BRS Party Workers Try To Attack On Komatireddy At Nalgonda - Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత.. కుర్చీలు, కర్రలు విసిరిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

Published Thu, Feb 16 2023 5:52 PM | Last Updated on Thu, Feb 16 2023 6:27 PM

BRS Party Workers Try To Attack Komatireddy At Nalgonda - Sakshi

బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో.. కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన.. 

సాక్షి, నల్లగొండ:  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం ఆయన జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని ఇటుకలపాడులో పర్యటించారు. అయితే.. 

ఈ పర్యటనలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.  బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని హాజరైన కోమటిరెడ్డి ప్రసంగించారు. రోడ్లు బాగోలేవని, ఇటుకలపాడుకు రావడానికి మూడు గంటలకు పైగా సమయం పట్టిందని.. సీఎం కేసీఆర్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. అయితే.. 

ఆ వ్యాఖ్యలు అక్కడే ఉన్న కొందరు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి. బొడ్రాయి ప్రతిష్టాపనకు వచ్చి రాజకీయం మాట్లాడుతున్నారంటూ అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనపై కుర్చీలు, కర్రలు విసిరి దాడి చేసేందుకు యత్నించారు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు. అయితే దాడి నుంచి ఆయన తప్పించున్నారు. ఈ క్రమంలో..

పోటీగా రంగంలోకి కాంగ్రెస్‌ కార్యకర్తలు.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో తోపులాటకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement