిన ప్రతాప్ సారంగితోపాటు ముకేశ్ రాజ్పుత్ చికిత్స నిమిత్తం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. సారంగి కణతకు కుట్లు పడ్డాయి. ముకేశ్ రాజ్పుత్ తలకు గాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ వారిద్దరినీ ఫోన్లో పరామర్శించారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే ఎంపీలు సైతం ఆసుపత్రికి చేరుకొని ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్పుత్లను పరామర్శించారు. బీజేపీ ఎంపీలు కర్రలతో బెదిరించారు: రాహుల్ బీజేపీ ఎంపీలు తనపై బల ప్రయోగం చేశారని, దురుసుగా తోసివేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కింద పడిపోయానని, తనకు గాయాలయ్యాయని చెప్పారు. బీజేపీ ఎంపీలే తమపై దౌర్జన్యానికి పాల్పడి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ప్రాంగణంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై బీజేపీ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. బీజేపీ ఎంపీలే తమపై భౌతిక దాడులు చేశారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కర్రలు చేతపట్టుకొని తమను అడ్డుకున్నారని, బెదిరించారని, పార్లమెంట్ లోపలికి వెళ్లనివ్వలేదని చెప్పారు. పార్లమెంట్ రెజ్లింగ్ రింగ్ కాదు: రిజిజు తమ ఎంపీ సారంగిని రాహుల్ గాంధీ నెట్టివేశారని, రౌడీలా ప్రవర్తించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే దుయ్యబట్టారు. ఒక వృద్ధుడిని నెట్టివేసినందుకు రాహుల్ సిగ్గుపడాలని అన్నారు. తాను నాలుగుసార్లు ఎంపీగా గెలిచానని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణమైన ఘటన ఏనాడూ చూడలేదని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. పార్లమెంట్ అనేది బల ప్రదర్శనకు వేదిక కాదని, కుస్తీలు పట్టడానికి రెజ్లింగ్ రింగ్ కాదని సూచించారు. గురువారం నాటి ఘర్షణపై తగిన చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు. అమిత్ షాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అంబేడ్కర్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్కు ఈ నోటీసు అందజేశారు. రాజ్యసభ సాక్షిగా రాజ్యాంగ నిర్మాతను అమిత్ షా అవమానించారని ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్లోకి వెళ్తుంటే ఎగతాళి చేశారుతాము పార్లమెంట్లోకి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు ఎగతాళి చేశారని, లోపలకి వెళ్లకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆరోపించారు. అంబేడ్కర్ను అవమానించినందుకు హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారు గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమిత్ షాను కాపాడేందుకు బీజేపీ ముందస్తుగానే కుట్ర పన్నిందని విమర్శించారు.పరస్పరం ఫిర్యాదులు మొత్తం గొడవకు రాహుల్ గాంధీ కేంద్ర బిందువుగా మారారు. ఆయనపై బీజేపీ నేతలు పార్లమెంట్ హౌస్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం, భౌతిక దాడి, హింసకు ప్రేరేపించడం వంటి ఆరోపణలతో ఫిర్యాదు అందించారు. రాహుల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు సైతం బీజేపీ ఎంపీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిశారు. రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు దారుణంగా ప్రవర్తించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఓం బిర్లాకు ఫిర్యాదు అందజేశారు. మల్లికార్జున ఖర్గే సైతం ఓం బిర్లాకు లేఖ రాశారు. బీజేపీ ఎంపీల దాడిలో తన మోకాలికి గాయమైందని పేర్కొన్నారు. ఈ దాడిపై దర్యాప్తు జరపాలని కోరారు. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్కు కూడా కాంగ్రెస్ ఎంపీలు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ ఎంపీలపై లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. నా ఆత్మగౌరవం దెబ్బతీశారురాహుల్ గాందీపై నాగాలాండ్కు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్నన్ కోన్యాక్ ఆరోపణలు చేయడం సంచలనాత్మకంగా మారింది. ఆమె గురువారం రాజ్యసభలో మాట్లాడారు. ‘‘మకరద్వారం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా రాహుల్ గాంధీ నాకు చాలా సమీపంలోకి వచ్చారు. కోపంగా చూస్తూ నాపై గట్టిగా అరిచారు. నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ ప్రవర్తన ఇదేనా?’’ అని ప్రశ్నించారు. రాహుల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్కు లేఖ అందజేశారు. ‘‘నేను గిరిజన మహిళను. రాహుల్ నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. నాకు రక్షణ కల్పించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదును పరిశీలిస్తున్నానని ధన్ఖడ్ చెప్పారు. హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమి ఎంపీల నిరసన -
ఉదయ్పూర్ప్యాలెస్లో ఉద్రిక్తతలు.. మహారాజుకు నో ఎంట్రీ
జైపూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్సమంద్ బీజేపీ ఎమ్మెల్యే, విశ్వరాజ్ సింగ్ మేవార్ను.. ఉదయ్పూర్ ప్యాలెస్లోకి రాకుండా ఆయన బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని పలువురు గాయపడ్డారు. ఈ పరిణామంతో మేవార్ రాజ కుటుంబంలో ఉన్న విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి.రాజ్పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాడ్ రాజ్య 77వ మహారాజుగా విశ్వరాజ్ సింగ్ సోమవారం పట్టాభిషికం చేశారు. చిత్తోర్గఢ్ కోటలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టాభిషేకం అనంతరం సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్పుర్లోని సిటీ ప్యాలెస్ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. అయితే ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్.. కొత్త రాజుకు వ్యతిరేకంగా ఓ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఉదయ్పుర్లోని రాజ కుటుంబానికి చెందిన ట్రస్ట్కు ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు.ఉదయ్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్యాలెస్, ఏకలింగనాథ్ ఆలయం ఈయన నియంత్రణలోనే నడుతుస్తున్నాయి. దీంతో మహారాజు విశ్వరాజ్ సింగ్ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి తన మద్దతుదారులతో కలిసి కోట వద్దకు వెళ్లిన మహారాజును , అరవింద్ సింగ్ కుమారుడు, ఆయన వర్గం వీరిని లోనికి రాకుండా అడ్డుకుంది. విశ్వరాజ్ మద్దతుదారులు బారికేడ్లను దాటుకొని బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే విశ్వరాజ్ తన మద్దతుదారులతో కలిసి ప్యాలెస్ ముందు గత రాత్రి 5 గంటల పాటు నిలుచున్నారు. అనంతరం ఆయన అభిమానులు, మద్దుతుదారులు ప్యాలెస్పై రాళ్లతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్యాలెస్ లోపల ఉన్న వ్యక్తులు కూడా రాళ్లతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. మంగళవారం ఉదయపూర్ ప్యాలెస్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. -
పండుగ వేళ దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: దీపావళి పండుగ వేళ కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాజులూరు మండలం సెలపాకలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. బత్తుల కుటుంబీకులపై పొట్లకాయ ఫ్యామిలీ కత్తులతో దాడి చేశారు. దీంతో ఒకే కుటుంబానికి ముగ్గురు మృతిచెందారు.మృతులు బత్తుల రమేష్, రాజు, చిన్నిగా గుర్తించారు. దాడి తర్వాత నిందితులు పరారయ్యారు. గాయపడ్డ నాలుగో వ్యక్తిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా ఎస్పీ విక్రాంత్ విచారిస్తున్నారు. సెలపాక గ్రామంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. -
యూపీ ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్ కంట్లో ఎస్పీ నలుసు
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) తీరు కాంగ్రెస్కు కొత్త తలనొప్పులు తెస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్ నుంచి 37 పార్లమెంట్ స్థానాలు కొల్లగొట్టామన్న అతివిశ్వాసంతో ఉన్న సమాజ్వాదీ పార్టీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని కాలదన్నుతోంది. ఎస్పీ ఒంటెద్దు పోకడలు కాంగ్రెస్కు మింగుడు పడటం లేదు. యూపీలో తమతో మాటైన చెప్పకుండా ఎస్పీ అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్కు సమస్యగా మారింది. తాము పోటీలో ఉన్న మధ్యప్రదేశ్లో మరో అభ్యర్థిని బరిలో దించి పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చింది. మహారాష్ట్రతో మహా వికాస్ అఘాడీ కూటమిలో పొరపొచ్చాలు పెరిగేలా 12 సీట్లు కోరుతూ కాంగ్రెస్కు ఎస్పీ ఇక్కట్లు తెస్తోంది. యూపీలో ఏకపక్షంగా..ఉత్తర్ప్రదేశ్లో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న 9 స్థానాల్లో ఉమ్మడిగా ముందుకెళ్లాలని ఎస్పీ, కాంగ్రెస్లు ప్రాథమిక నిర్ణయానికొచ్చాయి. అయితే ఇంతవరకు పోటీ చేసే స్థానాలపై స్పష్టత రాలేదు. హరియాణా ఎన్నికల్లో అతి విశ్వాసం కారణంగా ఓటమిపాలైన కాంగ్రెస్తో పెట్టుకుంటే లాభం లేదని ఎస్పీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఏకపక్షంగా 6 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ స్థానాల్లో తమ ఓటుబ్యాంకు పటిష్టంగా ఉందని బల్లగుద్ది చెబుతోంది. కాంగ్రెస్తో కనీస అవగాహనకు రాకుండానే సొంత అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం సైతం మొదలుపెట్టింది. ప్రకటించని మూడు స్థానాల్లో ఘజియాబాద్ సదర్, ఖైర్, కుందర్కి అసెంబ్లీ స్థానాలుండగా ఇందులో ఘాజియాబాద్ సదర్, ఖైర్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని కోరుతోంది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ ప్రాభల్యం బలంగా ఉంది. ఘజియాబాద్ సదర్లో దాదాపు 80వేల మంది దళితులు, 60వేల మంది బ్రాహ్మణులు, 40వేల మంది బనియాలు, 35వేల మంది ముస్లిం, 20వేల మంది ఠాకూర్లు ఉన్నారు. ఇక్కడ బీఎస్పీ పోటీలో ఉండటంతో దళితుల ఓట్లు తనకు అనుకూలంగా మారతాయన్న నమ్మకం కాంగ్రెస్కు లేదు. ఠాకూర్లతో పాటు సంఖ్యాపరంగా ప్రాభల్యం ఉన్న బ్రాహ్మణ, బనియా వర్గాలు బీజేపీతో ఉండటంతో ఇక్కడ గెలుపు సులభం కాదని కాంగ్రెస్ అంచనావేస్తోంది. ఇక ఖైర్లో లక్ష ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జాట్లు పూర్తిగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలకడం, 55,000 దళిత ఓట్లలో బీఎస్పీ చీలిక తెస్తుందన్న భయం కాంగ్రెస్ను వెంటాడుతోంది. దీంతో ఎస్పీ ఇస్తామన్న రెండు సీట్లపై కాంగ్రెస్ అయిష్టత చూపుతోంది. దీంతో ఉత్తరప్రదేశ్లో అసలు పొత్తులు ఉంటాయా? లేదంటే విడివిడిగా బరిలోకి దిగుతారా? అనే ప్రశ్న ఇరుపార్టీల శ్రేణుల్లో తలెత్తుతోంది. మధ్యప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహన్ రాజీనామా చేసిన బుద్నీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ను వీడి ఎస్పీలో చేరిన అర్జున్ ఆర్యను ఎస్పీ చీఫ్ అఖిలేశ్యాదవ్ బుద్నీలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ అంశం సైతం కాంగ్రెస్కు మింగుడుపడటం లేదు.మహారాష్ట్రలో అదే తీరుమహారాష్ట్రలో విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పార్టీల మధ్య పొత్తు విషయంలో చర్చలపై ఇంకా ఊగిసలాట కొనసాగుతోంది. ఈలోపే మధ్యలో దూరిన ఎస్పీ తమకు 12 సీట్లు కావాలని డిమాండ్చేస్తూ కొత్త పేచీలు మొదలెట్టింది. ఇప్పటికే రెండు స్థానాల్లో ఎస్పీ ఎమ్మెల్యేలు ఉండగా, ఆ అసెంబ్లీ స్థానాలకు చుట్టూ ఉన్న మరో 10 స్థానాలను తమకే కేటాయించాలని కోరుతోంది. ఇందులో మెజార్టీ స్థానాల్లో తమ అభ్యర్థుల్ని నిలపాలని ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాయి. ఎస్పీ అంతటితో ఆగకుండా బుధవారం ఏకంగా ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. దీంతో ఎస్పీతో ఎలా డీల్ చేయాలో కాంగ్రెస్కు అంతుపట్టని వ్యవహారంగా తయారైంది. -
జాతిరత్నాలురా మీరు..
-
జనాలను ఉరుకులు పెట్టించిన మైసూర్ గజరాజులు
బెంగళూరు: మైసూర్ ప్యాలెస్ వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దసరా వేడుకల కోసం తీసుకొచ్చిన రెండు ఏనుగులు పోట్లాడుకుని.. బీభత్సం సృష్టించాయి అక్కడ.రెండు ఏనుగులు ధనంజయ, కంజన్లు ఒకదానితో ఒకటి కొట్లాటకు దిగాయి. ఈ క్రమంలో ఒక ఏనుగు మరొకదాన్ని తరమడంతో.. జయమార్తాండ గేట్ గుండా బయట ఉన్న ఎగ్జిబిషన్ రోడ్కు వచ్చేశాయి.వెనకాల ఏనుగుపై మావటివాడు ఉన్నప్పటికీ.. ఏనుగు నియంత్రణ కాలేకపోయింది. దీంతో రోడ్లపై ఉన్న జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయితే కాసేపటికే మావటిలు, అధికారులు ఏనుగులు నియంత్రించి వెనక్కి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.మైసూర్ దసరా ఉత్సవాల్లో భాగంగా.. రాజమార్గంలో ఆనవాయితీగా జరిగే ఉరేగింపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. లక్షల మంది హాజరయ్యే ఈ ఉరేగింపునకు అలంకరణతో కూడిన గజరాజులే ప్రత్యేక ఆకర్షణ. అయితే గత రెండు దశాబ్దాల్లో.. ఉరేగింపులోగానీ, శిక్షణలోగానీ ఏనుగులు పోట్లాడుకునే ఘటనలు జరగలేదని అధికారులు అంటున్నారు. AnxietyGrips as 2DasaraElephants fight,run out of Palacepremises;Elephants pacified,BroughtBack toPalace;Noharm/damage@DeccanHerald pic.twitter.com/TZ8O4bmhoT— Shilpa P. (@shilpapdcmysuru) September 21, 2024 -
కుప్పంలో గంజాయి ‘మత్తు’.. తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ
సాక్షి, చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడటంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కత్తులు, రాడ్డులతో దాడులు చేసుకున్నారు. దాడిలో కుప్పం మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ తమ్ముడు వినయ్ తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘర్షణలో న్యాయవాది కుమారుడు, రాజకీయ నేతల కుమారులు ఉన్నట్లు తెలిసింది. టీడీపీ కార్యకర్త వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇదీ చదవండి: గనుల శాఖలో బదిలీల ‘వేలం’ -
Surat: వినాయక మండపంపై రాళ్ల దాడి.. పలువురు అరెస్ట్
సూరత్: గుజరాత్లోని సూరత్లోని ఒక గణేష్ మండపంపై అల్లరి మూకలు రాళ్ల దాడి చేశాయి. ఈ నేపధ్యంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అల్లరిమూకలు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని శాంతింపజేశారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం పోలీసులు వినాయక మండపం దగ్గర నెలకొన్న పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జీ చేయడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ స్వయంగా ఆ గణేశ్ మండపం దగ్గరకు వచ్చి, పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్, సూరత్ మేయర్ దాఖేష్ మవానీ ఆయన వెంట ఉన్నారు.సూరత్లోని సయ్యద్పురా ప్రాంతంలోని గణేష్ మండపంపై ఆరుగురు వ్యక్తులు రాళ్లు రువ్వారని మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. వీరితో పాటు వీరికి సహకరించిన మరో 27 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్ష్ సంఘ్వీ తెలిపారు. -
తెలంగాణలో సీఎం మార్పుపై టీ- కాంగ్రెస్ లో చర్చ
-
సినిమాను తలపించేలా.. చిన్న ‘పార్కింగ్’ గొడవ.. పెద్ద రచ్చ.. వీడియో వైరల్
ఢిల్లీ: నోయిడాలో కారు పార్కింగ్ స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య తగాదా హింసాత్మకంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇరుగుపొరుగు ఇళ్ల వారు రోడ్డుపైనే కొట్టుకున్నారు. నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 72లోని బి-బ్లాక్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా, స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కర్రలు, రాడ్లు, క్రికెట్ బ్యాట్ లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. రాజీవ్ చౌహాన్, నితిన్ మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం జరగ్గా.. నితిన్ తరపు వ్యక్తులు తొలుత రాజీవ్ చౌహాన్ పై దాడి చేశారు. ఆ తరువాత గాయపడిన రాజీవ్ చౌహాన్ కుమారులు రోడ్డుపై పార్కింగ్ చేసిన నితిన్ కారును ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మహిళల మధ్యకూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. Kalesh b/w Two parties over car parking in Sector 72's B Block in Noida's Sector 113 police station area, there was a lot of ruckus on the road, the car was broken with a cricket bat, Noida UPpic.twitter.com/ysMagNpWuW— Ghar Ke Kalesh (@gharkekalesh) August 26, 2024 -
Odisha: ఘర్షణల్లో యువకుని మృతి.. ఖుర్దాలో నిషేధాజ్ఞలు
ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఒక యువకుని మృతికి దారితీసింది. ఈ ఘటన నేపధ్యంలో మరిన్ని అల్లర్లు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ (బీఎన్ఎస్స్)లోని సెక్షన్ 163 కింద జిల్లాలో నిషేధాజ్ఞలు విధించారు. ఖుర్దా పట్టణ శివార్లలోని ముకుంద్ ప్రసాద్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని, ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.ఈ ఘర్షణల్లో గాయపడిన వ్యక్తిని ఖుర్దా జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరిశీలించి, అతను మృతిచెందినట్లు ప్రకటించారు. ఇరువర్గాల మధ్య జరిగిన హింసాకాండలో పలు వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఎస్.కె. ప్రియదర్శి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.ఈ హత్య అనంతరం స్థానికులు రోడ్డుపై బైఠాయించి వీరంగం సృష్టించారని పోలీసు సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ మీడియాకు తెలిపారు. అయితే నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో జనం అక్కడినుంచి వెళ్లిపోయారన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ చంచల్ రాణా మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఘర్షణల దరిమిలా ఖుర్దా మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో తక్షణమే నిషేధాజ్ఞలు విధించినట్లు ఆయన చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వాణిజ్య సంస్థలు మూతపడనున్నాయి. అయితే అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. -
గుడివాడలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య రచ్చ
-
గుడివాడ కూటమిలో భగ్గుమన్న విభేదాలు.. అర్ధరాత్రి ఉద్రిక్తత
కృష్ణా, సాక్షి: గుడివాడ కూటమి రాజకీయాల్లో విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జెండా దిమ్మపై దాడి ఘటనతో గత అర్ధరాత్రి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో టీడీపీ - జనసేన కార్యకర్తల బాహాబాహీ కాస్తలో తప్పింది.నాగవరప్పాడు జంక్షన్లో జనసేన జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేత ధారా నరసింహారావు ప్రయత్నించారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. టీడీపీ నేతలు కూటమి ధర్మం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తక్షణమే స్పందించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. టీడీపీ వాళ్లు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాగ్వాదం కాస్త గొడవగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. జనసేన కార్యకర్తలకు నచ్చజెప్పి పంపించి వేశారు. అయితే.. జనసేన జెండా దిమ్మ పై దాడిని తమ పై దాడిగా భావిస్తామంటున్న జనసేన కార్యకర్తలు, ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. అలాగే.. టీడీపీ నుంచి నరసింహారావును బహిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే రాముకు జనసేన నాయకులు హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు.. టీడీపీ నేత ధారా నరసింహారావు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన కార్యకర్తలు. -
టీడీపీ కోసం 37 కేసులు పెట్టించుకున్నా.. ఏం లాభం?
విజయవాడ, సాక్షి: అధికారంలో ఉన్నా పదవి ఉంటేనే ఏదైనా చెల్లుతుందని, ఆ పదవి లేకనే తాను ఏం చేయలేకపోతున్నానంటూ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో ఆయన ప్రసంగం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ‘‘పదవి లేక పోవడంతో నన్ను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నా. సీఐల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గింది. ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐలుగా నియమించారు. నా మాట చెల్లలేదు. చాలా ఆవేదనగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డాను. నన్ను నమ్ముకున్న వారికి నేనేం చేస్తాను. నన్ను కార్యకర్తలు క్షమించాలి.. .. 2024 ఎన్నికల సందర్భంలో రక్తంతో చంద్రబాబు నాయుడు చిత్రపటం కాళ్ళు కడిగా. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వచ్చినోళ్లను నేను అడ్డుకున్నా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అప్పుడెవరు వచ్చారో చెప్పాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. అందులోని వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, విజయ్ సాయి రెడ్డి లాంటి వాళ్లను తిట్టా. టీడీపీ కోసం ఎంతో చేశా. .. నా మీద మొత్తం 37 కేసులు ఉన్నాయి. కేవలం టీడీపీ కోసమే ఆ 37 కేసులు పెట్టించుకున్నా. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు న్యాయం జరగలేదని భావిస్తున్నా. ఈ మాట ఆవేదనతోనే చెబుతున్నా తప్ప వ్యతిరేకతతో కాదు. గత ఎన్నికల్లో ఎంతోమంది పోరాటం చేసి, ఎదురు తిరిగి టీడీపీలో టికెట్లు పొందారు. నాకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశా.. .. ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఏమైనా మాట చెల్లుతుందని 2024 ఎన్నికల్లో తెలుసుకున్నా. నా కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించలేని దుస్థితిలో నేను ఉన్నా. 2029 ఎన్నికల్లో పోరాటం చేసి అయినా టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్టు సాధిస్తా.. ఎమ్మెల్యేగా గెలుస్తా. చచ్చేంతవరకు టీడీపీలోనే ఉంటా. నా ఆవేదనను ఎంపీ కేశినేని చిన్ని టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి అని బుద్దా వెంకన్న అన్నారు. బుద్దా ప్రసంగం ముగిసిన వెంటనే ఎంపీ కేశినేని చిన్ని మైక్ అందుకున్నారు. ‘‘పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారనే విషయం నాకు తెలుసు. దీన్ని అధిష్టానం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకువెళతా. కార్యకర్తలు నాయకులు ఏమాత్రం అధైర్యపడొవద్దు. త్వరలోనే బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలకు కూడా మంచి పదవులు వస్తాయి అని బుద్దాను సముదాయించే మాటలు చెప్పారు. ఇదిలా ఉంటే.. సీఐల బదిలీలే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చిచ్చు రాజేసినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరికి, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే ప్రచారం ఉంది. అయితే.. ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల సాక్షిగా అది నిజమని తేలింది. -
Bihar: పోలీసులతో ఘర్షణ...మెడికోలకు గాయాలు!
ముజఫర్పూర్: బీహార్లోని ముజఫర్పూర్లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(ఎస్కేఎంసీహెచ్)లో వైద్య విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలో పోలీసుల చర్యను నిరసిస్తూ వైద్యులు సమ్మెకు దిగారు.పోలీసుల లాఠీచార్జి అనంతరం వైద్య విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. లాఠీ ఛార్జీకి నిరసనగా ఎస్కేఎంసీహెచ్లో వైద్యులు ఎమర్జెన్సీతో సహా అన్ని సేవలను నిలిపివేశారు. సమ్మెకు దిగుతున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటనకు దారితీసిన వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు వైద్య విద్యార్థులు బైక్పై మార్కెట్ నుంచి తిరిగి వస్తున్నారు. మెడికల్ కాలేజీ గేటు నంబర్ త్రీ దగ్గర అహియాపూర్ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ అధికారి వీరిని ఆపారు.ఈ నేపధ్యంలో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఒక వైద్య విద్యార్థిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయాన్ని మిగిలిన వైద్య విద్యార్థుల వాట్సాప్ గ్రూప్లో విద్యార్థులందరికీ షేర్ చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న విద్యార్థులంతా పోలీసు పెట్రోలింగ్ బృందాన్ని చుట్టుముట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు నాలుగు వాహనాల్లో ఎస్కెఎంసిహెచ్కి చేరుకున్నారు. అనంతరం వారు విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రోగులు, వారి బంధువులు భయాందోళనలతో ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన వైద్య విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. -
మధ్యాహ్నం భోజనం కాంట్రాక్టు కోసం టీడీపీ నేతల మధ్య ఘర్షణ
-
త్రిసూర్లో కాంగ్రెస్ ఓటమి.. కొట్టుకున్న కార్యకర్తలు
తిరువనంతపురం: లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత.. కేరళలోని త్రిసూర్లో శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, నటుడు సురేష్ గోపి గెలుపొందిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్ధి కే మురళీధరన్ ఓటమి చెందారు.అయితే పార్టీ ఓటమికి డీసీసీ చీఫ్ జోస్ వల్లూర్, త్రిసూర్ మాజీ ఎంపీ టీఎన్ ప్రతాపన్యే కారణం అంటూ జూన్ 4 తరువాత స్థానికంగా పలు పోస్టుల వెలువడ్డాయి. ప్రతాపన్, జోస్ వల్లూర్ రాజీనామా చేయాలంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ క్రమంలో తాజాగా ఓటమిపై త్రిసూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) తాజాగా సమావేశమైంది. ఈ భేటీలో పోస్టర్ల అంశంపై కార్యకర్త సురేష్ను వల్లూరు ప్రశ్నించడంతో వాగ్వాదం మొదలైంది.డీసీసీ కార్యదర్శి సంజీవన్ కురియచిర, వల్లూర్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత కొందరు కార్యకర్తలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో త్రిసూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జోస్ వల్లూరుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీసీసీ కార్యదర్శి సంజీవన్ కురియచిరా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 19 మందిపై కేసు బుక్ చేశారు. వల్లూరుతో పాటు అతని మనుషులు డీసీసీ ఆఫీసులో తనపై దాడి చేసినట్లు కురియచిర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.అయితే వల్లూరు వల్లే మురళీధరన్ ఓడిపోయినట్లు కురియాచిర ఆరోపించారు. కౌంటింగ్ రోజు సైతం జిల్లా, రాష్ట్ర నాయకత్వం తన ప్రచారానికి రాలేదని మురళీధరన్ ఆరోపించారు. -
టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
నూజివీడు:ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని పెద్ద గాంధీబొమ్మ సెంటర్లో వైఎస్సార్సీపీకి చెందిన 30వ వార్డు కౌన్సిలర్ నడకుదురు గిరీష్పై టీడీపీ కార్యకర్త నూకల సాయి అరుణ్ కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. దీంతో గిరీష్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. నూకల సాయికిరణ్ (చింటూ), నూకల సాయి అరుణ్లకు.. కౌన్సిలర్ గిరీష్కు మధ్య గతం నుంచి గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ విజయం సాధించినప్పటి నుంచి చింటూ, అరుణ్లు గిరీష్ను కవ్విస్తూ వస్తున్నారు. పశువుల ఆసుపత్రి వద్ద ఉన్న గిరీష్ చికెన్ సెంటర్ వద్దకు సైతం వచ్చి కవ్వింపు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 10.30 గంటలకు మిత్రుడు మూడు సుధీర్కుమార్ బండిపై చింటూ వెళ్తుండగా.. పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో గిరీష్ వారిని ఆపాడు. ఎందుకు కవ్విస్తున్నారంటూ చింటూను నిలదీశాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగి తోపులాట వరకు వెళ్లింది. ఈ క్రమంలో గిరీష్ చింటూపై కత్తితో దాడి చేశాడు. దీంతో అదే సెంటర్లో ట్రాఫిక్ డ్యూటీ నిర్వహిస్తున్న హోంగార్డు చంద్రశేఖర్, సుధీర్, మరికొందరు నిలువరించి గిరీష్ వద్ద ఉన్న కత్తిని లాక్కున్నారు. తన అన్న చింటూపై దాడి చేస్తున్నారన్న విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న చింటూ తమ్ముడు నూకల సాయి అరుణ్ కత్తి తీసుకుని గిరీష్పై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో గిరీష్ చావుబతుకుల మధ్య అక్కడి నుంచి పారిపోతున్నా వెంబడించారు. అక్కడి నుంచి పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకొని సీఐ ఎంవీఎస్ఎన్ మూర్తికి తెలుపగా వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చింటూను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నిందితులు నూకల సాయి అరుణ్, మూడు సుధీర్కుమార్లను అరెస్టు చేశామని, వారిపై 307 కేసు నమోదు చేశామని ఏలూరు జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి తెలిపారు. ఘటన ప్రాంతాన్ని గురువారం సాయంత్రం ఆమె పరిశీలించారు. అనంతరం పట్టణ పోలీస్స్టేషన్లో విలేకర్లతో మాట్లాడుతూ.. తమ హోంగార్డు చంద్రశేఖర్ ఎంతో ధైర్యంగా గిరీష్ చేతిలోని కత్తిని లాక్కొన్నాడని, దీంతో మరిన్ని గాయాలు కాకుండా ఆపగలిగామన్నారు. ఈ సందర్భంగా హోంగార్డుకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు నూజివీడు డీఎస్పీ జీ లక్ష్మయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
టీడీపీ, బీజేపీ, జనసేనలో రచ్చ రచ్చ
-
ఒగ్గు పూజారుల ఘర్షణ
దుబ్బాకటౌన్: సిద్దిపేట జిల్లాలో ఒగ్గు పూజారులు ఘర్షణ పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని రేకులకుంట మల్లన్న ఆలయం వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రసిద్ధి చెందిన రేకులకుంట మల్లికార్జునస్వామి ఆలయం వద్ద.. పూజల విషయమై ఒగ్గు పూజారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పూజారులు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో 10 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ గంగరాజు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పూజల విషయమై కొన్నేళ్లుగా వివాదం.. రేకులకుంట మల్లన్న ఆలయంలో కొన్నేళ్లుగా ఒగ్గు పూజారుల మధ్య పూజల విషయమై వివాదం నెలకొంది. చెరుకూరి వంశానికి చెందిన 26 మంది, కోటి వంశంవారు 22 మంది, పయ్యావుల వంశం వాళ్లు 10 మంది పూజలు చేయడంతోపాటు పట్నాలు వేస్తున్నారు. ఈ క్రమంలో పయ్యావుల వంశం పూజారులు తాము 10 మందిమే ఉన్నామని, మరో 10 మందికి అవకా«శం ఇవ్వాలని కోరడంతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో పయ్యావుల వంశంవారు దేవాదాయ శాఖ నుంచి కొత్తగా 10 మంది పూజలు చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారని ఈఓ తెలిపారు. దీంతో బుధవారం సాయంత్రం ఆలయం వద్ద పూజలు చేస్తున్న కొత్తవారిని పాత పూజారులు నిలదీయంతో ఘర్షణ మొదలైంది. పరిస్థితి చేయిదాటిపోయి దాడులకు దిగారు. ఈ ఘటనతో ఆలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దాడుల విషయంలో పూజారులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. -
ధర్మవరంలో పరిటాల, సూరి వర్గీయుల మధ్య బయటపడ్డ విబేధాలు
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రతిపక్ష టీడీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి. తాజాగా బత్తలపల్లిలో వరదాపురం సూరి వర్గీయుల వాహనాలను పరిటాల అనుచరులు ధ్వంసం చేశారు. దీంతో పరిటాల-సూరి వర్గీయులు ఒకరికొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వరదాపురం సూరి వర్గీయులు ప్రయాణిస్తున్న 10-15 వాహనాలు ధ్వంసం అయ్యాయి. నలుగురు సూరి వర్గీయులకు గాయాలయ్యాయి. దీంతో కాసేపు స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పెనుకొండలో సోమవారం సాయంత్రం జరిగే చంద్రబాబు ‘రా.. కదలిరా’ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న వరదాపురం సూరి వర్గీయులు చంద్రబాబు సభకు వెళ్లకూడదంటూ పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇక ధర్మవరం టీడీపీ టికెట్ కోసం కొంతకాలంగా పరిటాల శ్రీరామ్ - వరదాపురం సూరి గొడవపడుతున్న సంగతి విదితమే. చదవండి: నర్రెడ్డి సునీత యాక్షన్.. చంద్రబాబు డైరెక్షన్ -
ధర్మవరంలో హై టెన్షన్...వరదాపురం Vs పరిటాల..
-
ఎన్నికలకు ముందే జేఎన్యూలో ఘర్షణ.. పలువురికి గాయాలు!
దేశరాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) క్యాంపస్లో శుక్రవారం అర్థరాత్రి విద్యార్థుల మధ్య మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణపై జరిగిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తమ సభ్యుల్లో కొందరికి గాయాలయ్యాయని ఇరువర్గాలు పేర్కొన్నాయి. వార్తా సంస్థ పీటీఐ తెలిపిన ప్రకారం ఈ ఘర్షణపై జేఎన్యూ పాలకవర్గం నుంచి ఇంతవరకూ స్పందన లేదు. 2024 జేఎన్యూఎస్యూ ఎన్నికల కమిషన్ సభ్యులను ఎన్నుకోవడానికి క్యాంపస్లో విద్యార్థి సంఘాలు పరస్పరం ఘర్షణ పడ్డాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు వేదికపైకి ఎక్కి కౌన్సిల్ సభ్యులు, స్పీకర్లతో గొడవకు దిగి, యూజీబీఎంకి అంతరాయం కలిగించారని లెఫ్ట్-అనుబంధ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్) ఆరోపించింది. సోషల్ మీడియాలో రెండు గ్రూపులు షేర్ చేసిన వీడియోలలో, ఏబీవీపీ, జేఎన్యూఎస్యూ సభ్యులు నినాదాలుచేస్తూ వాదించుకోవడాన్ని చూడవచ్చు. పరిస్థితిని చక్కదిద్దేందుకు విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. -
బాబు సమక్షంలో.. కాబోయే సీఎం పవన్ అన్నందుకు..!
చిత్తూరు, సాక్షి: సీట్ల పంపకం తేలడం మాటేమోగానీ.. టీడీపీ-జనసేన కొట్లాటలు మాత్రం రోజుకో చోట బయటపడతున్నాయి. అయితే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో.. అదీ ఆయన సమక్షంలోనే ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగడం గమనార్హం. గంగాధర(జీడీ) నెల్లూరులో చంద్రబాబు నిర్వహించిన రా.. కదలిరా బహిరంగ సభలో టీడీపీ- జనసేన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. రా.. కదలిరా బహిరంగ సభలో టీడీపీ- జనసేన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు దూషించుకున్నారు. కర్రలతో దాడి చేసుకున్నారు. టీడీపీ జెండాలను కట్టిన కర్రలను తీసుకుని టీడీపీ కార్యకర్తలు జనసేన సానుభూతిపరులను తరిమి కొట్టడం కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే చంద్రబాబు సమక్షంలోనే ఈ గొడవ జరగడం గమనార్హం. అందుకు కారణం ఏంటో తెలుసా?.. కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ కొంతమంది జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారట. టీడీపీ కార్యకర్తలు అది భరించలేకే.. ఇలా డిష్యుం డిష్యుంకి దిగారు. -
Video: పార్టీ కార్యాలయంలోనే కాంగ్రెస్ నేతల ఘర్షణ
భోపాల్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ అధ్యక్షుడు కమల్ నాథ్ మద్దతుదారుల మధ్య వివాదం చెలరేగింది. నేతలు ఒకరిపై మరొకరు కుర్చీలతో కొట్టుకున్నారు. రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికార ప్రతినిధి షహర్యార్ ఖాన్, కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాల విభాగం మాజీ అధ్యక్షుడు ప్రదీప్ అహిర్వార్ మధ్య వివాదం చెలరేగింది. గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై దిగ్విజయ్ సింగ్ని ప్రదీప్ దుర్భాషలాడాడని షహర్వార్ ఖాన్ ఆరోపించారు. కార్యాలయంలోనే నేతలు వాగ్వాదానికి దిగారు. మాటలు తీవ్రస్థాయికి చేరాక ఘర్షణకు దిగారు. కుర్చీలతో కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఇతర నేతలు, సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. कमलनाथ जी समर्थक द्वारा दिग्विजय सिंह जी को गाली बकने को लेकर पीसीसी में जमकर चले लात-ठूँसे... कुर्सियाँ चली , जमकर एक दूसरे को गालियाँ बकी गई... बीचबचाव करने आये कमलनाथ समर्थक एक नेता को भी लात-ठूँसें पड़े... pic.twitter.com/wtWQ0sFsWp — Narendra Saluja (@NarendraSaluja) January 29, 2024 మధ్యప్రదేశ్లో గత నవంబర్ 17న ఎన్నికలు జరిగాయి. బీజేపీ గణవిజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఉన్న కమల్ నాథ్ సారథ్యంలో దిగ్విజయ్ సింగ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ జాతీయ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ప్రచారంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఈడీ ముందు హాజరైన లాలూ కుమారుడు -
శ్రీరాముడి ర్యాలీలో ఘర్షణ.. దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్
ముంబై: మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. ముంబై శివారుల్లో ఆదివారం కార్లు, బైకులతో ర్యాలీ తీసిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీసు స్పందించారు. మహారాష్ట్రలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని సహించేది లేదని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకల నేపథ్యంలో 10-12 మంది కార్లు, మెటర్ సైకిల్స్తో ఆదివారం రాత్రి ముంబై శివారుల్లో శ్రీరాముడి నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. మరో వర్గం టపాసులు పేల్చింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధం ఉన్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ అధారంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: Ayodhya Ram Mandir: భావోద్వేగానికి లోనైన దిగ్గజ నేతలు -
తన్నుకున్న టీడీపీ నేతలు
-
స్థల వివాదంలో తన్నుకున్న జన సైనికులు
సాక్షి, కృష్ణా జిల్లా: హనుమాన్ జంక్షన్లో జన సైనికులు రెచ్చిపోయారు. ఓ ప్రైవేట్ స్థలం సరిహద్దుపై గత కొన్ని నెలలుగా జనసేనకు చెందిన రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. స్థల వివాదం సెటిల్మెంట్ చేస్తున్న సమయంలో ఇరు వర్గాలు సవాళ్లు విసురుకున్నాయి. కొట్టుకునేందుకు సమయం చెప్పి ఇరువర్గాలు ఘర్షణకు సిద్ధమయ్యాయి. గన్నవరం నియోజకవర్గం జనసేన ఇంఛార్జి చలమలశెట్టి రమేష్.. ఒక వర్గానికి నాయకత్వం వహించారు. ఆయన వర్గం ఓవైపు.. మరో వర్గం ఇంకోవైపు రోడ్డెక్కారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎందుకు ఘర్షణ జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ధిచెప్పారు. -
యనమల ఇంట్లో టికెట్ లొల్లి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో తెరవెనుక రాజకీయాలను శాసించిన యనమల రామకృష్ణుడికి ఇంటిపోరు పెద్ద తలనొప్పిలా మారింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన సొంత నియోజకవర్గం తునిలో తన రాజకీయ వారసురాలిగా కూతురిని తెరపైకి తీసుకొచ్చి.. తమ్ముడు యనమల కృష్ణుడికి మొండిచేయి చూపుతూ చక్రం తిప్పారు. ఈ ఇంటి పోరుతో తుని నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కాకినాడ జిల్లా తునిలో పార్టీ ఇన్చార్జిగా యనమల కృష్ణుడే అన్నీ తానై చూసుకున్నారు. కష్టకాలంలో పార్టీని నడిపించిన తమ నాయకుడిని కాదని రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేలా ఎక్కడో ఉన్న రామకృష్ణుడి కుమార్తె దివ్యను రంగంలోకి దించడంతో కృష్ణుడి అనుచరవర్గం మండిపడుతోంది. ఇప్పుడు రామకృష్ణుడు తన చిన్నాన్న కుమారుడైన కృష్ణుడికి పూర్తిగా చెక్ పెట్టేందుకు.. సొంత సోదరుడి కుమారుడు రాజేష్ను రంగంలోకి దించడంతో తాడేపేడో తేల్చుకునేందుకు కృష్ణుడు సిద్ధమయ్యారు. పక్కా వ్యూహంతో తమ్ముడిని దెబ్బకొట్టిన యనమల యనమల కృష్ణుడి వల్లే టీడీపీ నష్టపోయిందనే సాకుతో అభ్యర్థి బరి నుంచి ఆయనను తప్పించడంలో రామకృష్ణుడి వ్యూహం ఫలించింది. ఇది కృష్ణుడి వర్గానికి ఏమాత్రం రుచించడం లేదు. అలాగని ఇప్పటికిప్పుడు బయటపడకుండా వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు. మరోవైపు దివ్యకు పార్టీలో ప్రతికూల వాతావరణం ఎదురు కాకుండా కృష్ణుడిని పొమ్మనకుండానే పొగపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు రామకృష్ణుడు సోదరుడి కుమారుడు రాజేష్ను పావుగా వాడు కుంటున్నారనే వాదన వినిపిస్తోంది. దివ్యను టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన సందర్భంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కృష్ణుడు.. పార్టీ మారే ఆలోచన కూడా చేశారనే ప్రచారం జరిగింది. దివ్య నియామకాన్ని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కృష్ణుడి వర్గం బాహాటంగానే వ్యతిరేకించింది. పార్టీని ఇంతకాలం మోసిన కృష్ణుడిని పక్కన పెట్టిన రోజే యనమల కుటుంబంలో ఇంటి పోరుకు తెరలేచింది. అనంతర పరిణామాల్లో ఆయనను బుజ్జగించడంతో కృష్ణుడిని దారిలోకి తెచ్చుకున్నామని రామకృష్ణుడు సంబరపడ్డారు. లోలోన రగిలి పోతున్న కృష్ణుడు సమయం కోసం వేచిచూశారు. రాజేష్ రాకతో కాక రామకృష్ణుడి సోదరుడి కుమారుడు రాజేష్, కృష్ణుడి వర్గాలు రామకృష్ణుడి సమక్షంలోనే ఇటీవల పరస్పరం కొట్లాటకు దిగారు. దివ్యను ఇన్చార్జిగా నియమించిన సమయంలో కృష్ణుడు రాజకీయంగా అస్త్రసన్యాసం చేసి కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఆ సమయంలో దివ్య వెంట రాజేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో తుని, కోటనందూరు, తొండంగి మండలాలు ఉండగా, రాజేష్ తొండంగి మండల పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఇంతలోనే కృష్ణుడు ఇటీవల పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని రామకృష్ణుడి వర్గం కృష్ణుడికి పొమ్మనకుండానే పొగబెట్టేలా చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ల మధ్య విస్తృత చర్చ సాగుతోంది. పార్టీ కార్యకలాపాలకు కృష్ణుడు దూరంగా ఉన్నంతసేపు ఖుషీగా ఉన్న ఆ వర్గానికి.. కృష్ణుడు తిరిగి పార్టీలో చురుగ్గా ఉండటం రుచించడం లేదంటున్నారు. ఇందుకు రాజేష్ను పావుగా వాడుకుంటూ కృష్ణుడిపైకి ఉసిగొల్పుతున్నారనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. తాడోపేడో తేల్చుకునేందుకు యనమల కృష్ణుడు సిద్ధం రాష్ట్ర రాజకీయాల్లో రామకృష్ణుడు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతుండగా.. ఆయన తరఫున తునిలో అన్నీ తానై చూసుకున్న కృష్ణుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. రాజకీయాల్లో తనకంటే వెనకాల వచ్చిన రాజేష్కు టీడీపీలో ప్రాధాన్యం ఇవ్వడం కృష్ణుడికి పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఉంటే రాజేష్ అయినా ఉండాలి లేక తమ నాయకుడికైనా పూర్తిగా బాధ్యతలు అప్పగించాలని కృష్ణుడి వర్గం వాదన వైరి వర్గానికి మింగుడు పడటం లేదు. తునిలో బుధవారం జరగనున్న చంద్రబాబు సభలోపు ఈ విషయంపై తాడోపేడో తేల్చాలని పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితులతో యనమల రామకృష్ణుడికి ఎటూ పాలుపోని పరిస్థితి ఉంది. ఈలోగా ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
సీఎం అంశంపై టీడీపీ, జనసేన మధ్య బయటపడ్డ విభేదాలు
ఒంగోలు టౌన్: అంగన్వాడీ కార్యకర్తల సాక్షిగా టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చంద్రబాబు సీఎం అయ్యాక అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అవుతాయని టీడీపీ నేతలు పేర్కొనగా.. జనసేన నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నాయకులు ముందుగానే చంద్రబాబు సీఎం అని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసేన నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు తెలిపేందుకు టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ సోమవారం దీక్షా శిబిరం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా బాలాజీ ప్రసంగిస్తూ.. రానున్న ఎన్నికల తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అంగన్వాడీల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళతానని చెప్పారు. చంద్రబాబే ముఖ్యమంత్రి అని ఎలా చెబుతారు? ఆ తరువాత జనసేన నాయకుడు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికల తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ చెప్పడాన్ని తప్పుపట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఇప్పుడే ఎలా చెబుతారని, ఎన్నికల తరువాత కూటమిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే వారే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంచేశారు. 2014లో పవన్ కళ్యాణ్ మద్దతుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చాలా తప్పులు చేశారని, ఇప్పుడు కూడా ఆయన అలాగే తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ సహించరని హెచ్చరించారు. కాగా.. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణమ్మ కూడా నూకసాని బాలాజీ వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. అంగన్వాడీలకు ఎంత జీతం ఇస్తారో అంకెలతో సహా టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొనాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించడం తాము మరిచిపోలేదని కొందరు అంగన్వాడీలు చెప్పుకోవడం కనిపించింది. జనసేనలో ఆధిపత్య పోరు ఇదే సందర్భంలో జనసేన పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. అంగన్వాడీలకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మధ్య పోరు మరోసారి రచ్చకెక్కింది. తొలుత జనసేన తరఫున ప్రసంగించడానికి అరుణకు మైకు ఇచ్చారు. అయితే.. ఆమె నుంచి మైకు లాక్కుని రియాజ్ను ప్రసంగించాల్సిందిగా కొందరు కార్యకర్తలు కోరారు. రియాజ్ ప్రసంగించిన తరువాత తన అనుచరులతో కలిసి వెళ్లిపోయారు. కాగా.. ఇటీవల ఒంగోలు గద్దలగుంటలో జరిగిన కార్యక్రమంలోనూ రియాజ్, అరుణ వర్గాల మధ్య వివాదం జరిగింది. -
అసంతృప్తి ‘కన్నా’లెన్నో!
సాక్షి, నరసరావుపేట: ఎన్నో ఆశలతో రాజకీయ బద్ధశత్రువు, టీడీపీ అధినేత చంద్రబాబు చెంత చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ చేశారు. వంగవీటి రంగా తర్వాత కాపు సామాజికవర్గంలో తానే కీలక నేతనని ఆయన భావిస్తుంటారు. అలాంటి కన్నా... వంగవీటి రంగా హత్యకు కారణమైన టీడీపీలో చేరడంతో రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు పంచన చేరిన తర్వాత కన్నాకు పార్థిలో అనుకున్నంత ప్రాధాన్యం లభించడం లేదు. తనకు గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం కేటాయించాలని ఆయన కోరినా బాబు వినకుండా సత్తెనపల్లికి పంపారు. అక్కడ అప్పటికే పార్టీ క్యాడర్ మూడు గ్రూపులుగా విడిపోయి ఉంది. కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు, అబ్బూరి మల్లి వర్గాలు పరస్పరం కత్తులు నూరుతున్నాయి. ఇందులో అబ్బూరి మల్లి కొంత కన్నాకు సహకరిస్తున్నా, వైవీ ఆంజనేయులు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు కోడెల శివరాం పల్లె నిద్ర పేరిట ఇంటింటికీ తిరుగుతున్నారు. శివరాంను నిలువరించే యత్నం టీడీపీ అధిష్టానం చేయడం లేదని కన్నా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. తనకే టీడీపీ టికెట్ ఇస్తుందని, ఒకవేళ ఇవ్వని పక్షంలో కోడెల శివప్రసాదరావు ఆశయ సాధన కోసం స్వతంత్ర అభ్యర్థి గా అయినా పోటీ చేస్తానని శివరాం నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతుండటం గమనార్హం. కన్నాకు వ్యతిరేకంగా కాపులను ఏకం చేస్తున్న ‘బొర్రా’ కాపు సామాజికవర్గం బలంగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని, జనసేనకే ఇక్కడ పొత్తులో సీటు ఖరారవుతుందని చెబుతున్నారు. ఆ పార్టీ ఇన్చార్జి బొర్రా వెంకట అప్పారావుకు గానీ, మరో నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కు గానీ అవకాశం రావచ్చనే చర్చ జరుగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్తో మాత్రమే సన్నిహితంగా ఉంటున్నారు. బొర్రా అప్పారావును దూరం పెడుతున్నారు. దీంతో ఆర్థిక, అంగబలం ఉన్న బొర్రా అప్పారావు నియోజకవర్గంలోని కాపు నేతలను ఏకం చేసి జనసేన వైపు ఉండేలా చూస్తున్నారు. జనసేనకు టికెట్ ఇస్తేనే ఈ నియోజకవర్గంలో కాపులకు ప్రాధాన్యం ఉంటుందని, టీడీపీ తరఫున కన్నా గెలిచినా పెత్తనం ఓ సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. జనసేనతోపాటు టీడీపీలోని గ్రూపులు కన్నాకు వ్యతిరేకంగా పనిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. దీంతో తనకు గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కన్నా లక్ష్మీనారాయణ కోరుతున్నట్టు సమాచారం. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలూ లేకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. పైగా కాపు సామాజికవర్గంలో బలమైన నేతనైనా తనకన్నా పవన్ కళ్యాణ్కే పార్టీ అధిష్టానం అధిక ప్రాధాన్యం ఇస్తుండడం ఆయనకు రుచించడం లేదని సమాచారం. టీడీపీలో చేరి తప్పు చేశారనే భావన కన్నా వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా సత్తెనపల్లి సీటును జనసేనకు కేటాయించేందుకే సుముఖంగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట
-
పవన్ కళ్యాణ్ గంగిరెద్దు రెండు ఒక్కటే
-
జనసేన-టీడీపీ పొత్తుపై కార్యకర్తల మధ్య విభేదాలు
-
గుడివాడలో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
-
SFI,ABVP విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ
-
సంగారెడ్డిలో అర్ధరాత్రి ఉద్రిక్తత..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలైన ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల నేతలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే, ప్లీనరీ సమావేశాలు ఉండటంతో ఎస్ఎఫ్ఐ నేతలు ఫ్లెక్సీలు కట్టారు. కాగా, ఫ్లెక్సీల విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం -
సెప్టెంబరు 17న పెరేడ్ గ్రౌండ్ లో సభ కోసం టీకాంగ్రెస్ సన్నాహాలు
-
హద్దులు మీరిన చర్చ.. వేళ్లు చూపుతూ..
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ కోసం జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ డిబేట్లో ఇద్దరు భారతీయ మూలాలున్న అభ్యర్థుల మధ్య చర్చ స్థాయిని మించి వాడీవేడిగా సాగింది. సంయమనం కోల్పోయి ఒకరిపై మరొకరు మాటల శస్త్రాలతో దాడికి దిగారు. ఆక్రోశంతో అరుస్తూ.. వేళ్లు చూపారు. అధ్యక్ష ఎన్నికలో ప్రాథమిక చర్చ సందర్భంగా భారతీయ సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ముఖాముఖిగా రావడం ఇదే ప్రథమం. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరు భారతీయ-అమెరికన్ ఆశావహులు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష స్థానం కోసం పోటీ పడ్డారు. విదేశాంగ విధాన సమస్యలపై జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ డిబేట్లో మాటల శస్త్రాలతో హద్దులు మీరారు. ఉక్రెయన్, రష్యా యుద్ధం అంశంపై చర్చ తారాస్థాయికి చేరింది. అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇద్దరు అభ్యర్థులు విభేదించుకున్నారు. ఉక్రెయిన్ పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానంపై రామస్వామికి సరైన అవగాహన లేదని నిక్కి హేలీ ఆరోపించారు. అమెరికా భద్రతకు ఇలాంటి అభ్యర్థులతో ముప్పు అని దుయ్యబట్టారు. అమెరికా శత్రువులకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఉక్రెయిన్ను రష్యాకు అప్పగించాలనేదే వారి అభిప్రాయమా..? అంటూ ప్రశ్నించారు. రష్యా , పుతిన్ పట్ల సానుకూల వైఖరి పనికిరాదని అన్నారు. నిక్కీ హేలి మాట్లాడుతుండగా.. తరుచూ కలుగజేసుకున్న రామస్వామి.. చెప్పేదంతా అబద్ధం అని అన్నారు. నిక్కీ హేలికి విదేశీ విధానాలపై సరైన అవగాహన లేదని అన్నారు. అమెరికా విదేశాలకు కేటాయిస్తున్న మిలిటరీ ఫోర్స్ను ఏమాత్రం వినియోగించినా.. దక్షిణ ప్రాంతం నుంచి ఎదురైతున్న తిరుగుబాటును అంతం చేయొచ్చని అన్నారు. ఈ క్రమంలో చర్చ వాడీవేడీగా సాగింది. అరుస్తూ వేళ్లు చూపించుకునే స్థాయికి చేరింది. ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్ -
జనగామ రైల్వే స్టేషన్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్వివాదం
-
బిల్ ఎంత పని చేసింది!.. రెస్టారెంట్లో కొట్టుకున్న సిబ్బంది, కస్టమర్లు!
సాధారణంగా అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి హోటల్కు వెళ్లి నచ్చిన ఫుడ్ని ఆరగించడం ఇటీవల ట్రెండ్గా మారింది. బిల్లు ఎక్కువైనా పర్లేదు కడుపు నిండా తినాల్సిందేనని కొందరు తెగ లాగించేస్తుంటారు. ఇదే తరహాలో ఓ కుటుంబం కూడా రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేసింది. అంతా అయ్యాక, వెయిటర్ బిల్లు తెచ్చాడు. బిల్లు చూసి ఆ కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఎందుకంటే ఆహార పదార్థాలే కాకుండా బిల్లుపై సర్వీస్ చార్జీలు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. రూ. 970 సర్వీస్ ఛార్జీ ఎందుకు విధించారని, హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, అది కాస్త గొడవకు దారి తీసింది. దీంతో హోటల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఆ కుటుంబ సభ్యులలో ఒకరు ట్వీట్ రూపంలో తమకు చేదు అనుభవాన్ని నెటిజన్లకు ఇలా పంచుకున్నారు.. “ఈరోజు మేము నా కుటుంబంతో కలిసి నోయిడాలోని స్పెక్ట్రమ్ మాల్, సెక్టార్-75లో ఉన్న రెస్టారెంట్ ఫ్లోట్ బై ఫ్యూటీ ఫ్రీకి వెళ్లాం. ముందుగా సిబ్బంది మెనూ కార్డ్లో ఉన్న కొన్ని పుడ్ ఐటమ్స్ను ఆర్డర్ చేస్తే.. అవి లేవని చెప్పాడు. సరే అని మేము సర్దుకుని రెస్టారెంట్లో ఉన్న అందుబాటులో ఉన్న ఆహారాన్ని తెప్పించుకుని తిన్నాము. కాసేపు అనంతరం రెస్టారెంట్ సిబ్బంది మా భోజన ఖర్చుకు సంబంధించిన బిల్లు తీసుకువచ్చి మా ముందు ఉంచాడు. అయితే సర్వీస్ ఛార్జీ ఎక్కువగా ఉందని.. దాన్ని తొలగించి బిల్ ఇవ్వమని కోరాము. కానీ సిబ్బంది కుదరదంటూ మొండిగా వాదించాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి నా సోదరుడిపై దుర్భాషలాడడంతో పాటు నాపై కూడా దాడి చేశాడని వాపోయాడు. Customers, restaurant employees clash over ‘service charge’ at Noida’s Spectrum Mall Read: https://t.co/xs0tE4fX6M pic.twitter.com/0iI0nr0QmC — Express Delhi-NCR (@ieDelhi) June 19, 2023 చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే.. -
కుర్చీలతో వీరంగం చేసిన కాంగ్రెస్ నేతలు.. వీడియో వైరల్
ముంబై: ముంబైలో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగులో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ మద్దతుదారులకు వ్యతిరేక వర్గానికి మధ్య వివాదం చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ దాడులకు దిగారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో ఏమీ మాట్లాడకుండానే అక్కడినుండి వెళ్లిపోయారు. చాలాకాలంగా మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ ను ఆ బాధ్యతల నుండి తప్పించమని ఒక వర్గం కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. మరో వర్గం మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య సమన్వయాన్ని కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది మహారాష్ట్ర కాంగ్రెస్. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా యూత్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటుచేసింది అధిష్టానం. తీరా చూస్తే ఈ రెండు వర్గాలు ఆ వేదికను రణరంగంలా మార్చి పరస్పర దాడులకు తెగబడ్డారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ వీరంగం సృష్టించారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో మాట్లాడకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. BREAKING: A meeting of the Youth Congress in a fight between two groups over the demand to remove Maharashtra Youth Congress chief Kunal Nitin Raut.pic.twitter.com/AWW7qhF2fP — ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) June 17, 2023 ఇది కూడా చదవండి: ఎన్నికలకు ఫార్ములా రెడీ చేశాం, ఇక రంగంలోకి దూకడమే.. -
తమిళనాడులో ఐటీ శాఖకు చేదు అనుభవం..
-
రెజ్లర్ల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేస్తున్న దీక్షా స్థలి ఒక్కసారిగా ఉద్రిక్తతకు కేంద్ర బిందువైంది. రెజ్లర్లు, వారికి మద్దతుగా వచ్చిన ఆప్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, చివరకు తోపులాట, ఘర్షణకు దారితీసింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దీక్షా శిబిరం వద్ద వర్షాలతో రెజ్లర్లు వినియోగిస్తున్న పరుపులు తడిసి ముద్దయ్యాయి. వారికి సాయపడేందుకు కొన్ని చెక్క మంచాలను ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతి తన కార్యకర్తలతో తెప్పించారు. వాటిని రెజ్లర్లకు ఇచ్చేందుకు అనుమతించేది లేదని, జంతర్మంతర్ను శాశ్వత దీక్షాశిబిరంగా మార్చేందుకు అనుమతులు లేవని అక్కడే మొహరించిన పోలీసులు తెగేసి చెప్పారు. అయినా సరే కొన్ని మంచాలను రెజ్లర్లకు కార్యకర్తలు ఇవ్వడం, వాటిని రెజ్లర్లు శిబిరంలోకి తీసుకెళ్తుండటంతో పోలీసులు, ఆప్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. తమకు సాయపడేందుకు వచ్చిన ఆప్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో రెజ్లర్లు వారితో వాదనకు దిగారు. దీంతో రెజ్లర్లు, కార్యకర్తలను నిలువరించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు బలప్రయోగం చేశారు. ఇరువర్గాల వాదనలు చివరకు తోపులాటలు, ఘర్షణకు దారితీశాయి. ఈ ఘటనలో రాహుల్ యాదవ్, దుష్యంత్ ఫొగాట్సహా పలువురు రెజ్లర్లకు గాయాలయ్యాయి. వినేశ్ ఫొగాట్ కంటతడి నన్ను తిట్టారు. నేలకు పడేశారు. పురుష పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారు. ఒక్క మహిళా పోలీసు అయినా ఉన్నారా ఇక్కడ?. మమ్మల్ని చంపేద్దామనుకుంటున్నారా? చంపేయండి. ఇలాంటి రోజు కోసమేనా మేం దేశం కోసం పతకాలు సాధించింది? అంటూ ప్రముఖ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ కన్నీరు పెట్టుకున్నారు. తాము సాధించిన పతకాలు, కేంద్రం ఇచ్చిన అవార్డులు, పద్మశ్రీ అన్నీ వెనక్కి ఇస్తామని రెజ్లర్లు హెచ్చరించారు. విపక్షాల తీవ్ర ఆగ్రహం రెజ్లర్లపై పోలీసుల దాడి దారుణమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ‘ఆటగాళ్లపై పోలీసుల దాడి సిగ్గు చేటు. సమాఖ్య చీఫ్ శరణ్ను ఆ పదవి నుంచి మోదీ తొలగించాలి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘కోర్టు పర్యవేక్షణలో ఘటనపై దర్యాప్తు జరగాలి. కనీసం ఘటనాస్థలికి వెళ్లి మోదీ రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించాలి’ అని కాంగ్రెస్ డిమాండ్చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితర నేతలూ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. -
ఉద్రిక్తంగా మారిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
-
నెల్లూరులో మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ
-
చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ కార్యకర్తల వాగ్వాదం
-
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో టీడీపీ వర్గాల ఘర్షణ
-
దావత్లో గొడవ.. వెలుగులోకి లీక్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: టీఎస్పీఎస్సీ ఈ నెల ఐదో తేదీన నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్స్ పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. పరీక్ష అనంతరం ఈ కేసులో నిందితులతో పాటు మరికొందరు వనపర్తిలో దావత్ చేసుకున్నారని, ఆ సమయంలో ‘లీకేజీ డబ్బులు’విషయమై గొడవ జరిగిందని, ఆ గొడవతోనే పేపర్ లీక్ విషయం బయటపడిందని తెలిసింది. ఈ బాగోతంలో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇందులో ఆరుగురు పాలమూరుకు చెందినవారేనన్న సంగతి తెలిసిందే. పంచాంగల్లో ప్రిపరేషన్..వనపర్తిలో దావత్ ఏ–1 నిందితుడు ప్రవీణ్ నుంచి పేపర్ తీసుకున్న తర్వాత.. పరీక్షకు ఒకట్రెండు రోజుల ముందు రేణు క, డాక్యా దంపతులు గండేడ్ మండలం పంచాంగల్ తండాలోని ఇంటికి వచ్చారు. వీరితో పాటు ఆమె పెద్ద నాన్న కొడుకు శ్రీనివాస్ (మేడ్చల్ కానిస్టేబుల్), ఈయన స్నేహితులు కేతావత్ నీలేశ్ నాయక్, అతడి తమ్ముడు రాజేంద్ర నాయక్, వికారాబాద్ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల తండాకు చెందిన పత్లావత్ గోపాల్ నాయక్ కూడా వచ్చినట్లు సమాచారం. రేణుక తమ్ముడు రాజేశ్వర్ కూడా వీరితో జత కాగా.. వారిని అక్కడే చదివించి 5న సరూర్నగర్లోని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. పరీక్ష రాసిన తర్వాత రేణుక కారులో రాజేశ్వర్, శ్రీనివాస్, నీలేశ్, రాజేంద్ర నాయక్ వనపర్తి ఇంటికి వచ్చారని, అంతా కలిసి దావత్ చేసుకున్నారని సమాచారం. ఆ సమయంలో డాక్యా, గోపాల్నాయక్ వారితో ఉన్నారా? లేరా? అనేది తెలియలేదు. పేరులో తప్పు సరిచేసుకునేందుకు వెళ్లి.. రేణుకకు హిందీ పండిట్ ఉద్యోగం వచ్చిన తర్వాత రికార్డుల్లో ఆమె పేరులో తప్పుదొర్లింది. దీన్ని సరిచేసుకునేందుకు వెళ్లిన క్రమంలో ప్రవీణ్తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారు తరచుగా కలిసేవారని.. రేణుక టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లేదని తెలిసింది. ఈ క్రమంలోనే కవిత, ఆమె భర్త డాక్యా, ప్రవీణ్తో కలిసి పేపర్ లీకేజీ స్కెచ్ వేశారు. రేణుక సొంతూరు గండేడ్ మండలంలోని మన్సూర్పల్లి కాగా అత్తగారిల్లు ఇదే మండలంలోని పంచాంగల్ తండా. ఇలావుండగా వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం ఈ రెండు తండాల్లో పర్యటించి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఘర్షణ, బెదిరింపుతో.. దావత్ క్రమంలో రేణుక డబ్బుల విషయం లేవనెత్తినట్లు సమాచారం. ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం కుదరగా.. రూ.5 లక్షలు చొప్పున ఇచ్చి మిగతా డబ్బు తర్వాత ఇస్తామని రేణుకకు చెప్పారు. అయితే ఆమె ఇప్పుడే పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నీలేశ్నాయక్, రేణుక మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగినట్లు సమాచారం. నీలేశ్ను రేణుక బెదిరించడంతో ఆయన బయటకు వచ్చి డయల్ 100కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ఇంటికి వచ్చి అందరినీ తీసుకెళ్లారు. వారు విచారించడంతో లీకేజీ డొంక కదిలినట్లు తెలుస్తోంది. -
భూపాలపల్లిలో రచ్చకెక్కిన ఫ్లెక్సీల వివాదం
-
హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ
-
హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ
-
కోమటిరెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం ఆయన జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని ఇటుకలపాడులో పర్యటించారు. అయితే.. ఈ పర్యటనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని హాజరైన కోమటిరెడ్డి ప్రసంగించారు. రోడ్లు బాగోలేవని, ఇటుకలపాడుకు రావడానికి మూడు గంటలకు పైగా సమయం పట్టిందని.. సీఎం కేసీఆర్పై ఆయన విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ వ్యాఖ్యలు అక్కడే ఉన్న కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి. బొడ్రాయి ప్రతిష్టాపనకు వచ్చి రాజకీయం మాట్లాడుతున్నారంటూ అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనపై కుర్చీలు, కర్రలు విసిరి దాడి చేసేందుకు యత్నించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అయితే దాడి నుంచి ఆయన తప్పించున్నారు. ఈ క్రమంలో.. పోటీగా రంగంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యకర్తలతో తోపులాటకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ
-
Hyderabad: భర్తతో గొడవపడి.. భార్య అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: భర్తతో గొడవపడి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన గురువారం హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... హయత్నగర్ డివిజన్ సూర్యానగర్లో నివసించే మహీంద్రారెడ్డి ప్రైవేటు ఉద్యోగి. ఆయన భార్య శిరీష(25) బుధవారం రాత్రి గుర్తు తెలియని వారితో ఫోన్లో చాటింగ్ చేస్తుంది. ఈ విషయమై భర్త ప్రశ్నించడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శిరీషపై భర్త చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త మహీంద్రారెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: వీబీఐటీ కేసు: వల వేసి.. సవాల్ విసిరి.. పోలీసులకు చిక్కాడు -
పటాన్చెరు: భార్యాభర్తల మధ్య గొడవ.. ఆపేందుకు వెళ్లిన వదినపై..
సాక్షి, హైదరాబాద్: భార్యాభర్తల మధ్య వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బొల్లారం సీఐ సురేందర్ రెడ్డి, అమీన్పూర్ ఎస్ఐ కిష్టారెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురు మండలం జయ్యారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ బతుకుదెరువు కోసం వచ్చి బాల్నగర్ చింతల్లో ఉంటున్నారు. కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శ్రీనివాస్ అతడి భార్య సునీత కొన్ని రోజులుగా గొడవపడుతున్నారు. సునీత అమీన్పూర్ శ్రీవాణి నగర్లో ఉంటున్న తన అక్క సుజాత(46) వద్దకు నెల క్రితం వచ్చింది. అక్కడే ఉంటూ బాచుపల్లి సమీపంలోని అరవిందో పరిశ్రమలో కూలి పనిచేస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం 5.30 గంటలకు సునీత డ్యూటీకి వెళ్లింది. వెనుక అక్క సుజాత, ఆమె కుమారుడు సాయికిరణ్ బైక్పై వచ్చారు. పరిశ్రమ సమీపంలో సునీత ఆమె భర్త శ్రీనివాస్ గొడవపడుతున్నారు. వారిని ఆపే ప్రయతనం చేసేందుకు వెళ్లిన సుజాత, సాయికిరణ్తో పాటు సునీతపై శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. దాడిలో సుజాత అక్కడికక్కడే మృతిచెందగా, సునీత, సాయికిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక మమత ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి, సీఐ వేణుగోపాల్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చదవండి: (భర్త ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ప్రియుడిని రప్పించి చాకచక్యంగా..) -
కామారెడ్డిలో కాసేపు హైటెన్షన్.. రైతులు, BRS నేతల మధ్య వాగ్వాదం
-
గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ఘర్షణ
-
కర్రలతో కొట్టుకున్న ప్రైవేటు కాలేజ్ విద్యార్థులు.. వీడియో వైరల్
సాక్షి, ఖమ్మం: నగరంలోని ఓ ప్రైవేటు కళాశాల స్టూడెంట్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీనియర్, జూనియర్ విద్యార్థులు కొట్టుకున్నారు. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. కాలేజీ నుంచి విద్యార్థులు బయటకు వస్తున్న సమయంలో గొడవ జరిగింది. జూనియర్లు కాపుకాసి సీనియర్ విద్యార్థిని చితకబాదారు. జూనియర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో సీనియర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో యువకుడిని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఓ విషయంలో తెలెత్తిన వివాదం కారణంగా ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. గాయపడిన విద్యార్థి ఓ కార్పొరేటర్ కొడుకుగా తెలుస్తుంది. పట్టపగలే విద్యార్థులు కర్రలతో దాడి చేసుకోవడం వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. కాగా విద్యార్థులు కొట్టుకున్న దృశ్యాలు కళాశాల గేట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. చదవండి: సంగారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం.. చిరుత చిక్కిందిలా! -
మాచర్లలో పథకం ప్రకారం రెచ్చిపోయిన టీడీపీ ముఠా
-
చైనా ఆర్మీని తరిమికొట్టిన భారత బలగాలు.. వీడియో వైరల్
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టర్లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవల భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్9న భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించిందని.. డ్రాగన్ చర్యను భారత బలగాలు ధీటుగా అడ్డుకున్నాయని మంగళవారం లోక్సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అయితే చైనా, భారత్ దళాల దాడి ఘటనను కేంద్రం ధృవీకరించిన మరుసటి రోజే ఓ వీడియో బయటకు వచ్చింది. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. చైనా దళాలు భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.భారత్ భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న చైనా జవాన్లను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పి కొట్టాయి. సరిహద్దు దాటాలనుకుంటున్న చైనా ఆర్మీని.. భారత సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారు. గుంపుగా వచ్చిన చైనా దళాలపై ఇండియన్ ఆర్మీ లాఠీలతో మూకుమ్మడిగా దాడి చేసింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో డిసెంబర్ 9 జరిగిన ఘటనకు సంబంధించినది కాదని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. 2020లో తూర్పు లడఖ్లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ఈ దాడి ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
భారత్-చైనా సైనికుల ఘర్షణపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై స్పందించింది అమెరికా. తవాంగ్ ఘర్షణ తలెత్తగా ఇరు దేశాలు త్వరగా వెనక్కి తగ్గి ఉద్రిక్తతలు సద్దుమణగటం ఆహ్వానించదగ్గ విషయమని అమెరికా శ్వేతసౌధం పేర్కొంది. వైట్హౌస్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్-పీయెర్ మాట్లాడారు. భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వివాదాస్పద సరిహద్దుల అంశంపై ప్రస్తుత దౌత్యపరమైన మార్గాల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. ‘ఘర్షణ నుంచి ఇరు పక్షాలు వెనక్కి తగ్గటం ఆహ్వానించదగ్గ విషయం. మేము పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. వివాదాస్పద అంశాలపై ద్వైపాక్షిక మార్గాల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలి. ఈసారి ఘర్షణ వాతావరణం త్వరగా సద్దుమణిగినందుకు సంతోషం.’ అని తెలిపారు శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్-పీయెర్. మరోవైపు.. సరిహద్దులో ఉద్రిక్తతలు సద్దుమణిగేందుకు భారత్ తీసుకున్న చర్యలకు తమ మద్దతు ఉంటుందని పెంటగాన్ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద డిసెంబర్ 9న సుమారు 300 మంది చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ సైనికులు భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారిని భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. భారత సైనికులు చైనా కుతంత్రాన్ని దీటుగా తిప్పికొట్టారని పార్లమెంట్లో ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇదీ చదవండి: సైనికుల ఘర్షణపై స్పందించిన చైనా.. సరిహద్దులో పరిస్థితులపై ప్రకటన -
మోదీ సర్కారు మెతక వైఖరి వల్లే చైనా ఆగడాలు!
న్యూఢిల్లీ: సరిహద్దు విషయంలో నిజాలు బయటకు రాకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ ఆరోపించారు. మన ప్రభుత్వ వైఖరి వల్లే చైనా రెచ్చిపోతుందని అన్నారు. మోదీ సర్కారు మెతక వైఖరిని డ్రాగన్ ఉపయోగించుకుంటోందని చెప్పారు. అరుణాచల్ప్రదేశ్లో ఎల్ఏసీ వద్ద భారత్, చైనా జవాన్ల ఘర్షణ నేపథ్యంలో ఆయన సోమవారం ట్వీట్ చేశారు. చైనా నుంచి దాడులు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని, మేల్కొల్పేందుకు తాము ప్రయత్నిస్తున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాజకీయ ప్రతిష్టను కాపాడుకొనేందుకు చైనాపై నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. సరిహద్దుల్లో మన సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలను చూసి గర్వపడుతున్నామని జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. చైనా చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. దేశం కంటే ఎవరూ ఎక్కువ కాదని, నరేంద్ర మోదీ మాత్రం తన వ్యక్తిగత ప్రతిష్టం కోసం దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపించారు. సరిహద్దుల్లో ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడించారు. సరిహద్దులో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ.. ఇరు వర్గాలకు స్వల్ప గాయాలు! -
పొన్నూరు సభలో చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
సాక్షి, గుంటూరు జిల్లా: పొన్నూరు చంద్రబాబు సభలో తెలుగు తమ్ముళ్లు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఐలాండ్ సెంటర్లో చంద్రబాబు ప్రసంగిస్తుంటే.. ఆ పక్కనే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లో దూరారు. తెలుగు తమ్ముళ్లు పీకల వరకు మద్యం సేవించి బయటికి వచ్చి తాగిన మైకంలో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. ఒక వైపు చంద్రబాబు ప్రసంగిస్తుంటే.. మరో వైపు టీడీపీ నేతలు మాత్రం ఆయనను పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో పాటు కాళ్లతో ఎగిరేగిరి తన్నుకున్నారు. ఇది చూసిన జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. చివరకు పోలీసులు రంగంలో దిగడంతో తెలుగుదేశం పార్టీ తాగుబోతు తమ్ముళ్ల గొడవ సద్దుమణిగింది గొడవపడేవారిని విడదీసి పోలీసులు పంపించేశారు. చదవండి: చంద్రబాబు వీక్నెస్ అదే.. కొంప మునగడం ఖాయమా? -
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు టీడీపీలో వర్గపోరు
-
Viral Video: అవమాన భారం.. తీసింది ప్రాణం
