-
అతికిరాతకంగా YSRCP కార్యకర్త హత్య
అన్నమయ్య, సాక్షి: ఎన్నికల కౌంటింగ్ ముందు హత్యారాజకీయాలతో ఏపీలో అలజడులు సృష్టించాలనే ప్రయత్నాలు మొదలయ్యాయా?. అన్నమయ్య జిల్లాలో తాజాగా జరిగిన ఘాతుకం అవుననే సంకేతాలిస్తోంది. మదనపల్లి శ్రీవారినగర్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మృతుడ్ని పుంగనూరు శేషాద్రిగా పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుఝామున శేషాద్రి ఇంట్లోకి చొరబడిన 30 మంది దుండగులు అతికిరాతకంగా నరికి చంపి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రక్తపు మడుగులో పడి ఉన్న శేషాద్రి మృతదేహాన్ని స్వాధీన పర్చుకున్నారు. శేషాద్రి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 70సార్లు నరికి.. శనివారం వేకువ ఝామున శేషాద్రి ఇంటి తలుపులు బద్ధలు కొట్టిన దుండగులు.. ఆయన భార్య కళ్ల ముందే అతి దారుణంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. కాళ్ల మీద పడి చంపొద్దని వేడుకున్నా.. ఆ కిరాతకులు కనికరించలేదు. జిల్లా ఆస్పత్రిలో శేషాద్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు.. శరీరంపై కత్తిపోట్లు చూసి విస్తూపోయారు. సుమారు 70 కత్తి పోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. దుండగులు భూ దందాల ముఠా సభ్యులై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
Yellow Babu : ప్రకృతి కూడా పసుపు పార్టీ సరుకేనా?
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాజకీయ పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి బి.ఆర్.ఎస్., బిజెపి ల నుండి పలువురు నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇలా చేస్తే ప్రకృతి ఊరుకోదని.. తీవ్ర పరిణామాలు తప్పవని గతంలో రేవంత్ రెడ్డి ఓ ఎల్లో మీడియా అధినేతతో కలిసి స్టూడియోలో కూర్చుని సిద్ధాంతీకరించారు. మరి ఇపుడు రేవంత్ రెడ్డి ఇలా BRS పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? ప్రమాదం ఏమీ ఉండదా? అని పొలిటికల్ ఎన్విరాన్ మెంటలిస్టులు ప్రశ్నిస్తున్నారు. పొరుగు పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదట. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని అనుకోవడం వల్లనే దివంగత వై.ఎస్.ఆర్. పై ప్రకృతి ప్రకోపించిందట. దాని కారణంగానే ఆయన మరణించారని ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లో మీడియా లో ఇంటర్వ్యూలో అభిప్రాయ పడ్డారు. ఇలా అభిప్రాయ పడ్డ రేవంత్ రెడ్డి.. ఏబీఎన్ రాధాకృష్ణ ఇద్దరూ కూడా చాలా చాలా మేధవులు. కాకపోతే ఇద్దరికీ కొద్ది పాటి సంస్కారం కూడా లేకుండా పోయిందంటున్నారు రాజకీయ పండితులు. దివంగత వై.ఎస్.ఆర్. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చనిపోయిన వారి గురించి ఎవ్వరూ కూడా హేళనగా మాట్లాడరు. కానీ ఈ ఇద్దరూ కూడా వై.ఎస్.ఆర్. మరణానికి ఆయన టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలనుకోవడమే కారణమన్నట్లు.. అందుకే ప్రకృతి ఆయన్ను శిక్షించింది అన్నట్లు తీర్మానించారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టమైన గురువు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? 23 మంది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కేసులు పెడతామని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి టిడిపిలో చేర్చుకున్నారు. మరి ఈ ఘటనపై ప్రకృతికి కోపం ఎందుకు రాలేదట? వై.ఎస్.ఆర్. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను చేర్చుకుందామా వద్దా అని ఆలోచన చేస్తేనే పగ బట్టేసిన ప్రకృతి చంద్రబాబు నిస్సిగ్గుగా 23 మందిని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడమే కాకుండా అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినా ప్రకృతి ఎందుకు ఊరుకున్నట్లు? కొంపదీసి ప్రకృతి కూడా ఎల్లో బ్యాచ్ లో చేరిపోయిందా? ఎల్లో మీడియా తరహాలో టిడిపి అధినేత ఏం చేసినా ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్ధి అయిన వై.ఎస్. ఆర్. తనను ఆశ్రయించిన వారిని తన పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటేనే ప్రకృతికి కోపం వస్తుందా? అన్నది రేవంత్ రెడ్డితో పాటు..రాధాకృష్ణకూడా సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదే చంద్రబాబు పురమాయిస్తే ఇదే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటికి కరెన్సీ కట్టలతో వెళ్లి బేరసారాలాడారు. మరి ఆ ఘటన పట్ల ప్రకృతికి అభ్యంతరాలేవీ ఉండవా? చంద్రబాబు వారి అనుచరులు ఎలా వ్యవహరించినా ప్రకృతి చూసి పరవశించిపోతుందా? అన్నది కూడా రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు వివరించాలి. ఈ ఒక్క విషయమే కాదు..చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు పీకలదాకా అప్పులు చేసి రాష్ట్ర ఖజానా దివాళా తీయించి గద్దె దిగేటపుడు 100కోట్లు మాత్రమే మిగిల్చి పోయారు. అపుడు ఏపీ అద్బుతంగా ఉందని భజన చేసింది ఎల్లో మీడియా. బాబుతో పోలిస్తే చాలా తక్కువగా అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తున్నారంటూ గగ్గోలు పెట్టే రాతలు రాసింది. మనోడు చేస్తే సంసారం..ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఎల్లో మీడియా పైత్యపు రాతలు.. ఆ భావజాలంతో ఉండే వారి పైత్యపు కూతలు కొత్త కాదు. సరే చంద్రబాబు నాయుడి ప్రకృతికి చుట్టం కాబట్టి ఆయన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా రాజ్యాంగ విరుద్ధంగా టిడిపిలో చేర్చుకున్నా ప్రకృతి ఏమీ అనలేదు. కానీ ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ప్రకృతి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన్ని అభిమానించే వారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బి.ఆర్.ఎస్. నుంచి ఇద్దరు ఎంపీలను ఒక ఎమ్మెల్యేనీ రేవంత్ రెడ్డి పార్టీ చేర్చుకుని కండువాలు కప్పింది. మరో మాజీ మంత్రి మల్లారెడ్డిని డి.కె.శివకుమార్ దగ్గరకు పంపి బేరాలాడించింది. ప్రకృతి ఏపీలోనే కాదు కర్నాటకపైనా నిఘా పెడుతుంది మరి. అందుకే అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిదంటున్నారు విజ్ఞులు. - సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
ఒడిశా కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ!
ఒడిశాలో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు వివిధ పదవులకు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్కు అంజేశారు. ఎమ్మెల్యే పాణిగ్రాహి గత 25 ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగారు. ఆయన త్వరలోనే బీజేడీలో చేరనున్నారని విశ్వసనీయ సమాచారం. ఖాడియాల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో చర్చించిన తర్వాతనే తాను కాంగ్రెస్ను వీడాలని నిర్ణయించుకున్నానని అధిరాజ్ మీడియాకు తెలిపారు. ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. అయితే ఆయన బీజేడీలో చేరుతారంటూ పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్పై అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయనకు 59,308 ఓట్లు వచ్చాయి. బీజేడీ నేత లంబోధర్ నియాల్కు 56,451 ఓట్లు వచ్చాయి. 2014లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి పాణిగ్రాహి ఓటమి చవిచూశారు. -
రేపు వైఎస్సార్సీపీ కీలక సమావేశం
గుంటూరు, సాక్షి: పార్టీ కేడర్తో కీలక సమావేశం నిర్వహించేందుకు అధికారపక్షం వైఎస్సార్సీపీ సిద్ధం అయ్యింది. మంగళవారం మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జరగబోయే ఈ మీటింగ్లో మండల, బూత్ లెవల్లో పని చేసే పార్టీ శ్రేణితో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు(కొత్త-పాత ఇన్ఛార్జిలు) పాల్గొననున్నారు. ఎన్నికలకు ముందర జరగబోయే క్షేత్రస్థాయి సమావేశం ఇదే చివరిది. రేపటి సమావేశానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా హాజరవుతారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో.. ఎన్నికల్లో ఎలా పని చేయాలో కేడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని అన్నారు. ఎన్నికలకు ముందు జరగబోయే ఆఖరు సమావేశం ఇది. క్షేత్రస్థాయి. .మండల కార్యకర్తల సమావేశం. సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు పాల్గొంటారు. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సీఎం జగన్ దిశానిర్ధేశం చేస్తారు. ప్రత్యర్ధులు అవకతవకలకు పాల్పడకుండా ఎలా చూడాలో చెప్తారు. ప్రజల్లోకి మరింతగా పార్టీని ఎలా తీసుకెళ్లాలో వివరిస్తారు.. గడపగడపకు కార్యక్రమంతో ఎప్పుడూ వైఎస్సార్సీపీ ప్రజల్లోనే ఉంది. నాయకులెప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని.. పథకాల్ని ప్రజలకు చేరవేస్తున్నాం. ఈ నాలుగున్నరేళ్లుగా ప్రజల అవసరాలను తెలుసుకుని మరీ తీరుస్తున్నాం. అందుకే.. అందరి కంటే ముందుగా ఎన్నికల కోసం గట్టి టీమ్ను సిద్ధం చేసుకున్నాం. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పూర్తి చేశాం. బూత్ కమిటీలు కూడా రెడీ చేస్తున్నాం. సమర్ధవంతమైన బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక ఓరియంటేషన్ ప్రక్రియ రేపు జరగనుంది. రేపటి సమావేశం తర్వాత మేం పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతాం. .. మా అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తున్నప్పుడు ఏదో అయిపోతుందని మమ్మల్ని విమర్శించారు. మేం ఆరోజే చెప్పాం. మీకే బ్యాడ్ టైం మొదలుకాబోతోందని. అసంతృప్తుల్ని పిలిచి మాట్లాడుతున్నాం.. అంతా సర్దుకున్నారు. టీడీపీ-జనసేన అతుకుల బొంతగా ఉంది. పవన్ ను ఘోరంగా అవమానించి 24 సీట్లు కేటాయించారు. ఆ రెండు పార్టీల్లోని అసంతృప్తులు మా పార్టీలోకి వస్తామంటున్నారు. గంపగుత్తగా వస్తున్నారని మేం ఎవరిని పడితే వారిని చేర్చుకోం. అలాంటి వారి వల్ల అనవసరమైన తలనొప్పులు.. పార్టీకి భారం. అవకాశం ఉన్న చోట వాళ్లను చేర్చుకునే అంశం పరిశీలిస్తాం అని సజ్జల పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ క్షేత్రస్థాయి సమావేశం ఏర్పాట్లను సజ్జలతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి పార్టీ ఇన్ఛార్జి గంజి చిరంజీవి సమీక్షించారు. ‘‘ఎంతమంది కలిసి వచ్చినా మా(వైఎస్సార్సీపీ) విజయాన్ని ఎవరూ ఆపలేరు. 175 కి 175 గెలవబోతున్నాం...ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి. మార్చి 3వ తేదీన చివరి సిద్ధం సభ జరగబోతోంది. ఎన్నికలకు సమాయాత్తమవుతున్న సమయంలో రేపటి మీటింగ్ కీలకం కాబోతోంది. కీలకమైన నాయకులు,బూత్ లెవల్లో నాయకులంతా రేపటి మీటింగ్ హాజరవుతారు. పార్టీ పరంగా వివిధ హోదాల్లో ఉన్న 2,700 మందికి ఆహ్వానం పంపించాం’’ అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. -
రా... కదలిరాలో కిందపడబోయిన చంద్రబాబు.. ఆగ్రహం
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ కార్యకర్తలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కోపమొచ్చింది. రాజానగరం టికెట్ కేటాయింపు అసంతృప్తి సెగలు ఆయనకు తగిలాయి. ఈ క్రమంలో రాజమండ్రి రూరల్ కాతేరులో సోమవారం ఆయన నిర్వహించిన రా కదలి రా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాజానగరం టికెట్ జనసేనకు కేటాయించడంపై చంద్రబాబు సమక్షంలో బొడ్డు వెంకటరమణ వర్గీయులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో స్టేజ్ పైనుంచి కార్యకర్తలు దూకుడుగా దిగే యత్నం చేయగా.. చంద్రబాబు కిందపడబోయారు. అయితే సెక్యూరిటీ ఆయన్ని కిందపడకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇదేం తీరు తమ్ముళ్లూ.. అంటూ సొంత పార్టీ కార్యకర్తల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
CM Jagan: రాష్ట్రవ్యాప్తంగా పర్యటన.. వైఎస్సార్సీపీ కేడర్తో భేటీ
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కీలక సమావేశాల నిర్వహణకు అధికార వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందుకోసం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. పార్టీ కేడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ రీజనల్ క్యాడర్ సమావేశాలు మొదలు కానుండగా.. తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానుంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. ఇప్పటికే వైఎస్సార్సీపీ పలు మార్పులతో కూడిన జాబితాల్ని సిద్దం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మొదటగా సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో కేడర్ సమావేశాలు జరుగుతాయన్నారు. ఇక నాలుగు నుంచి ఆరు జిల్లాలకు కలిపి ఒకే కేడర్ సమావేశంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీల్లో ఎన్నికల కోసం వ్యవహరించాల్సిన వ్యూహంపై పార్టీ కేడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. “Message to YSRCP Cadre” పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని "5 రీజియన్ లలో క్యాడర్ మీటింగ్"లను నిర్వహించి క్యాడర్ కి దిశానిర్దేశం చేయబోతున్నారు. 4-6 జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పార్టీ సభ్యులందరినీ ఏకంచేసి,… — YSR Congress Party (@YSRCParty) January 12, 2024 -
రణరంగంగా నాని వర్సెస్ చిన్ని.. జనసైనిక్స్ ఆగ్రహం!
ఎన్టీఆర్, సాక్షి: అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి బహిరంగంగానే తీవ్రస్థాయిలో బయటపడింది. బుధవారం తిరువూరులో టీడీపీ సమన్వయ భేటీ సాక్షిగా కేశినేని నాని-కేశినేని చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. చిన్నిని లోపలికి వెళ్లనీయకుండా నాని వర్గీయులు అడ్డుకోవడంతో పార్టీ ఆఫీస్ ప్రాంగణం రణరంగంగా మారింది. ఈ క్రమంలో.. అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైనా దాడికి దిగారు. ఈ పరస్సర దాడిలో ఎస్సై సతీష్కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉంది. ఈ ఏర్పాట్లను స్థానిక నేతలతో విడివిడిగా భేటీ అవుతూ ఆ అన్నదమ్ములిద్దరూ వేర్వేరుగానే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సమన్వయ భేటీ జరగ్గా.. దానికి జనసేన కార్యకర్తలు సైతం హజరయ్యారు. అయితే అక్కడ కేశినేని నాని ఫ్లెక్సీ లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడే ఉన్న చిన్ని ఫ్లెక్సీని చించేశారు. అయితే అందులో పవన్ కల్యాణ్ ఫొటో కూడా ఉండడంతో జనసైనికులు నొచ్చుకున్నారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సమావేశం బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. అదే సమయంలో తిరువూరు ఇన్ఛార్జి దత్తుపై నాని వర్గీయుల దాడి చేశారు. చిన్నిని లోపలికి రానివ్వబోమంటూ అడ్డుగా బైఠాయించారు. ఇక.. ఈ పరిణామం గురించి తెలుసుకుని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు కేశినేని చిన్ని. ఆయన్ని అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో టీడీపీ నేతలు సర్దిచెప్పే యత్నం చేశారు. అయినా పరిస్థితి సర్దుమణగలేదు. చివరకు ఎస్సై తలకు గాయం కావడంతో.. విస్తృతస్థాయి సమావేశం నిర్వహించుకుండానే టీడీపీ ముఖ్యనేతలు అక్కడి నుంచి జారుకున్నారు. -
జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి: కేజ్రీవాల్
ఢిల్లీ: ప్రజా క్షేమమే లక్ష్యంగా.. పనే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేసిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ కారణంగానే ఆప్కు ప్రజాధరణ లభించిందని చెప్పారు. ప్రజలకు మంచి చేయడానికి తాము ఎంచుకున్న మార్గం కోసం జైలుకు వెళ్లడానికైనా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలపై ఐదుగురు ఆప్ నేతలు జైలులో ఉన్నందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ నేతలను ఉద్దేశించి ఆప్ అధినేత ఈ మేరకు మాట్లాడారు. "పిల్లలకు మంచి చదువులు చెప్పాలని, పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు పంపిస్తారా?. అందుకు ఎప్పుడైనా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. మేము పోరాటాన్ని ఎదుర్కొంటున్నాం. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు జైలులో ఉన్న మా ఐదుగురు నాయకులు హీరోలే. వారందరినీ చూసి మేము చాలా గర్వపడుతున్నాం. ఏ ఇతర పార్టీలు దృష్టి సారించని విషయాలను పట్టించుకున్నందుకే ఆప్ రాజకీయాల్లోకి ఎదిగింది." అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జనవరి 3న హాజరుకావాలని ఈడీ సమన్లు పంపిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఈడీ రెండు సార్లు కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన గౌర్హాజరయ్యారు. ఇదీ చదవండి: PM Narendra Modi Wishes: దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు! -