సాక్షి, జడ్చర్ల: తరగతి గదిలో ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ ఒక ఆత్మహత్యకు దారి తీసింది. ఓ విద్యార్థిని మరో విద్యార్థిని చెంపపై కొట్టిన దృశ్యాన్ని ఇతరులు వీడియో తీసి వైరల్ చేయడంతో.. చెంపదెబ్బ తిన్న విద్యార్థిని మనస్తాపంతో పురుగులమందు తాగింది. దీనిపై ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఘటన జరిగింది. ఆందోళన సమాచారం అందిన పోలీసులు కాలేజీ వద్ద భారీగా మోహరించారు. విద్యార్థులను వెనక్కి పంపించి ప్రధాన గేటు మూసివేసినా.. విద్యార్థిని కుటుంబ సభ్యులు కాలేజీలోకి చొచ్చుకువచ్చి ప్రిన్సిపాల్, లెక్చరర్లతో వాగ్వాదానికి దిగారు. అసలేం జరిగింది? నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం హనుమాన్తండాకు చెందిన ముడావత్ మైనా (19) జడ్చర్లలోని బీఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ (బీజెడ్సీ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మంగళవారం తరగతి గదిలో మైనాతో తోటి విద్యార్థిని దేవయాని గొడవ పెట్టుకుంది. మైనా చెంపపై కొట్టింది. ఈ గొడవను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ చిన్నమ్మ, లెక్చరర్లు గొడవపడిన విద్యార్థినులకు అదేరోజున కౌన్సెలింగ్ ఇచ్చి సర్దిచెప్పారు. కానీ తీవ్ర మనస్తాపానికి గురైన మైనా బుధవారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ వద్ద ఉద్రిక్తత దీనితో మైనా కుటుంబ సభ్యులు, బంధువులు, కొందరు విద్యార్థులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. కాలేజీలోకి చొచ్చుకువెళ్లి ప్రిన్సిపాల్, లెక్చరర్లతో వాగ్వాదానికి దిగారు. మైనాపై దాడి జరిగితే తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ సమయంలో ప్రిన్సిపాల్ చిన్నమ్మ అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. కొందరు విద్యార్థులు ఆమెను వైద్యం కోసం బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీనితో ఒక వైద్యుడిని కాలేజీకి రప్పించి ప్రిన్సిపాల్కు చికిత్స అందజేశారు. మృతదేహంతో రాస్తారోకో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో మైనా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తర్వాత స్వగ్రామానికి తరలిస్తుండగా.. జడ్చర్లలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ వద్ద ఆందోళనకారులు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. వేరే అమ్మాయి ఫొటో తీసిందని గొడవ! పెళ్లయిన ఓ విద్యార్థిని తరగతి గదిలో తోటి విద్యార్థులైన అబ్బాయిలతో మాట్లాడుతుండగా మైనా ఫోన్లో ఫొటో తీసిందని.. సదరు విద్యార్థిని భర్త మిత్రుడికి ఆ ఫొటోను పంపడంతో గొడవ జరిగిందని ప్రిన్సిపాల్ చిన్నమ్మ, లెక్చరర్లు మీడియాకు వివరించారు. సదరు వివాహిత విద్యార్థిని స్నేహితురాలు దేవయాని జోక్యం చేసుకుని మైనా చెంపపై కొట్టిందన్నారు. ఈ విషయం తెలియడంతో ముగ్గురు విద్యార్థినులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపామని తెలిపారు. లెక్చరర్ వేధింపులే కారణం ఓ లెక్చరర్, ఇద్దరు విద్యార్థినుల కారణంగా తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మైనా తల్లి మణెమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపించారు. లెక్చరర్ కారణంగానే మైనా ఆత్మహత్య చేసుకుందని రాసిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. సదరు లెక్చరర్ కొందరు విద్యార్థినులతో చనువుగా ఉండేవాడని.. సదరు లెక్చరర్ ప్రోత్సాహంతోనే విద్యార్థినులు మైనాపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నాం: పోలీసులు బిజినేపల్లి: మైనా ఆత్మహత్యకు లెక్చరర్ వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యులు తిమ్మాజిపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై షంషుద్దీన్ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు. బుధవారమే యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, గురువారం వారు చేసిన ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
కొడుకులు వారసులు కాలేరు! ఏక్నాథ్ షిండే సెటైర్లు
ముంబై: ముంబైలో శివసేన ప్రత్యర్థి వర్గాల మద్య దసరా ర్యాలీలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్ణణ జరగడానికి కొద్దిసేపటి ముందే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే.. ఉద్ధవ్ థాక్రేని లక్ష్యంగా చేసుకుని సెటైరికల్ ట్విట్లు పోస్ట్ చేశారు. ఈ మేరకు షిండే ట్విట్టర్లో...పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాక్రే వారసత్వంగా కొడుకులు రావాల్సిన అవసరం లేదంటూ ఉద్ధవ్ థాక్రేని ఉద్దేశిస్తూ సెటైర్లు విసిరారు. అలాగే ప్రముఖ కవి హరివంశరాయ్ బచ్చన్ గురించి ప్రస్తావిస్తూ... నా కొడుకు కావడం వల్ల అతను నా తర్వాత వారసుడు కాలేడు, నా తదనంతరం ఎవరైతే వస్తారో వారే తన కొడుకు అవుతాడని చమత్కరించారు. అంతేగాదు నిజమైన శివసేనకు నాయకత్వం వహించనప్పుడు థాక్రే వారసత్వం గురించి ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఉద్ధవ్ థాక్రే తన తండ్రి నిలబెట్టిన పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విసయమై థాక్రే, ఏక్నాథ్ షిండేల మధ్య న్యాయపోరాటం జరుగుతుంది. అలాగే ఇరువురి మధ్య సంప్రదాయ దసరా ర్యాలీ విషయమై కూడా న్యాయపోరాటం చేస్తున్నారు. ఐతే ఉద్ధవ్ థాక్రేకి ఈవిషయంలో బాంబే హైకోర్టు సంప్రదాయ వేదిక శివాజీ పార్క్ను మంజూరు చేయడంతో కాస్త ఊరట లభించినట్లయింది. (చదవండి: కశ్మీర్ను శాంతివనంగా మారుస్తాం! పాక్తో చర్చలపై హోం మంత్రి ఏమన్నారంటే..) -
నల్గొండలో కూలీల మధ్య ఘర్షణ
-
నల్లగొండ డీఈఓ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తం
సాక్షి, నల్లగొండ: నల్లగొండలోని డీఈఓ కార్యాయలయం వద్ద కూలీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కూలీల అడ్డా వద్ద లోకల్ కూలీలు, బీహార్ కూలీలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. కూలీ డబ్బుల విషయంలో చెలరేగిన చిన్న వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. ఈ ఘటనలో పలు వాహనాల అద్దాలు ధ్వంసం కాగా, పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: (మన మైసూర్.. ఇల్లెందు) -
Ranga Reddy: ఫాస్ట్ ట్యాగ్ విషయంలో గొడవ.. కొట్టుకున్న సర్పంచ్, టోల్ ప్లాజా సిబ్బంది
సాక్షి, రంగారెడ్డి: షాద్ నగర్ పట్టణ పరిధిలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న రాయికల్ టోల్ ప్లాజా వద్ద బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టోల్ ప్లాజా సిబ్బందికి, జడ్చర్ల పరిధిలోని నసురుల్లాబాద్ గ్రామ సర్పంచ్ ప్రనిల్ చందర్కు మధ్య వాగ్వివాదం జరగడంతో ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. సర్పంచ్ ప్రనిల్ చందర్ టోల్ ప్లాజా వద్ద వెళ్తుండగా అతని ఫాస్ట్ ట్యాగ్లో డబ్బులు అయిపోయాయి. అతను రీఛార్జ్ చేసుకునే క్రమంలో కొంత ఆలస్యం అయింది. వెనుక వాహనాల వారు హారన్స్ కొడుతుండడంతో వాహనాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో టోల్ ప్లాజా సిబ్బందికి ఇతనికి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు దూషించుకోవడంతో గొడవ ప్రారంభమైంది. చదవండి: హైదరాబాద్లో మహిళ హంగామా.. ట్రాఫిక్ కానిస్టేబుల్తో గొడవ అయితే సర్పంచ్ ప్రనిల్ చందర్ సర్పంచుల సంఘంలో నాయకుడిగా ఉన్నారు. సర్పంచ్ ప్రనిల్ చందర్పై దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, స్నేహితులు రాయికల్ టోల్ ప్లాజా వద్దకు వచ్చి టోల్ ప్లాజా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రనిల్ చందర్ తరపున అనుచరులు హంగామా సృష్టించి, టోల్గేట్ క్యాబిన్లను అద్దాలను ధ్వంసం చేశారు. పరస్పర దాడులతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున అనుచరులు తరలిరావడంతో ప్రనిల్ తో పాటు పలువురికి గాయాలు కూడా అయ్యాయి. -
విశాఖ తీరంలో మరోసారి ఉద్రిక్తత
విశాఖపట్నం: విశాఖ తీరంలో మరొకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రింగు వలలో వేట సాగిస్తున్నారంటూ ఒక గ్రామానికి చెందిన మత్స్యకారుల బోట్లను మరో గ్రామస్తులు నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ నగరానికి ఆనుకుని ఉన్న మత్స్యకారపల్లిలో కొందరు రింగ్ వలలతో చేపల వేట కొనసాగిస్తున్నారు. దీనికి సమీపంలో ఉన్న జాలరిపేట గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై రెండు వర్గాల మధ్య ఆరు నెలల క్రితం ఘర్షణ చెలరేగడంతో మంత్రి అప్పలరాజు, కురసాల కన్నబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ దశలో నిన్న రాత్రి చేపల వేట ముగించి తీరంలో లంగర్ వేసిన ఆరు బోట్లకు నిప్పు పెట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య మరొకసారి వివాదం ఏర్పడింది. తమ వలలకు దారుణంగా నిప్పు పెట్టి నష్టపరిచారని మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి రెండు గ్రామస్తుల మధ్య వివాదం చెలరేగ కుండా అడ్డుకున్నారు. అధికారుల ఆదేశాల మేరకు చేపల వేట సాగుతుందని అంతవరకు ప్రజలు సమయంనంతో ఉండాలని సూచించారు. -
మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి.. వంట విషయంలో గొడవపడి
సాక్షి, హైదరాబాద్: వంట విషయంలో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేపాల్కు చెందిన బాదల్ తమాంగ్(29), సకిల మిశ్ర మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మణికొండ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. తమాంగ్ స్థానికంగా ఓ సెలూన్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి వంట విషయంలో తమాంగ్ భార్యతో గొడవపడి అన్నం తినకుండా ఆమె ఉన్న గదికి బయట నుంచి గడియ పెట్టి బయటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం 6.45 గంటలకు భార్య బయటకు వచ్చి చూడగా భర్త కనిపించలేదు. బాత్రూమ్కు వెళ్లగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా తాడుతో కిటికీ చువ్వలకు ఉరి వేసుకొన్నాడు. ఇరుగు పొరుగు సాయంతో బయటకు తీయగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. వెంటనే రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భార్య చేసిన పనికి.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com -
అర్థరాత్రి నడిరోడ్డుపై కొడవళ్లతో విధ్వంసం ... వీడియో వైరల్
కొంతమంది మద్యం తాగితే ఆ మత్తులో వారి చేసే హంగామా మామాలుగా ఉండదు. ఒక్కోసారి బార్ లేదా పబ్ల వద్ద ఫుల్గా తాగి ఏదో చిన్న చిన్న విషయాలకే ఇగోకి వెళ్లి ఆ మత్తులోనే ఘోరమైన అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక గ్రూప్ బార్లో జరిగిన చిన్న వివాదాన్ని సీరియస్ తీసుకుని అర్థరాత్రి అని కూడా లేకుండా వెంటపడి మరీ దాడి చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ ఘటన హంకాంగ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...హాంకాంగ్లో లాన్ క్వాయ్ ఫాంగ్ ప్రాంతంలోని బార్లో రెండు గ్రూప్ల మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఆ గ్రూప్లలో ఒక బృందం ఆ బార్ నుంచి నిష్క్రమించి వెళ్లిపోయింది. ఐతే మరో గ్రూప్ ఆ వివాదాన్ని కాస్త సీరియస్ తీసుకుని వారి పై దాడి చేసేందుకై వారిని ఫాలో అవుతూ.. ఒక లగ్జరీ కారులో బయలుదేరారు. ఇంతలో ట్రాఫిక్ జంక్షన్లో కారులన్ని ఆగిపోయి ఉన్నాయి. అంతే సదరు గ్రూప్ తమ కారుని తమ ప్రత్యర్థి గ్రూప్కి సంబంధించిన తెల్ల కారు పక్కనే ఆపి మరీ.. కొడవళ్లు తీసుకుని దాడి చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు మొత్తం ఎనిమిది మంది నడి రోడ్డుపై కొడవళ్లతో పెద్ద బీభత్సం సృష్టించారు. ఇంతలో వెనెక ఉన్న ఒక నలుపు వ్యాన్ ఆ రెండు కార్ల మధ్యలోంచి దూసుకుపోయింది. ఆ తర్వాత ఏమైందో ఏమో ఇంతలో ఆ బృందం అకస్మాత్తుగా వెనక్కి తమ కారు వద్దకు వచ్చి ఎక్కి హడావిడిగా వెళ్లేందుకు యత్నిస్తారు. ట్వీస్ట్ ఏంటంటే అక్కడే సమీపంలో పోలీసులు ఉన్నారు. వెంటనే వారు స్పందించి అక్కడికక్కడే దాడిచేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అంతేకాదు ఆ ప్రాంతంలో కర్ఫ్యూని కూడా విధించారు. ఐతే ఈ ఘటనకు సంబంధించిని వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: మరణ శిక్ష రద్దు చేసేందుకు సమ్మతించిన ప్రభుత్వం!) -
తన గర్ల్ ఫ్రెండ్ కు హాయ్ చెప్పాడంటూ టెన్త్ విద్యార్ధిపై దాడి
-
ఢిల్లీ జేఎన్యూలో విద్యార్థి సంఘాల ఘర్షణ
న్యూఢిల్లీ: రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఆదివారం తీవ్ర ఘర్షణ చెలరేగింది. దాంతో క్యాంపస్లో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారు. క్యాంపస్లోని కావేరీ హాస్టల్ మెస్లో మాంసాహారం వడ్డించకుండా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్యూఎస్యూ) కార్యకర్తలు ఆరోపించారు. క్యాంపస్లో రామనవమి పూజకు జేఎన్యూఎస్యూ నేతలు ఆటంకాలు సృష్టించారని ఏబీవీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. దాంతో రగడ మొదలయ్యింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు చెప్పారు. కానీ, దాదాపు 60 మందికి గాయాలయ్యాయని జేఎన్యూఎస్యూ నేతలు పేర్కొన్నారు. తమ కార్యకర్తలు 10 మంది గాయపడ్డారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. -
బీజేపీ–టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సోషల్ మీడియాలో బీజేపీ నాయకుడు చేసిన పోస్టు ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీస్స్టేషన్ ఎదుటే బీజేపీ–టీఆర్ఎస్ వర్గాలు గొడవపడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన బీజేవైఎం మండల అధ్యక్షుడు బోనాల సాయికుమార్ టీఆర్ఎస్ కార్యకర్త శివరామకృష్ణపై అనుచిత వ్యాఖ్యలుచేస్తూ రెండు రోజుల కిందట సోషల్ మీడియాలో పోస్టుపెట్టారు. దీనిపై స్పందించిన టీఆర్ఎస్ కార్యకర్తలు ముగ్గురు శుక్రవారం రాత్రి పదిర గ్రామంలోని సాయికుమార్ ఇంటికెళ్లారు. ఆ సమయంలో సాయికుమార్ లేకపోవడంతో అతని తల్లిదండ్రులు మణెమ్మ, రవీందర్లతో అమర్యాదగా మాట్లాడారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మణెమ్మ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గోపి, మరికొంత మందితో కలిసి ఎల్లారెడ్డిపేట ఠాణాకు వచ్చారు. ఇది తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు స్టేషన్కు చేరుకోగా ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈక్రమంలోనే స్టేషన్లో ఉన్న గోపితోపాటు మండల ఉపాధ్యక్షుడు రామచంద్రం, మరో ఇద్దరిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేశారు. రామచంద్రంకు బలమైన గాయాలవడంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీస్స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో సీఐ మొగిలి, ఎస్సై శేఖర్, సిబ్బందితో కలిసి ఇరువర్గాలను శాంతింపజేశారు. దాడిపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్టేషన్ ఎదుటే ఇరు వర్గాలు రాళ్లతో దాడిచేసుకున్నాయి. సిరిసిల్ల ప్రాంతంలో బలపడుతున్న బీజేపీని అణచివేయాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ డైరెక్షన్లోనే తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని గోపి ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, గ్రామస్థాయి కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు, నాయకులు సోషల్మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తూ రెచ్చగొడుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు. -
గులాబీలో నేతల మధ్య గలాట
-
కుక్కపిల్లపై మోజుతో ఆ యువకుడు ఏం చేశాడంటే.. చివరికి..
పెనుకొండ(అనంతపురం జిల్లా): కుక్క పిల్ల కోసం చోటు చేసుకున్న ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. పెనుకొండ మండలం మంగాపురంలో రైతు అమరనాథరెడ్డి తన పొలంలోని షెడ్ వద్ద ఆదివారం ఉదయం ఓ కుక్క పిల్లను కట్టి ఉంచాడు. కుక్కపిల్లపై మోజుతో దానిని అదే గ్రామానికి చెందిన యువకుడు శబరీష్ ఎత్తుకెళ్లాడు. కాసేపటి తర్వాత ఈ విషయం తెలుసుకున్న అమరనాథరెడ్డి.. వెంటనే శబరీష్ను మందలించాడు. చదవండి: పాపం ఏమైందో గానీ పెళ్లయిన నెలకే జవాను, భార్య ఆత్మహత్య ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా శబరీష్ ఇంటికి వెళ్లి తన సోదరుడు మంజునాథరెడ్డికి విషయం తెలిపి.. అమరనాథరెడ్డి వద్దకు పిలుచుకెళ్లాడు. ఆ సమయంలో ఘర్షణ చోటు చేసుకుని పరస్పరం దాడి చేసుకున్నారు. ముగ్గురికీ గాయాలయ్యాయి. ఘర్షణకు సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
విశాఖలో మత్స్యకారుల మధ్య రింగు వల వివాదం
-
బీజేపీ ఎంపీ అరవింద్ పర్యటన నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
ఆ సినిమా తర్వాత అందుకే చిరంజీవితో పని చేయలేదు: కోటి
Music Director Koti Comments On Clash With Chiranjeevi Goes Viral: మ్యూజిక్ డైరెక్టర్ కోటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్హిట్ సినిమాలకు బ్లాక్ బస్టర్ సాంగ్స్ను అందించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి-కోటి కాంబినేషన్లో పదహారేళ్ల వయసు, అందమా అందుమా, ప్రియ రాగాలే.. వంటి ఎన్నో సూపర్హిట్ సాంగ్స్ వచ్చాయి. ఆ సమయంలో ఇద్దరికి మంచి అనుబంధం ఉండేదని, అయితే ఓ సంఘటన కారణంగా కొంత గ్యాప్ వచ్చిందని కోటి అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇంటర్వ్యూలో ఇందుకు ఇద్దరి మధ్య ఎందుకు బ్రేక్ వచ్చిందో తెలిపారు. చదవండి: వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున వేసుకున్న షర్ట్ అంత ఖరీదా? 'ఓ సినిమా 100డేస్ ఫంక్షన్ ఓంగోలులో జరిగింది. అది మా అత్తగారి ఊరు కావడంతో ఒకరోజు ముందుగానే అక్కడికి వెళ్లా. అయితే హఠాత్తుగా నాకు హైఫీవర్ రావడంతో ఫంక్షన్కు రాలేకపోయాను. కానీ నేను కావాలనే ఫంక్షన్కు రాలేదని కొందరు చిరంజీవికి ఉన్నవి, లేనివి చెప్పారు. ఆ తర్వాత నేను అసలు విషయం చెప్పడానికి ఆఫీసుకు వెళ్లితే, అప్పుడు ఆయన మాట్లాడే మూడ్లో లేనని అన్నారు. చిరంజీవి అలా రియాక్ట్ కావడంలో తప్పులేదనిపించింది. దీంతో వెనక్కు వచ్చేశాను.హిట్లర్ తర్వాత మళ్లీ చిరంజీవితో పని చేయలేదు. అలా ఆ ఫంక్షన్ నన్ను ఆయనకి దూరం చేసింది' అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: నిన్ను నమ్మినవాళ్లను మోసం చేయొద్దు : వెంకటేశ్ దానికోసం అవసరమైతే గుండు కొట్టించుకుంటా : అనసూయ -
స్థానికేతరులు వచ్చారని ఆరోపిస్తూ ఘర్షణకు దిగిన బీజేపీ నేతలు
-
నర్సంపేట బిట్స్ కాలేజీలో కొట్టుకున్న విద్యార్థులు
-
మా పొలంలో గేదెలను ఎందుకు వదిలావ్ అంటూ కోపంతో..
సాక్షి, దోమ( వికారాబాద్): భూ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిపై దాయాదులు దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామానికి చెందిన ఎండీ అస్లాం శనివారం ఎప్పటిలాగే పొలానికి వెళ్తుండగా తమ పొలంలో గెదేలను ఎందుకు వదిలావని అతని దాయదులైన కలీం, ఆఫ్రీద్, జాహంగీర్బీ స్పింగర్లతో అతనిపై దాడికి పాల్పడ్డారు. పాత కక్షలతోనే వారు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు అస్లాం ఆదివారం దోమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన ముగ్గిరిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై రమేష్ తెలిపారు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక.. ఉరేసుకుని ఆత్మహత్య మర్పల్లి: జీవితపై విరక్తి చెందిన ఓ మహిళ ఉరేసుకోని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ కూతురు నవనీత (22)ను మూడు సంవత్సరాల క్రితం కోట్పల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన గోవర్ధన్కు ఇచ్చి వివాహం జరిపించారు. నా లుగు నెలల క్రితం భర్త గోవర్ధన్ కరోనా బా రిన పడి మృతి చెందాడు. అప్పటినుంచి నవనీత పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉండేది. ఈ నేపథ్యంలో భర్త మరణాన్ని జీర్ణించుకోలేని నవనీత జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలానికి ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. అన్న న వీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటశ్రీను తెలిపాడు. -
భూమి విషయం లో 2 రోజుల క్రితం ఇరువర్గాల మధ్య గొడవ
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
-
మాస్క్ పెట్టుకోలేదని కస్టమర్తో సెక్యూరిటీ గార్డ్ గొడవ
-
హైదరాబాద్ పాతబస్తీ లో ఘర్షణ
-
బెంగాల్ నాలుగోదశ ఎన్నికల పోలింగ్ లో హింస
-
తీర్మానాలు చించేశారు.. కుర్చీలు విసిరేశారు..
సాక్షి, అమరావతి: బెజవాడ బార్ అసోసియేషన్కు చెందిన కొందరు న్యాయవాదులు.. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యకలాపాల్లో జోక్యానికి ప్రయత్నించడం, హైకోర్టు వద్ద సర్వసభ్య సమావేశానికి పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. ఇది గురువారం న్యాయవాదుల మధ్య ఘర్షణకు దారి తీసింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి, అధ్యక్షులను విజయవాడ న్యాయవాదులు నిర్ణయించడం ఏమిటంటూ హైకోర్టు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సర్వసభ్య సమావేశం తీర్మానాలను కొందరు చించివేయగా.. మరికొందరు కుర్చీలు విసిరేశారు. బయట నుంచి వచ్చిన న్యాయవాదులు విసిరేసిన కుర్చీ తగలడం వల్ల బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్కు గాయమైందంటూ.. ఆయన జూనియర్లు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం అజయ్కుమార్ తదితరులు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే న్యాయవాదుల మధ్య వివాదంలో తాను ఏరకంగానూ జోక్యం చేసుకోనని ప్రధాన న్యాయమూర్తి వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు హైకోర్టు న్యాయవాదులు మెట్టా చంద్రశేఖర్తో పాటు మరికొందరు ఎస్పీఎఫ్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. హైకోర్టు న్యాయవాదుల సంఘంలో సభ్యులు కాని వ్యక్తులు తమపై దాడికి ప్రయత్నించారంటూ డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వాస్తవానికి హైకోర్టు న్యాయవాదుల సంఘం పాలకవర్గం కాల పరిమితి ఎప్పుడో ముగిసింది. గతేడాది ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి తెలియకుండా సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించడం వివాదానికి కారణమైంది. చలసాని అజయ్ ఇటీవల జరిగిన బెజవాడ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకున్నారని, అతనికి హైకోర్టు న్యాయవాదుల సంఘంలో ఓటు హక్కు లేదని పలువురు న్యాయవాదులు చెబుతున్నారు. బయట వ్యక్తులను తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా ఆయనే గొడవ సృష్టించారని చెబుతున్నారు. చదవండి: వీడియో వైరల్: హైదరాబాద్కు రజనీకాంత్ రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్ -
గన్నవరం హై స్కూల్ గ్రౌండ్ లో విద్యార్థుల మధ్య వివాదం
-
దేబ్రా నియోజకవర్గం లో బయటివ్యక్తుల కలకలం
-
దాడికి దారి తీసిన విద్యార్థుల మధ్య గొడవ
-
కొండా బర్త్డే: కాంగ్రెస్లో ‘కేకు’ రగడ..
తాండూరు టౌన్: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ నేతల మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కొండా జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేయాలని నాయకులు ముందుగా భావించారు. అయితే కార్యకర్తలు, నేతలు అందరూ రాకముందే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్మహరాజ్ కేక్ కట్ చేశారు. దీంతో ఆగ్రహించిన పార్టీ నేత ఖయ్యూం రమేష్మహరాజ్తో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలందరి సమక్షంలో వేడుకలు నిర్వహిస్తే బాగుండేదని, కొందరి సమక్షంలో తూతూ మంత్రంగా జరపడం సరికాదన్నారు. తాను అత్యవసర పనిమీద వెళ్లాల్సి ఉందని, ఉందని, మరో పెద్ద కేకు తీసుకొస్తారని, దానిని కట్ చేసి వేడుకలు నిర్వహించుకోవాలని రమేష్ మహరాజ్ చెప్పడంతో వాగ్వాదం మరింత ముదిరింది. ఎవరికి వారే నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని పలువురు నేతలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో రమేష్ మహరాజ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మరో కేక్ తీసుకొచ్చి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు అలీం, బస్వరాజ్, మల్లికార్జున్, ప్రభాకర్గౌడ్, వరాల శ్రీనివాస్రెడ్డి, లింగదల్లి రవి, షుకూర్ పాల్గొన్నారు. చదవండి: ముగ్గురు మంత్రులు.. 3 జిల్లాలు అందమైన యువతుల ఫొటోలతో ఎర, గొంతులు మార్చి.. -
శునకం తెచ్చిన తంటా..
బొమ్మలసత్రం(కర్నూలు జిల్లా): ఇంటి ముందు శునకం విసర్జించిన విషయమై ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగి.. కత్తులతో దాడులు చేసుకున్నారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం నంద్యాల మండలం కానాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ రమేష్, దూదేకుల చిన్నబాబయ్యకు పక్కపక్కనే ఇళ్లు ఉన్నాయి. మురుగు నీరు వెళ్లే విషయంలో ఇరు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం రమేష్ ఇంటి ముందు ఓ శునకం విసర్జించింది. ఈ విషయంలో చిన్నబాబయ్యకు, రమేష్లకు వాగ్వాదం తలెత్తి, ఘర్షణకు దారితీసింది. ఇరువురు కత్తులతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చిన్నబాబయ్య తన చేతిలో ఉన్న కత్తితో రమేష్, ఆయన తండ్రి వెంకటరమణలను పొడిచాడు. రమేష్ తన వద్ద ఉన్న కత్తితో బాబయ్యపై దాడి చేశాడు. గాయపడ్డవారిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రమేష్, వెంకటరమణల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: సినిమాలో చూస్తాడు.. బయట చేస్తాడు) మాట వినకపోతే చంపేస్తాం.. బాబు పీఏ బెదిరింపులు.. -
దారణం: హత్యకు దారితీసిన యువకుల గొడవ
సాక్షి, నెల్లూరు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్ల కుక్కలగుంట కూరగాయల మార్కెట్ వద్ద ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. కరివేపాకు వ్యాపారం చేసుకొని జీవించే సాయి అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన దయానంద్తో చిన్నపాటి వివాదం తలెత్తింది. గొడవ మరింత ముదరడంతో దయానంద్ ఆవేశంతో సాయిపై కత్తితో దాడి చేశాడు. దీంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్లానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
బీజేపీ కార్యకర్తలతో టీఆర్ఎస్ కార్యకర్తల వాగ్వాదం
-
కత్తులతో దాడి.. క్రికెట్ రేపిన చిచ్చు
కేవీపల్లె(చిత్తూరు జిల్లా): క్రికెట్ ఆట యువకుల మధ్య చిచ్చుకు కారణమైంది. ఇరువర్గాల ఘర్షణకు దారి తీసింది. కత్తులు, కర్రలతో దాడి చేసుకోవడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు..కేవీపల్లె మండలం దిన్నెవడ్డిపల్లెకు చెందిన యువకులు గురువారం క్రికెట్ ఆడారు. గ్రామానికి చెందిన నాగసిద్ధులు (45) కుమారుడు నాగార్జున, నాగసుబ్బయ్య (34) బావమరిది నరేష్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇదే విషయంపై శుక్రవారం సాయంత్రం నాగసిద్ధులు, ఆయన కుమారులు వెంకటష్, నాగార్జున, బావమరిది యల్లయ్య, తమ్ముడు చంద్ర (43), తమ్ముని కుమారులు శ్రీనివాసులు, గిరిబాబు వర్గం, నాగసుబ్బయ్య, అతని తమ్ముడు నాగేంద్ర (32), బావమరది నరేష్ వర్గం పరస్పరం కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. (చదవండి: ఆవు తెచ్చిన తంటా!) ఈ ఘర్షణలో నాగసిద్ధులు కడుపు, చేతిపై కత్తిపోట్లు పడి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే నాగసుబ్బయ్య తలకు తీవ్రగాయమైంది. అలాగే నాగేంద్ర, చంద్ర సైతం తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ నలుగురినీ 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. -
గల్వాన్పై చైనాలో అసమ్మతి సెగ!
బీజింగ్: గల్వాన్ ప్రాంతంలో దురాక్రమణకు పాల్పడటం ద్వారా పొరుగుదేశం చైనా ఏం బావుకుందో ఏమో తెలియదుగానీ.. దేశంలోనే కాకుండా.. విదేశాల్లోని స్వదేశీయుల నుంచి అసమ్మతిని మాత్రం మూటగట్టుకుంటోంది. చైనాలో ప్రభుత్వం కనుసన్నలలో నడిచే మీడియా, సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక వ్యాఖ్యానాలు చర్చలు కొనసాగుతున్నా.. ఇతర మాధ్యమాల్లో, విదేశాల్లోని చైనీయుల మధ్య జరుగుతున్న ఆన్లైన్ సంభాషణల్లోనూ గల్వాన్ లోయలో చైనా వ్యవహారంపై పలువురు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే పూర్తయి వివరాలు వెల్లడి కావాల్సిన ఓ ఆన్లైన్ సర్వే ద్వారా ఈ విషయం తెలుస్తోందని జాతీయ స్థాయి టెలివిజన్ చానల్ ఒకటి ఒక కథనాన్ని ప్రచురించింది. సుమారు 75 వేల మంది సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్లను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు సెక్ల్యాబ్ అండ్ సిస్టమ్స్ అనే సంస్థ చెబుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చైనా ప్రభుత్వం మద్దతుతో నడిచే కొన్ని వ్యూహాత్మక సంస్థల్లో పనిచేసే వారు కూడా ప్రభుత్వం తీరు సరికాదని వ్యాఖ్యానించడం. సెక్ ల్యాబ్ అండ్ సిస్టమ్స్ సోషల్మీడియా నెట్వర్క్లను గణిత శాస్త్ర సూత్రాల ఆధారంగా విశ్లేషించింది. ప్రవాస చైనా జర్నలిస్టుల సోషల్ మీడియా పోస్టుల్లో గల్వాన్ విషయంలో చైనా వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతూండగా.. అదృశ్య శక్తి ఒకటి ఒకటి వీటన్నింటి వెనుక ఉందని చైనా ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని వీరు భావిస్తున్నారు. వీరే కాకుండా.. హాంకాంగ్, తైవాన్లలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్న వారు, ఇతర మద్దతుదారుల్లోనూ ఇదే తరహా సెంటిమెంట్లు నడుస్తున్నాయి. ట్విట్టర్లో సుమారు 34 వేల మంది ఫాలోయర్లు ఉన్న జర్నలిస్ట్, చైనీస్ కుమిన్టాంగ్ విప్లవ కమిటీ సభ్యుడు డెంగ్ యూవెన్ భారత్తో సరిహద్దు గొడవలు చైనా నేతలకు ఏమాత్రం తగని పని అని ఒక కథనంలో వ్యాఖ్యానించారు. భారత్ చైనాల మధ్య యుద్ధం అసాధ్యమని గతంలో అనుకునేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని యూవెన్ వ్యాఖ్యానిస్తున్నారు. ట్విట్టర్లో రెండు లక్షల కంటే ఎక్కువమంది ఫాలోయర్లు ఉన్న హు పింగ్ కూడా యూవెన్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనాలోనే కొంతమంది పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూండటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని, కమ్యూనిస్టు పార్టీ అంతర్గత సమావేశాల రికార్డింగ్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వాంగ్ కియాన్కిన్ ఒక ట్వీట్ చేశారు. కొంత కాలానికే ఈ ట్వీట్ డెలిట్ కావడం గమనార్హం. భారత్ అత్యవసరంగా రష్యా నుంచి 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తూండటం వారి సంబంధాలు చైనా కంటే ఆ దేశంతోనే బాగున్నాయని నిరూపిస్తున్నాయని ట్వీట్ ద్వారా వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, ట్వీట్లు, ఆలోచనలు ఒక పద్ధతి ప్రకారం వస్తున్నవి ఏమీ కావని, ప్రస్తుతానికి వీటిని గుసగుసలుగానే పరిగణించాలని సెక్ల్యాబ్స్ నిర్వహించిన సర్వే చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఊపిరిపోసుకుని ఆ తరువాత ఓ వ్యవస్థీకృత ఉద్యమంగా మారిన పలు ఉద్యమాలు కూడా ఇలాంటి చెదురుమదురు అసంతృప్తికర వ్యాఖ్యలతోనే మొదలైన విషయాన్ని గుర్తించాలని చెబుతోంది. -
పోలీసులతో కలబడ్డారు
-
లాక్డౌన్: పోలీసులతో కలబడ్డారు
చండీగఢ్: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. పోలీసుల అత్యుత్సాహం, ప్రజల అసహనం కారణంగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పంజాబ్లో ఎటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిరోజ్పూర్లోని సిక్రీ బజార్లో ఆదివారం పోలీసులు, దుకాణదారులకు మధ్య ఘర్షణ జరిగింది. లాక్డౌన్ నిబంధనలను అనుసరించి షాపులు మూసివేయాలన్న పోలీసులపై దుకాణదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగి గొడవ మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, ఏప్రిల్ 12న పటియాల జిల్లాలోని ఓ కూరగాయల మార్కెట్ వద్ద జరిగిన మరో ఘటనలో ఓ వ్యక్తి ఏఎస్ఐ చేయి నరికేశాడు. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఎస్ఐని ఆస్పత్రిగా తరలించగా వైద్యులు ఏడు గంటల పాటు సర్జరీ చేసి అతడి చేతిని అతికించారు. పంజాబ్లో 219 మంది కరోనా బారిన పడగా, 16 మంది మృతి చెందినట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. హమ్మయ్య.. వారికి కరోనా నెగెటివ్ -
యోగి ప్రతీకారం : రూ. 15 లక్షలు కట్టండి!
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్నంత పనీ చేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా జరిగిన ఆందోళనకు, నష్టానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన యోగీ ప్రభుత్వం ఆందోళన కారులకు నోటీసులు పంపింది. ఈ నిరసన కార్యక్రమంలో చెలరేగిన హింస సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టానికి రూ .14.86 లక్షలు రికవరీ కోసం దాదాపు 28 మందికి నోటీసులు అందాయి. అంతేకాదు దెబ్బతిన్న పోలీసు హెల్మెట్లు, లాఠీలు, పెలెట్స్ కోసం కూడా పరిహారం చెల్లించాలని కూడా యూపీ సర్కార్ ఆదేశించింది. కాగా గతవారం ఉత్తరప్రదేశ్ రాంపూర్లో సీఏఏ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ హింసకు కారణమని ఆరోపిస్తూ 31మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, వేలం వేస్తామని, తద్వారా నష్టాన్ని భర్తీ చేస్తామని, ప్రతీకారం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్ర పోలీసులు కనీసం 21 గురు మైనర్లను అదుపులోకి తీసుకుని, 48 గంటల పాటు చిత్ర హింసలకు గురిచేశారని హఫింగ్టన్ పోస్ట్ నివేదించింది. స్థానిక పత్రికల కథనాలు, బాధితుల ఇంటర్వ్యూల (విడుదలైన 21 మందిలో ఐదుగురిని) ఆధారంగా బహిరంగ ప్రదర్శనకు ఎప్పుడూ హాజరుకావద్దంటూ వారిని బెదిరించడంతోపాటు తీవ్రంగా కొట్టారని తెలిపింది. చేసింది, అయితే దీనిపై ఉత్తరప్రదేశ్ డీజీపి ఓపీ సింగ్, బిజ్నోర్ జిల్లా కలెక్టర్ రామకాంత్ పాండే , బిజ్నోర్ ఎస్పీ సంజీవ్ త్యాగి ఇంకా స్పందించాల్సి వుందని పేర్కొంది. చదవండి : వాళ్ల ఆస్తులు వేలం వేస్తాం: యూపీ సీఎం -
రిసార్టులో ఎమ్మెల్యేల బాహాబాహీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఉన్న ఈగల్టన్ రిసార్టులో కలకలం చెలరేగింది. ఈ రిసార్టులో శనివారం రాత్రి కాంగ్రెస్ నేతలు భోజనం చేస్తుండగా కంప్లి ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్, హోసపేటె ఎమ్మెల్యే, గనుల వ్యాపారి ఆనంద్ సింగ్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన గణేశ్ టేబుల్పై ఉన్న మద్యం బాటిల్తో ఒక్కసారిగా ఆనంద్సింగ్పై దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆనంద్సింగ్ను నేతలు అపోలో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనకు 12 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఆసుపత్రి ముందు మోహరించిన పోలీసులు ప్రస్తుతం రాజకీయ నేతలెవరినీ లోపలకు వెళ్లనివ్వడం లేదు. ఈ గొడవ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధుయాష్కి మాట్లాడుతూ..‘బళ్లారి జిల్లాకు చెందిన గణేశ్, ఆనంద్ సింగ్ ఇద్దరూ పలు వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారానికి సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్తా ముదరడంతో గణేశ్, ఆనంద్ సింగ్పై దాడి చేశారు. ఈ దాడికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. రహస్య సమాచారం లీక్ చేశాడనే.. ఈగల్టన్ రిసార్టులో రెండ్రోజులుగా గణేశ్, ఆనంద్ సింగ్ మధ్య వాగ్వాదం కొనసాగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో భాగంగా బీజేపీ నేతలు గణేశ్ను సంప్రదించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు తనను సంప్రదించిన విషయాన్ని, ఇస్తామన్న ఆఫర్ను గణేశ్ ఆనంద్సింగ్తో పంచుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ సీఎల్పీ భేటీకి విప్ జారీచేయడంతో గణేశ్ గత్యంతరం లేక హాజరయ్యారు. సమావేశం అనంతరం సీనియర్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలను నేరుగా రిసార్టుకు తరలించారు. ఈ సందర్భంగా గణేశ్ను బీజేపీ ప్రలోభపెట్టిన విషయాన్ని ఆనంద్సింగ్ సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య చెవిన వేశారు. ఈ విషయం తెలుసుకున్న గణేశ్ ఆగ్రహంతో ఊగిపోయారు. చివరికి మాటామాటా పెరగడంతో ఆనంద్సింగ్ తలపై మద్యం బాటిల్తో దాడిచేశారు. కాగా, తన భర్తపై దాడిచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆనంద్సింగ్ భార్య ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని బిదాది పోలీసులు తెలిపారు. బీజేపీ విమర్శలు ఈగల్టన్ రిసార్టులో జరిగిన ఘటన ప్రజాస్వామ్యానికే కళంకమని బీజేపీ విమర్శించింది. ఈ గొడవను రాష్ట్ర పీసీసీ చీఫ్ గుండూరావు ఆపలేకపోవడం నిజంగా దురదృష్టకరమని ఎద్దేవా చేసింది. ఇన్నాళ్లూ ప్రతీ సమస్యకు బీజేపీనే కారణమని ఆరోపించిన గూండూరావు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించింది. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్ యాడ్యూరప్ప ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాష్ట్రానికి తిరిగివస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి కుమారస్వామి సర్కారును బలనిరూపణకు ఆదేశించాల్సిందిగా కమలనాథులు కోరే అవకాశమున్నట్లు సమాచారం. -
కర్ణాటక హైడ్రామా : ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాహాబాహీ
-
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాహాబాహీ
సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో రిసార్ట్స్ రాజకీయాలు వేడెక్కాయి. బెంగళూర్లోని ఈగల్టన్ రిసార్ట్స్లో సేదతీరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలిసింది. ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు బాహాబాహీకి తలపడగా, ఈ అంశాన్ని కాంగ్రెస్లో కీచులాటలకు సంకేతంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, జేఎన్ గణేష్ల మధ్య వాగ్వాదం జరగ్గా సింగ్ తలపై గణేష్ బాటిల్ విసిరికొట్టారని సమాచారం. గాయపడిన ఆనంద్ సింగ్ను ఆస్పత్రికి తరలించారని స్ధానిక మీడియా వెల్లడించింది. కాగా ఆనంద్ సింగ్ను ఛాతీ నొప్పి రావడంతోనే ఆస్పత్రిలో చేర్పించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇక బీజేపీ నుంచి బేరసారాలు జరుగుతాయనే భయంతో పాటు సీఎల్పీ భేటీకి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసార్ట్స్కు తరలించిన సంగతి తెలిసిందే. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ను కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. -
టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి
-
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, వైఎస్సార్: జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డి అనుచరులు బాహాబాహీకి దిగారు. రాజుపాలెం మండలం చిన్నశెట్టిపాలెంలో సాగునీటి మళ్లింపు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గానికి చెందిన కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి 50 లక్షల రూపాయల వ్యయంతో చిన్నశెట్టి పాలెంలో సాగునీటి కోసం పైపు లైన్ పనులు చేపట్టారు. అయితే అదే గ్రామానికి చెందిన వరదరాజులరెడ్డి అనుచరుడు నరసింహారెడ్డి తన పొలానికి నీటి మళ్లింపు కోసం పైపులు అమర్చడం గొడవకు దారితీసింది. ఘటన స్థలానికి చేరుకున్న పరిస్థితిని అదుపులో తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇరువర్గాలను పోలీసు స్టేషన్కు తరలించి సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే తెలుగు తమ్ముళ్లు పోలీసు స్టేషన్ బయట గొడవకు దిగారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో లాఠీ చార్జీ చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇరువర్గాలకు చెందిన నేతలు పలుమార్లు ఘర్షణకు దిగారు. -
బీజేపీ, ఆప్ శ్రేణుల బాహాబాహీ
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ, ఆప్ శ్రేణుల మధ్య ఘర్షణకు దేశ రాజధానిలో సిగ్నేచర్ వారధి ప్రారంభోత్సవం వేదికగా మారింది. ఈ బ్రిడ్జి పునర్నిర్మాణానికి తాము చొరవ తీసకుంటే స్ధానిక ఎంపీనైన తనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల సమక్షంలోనే బీజేపీ, ఆప్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. తన నియోజకవర్గ పరిధిలో ఈ బ్రిడ్జి పునర్నిర్మాణానికి తాను చొరవ తీసుకున్నానని, తాను వారధి నిర్మాణానికి ఎంతో కృషి చేస్తే ప్రస్తుతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభిస్తున్నారని అన్నారు. తివారీ వేదిక వద్దకు చేరుకోగానే బీజేపీ, ఆప్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆప్ కార్యకర్తలు, పోలీసులు తన పట్ల దురుసుగా వ్యవహరించారని తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ను స్వాగతించేందుకు తాను ఇక్కడికి వస్తే పోలీసులు, ఆప్ శ్రేణులు తనను నేరస్తుడిలా చుట్టుముట్టాయని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆప్ వాలంటీర్లను, స్ధానికులను నెట్టివేసి రాద్ధాంతం చేశారని ఆప్ నేత దిలీప్ పాండే పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఆహ్వానం లేకపోయినా హాజరయ్యారని, తివారీ తనకు తాను వీఐపీలా భావిస్తున్నారని పాండే అన్నారు. -
పెళ్లి క్లాష్ వచ్చేస్తే ఎలా?