చంద్రబాబు మోసం.. నక్కాకు చేదు అనుభవం
సాక్షి, అల్లూరి: చంద్రబాబు చేసిన దారుణ మోసాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అరకులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది ఆయనకి. నక్కా ఆనంద్ బాబు తాజాగా అరకు పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. టీడీపీ నేత అబ్రహాంకు అన్యాయం చేశారంటూ నినాదాలు చేశారు. మావోయిస్టుల చేతిలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సోము తనయుడు అబ్రహాం. అబ్రహాంకు టికెట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. దీంతో నక్కా ఆనంద్బాబును అడ్డుకోవడం ద్వారా టీడీపీ అధిష్టానానికి తమ నిరసన గళం వినిపించారు కార్యకర్తలు. -
ఛత్తీస్గఢ్ సీఎం ఎవరు? నేటితో చర్చలకు తెర?
ఛత్తీస్గఢ్కు నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపిక అవుతారనేదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. సీఎం ఎంపికకు బీజేపీ పరిశీలకులను నియమించింది. ఈ నేపధ్యంలో నేడు (ఆదివారం) శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో సీఎం పేరు ఖరారు కావచ్చని భావిస్తున్నారు. అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ గౌతమ్లను బీజేపీ ఛత్తీస్గఢ్ పరిశీలకులుగా నియమించింది. రాష్ట్ర ఇన్చార్జి ఓం మాథుర్, రాష్ట్ర కో-ఇన్చార్జ్ నితిన్ నబిన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా సింగ్, కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్ సాయి, రాంవిచార్ నేతమ్, అరుణ్ సావో, ఓపీ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక కోసం బీజేపీ పరిశీలకులను ప్రకటించింది. వీరు ఎమ్మెల్యేలతో చర్చలు సాగించి సీఎం పేర్లను ప్రకటిస్తారు. అనంతరం మూడు రాష్ట్రాలలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. కాగా మూడు రాష్ట్రాల్లో జరిగే ప్రమాణస్వీకారోత్సవాలు జరిగే తేదీలపై చర్చ పార్టీలో జరుగుతోంది. ఇది కూడా చదవండి: అందరికీ ‘రామ్ రామ్’ -
అసమ్మతుల చూపు.. ప్రగతి భవన్ వైపు..!
భద్రాద్రి: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే టికెట్లు దక్కించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు, టికెట్లపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు అంతా ‘చలో హైదరాబాద్’ అంటున్నారు. ఇప్పటికే కొందరు రాజధానిలో మకాం వేయగా.. మరికొందరు నేడు, రేపు హైదరాబాద్ బాట పట్టనున్నారు. చల్లారని ఇల్లెందు సెగ.. ఇల్లెందు నియోజవకర్గంలో బీఆర్ఎస్లో చెలరేగిన అసమ్మతి ఎంతకీ చల్లారడం లేదు. రెండు వారాల క్రితం మంత్రి హరీశ్రావుకు తమ ఇబ్బందులు చెప్పుకున్న అసమ్మతి వర్గం నేతలు గురువారం హైదరాబాద్ వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవితతో కలిసి ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డీవీ, పార్టీ అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, కృష్ణప్రసాద్, మధుకర్రెడ్డి కేటీఆర్ను కలిశారు. సుమారు రెండు గంటల పాటు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు. అసమ్మతి నేతలు చెప్పిన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ నుంచి వచ్చే ఏ ఆదేశాలనైనా పాటించేందుకు సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. సోమవారం తొలి జాబితా.. కమలం పార్టీకి సంబంధించి ఇల్లెందు నుంచి ఊకె అబ్బయ్య, భద్రాచలం నుంచి కుంజా సత్యవతి వంటి మాజీ ఎమ్మెల్యేలు ఆయా స్థానాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కొత్తగూడెం నుంచి పోటీకి రంగాకిరణ్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పినపాక నుంచి కేంద్ర సర్వీసులకు చెందిన కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. కాగా బీజేపీ మొదటి జాబితా వచ్చే సోమవారం వెలువడుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ‘గులాబీ’ అభ్యర్థుల పయనం.. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. గత నెల రోజులుగా వీరంతా నియోజకవర్గాల స్థాయిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తదితర అధికారిక కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. అయితే ఎన్నికలు సమీపించిన వేళ ఇల్లెందు, అశ్వారావుపేటలో అసమ్మతి చెలరేగడం అభ్యర్థులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఈనెల 15న హైదరాబాద్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశం జరగనుంది. టికెట్లు కేటాయించిన అభ్యర్థులకు ఆ సమావేశంలోనే బీ ఫామ్లు ఇస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా, రేగాకాంతారావు, హరిప్రియనాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తెల్లం వెంకట్రావు నేడు, రేపు హైదరాబాద్ వెళ్లనున్నారు. ఢిల్లీ టు హైదరాబాద్.. కాంగ్రెస్లో టికెట్ల కేటాయింపు అంశం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఆశావహులంతా గత పది రోజులుగా ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు. నిన్నా మొన్నటి వరకు టికెట్ల కేటాయింపు కోసం నియమించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఢిల్లీలో జోరుగా సాగాయి. దీంతో ఆశావహులు తమకు సానుకూలంగా ఉన్న అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు అక్కడే మకాం వేశారు. లంబాడా సామాజిక వర్గానికే ఇల్లెందు టికెట్ ఇవ్వాలంటూ ఆజ్మీరా శంకర్నాయక్, ప్రవీణ్ నాయక్, రామచంద్రునాయక్ తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఇక కొత్తగూడెం టికెట్ బీసీలకే ఇవ్వాలంటూ ‘గూడెం’ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గుర్రుగా ఉన్న పొదెం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో వామపక్షాలకు పొత్తు కుదిరితే భద్రాచలం అసెంబ్లీ స్థానం సీపీఎంకు కేటాయిస్తారనే ప్రచారం విపరీతంగా జరగడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఆమీతుమీ తేల్చుకునేందుకు భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య రెండు రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని పొత్తులో ఇతర పార్టీకి టికెట్ కేటాయించడమేంటని ఆయన పార్టీ పెద్దలను నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ పొత్తుల్లో భద్రాచలం స్థానాన్ని సీపీఎంకు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైతే పినపాక నుంచి పోటీ చేయాలని పొదెం వీరయ్యకు కాంగ్రెస్ ఆఫర్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే భద్రాచలం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వకుంటే ములుగు నుంచి పోటీకి సిద్ధమని ఆయన పార్టీ పెద్దలకు కబురు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. భద్రాచలం, ములుగు తప్ప మరో స్థానం నుంచి పోటీ చేసే ప్రసక్తి లేదని పొదెం వీరయ్య కుండబద్ధలు కొట్టినట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం. -
ఈ నెల 15వ తేదీ తర్వాత గెలుపు గుర్రాలను ప్రకటించనున్న బీజేపీ.. మరీ అసంతృప్తులకు..!
సూర్యపేట్: ఉమ్మడి జిల్లాలో పోటీలో ఉండే అభ్యర్థుల విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో ఒకరి పేరునే మొదటి ప్రాధాన్యంగా తీసుకొని అధిష్టానానికి పంపించగా.. మరికొన్ని నియోజకవర్గాలో రెండవ పేరుతో కూడిన జాబితాను పంపించినట్లు తెలిసింది. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన పార్టీ స్క్రీనింగ్ కమిటీ వాటి వడబోత కార్యక్రమాన్ని పూర్తి చేసింది. నియోజవకర్గాల్లో పోటీలో ఉండబోయే అభ్యర్థుల పేర్లను ఈ నెల 15వ తేదీ తరువాత ప్రకటించనుంది. అయితే, అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టతకు వచ్చిన పార్టీ.. మిగతా వారిని బుజ్జగించే పనిలో ఉంది. నాలుగు రకాలుగా వడబోత అభ్యర్థుల ఎంపికలో నాలుగు రకాల జాబితాలను సేకరించినట్లు తెలిసింది. ఇందులో ముఖ్యమైన నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన ఆశావహులపై అభిప్రాయాలను తీసుకున్నట్లు పార్లీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు బీజేపీకి వెన్నెముకగా వ్యవహరించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి కూడా నియోజకవర్గాల వారీగా పేర్లను తీసుకున్నట్లు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి కూడా ఇలా అభిప్రాయ సేకరణ చేసిన తరువాత వాటన్నింటని క్రోడీకరించి కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కరి పేరును, మరికొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరి పేర్లను, ఇంకొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురి పేర్లతో కూడా జాబితాను పార్టీ అధిష్టానానికి పంపించింది. నాలుగు చోట్ల ఒక్కరి పేరే.. నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో నాలుగు రకాల జాబితాల్లో ఒక్కరి పేరును మొదటిదిగా పేర్కొన్నట్లు తెలిసింది. అందులోని ఆ ఒక్కరి విషయంలో ఏకాభిప్రాయం రావడంతో వారికే టికెట్ను పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. మునుగోడు నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గం నుంచి సంకినేని వెంకటేశ్వర్రావు, భువనగిరి నుంచి గూడురు నారాయణరెడ్డి, తుంగతుర్తి నుంచి కడియం రామచంద్రయ్య పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది. అనుకోని పరిణామాలు ఎదురైతే తప్ప వారి విషయంలో మార్పు ఉండే అవకాశం లేదు. రంగంలోకి జిల్లా ఎన్నికల ఇన్చార్జీలు.. పార్టీ అధిష్టానం జిల్లా ఎన్నికల ఇన్చార్జీలను రంగంలోకి దింపుతోంది. టికెట్ ఎవరికి ఇచ్చినా పనిచేసేలా బుజ్జగింపులకు తెర తీసింది. అసంతృప్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మంత్రి శోభ కరాండ్లజే జిల్లాకు చేరుకున్నారు. వివిధ నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతున్నారు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోనూ మూడు నాలుగు రోజుల్లో జిల్లా ఎన్నికల ఇన్చార్జీల సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇద్దరి పేర్లను ప్రతిపాదించిన నియోజకవర్గాలు.. ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఒక్కో సెగ్మెంట్ నుంచి ఇద్దరి పేర్లను అధిష్టానానికి పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధానంగా పోటీపడుతున్న వారిలో నల్లగొండ నుంచి మాదగోని శ్రీనివాస్గౌడ్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, నాగం వర్షిత్రెడ్డి టికెట్ ఆశిస్తుండగా.. వారిలో ఇద్దరి పేర్లను పంపించినట్లు సమాచారం. నకిరేకల్ నుంచి చేపూరి రవీందర్, నకిరేకంటి మొగిలయ్య, దేవరకొండ నుంచి కేతావత్ లాలూనాయక్, జర్పుల కల్యాణ్నాయక్, నాగార్జునసాగర్ నుంచి కంకణాల నివేదితారెడ్డి, బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్యాదవ్, మిర్యాలగూడ నుంచి సాదినేని శ్రీనివాసరావు, రేపాల పురుషోత్తంరెడ్డి, పల్నాటి వెంకట్రెడ్డి, ఆలేరు నుంచి పడాల శ్రీనివాస్, కాసం వెంకటేశ్వర్లు, సూదగాని హరిశంకర్గౌడ్, కోదాడలో నూకల పద్మావతిరెడ్డి, ఓర్సు వేలంగిరాజు, హుజూర్నగర్లో బొబ్బా భాగ్యరెడ్డి, గట్టు శ్రీకాంత్రెడ్డి, చల్లా శ్రీలతారెడ్డి టికెట్ కోసం పోటీపడుతున్నారు. వారిలో ఇద్దరి పేర్లతో కూడిన జాబితాను పంపించింది. -
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం
ఢిల్లీ: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటకలో బీజేపీకి తన పాత మిత్రుడు తోడు నిలిచాడు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే, జేడీఎస్ కలిసే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈమేరకు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) ఎన్డీయేలో చేరుతున్నట్లు స్పష్టం చేసింది. జేడీఎస్ చీఫ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే ఈ చేరిక తదనంతర.. సీట్ల పంపకాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. జేడీఎస్కు నాలుగు సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఇరుపార్టీల నేతలు ఫొటోలు షేర్ చేస్తూ ఈ మేరకు తెలిపారు. 'ఎన్డీయే, జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని తెలపడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎన్డీయేలో చేరినందుకు జేడీఎస్కు అభినందనలు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయేకి మరింత బలం చేకూర్చినట్లయింది' అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. Met Former Chief Minister of Karnataka and JD(S) leader Shri H.D. Kumaraswamy in the presence of our senior leader and Home Minister Shri @AmitShah Ji. I am happy that JD(S) has decided to be the part of National Democratic Alliance. We wholeheartedly welcome them in the NDA.… pic.twitter.com/eRDUdCwLJc — Jagat Prakash Nadda (@JPNadda) September 22, 2023 బీజేపీతో చేరిపోతున్నారా..? అని గతవారం కుమారస్వామిని అడగగా.. గణేష్ చతుర్థి తర్వాత ఏదో ఒక ప్రకటన వెలువరిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం అధికారికంగా ప్రకటించారు. అయితే.. లోక్సభ ఎన్నికల కోసం నాలుగు సీట్లు జేడీఎస్కే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఓటమి పాలైంది. ఆ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఈ పొత్తు సార్వత్రిక ఎన్నికలకే పరిమితం అవుతుందా? రాష్ట్ర రాజకీయాల్లోనూ కొనసాగుతుందా? అనేదానిపై మాత్రం ఇరు వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. ఇదీ చదవండి: ఎన్సీపీలో రగులుతున్న వివాదం.. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? -
లోకేష్ రాక.. టీడీపీ గుండాగిరి
సాక్షి, కృష్ణా: జిల్లాలో తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యాత్ర సందర్భంగా.. ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బజారు రౌడీల్లాగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. లోకేశ్ రాక సందర్భంగా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాయి టీడీపీ శ్రేణులు. అయితే అదే సమయంలో కౌంటర్గా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశాయి వైఎస్సార్సీపీ శ్రేణులు. ఈ పరిణామాన్ని టీడీపీ గుండాలు జీర్ణించుకోలేకపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసి.. కర్రలతో ఇష్టానుసారంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వల్లభనేని పరామర్శ.. ఫిర్యాదు రంగన్నగూడెం చేరుకున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ మూకల దాడిలో గాయపడిన వైసీపీ శ్రేణులను పరామర్శించారు. లోకేష్ సమక్షంలోనే వంద మందికి పైగా మూకుమ్మడిగా తమ పై దాడిచేశారని వంశీ ఎదుట వాపోయారు బాధితులు. బాధితులతో కలిసి వీరవల్లి పోలీస్టేషన్ కు బయల్దేరిన ఎమ్మెల్యే వంశీ.. ఘటనపై వీరవల్లి పోలీసులకు ఫిర్యాదు చేయయనున్నారు. -
'పార్టీ మారడం లేదు.. ఇలాంటి పుకార్లలో టీడీపీ దిట్ట..'