సాధారణంగా సినిమా వాళ్లకు రిలీజ్ విషయంలో, డేట్స్ విషయంలో క్లాష్ ఏర్పడుతుంది. హీరోయిన్స్ విషయంలో, రెమ్యునరేషన్ విషయంలో క్లాష్ వస్తుంది. తాజాగా దీపికా పదుకోన్కు, ప్రియాంకా చోప్రాకు విభిన్నంగా పెళ్లి విషయంలో క్లాష్ ఏర్పడేలా ఉందని బాలీవుడ్ మీడియా టాక్. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ల వివాహం నవంబర్ 14,15 తేదీల్లో జరగనుంది. ఆ తర్వాత నవంబర్ చివరి వారంలో ఇండస్ట్రీ ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట. అయితే విచిత్రంగా నిక్ జోనస్తో ప్రియాంకా వెడ్డింగ్ కూడా నవంబర్ నెలాఖరులో అని ఒక తేదీ, డిసెంబర్ ఒకటి, రెండూ తేదీల్లో అని మరో వార్త వినిపిస్తోంది. ఈ ప్రేమికుల వివాహం జో«ద్పూర్లో గ్రాండ్గా జరగనుందని తెలిసిందే. ఒకవేళ దీపికా రిసెప్షన్ తేదీ, ప్రియాంక పెళ్లి తేదీ, టైమ్ కూడా ఒకటే అయితే అప్పుడు ఈ ఫంక్షన్లు క్లాష్ అవుతాయా? అనే చర్చ మొదలైంది. అదే కనుక జరిగితే అటు వెళ్లాలా? ఇటు వెళ్లాలా? రెండు వేడుకలకూ ఎలా ప్రెజెంట్ వేయించుకోవాలా? అని సెలబ్రిటీలు తికమక పడక తప్పదు. క్లాష్ ఉన్నా లేకపోయినా బాలీవుడ్లో కొన్ని రోజుల పాటు పెళ్లి కళ మాత్రం కనిపిస్తుందనడంలో సందేహం లేదు. -
దారుణం : డిగ్రీ విద్యార్థులు తాగి.. ఘర్షణకు దిగి
సాక్షి, జగిత్యాల : జగిత్యాల మండలం తాటిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మత్తులో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఘర్షణకుదిగారు. ఈ ఘర్షణలో ఒక విద్యార్థి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. తాటిపల్లికి చెందిన సాధినేని నవీన్, బొలిశెట్టి శ్రవణ్ ఇద్దరూ.. డిగ్రీ చదువుతున్నారు. వీరు మద్యం సేవించిన అనంతరం ఇద్దరు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో సాధినేని నవీన్ను బొలిశెట్టి శ్రవణ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఘటన గురించి సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విద్యార్థుల మధ్య ఘర్షణకు కారణాలు తెలియదని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
స్టార్ హీరోల మధ్య చిచ్చు..!
‘మదకరి నాయక’... ప్రస్తుతం శాండల్వుడ్లో ఈ పేరు పలు వివాదాలకు కారణమైంది. ఇద్దరు స్టార్ హీరో అభిమానుల మధ్య ‘మదకరి నాయక’ వివాదాన్ని రేపుతోంది. 18వ శతాబ్దాపు రాజు మదకరి నాయకుడికి సంబంధించిన కథతో సినిమాను నిర్మించేందుకు కన్నడ సినిమా రంగంలోని చాలా మంది ఆసక్తి కనపరుస్తున్నారు. కిచ్చా సుదీప్ తన సొంత బ్యానర్లో మదకరి నాయకపై సినిమాను నిర్మిస్తానని ఇటీవల ప్రకటించారు. కిచ్చా సుదీప్ భార్య ప్రియా రాధాకృష్ణన్ నిర్మాతగా మదకరి నాయక పాత్రను సుదీప్ పోషిస్తూ సుమారు 100 కోట్లతో సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ సినిమాను గురుదత్తా గనిగా, సంచిత్లల్లో ఎవరో ఒకరు దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా మదకరి నాయకుడిపై సుదీప్తో సినిమా నిర్మించాలని వాల్మీకి ఫౌండేషన్ ప్రయత్నాలు చేస్తోంది. కిచ్చా సుదీప్ కూడా ఆ సినిమాపై ఆసక్తి కనపరుస్తున్నారు. కానీ ఇదే మదకరి నాయకుడి జీవిత చరిత్రపై మరో బడా హీరో, చాలెంజింగ్ స్టార్ దర్శన్ కూడా కన్ను వేశాడు. రాక్లైన్ వెంకటేశ్ నిర్మాణంలో రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వంలో మదికర నాయక సినిమాను చిత్రీకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ‘గండుగలి వీర మదకరి నాయక’ పేరుతో దర్శన్తో సినిమాను నిర్మించనున్నట్లు ఇటీవలే నిర్మాత రాక్లైన్ వెంకటేశ్ ప్రకటించారు. దీంతో కిచ్చా సుదీప్ తీయాలనుకుంటున్న సినిమాను దర్శన్ హీరోగా నిర్మించనున్నడంపై సుదీప్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏ హీరో మదకరి నాయక సినిమాలో నటిస్తారనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో శనివారం హీరో దర్శన్ చిత్రదుర్గలో ప్రారంభమైన శరణ సంస్కృతి ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానుల నుంచి మదకరి నాయక చిత్రం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే పదేపదే సినిమా గురించి అడిగి ఎందుకు ఇబ్బంది పెడుతారని ప్రశ్నించారు. ప్రస్తుతం సినిమా గురించి ఎలాంటి గందరగోళం చేయొద్దని సూచించారు. ప్రస్తుతం చిత్రదుర్గ శరణ సంస్కృతి ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చానని, సినిమా గురించి మాట్లాడేందుకు ఇది సందర్భం కాదని అభిమానులను నివారించే ప్రయత్నం చేశారు. ఇదే ఉత్సవంలో పాల్గొన్న రాక్లైన్ వెంకటేశ్ మాట్లాడుతూ... దసరా పండుగ జరుపుకునేందుకు వచ్చామని, ఇక్కడి సినిమా గురించి మాట్లాడడం వద్దని అభిమానులకు సూచించారు. మదకరి నాయక గురించి తర్వాత మాట్లాడుతామని తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబులు పాల్గొన్నారు. ఎవరీ మదకరి? ఇంతంటి వివాదానికి కారకుడైన ఒంటిసలగా మదకరి నాయక అలియాస్ మదకరి నాయక చిత్రదుర్గకు చెందిన ఒక గొప్ప రాజు. కర్ణాటక చిత్రదుర్గకు చెందిన మదకరి సామాజిక వర్గానికి చెందిన మహారాజు. 1758లో జన్మించిన రాజా వీర మదకరి నాయక 1789లో శ్రీరంగపట్టణలో తుదిశ్వాస విడిచాడు. -
మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రిలో ఘర్షణ
-
బంగ్లాదేశ్లో ఘర్షణ..ఆరుగురి మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఓ రాజకీయ పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన చిట్టగాంగ్ జిల్లాలోని ఖగ్రాచారి పట్టణం షోనిర్బార్ బజార్ ప్రాంతంలో శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జరిగింది. వీరంతా యునైటెడ్ పీపుల్స్ డెమెక్రటిక్ ఫ్రంట్(యూపీడీఎఫ్) అనే లోకల్ పార్టీకి చెందిన వారు. మృతిచెందిన ఆరుగురిలో యూపీడీఎఫ్ నాయకుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మత్స్యకారుల మధ్య స్పీడ్ బోట్ల చిచ్చు
-
రసాభాసగా తుంగభద్ర అడ్వైజరీ బోడు భేటీ
-
రసాభాసగా రాజమండ్రి మున్సిపల్ సర్వసభ్య సమావేశం
-
నీటి కోసం ఘర్షణ : 300 మందిపై కేసు!
చంఢీఘర్ : నీటి కోసం హర్యానాలోని రెండు గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12మందికి గాయాలు కాగా.. దీనితో సంబంధం ఉన్న 300 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. హిసర్ జిల్లాలోని పుతి మంగల్ఖాన్, పీరాన్వాలీ గ్రామాల మధ్య దగ్గర్లోని కెనాల్ నుంచి నీటి తరలింపు విషయంలో వివాదం తలెత్తింది. పీరాన్వాలీ గ్రామస్థులు కెనాల్ నుంచి అనుమతులు లేకుండా పంపుసెట్ ఏర్పాటు చేసి నీటి తరలింపు చేపడుతున్నారని ఆరోపిస్తూ మంగల్ఖాన్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో పీరాన్వాలీ ప్రజలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. చిన్నగా మొదలైన గొడవ ఇరు వర్గాల మధ్య పెనుగులాటకు దారితీసింది. ఈ దాడుల్లో బైకులకు కూడా నిప్పు పెట్టారు. కొత్తగా ఏర్పాటు చేసిన పంపుసెట్ కూడా కాలిపోయింది. ఇరు గ్రామాలకు చెందిన వందలాది మంది ఘర్షణలో పాల్గొన్నారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలు కాగా, 8 బైక్లు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న దాదాపు 300 మందిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు గ్రామాల మధ్య మళ్లీ ఘర్షణలు తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించారు. -
రెండు గ్రామాల మధ్య పంక్షన్ తెచ్చిన తంటా
-
పంక్షన్ తెచ్చిన తంటా.. గ్రామాల మధ్య ఘర్షణ
సాక్షి, తూర్పు గోదావరి : మూడు రోజుల క్రితం ఓ ఫంక్షన్లో తలెత్తిన వివాదంతో మొదలైన ఘర్షణ నేటికి కొనసాగుతుంది. దీంతో జిల్లాలోని తొర్రేడు, వెంకటనగరం గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలివి.. తొర్రేడు గ్రామానికి చెందిన యువకులు ఆదివారం వెంకటనగరం వెళ్లడంతో గొడవ మళ్లీ మొదలైంది. అనంతరం ఇరు గ్రామాల ప్రజలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో గ్రామస్తులతో పాటు వారిని చెదరగొట్టడానికి వచ్చిన పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రెండు గ్రామాల ప్రజలను చెదరగొట్టారు. అంతేకాక పోలీసులు ఇరు గ్రామాల ప్రజల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో వెంకటనగరం గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. -
ఇరువర్గాల కొట్లాటలో వృద్ధుడి మృతి
కాండ్రకోట (పెద్దాపురం): జాతర వేళ.. పాత కక్షలు గుర్తొచ్చాయో.. ఏమో ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తుల మధ్య జరిగిన ఘర్ణణలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన పెద్దాపురం మండలం కాండ్రకోటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెంది న చింతాడ చక్రరావు (55) అదే గ్రామానికి చెందిన చింతపల్లి చక్రరావు, గుమ్మడి బుజ్జియ్య, గుమ్మడి గోవిందు, పిల్లి చంద్రరావులతో చక్రరావు కుమారుడు శ్రీనుల కు మధ్య జరిగిన ఘర్షణ మధ్యలోకి వెళ్లాడు. ఆ తోపులాటలో చక్రరావు సృహతప్పి పడిపోవడంతో అతన్ని స్థానికులు పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా మా ర్గమధ్యంలో మృతి చెందాడు. దీనిపై గ్రామానికి చెందిన ఆ నలుగురు వ్యక్తులే తన తండ్రిని చంపేసారంటూ కు మారుడు శ్రీను శనివారం ఉదయం పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఎస్ఐ కృష్ణ భగవాన్ సం ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను విచారించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాదిగ ఉపకులాలపై దాడులు అమానుషం జిల్లాలో మాదిగ ఉపకులా లపై దాడులు పెరిగాయ ని, కాండ్రకోటలో జరిగిన దాడి అమానుషమని ఎంఆర్పీఎస్ నాయకులు వల్లూరి సత్తిబాబు అన్నారు. కాండ్రకోటలోని చక్రరావు మృతదేహం వద్దకు వచ్చి వారిపై దాడి చేసి, చావుకు కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులకు వివరించారు. -
పదేళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు
ఒంగోలు క్రైం : పదేళ్లు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న హత్య కేసు నిందితుడిని ఒంగోలు తాలూకా పోలీసులు ఎట్టకేలకు ఆదివారం కటకటాల వెనక్కి నెట్టారు. ఒంగోలు బలరాం కాలనీలో 2008లో ఒక రిక్షా నడుపుకొనే వ్యక్తిని రాళ్లతో కొట్టటంతో అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఒంగోలు కోర్టులో కేసు నడుస్తోంది. న్యాయస్థానం అతడికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారెంట్ పెండింగ్లో ఉంది. ఈ మేరకు ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బి.సుబ్బారెడ్డి, కానిస్టేబుల్ బి.సోంబాబులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్నాడన్న సమాచారం రావటంతో అత్యంత కష్టం మీద అతడిని గాలించి పట్టుకొచ్చారు. వివరాలు.. 2008లో ఒంగోలు నగరం బలరాం కాలనీలో కళ్లు కొట్టు వద్ద జరిగిన ఘర్షణలో కబాలి అనే వ్యక్తిని స్థానికంగా నివాసం ఉంటున్న ఉప్పుతల గురవయ్య రాళ్లతో దాడి చేసి కొట్టాడు. కబాలి తీవ్రగాయాలతో వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉప్పుతల గురవయ్యపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. దాడి అనంతరం గురవయ్య ఒంగోలు విడిచిపారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతడిని గాలిస్తూనే ఉన్నారు. పదేళ్ల తర్వాత హైదరాబాద్లో ఉన్నాడని సమాచారం రావటంతో హెడ్ కానిస్టేబుల్ బి.సుబ్బారెడ్డి, కానిస్టేబుల్ బి.సోంబాబులు అక్కడికి వెళ్లి పట్టుకొచ్చారు. గురవయ్య స్వగ్రామం నల్గొండ జిల్లా తొట్టెంపూడి మండలం, బక్కమంతుల గూడెం. అనేక సార్లు పోలీసులు అతడి స్వగ్రామం కూడా వెళ్లివచ్చారు. అయినా ప్రయోజన లేకపోయింది. అతడిని సోమవారం కోర్టులో హాజరు పరిచారు. ఎట్టకేలకు పదేళ్ల తర్వాత అరెస్ట్ వారెంట్ను అమలు చేసినందుకు ఇద్దరు పోలీసులను ఎస్పీ బి.సత్య ఏసుబాబు, ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు. -
ముంబైలో మరాఠాలు, దళితుల మధ్య ఘర్షణలు
-
కేరళలో బీజేపీ సీపీఎం మధ్య ఘర్షణ
-
టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు
-
వినాయకచవితి చందా వివాదం
► పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ ► వాహనాన్ని ధ్వంసం చేసిన గ్రామస్తులు ► ప్రాణభయంతో పరుగులు తీసిన పోలీసులు బుచ్చినాయుడుకండ్రిగ : వినాయక చవితి చందా విషయమై పోలీసులు, గ్రామస్తుల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ సంఘటన మండలంలోని పద్మావతిపురం వద్ద ఆదివారం జరిగింది. కొంతమంది యువకులు కేటీరోడ్డుపై వెళుతున్న వాహనాలను వినాయక చవితి చందా వసూలు చేస్తున్నారు. ఆదివారం తిరుపతికి చెందిన ఎర్రచందనం టాస్క్ఫోర్సు ఎస్ఐ ఆదినారాయణరెడ్డి సిబ్బందితో కలిసి చెన్నై నుంచి ఎర్రచందనం స్మగ్లరును తీసుకుని వ్యాన్లో తిరుపతికి వెళుతున్నారు. ఆ వ్యాన ును యువకులు అడ్డుకున్నారు. పోలీసు సిబ్బంది రూ.10 ఇచ్చారు. దీంతో యువకులు పోలీసు సిబ్బందిని దుర్భాషలాడారు. ఈ క్రమంలో ఒక యువకుడిపై కానిస్టేబుల్ చెయ్యి చేసుకున్నాడు. దీంతో యువకులకు, టాస్క్ ఫోర్సు సిబ్బంది మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది తెలుసుకున్న పద్మావతిపురం గ్రామస్తులు, యువకులతో కలిసి టాస్క్ఫోర్సు సిబ్బందిపై దాడికి దిగారు. పోలీసులమని చెప్పినా వినకుండా వాహనాన్ని ధ్వంసం చేశారు. భయందోళనకు గురైన టాస్క్ఫోర్సు సిబ్బంది వ్యాన్ వదిలేసి బస్సు ఎక్కి బుచ్చినాయుడుకండ్రిగలోని పోలీసుస్టేషన్కు వచ్చి ఎస్ఐ రామ్మోహన్కు వివరించారు. ఆయన సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వ్యాన్ను తీసుకుని పోలీసుస్టేషన్కు వచ్చారు. జరిగిన గొడవను జిల్లా అధికారుల దృష్టికి తెలియజేశామని, వారి అదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. -
టీఆర్ఎస్ సమావేశం రసాభాస
-
ప్రాణం తీసిన క్రికెట్ బాల్ వివాదం
-
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రగడ
-
గుజరాత్ అసెంబ్లీలో బాహాబాహీ!