హైదరాబాద్: తాను పార్టీ మారడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా తాను పార్టీ మారతానని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని చెప్పారు. ఏడాదిగా ఈ దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇంత శాడిజం ఎంటో తనకు అర్థం కావట్లేదని అన్నారు. బీఆర్ఎస్తో కొట్లాడి గెలిచానని చెప్పారు. తాను పార్టీ మారతానని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా కల్చర్ టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ అయిందని పేర్కొన్నారు. దీన్ని వాడటంలో టీడీపీ దిట్ట అని ఆరోపించారు. టీడీపీ కల్చర్ కాంగ్రెస్ను భ్రష్టు పట్టించిందని అన్నారు. ఇదీ చదవండి: Bholakpur Scrap Godown Blast: బోలక్పూర్లో పేలుడు.. -
నన్ను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుంది: చంద్రబాబు
సాక్షి, అన్నమయ్య/చిత్తూరు: చంద్రబాబు నాయుడిలో పరాకాష్టానికి చేరిన ఉన్మాదం మరోసారి బయటపడింది. శుక్రవారం అంగళ్లులో తన పర్యటనతో కల్లోల పరిస్థితికి కారణమైన ఆయన.. టీడీపీ కార్యకర్తలను నిలువరించాల్సిందిపోయి ఇంకా రెచ్చిపోయేలా మాట్లాడారు. పచ్చ దండును ఉసిగొల్పి.. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు అడ్డుకునేందుకు యత్నించిన పోలీస్ సిబ్బందిపైనా దాడులు జరిపించి ఉద్రిక్తతలకు కారణం అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూర్లోనూ ఉద్రికత్తలకు కారణమైంది. పుంగనూరులో టీడీపీ కార్యకర్తల దాడిలో ఇద్దరు ఎస్సైలు, పది మంది కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలూ గాయపడ్డారు. ఈ క్రమంలో.. అధికార పక్షానికి సవాల్ పేరిట ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడారు. తమాషాలు చేస్తున్నారా నా కొడుకులు అంటూనే.. తరమండిరా అంటూ టీడీపీ కార్యకర్తలకు హుకుం జారీ చేశాడు. ‘‘టైం చెప్పండి.. ప్లేస్ చెప్పండి.. ఎవరు గెలుస్తారో చూద్దాం.’’ ‘‘నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టా. బాంబులకే భయపడలేదు. నన్ను బెదిరించడం.. మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు’’. ‘‘కర్రలతో వస్తే కర్రలతో వస్తా.. రౌడీలకు రౌడీగా ఉంటా, ఏయ్ పోలీస్ వాళ్లను పంపించూ’’ అంటూ తన బావ బాలయ్య రేంజ్లో డైలాగులు పేల్చాడు. ఈ క్రమంలో డీఎస్పీ కేశప్పను ఉద్దేశిస్తూ.. ఆ బట్టలు తీసేయండయ్యా.. అందరూ పెయిడ్ ఆర్టిస్టులే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాను మాత్రం సిబ్బందితో షీల్డ్ అడ్డుపెట్టించున్నారు. నన్ను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుంది. దెబ్బలు తగిలినా.. తలలు పగిలినా భయపడేది లేదు. నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ని. మగాళ్లైతే పోలీసులు లేకుండా రండి.. తేల్చుకుందాం. ఏయ్ పోలీస్ బట్టలిప్పూ.. రోషం లేని జీవితం నాశనం. మీ పతనం చూసేవరకు వెంటపడతా.. అంటూ పుంగనూరులో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ నినాదాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పర్యటనను అడ్డుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో టీడీపీ గూండాలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినకుండా దాడులకు తెగబడ్డారు. ఓపెన్ టాప్ వాహనంలో చంద్రబాబు తన కార్యకర్తలను ఉద్దేశించి పరిస్థితిని మరింత దిగజార్చేలా మాట్లాడడం గమనార్హం. -
బాబు మీటింగ్లో బీటెక్ రవి అనుచరుల వీరంగం
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో పులివెందుల నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీటింగ్ సందర్భంగానే వీరంగం సృష్టించారు. అటుగా వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చినా పోలీసులపైనా దాడికి యత్నించారు. దాడికి యత్నించింది టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి(మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి) అనుచరులుగా తేలింది. ఒకానొక దశలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. మరోవైపు పోలీసుల విజ్ఞప్తితో వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించారు. -
రాజకీయ పార్టీ ర్యాలీలో భారీ పేలుడు.. 40 మంది మృతి..
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బజూర్లో భారీ పేలుడు సంభవించింది. దాదాపు 40 మంది మృతి చెందారు. 150 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (జేయూఐ-ఎఫ్) రాజకీయ పార్టీ ర్యాలీలో ఈ దుర్ఘటన జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. Powerful explosion at a political rally left several people dead in Khyber Pakhtunkhwa #Pakistan #BREAKING #BreakingNews #Pakistanblast pic.twitter.com/A7nD8Vaym1 — Eliteworld (@eliteworldwaves) July 30, 2023 ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్లోని బజూర్లో జేయూఐఎఫ్ రాజకీయ పార్టీ మీటింగ్ను నిర్వహించింది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. ఇందులో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. భారీగా ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. పేలుడును జేయూఐఎఫ్ నాయకుడు హఫీజ్ హమ్దుల్లా ఖండించాడు. మానవత్వంపై దాడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నాడు. పేలుళ్లపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: రష్యాపై డ్రోన్ల దాడికి పాల్పడ్డ ఉక్రెయిన్.. మాస్కో విమానాశ్రయం మూసివేత -
తెలంగాణ కమలం పార్టీ ఆఫీస్లో కలకలం.. ఒక్కసారిగా దూసుకొచ్చి..