గాంధీనగర్: గుజరాత్ శాసనసభ గురువారం రణరంగంగా మారింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు సభలోనే బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో ఒక మహిళా మంత్రి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గాయపడ్డారు. అనంతరం ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులను స్పీకర్ రమణ్లాల్ ఓరా బడ్జెట్ సమావేశాల చివరి వరకు సస్పెండ్ చేశారు.రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా ఈ ఘర్షణ చోటుచేసుకుంది. జునాగఢ్, అమ్రేలి జిల్లాల్లో గత రెండేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులెందరో చెప్పాలని ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు ధనాని కోరారు. ఆ కాలంలో ఈ జిల్లాల్లో రైతులెవరూ ఆత్మహత్యలే చేసుకోలేదని వ్యవసాయ మంత్రి చిమన్ చెప్పారు. ఈ సమాధానంతో విభేదించిన ధనాని వెంటనే లేచి మంత్రి సీటు వద్దకు వెళ్లారు. మంత్రి అబద్ధం చెబుతున్నారనీ, రాష్ట్ర హోం శాఖ లెక్కలప్రకారం 400 మంది రైతులు చనిపోయారని అన్నారు. చిమన్ మంత్రితో గొడవ పడుతుండగానే, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్దేవ్జీ ఠాకూర్ మంత్రి చేతుల్లోని పేపర్లను లాక్కునేందుకు ప్రయత్నించారు. అనంతరం జరిగిన తోపులాటలో ఇద్దరు ఎమ్మెల్యేలు, మహిళా మంత్రి నిర్మలా వాధ్వానీ గాయపడ్డారు. -
ఎస్పీ, బీఎస్పీ వర్గీయుల మధ్య ఘర్షణ
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మీరట్లో సమాజ్వాది, బహుజన్ సమాజ్వాదీ పార్టీ కర్యకర్తలు బాహాబాహీకి దిగారు. పోలింగ్ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కితార్ గ్రామంలో ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదం కాల్పుల వరకూ వెళ్లింది. ఇక్కడి పోలింగ్ బూత్ వద్ద జరిగిన గొడవలో ఓ వ్యక్తి గాయపడగా.. అనంతరం ఓ వర్గం వారు మరో వర్గంపై కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించినట్లు తెలిపారు. తొలిదశ పోలింగ్ 15 జిల్లాల్లోని 73 సీట్లకు జరుగుతుంది. -
ఇద్దరి మధ్య ఘర్షణ : ఒకరి మృతి
భీమవరం టౌ¯ŒS : ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మరణించాడు. వ¯ŒSటౌ¯ŒS సీఐ డి.వెంకటేశ్వరరావు సోమవారం కథనం ప్రకారం.. సుంకరపద్దయ్య వీధిలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో గండ్రెడ్డి శ్రీధర్(40), జెట్టి వెంకటేశ్వరరావు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో జెట్టి వెంకటేశ్వరరావు చేతితో శ్రీధర్ కుడివైపు నవరగంతపై బలంగా కొట్టాడు. దీంతో శ్రీధర్ స్పృహ కోల్పోయాడు. దీనిపై శ్రీధర్ పెదనాన్న కుమారుడు జి.మధు ఫో¯ŒS చేసి శ్రీధర్ సోదరుడు సూర్యప్రకాష్కు సమాచారం ఇచ్చాడు. సూర్యప్రకాష్, బంధువులు వచ్చి శ్రీధర్ను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తరువాత అక్కడి నుంచి సోమవారం తెల్లవారుజామున ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ చెప్పారు. సూర్యప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. -
పరమేశ్వర ఉత్సవంలో ఘర్షణ
విశాఖపట్టణం: జిల్లాలో జరుగుతున్న గౌరి పరమేశ్వర ఉత్సవంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. జిల్లాలోని మునగపాక మండలం ఉమ్మవాడలో గౌరి పరమేశ్వర స్వామి ఉత్సవాలలో ఈ వివాదం నెలకొంది. -
రోడ్డు ప్రమాదంలో టైలర్ మృతి
ఏలూరు అర్బన్ : పొరుగూరులో చదువుతున్న పిల్లలను పాఠశాల నుంచి తీసుకొచ్చేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. దెందులూరు మండలం అలుగులగూడెంకు చెందిన దానే వెంకన్న టైలర్. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన ఇద్దరు కొడుకులను కొవ్వలిలోని ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నాడు. వారిని రోజూ ఉదయం పాఠశాల వద్ద దించి తిరిగి సాయంత్రం ఇంటికి తీసుకువస్తుంటాడు. ఈ నేప«థ్యంలో సోమవారం సాయంత్రం వెంకన్న యథావి«ధిగా పిల్లలను తీసుకువచ్చేందుకు మోటార్సైకిల్పై వెళ్తూండగా కొవ్వలి సెంటర్లో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. దీంతో వెంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృతిచెందాడు. -
మహాకూటమిలో లుకలుకలు !
-
ఇరువర్గాల ఘర్షణలో ఇద్దరికి గాయాలు
మునిమడుగు (పెనుకొండ రూరల్) : మండలంలోని మునిమడుగులో శనివారం పాతకక్షల కారణంగా ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో ఇరువర్గాలకు చెందిన ఎనిమిది మందిపై రౌడీషీట్ తెరిచినట్లు ఎస్ఐ లింగన్న తెలిపారు. ఎస్ఐ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అనిల్, శ్రీనివాసులు కుటుంబాలకు ఇది వరకే పాతకక్షలు ఉన్నాయి. అయితే శనివారం సాయంత్రం అనిల్ గ్రామరచ్చకట్టవద్ద నిలబడి ఉండగా శ్రీనివాసులు ద్విచక్రవాహనంపై అటుగా వచ్చి అకారణంగా అనిల్ను దూషిం చాడు. అనంతరం అనిల్ తల్లి మంగమ్మపై శ్రీనివాసులు బంధువులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అనిల్ వర్గీయులు సైతం శ్రీనివాసులు వర్గంపై దాడికి దిగారు. ఈ దాడిలో శ్రీనివాసులు తల్లి రమణమ్మకూ స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరు మహిళల్ని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఇరువర్గాలకు చెందిన అనిల్, నాగరాజు, మంగమ్మ, నాగేంద్ర, శ్రీనివాసులు, వెంకటేశులు, రమణమ్మ, కవితపై రౌడీషీట్ నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
బీహార్లో పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ
-
నిమజ్జనంలో ఘర్షణ.. ఒకరికి కత్తిపోటు
లడ్డు దక్కలేదనే అక్కసుతోనే దాడి ? కేసముద్రం : కత్తి పీటతో ఒకరి తలపై మరో వ్యక్తి దాడి చేసిన సంఘటన మండల కేంద్రంలోని రేకులతండాలో బుధవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకా రం... తండాలోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులంతా కలిసి గత ఏడాది మాదిరిగానే ఈ సారి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉత్సవ కమిటీ స భ్యుల్లో లడ్డూ పాటకు పోటీ జరిగింది. ఈ పోటీలో తేజావత్ లాల్సింగ్ రూ.12,200కు లడ్డూను దక్కించుకున్నా డు. ఈ క్రమంలో లడ్డుకు పోటీకి దిగిన ఓ వ్యక్తి ఊరేగిం పు మొదలయ్యాక లాల్సింగ్తో గొడవకు దిగాడు. ఈ క్ర మంలో గొడవకు దిగిన వ్యక్తి ఇంట్లో ఉన్న కత్తిపీట తెచ్చి లాల్సింగ్ తలపై కొట్టాడు. దీంతో తలకు లోతుగా కాటుపడి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో గొడవను అడ్డుకోవడానికి వచ్చిన లచ్చు చేతికి గాయమైంది. ఈ గొడవలో లాల్సింగ్పై మరో ఇద్దరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తండావాసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిం చారు. లాల్సింగ్ను మానుకోట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తండాకు చేరుకుని విచారణ చేపట్టారు. -
ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతం!
శ్రీనగర్: ఓవైపు ఆందోళనలు, మరో ఉగ్రవాదుల దాడులతో కశ్మీర్ అట్టుడుకుతూనే ఉంది. తాజాగా ఆదివారం కూడా ఉగ్రవాదులు చెలరేగిపోయారు. పూంచ్ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్కౌంటర్లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు విడిచాడు. మరోవైపు ఎల్వోసీకి సమీపంలో హంద్వారాలోని నౌగామ్ సెక్టర్లో విదేశీ ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు సరిహద్దుల మీదుగా చొరబడేందుకు ప్రయత్నించడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారా కనుగొనేందుకు భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇంకోవైపు కశ్మీర్ లోయలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుల్వామాలో ఆందోళనకారులు చెలరేగిపోయారు. భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో 12మంది గాయపడ్డారు. -
ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతం!
-
గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత
రెండు వర్గాల ఘర్షణ, 12 మందికి గాయాలు బి.కొత్తకోట: బి.కొత్తకోటలో గురువారం రాత్రి గణేష్ విగ్రహ నిమజ్జనంలో చోటు చేసుకున్న ఓ చిన్న సంఘటన రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణకు దారి తీసింది. వివరాలు.. బి.కొత్తకోట స్థానిక పోకనాటి వీధిలో ప్రతిష్టించిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు స్థానికులు ఊరేగింపు ప్రారంభించారు. రాత్రి 7.30 గంటలకు ఊరేగింపు జ్యోతి చౌక్ చేరుకుంది. అక్కడ నుంచి రంగసముద్రం రోడ్డు మీదుగా వెళుతుండగా రెండు సామాజిక వర్గాల మధ్య ఓ చిన్న వివాదం ఘర్షణకు దారితీసింది. ఇది ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో ఇరు వర్గాలకు చెందిన రెడ్డిశేఖర, జానీ, మహేంద్ర, వెంకటేష్, నరేంద్ర, జనార్ధన్, శివశంకర్, సతీష్కుమార్, రఘ, వంశీ తదితరులతో పాటు మరొకరు గాయపడ్డారు. అయితే ఇరు వర్గాలు తమపై ఎదుటి వర్గం వారే దాడి చేశారంటూ పరస్పరం ఆరోపించుకున్నారు. సమాచారం అందుకున్న ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీయడంతో మదనపల్లె, ములకలచెరువు సీఐలు మురళి, రుషి కేశవ, ముగ్గురు ఎస్ఐలు బి.కొత్తకోటకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. ఈ ఘటనలో ఇటుకలు, కర్రలతో దాడులు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సంఘటన ఎలా చోటు చేసుకుంది. దీనికి బాధ్యులెవరు అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 08టీబీపీ 20160908చి220404 -
టీడీపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ
గిద్దలూరు(ప్రకాశం): మంచినీటి సరఫరా విషయంలో ఇద్దరు టీడీపీకి కౌన్సిలర్ల మధ్య తలెత్తిన వివాదం.. కొట్టుకునేదాకా వెళ్లింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 17, 18వ వార్డు కౌన్సిలర్లుగా చింతలపూడి రామలక్ష్మి, సూరేపల్లి గురమ్మ ఉన్నారు. వైఎస్సార్సీపీ తరఫున కౌన్సిలర్గా ఎన్నికైన చింతలపూడి రామలక్ష్మి ఇటీవలే టీడీపీలో చేరారు. నిత్యం సరఫరా చేసే ట్యాంకర్ నీటిని ముందుగా తన ఇంటికే సరఫరా చేయాలని 18 వ వార్డు కౌన్సిలర్ సూరేపల్లి గురమ్మ పట్టుబడుతోంది. అయితే, వాటర్మెన్ లక్ష్మీనారాయణ తన మాట వినటం లేదని ఆగ్రహంతో ఉన్న గురమ్మ కుటుంబీకులు ఇటీవల అతడిపై చేయిచేసుకున్నారు. గాయాలపాలైన అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి శుక్రవారం ఉదయం విధుల్లో చేరాడు. నీటి సరఫరా సమయంలో అతడు తమ ఇంటి సమీపంలోకి రాగానే మరోసారి గురమ్మ కుటుంబీకులు అతడిపై దాడి చేశారు. ఈ విషయాన్ని అతడు తన బంధువైన కౌన్సిలర్ రామలక్ష్మికి తెలిపాడు. దీంతో ఆమె తన వారిని తీసుకుని గురమ్మ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో రామలక్ష్మి, లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ గురమ్మ కొడుకు వెంకట్రావుతోపాటు మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే గిద్దలూరు ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ శ్రీహరి సంఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
రాజ్యసభలో అధార్ రగడ
-
పోలీసులు,రైతుల మధ్య ఘర్షణ
-
అందరు చూస్తున్నారనే సోయి కూడా మరిచి..
లక్నో: ఉత్తరప్రదేశ్లో దొంగలు.. రౌడీలే కాదు. పోలీసులు కూడా రెచ్చిపోతున్నారు. వారికి వారే వీధి రౌడీల్లా దర్శనం ఇస్తున్నారు. వాటాలు పంచుకునేందుకు తొలుత చర్చను ప్రారంభించి పొరపొచ్చాలు రావడంతో తన్నుకున్నారు. చుట్టూ అందరు చూస్తున్నారనే సోయి కూడా మరిచి పట్టపగలు తన్నుకున్నారు. లంచాలు పంచుకునే విషయంలోనే ఈ ఘర్షణకు వారు దిగారు. రోడ్డుపైనే పరస్పరం వారు తలపడ్డారు. ఈ సంఘటనపట్ల సామాన్య జనం విస్తుపోతుండగా ఉన్నత పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
బావమరిదిని చంపిన బావ
♦ మద్యం మత్తులో డబ్బుల కోసం ఘర్షణ ♦ ధారూరు మండలం తరిగోపుల గ్రామంలో ఘటన ♦ డాగ్స్క్వాడ్, క్లూస్ టీంతో పరిశీలన ♦ వివరాలు సేకరించిన డీఎస్పీ స్వామి ధారూరు: తాగిన మైకంలో డబ్బుల విషయంలో ఘర్షణ జరగడంతో బావమరిదిపై బావ కర్రతో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన ధారూరు మండలంలోని తరిగోపుల గ్రామ శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వికారాబాద్ డీఎస్పీ స్వామి, మోమిన్పేట్ సీఐ రంగా కథనం ప్రకారం.. ధారూరు మండలం నాగ్సాన్పల్లికి చెందిన బాలయ్య, పార్వతమ్మ దంపతులు తరిగోపుల సమీపంలోని ఓ ఫాంహౌస్లో పనిచేస్తున్నారు. ఇదే మండలం గురుదోట్ల గ్రామానికి చెందిన బోయ శ్రీనివాస్(30) మూడు రోజుల క్రితం తన అక్కాబావ వద్దకు వచ్చాడు. వారివద్దే ఉన్న అతడు బావ బాలయ్యకు తెలియకుండా ఆయన జేబులోంచి రూ. 700 తీసుకున్నాడు. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం బావ, బావమరిది ఇద్దరు కలిసి మద్యం తాగారు. అనంతరం డబ్బుల విషయంలో వారిమధ్య ఘర్షణ జరిగింది. ‘నా డబ్బులే తీసుకుని.. నాపైనే దబాయిస్తావా..?’ అంటూ బాలయ్య కర్రతో బావమరిది శ్రీనివాస్పై దాడిచేశాడు. శ్రీనివాస్ ఫాంహౌస్లోంచి బయటకు పరుగులు తీసినా విడిచిపెట్టలేదు. బాలయ్య అతడిని వెంబడించి చంపేశాడు. మంగళవారం ఉదయం హత్య సమాచా రం తెలుసుకున్న వికారాబాద్ డీఎస్పీ స్వామి, మోమిన్పేట్ సీఐ రంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. అయితే శ్రీనివాస్కు పదేళ్ల క్రితం ధారూరు మండలం కొండాపూర్కలాన్కు చెందిన లక్ష్మితో వివాహమైంది. ఓ కొడుకు, కూతురు ఉన్నారు. భర్త వేధింపులు భరించలేక నెల రోజుల క్రితం లక్ష్మి పిల్లలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, హత్య కేసులో బాలయ్యతో పాటు ఆయన భార్య పార్వతమ్మ పాత్రపై విచారణ జరుపుతున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. హతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రగులుతున్న మథుర
హింస మృతులు 24 - ఎస్పీ, ఎస్హెచ్ఓతో పాటు 22 మంది ఆందోళనకారులు మృతి - 260 ఎకరాల్ని స్వాధీనం చేసుకుంటుండగా హింస - పోలీసులపై దాడులకు తెగబడ్డ ఆక్రమణదారులు - యూపీ నుంచి నివేదిక కోరిన కేంద్రం.. విచారణకు సీఎం అఖిలే శ్ ఆదేశం - సూత్రధారి ‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ మథుర: పోలీసులు, ఆక్రమణదారుల మధ్య కాల్పులతో ఉత్తరప్రదేశ్లోని మథుర మరుభూమిని తలపించింది. ఆక్రమణల తొలగింపుతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ హింసలో మృతుల సంఖ్య 24కు చేరగా.. మథుర సిటీ ఎస్పీతో పాటు ఎస్హెచ్ఏ(సీఐ స్థాయి అధికారి) ప్రాణాలు కోల్పోయారు. ‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’కి చెందిన 22 మంది ఆందోళనకారులూ మృతిచెందారు. పోలీసులు పెద్ద మొత్తంలో మారణాయుధాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 320 మందిని అరెస్టు చేశారు. సంఘటనపై ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ డివిజినల్ కమిషనర్చే విచారణకు ఆదేశించారు. మథుర జవహర్బాగ్లోని 260 ఎకరాల్లో 3 వేల మంది రెండేళ్లుగాఅక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణల్ని తొలగిస్తుండగా ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. ఘటనపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. రాష్ట్రానికి అవసరమైన సాయం చేస్తామని యూపీ సీఎంకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హామీనిచ్చారు. యూపీ డీజీపీ జావెద్ అహ్మద్ కథనం ప్రకారం... ఆక్రమణల తొలగింపులో భాగంగా గురువారం పోలీసులు రెక్కీ నిర్వహించడానికి వెళ్లగా ఎలాంటి కవ్వింపు లేకుండానే ఆక్రమణదారులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని చెప్పారు. రెండు షెల్టర్లను తొలగించిన అనంతరం ఆందోళనకారులు గ్యాస్ సిలిండర్లతో పాటు, ఆయుధాల నిల్వలకు నిప్పంటించడంతో భారీ పేలుళ్లు సంభవించాయని, ఈ విధ్వంసంలో మథుర సిటీ ఎస్పీ ముకుల్ ద్వివేది, ఎస్హెచ్ఓ(ఫరా) సంతోష్ యాదవ్లు మరణించారన్నారు. 22 మంది ఆక్రమణదారులు కూడా మరణించారని, ఆందోళనకారుల మంటల వల్లే 11 మంది చనిపోయారని డీజీపీ తెలిపారు. 23 మంది పోలీసు సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. 47 గన్లు, ఆరు రైఫిల్స్, 178 చేతి గ్రనేడ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు, మరో 196 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామన్నారు. నక్సల్స్ ప్రమేయం ఉందన్న కోణంలోను విచారణ చేస్తామన్నారు. నిఘా వైఫల్యం కొంత కారణం: అఖిలేశ్ మథుర హింసలో అమరులైన పోలీసుల కుటుంబాలకు సీఎం అఖిలేష్ రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు. బారాబంకిలో సీఎం అఖిలేశ్ మాట్లాడుతూ.. గతంలో పలుమార్లు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఆక్రమణదారులతో చర్చించారని, స్వాధీనం చేసుకునేటప్పుడు ఎన్నో సార్లు పోలీసులు హెచ్చరికలు చేశారని చెప్పారు. అధికార యంత్రాంగంతోపాటు, నిఘా వైఫల్యం కూడా కొంత ఉందన్నారు. ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యముందని కేంద్ర మంత్రి రిజుజు విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనేందుకు ఈ సంఘటనే నిదర్శనమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎవరీ ఆందోళనకారులు? ‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’... బాబా జైగురుదేవ్ నుంచి వేరు పడి ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుచరులుగా చెప్పుకునే ఈ గ్రూపు విచిత్రమైన డిమాండ్లతో రెండేళ్ల క్రితం ధర్నా చేపట్టి జవహర్ బాగ్లోని 260 ఎకరాల్ని ఆక్రమించింది. రాష్ట్రపతి, ప్రధాని కోసం ఎన్నికలను రద్దుచేయాలని, ప్రస్తుత కరెన్సీ స్థానంలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ కరెన్సీనీ ప్రవేశపెట్టాలని, రూపాయికి 60 లీటర్ల పెట్రోల్, అలాగే రూపాయికే 40 లీటర్ల డీజిల్ అమ్మాలంటూ వీరు డిమాండ్ చేస్తున్నారు. ఆక్రమణల్ని తొలగించేందుకు గతంలో పలు ప్రయత్నాలు సాగినా అవి ఫలించలేదు. రామ్ వ్రిక్ష యాదవ్, చందనా బోస్, గిరిష్ యాదవ్, రాకేష్ గుప్తాలు ప్రధాన కుట్రదారులని, వారు బతికుంటే సజీవంగా పట్టుకుంటామని యూపీ డీజీపీ వెల్లడించారు. ఆక్రమణదారులు చేతి గ్రనేడ్లతో పాటు ఆటోమెటిక్ ఆయుధాలతో చెట్లపై నుంచి కాల్పులు జరిపారన్నారు.