సాక్షి, హైదరాబాద్: ఇందూరు కమలం దళంలో రేగిన చిచ్చు.. హైదరాబాద్ లోని స్టేట్ పార్టీ కార్యాలయానికి పాకింది. ఎంపీ ధర్మపురి అరవింద్ తీరుపై స్థానిక అసమ్మతి నేతలు ఆందోళనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ సీనియర్ నేతలు సముదాయించినా అసమ్మతి నేతలు వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. నిజామాబాద్ కాషాయ పార్టీ నేతల ఆందోళనకు కారణమేంటీ ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వారికి ఏం చెప్పి సముదాయించారు? నిజామాబాద్ జిల్లాలో కాషాయ పార్టీ రెండుగా చీలింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య ఇటీవల 13 మండలాల అధ్యక్షులను తొలగించి.. కొత్త వారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో చర్చించకుండా.. నేరుగా కొత్తవారిని ప్రకటించడంపై అసమ్మతివర్గం రగిలిపోయింది. ఎంపీ అరవింద్ పట్టుబట్టి పార్టీ మండల అధ్యక్షులను మార్చివేశారని అసమ్మతివర్గం ఆరోపిస్తోంది. (చదవండి: విశ్వనగరమట.. కనీస స్పందన ఉండదా?.. కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్రెడ్డి ఫైర్) బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్భన్ నియోజకవర్గాలకు చెందిన కొంత మంది నేతలు వచ్చి ఒక్కసారిగా బైఠాయించి.. ఆందోళనకు దిగారు. అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి.. వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేయడానికి చాలా మంది అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య పోటీ చేయాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. ఎంపీ అరవింద్ ప్రోత్సాహంతో ధన్ పాల్ సూర్యనారయణ గుప్త అక్కడ పనిచేసుకుంటున్నారు. ఇక ఆర్మూర్ లోనూ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వినయ్ రెడ్డితో పాటు ఇటీవల పార్టీలో చేరిన వ్యాపారవేత్త రాకేశ్ రెడ్డి ఆర్మూర్ బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. (చదవండి: మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానం.. లోక్సభలో ఎవరి బలం ఎంతంటే!) బోధన్ అసెంబ్లీ నుంచి ప్రకాశ్ రెడ్డితో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. (చదవండి: కాంగ్రెస్లోకి వస్తూనే టికెట్ల పంచాయితీ పెట్టిన జూపల్లి! నాగం ఆగమాగం.. చేరికపై ట్విస్టయితే ఉండదుగా!) ఇదే తరుణంలో మండలాల అధ్యక్షులను మార్చడం.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న కొంత మంది.. అసమ్మతి వర్గానికి ఆజ్యం పోయడంతో ఆ రచ్చ కాస్తా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరింది. ఎంపీ అరవింద్ మాత్రం.. మండలాల అధ్యక్షుల మార్పులో తనప్రమేయం లేదని చెబుతున్నారు. ఆందోళనకు దిగిన నిజామాబాద్ అసమ్మతి నేతలను కిషన్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేయడంపై వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. సమస్య ఉంటే అంతర్గతంగా కూర్చొని సెట్ చేసుకోవాలని.. ఇలా వీధిన పడటం భావ్యం కాదని క్లాస్ తీసుకున్నారు. ఈ నెల 29న అమిత్ షా పర్యటన తర్వాత... సర్ధుబాటు చేసుకుందామని చెప్పి ఆందోళనకు దిగిన అసమ్మతి నేతలను కిషన్ రెడ్డి తిరిగి పంపించారు. -సాక్షి, పొలిటికల్ డెస్క్ -
పని చేయలేకున్నాం బాబోయ్.. మంత్రులపై సీఎంకు ఎమ్మెల్యేల లేఖలు..
బెంగళూరు: ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా మూడు నెలలు గడవక ముందే కర్ణాటక కాంగ్రెస్లో ముసలం పట్టిందా..? బయటకు నేరుగా వెల్లడించకపోయినా.. నేతల్లో అసమ్మతి సెగలు రగులుతున్నాయా? సొంత నియోజకవర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని 30 మంది ఎమ్మెల్యేలు సీఎంకు మొరపెట్టుకున్నారా?.. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు ఈ పుకార్లలో వాస్తవం లేదని చెబుతున్నా.. తాజా పరిణామాలు ఇవన్నీ నిజమేనా? అనే సందేహాలను కల్గిస్తున్నాయి. కర్ణాటకాలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. దేశవ్యాప్తంగా నీరుగారుతున్న కాంగ్రెస్ ఆశల్ని పైకిలేపింది. సిద్ధరామయ్య నేతృత్వంలో చక్కగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య పీఠం అధిష్ఠించగానే ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ శ్రేయోరాజ్య స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచిందో లేదో.. ప్రభుత్వం కూలిపోనుందా? అనే పుకార్లు పుట్టాయి. పార్టీ నేతల్లో అసమ్మతి సెగలు కమ్ముకున్నట్లు వార్తలు వచ్చాయి. సొంత నియోజక వర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని 30 మంది ఎమ్మెల్యేలు సీఎంకు మొరపెట్టుకున్నారని ఊహాగానాలు వచ్చాయి. దానికి తోడు తమ ప్రభుత్నాన్ని కూల్చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేయడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అటు.. అభివృద్ధి పనులకు మంత్రులు సహకరించడం లేదని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. సీఎంను ఎలా కిందకు దించాలో తనకు తెలుసంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు.. ప్రభుత్వంలో నేతల మధ్య సఖ్యత దెబ్బతిందనే ఆరోపణలకు బలం చేకూర్చాయి. ఇదీ చదవండి: HD Deve Gowda: జేడీఎస్ భవిష్యత్పై పార్టీ అధినేత దేవె గౌడ కీలక వ్యాఖ్యలు.. అయితే ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని సీఎం సిద్ధరామయ్య తాజాగా స్పష్టం చేశారు. 30 మంది ఎమ్మెల్యేలు తనకు అసమ్మతి లేఖలు పంపలేదని వెల్లడించారు. ఈ వారం పార్టీ అసెంబ్లీ సభ్యుల సమావేశం ఉంటుందని చెప్పారు. గత వారం జరగాల్సిన మీటింగ్ పలు కారణాల వల్ల వాయిదాపడినట్లు చెప్పారు. అటు డీకే శివకుమార్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేల మధ్య సయోద్యతో పాటు ప్రభుత్వ అభివృద్ధి పనులపై చర్చించనున్నట్లు చెప్పారు. మంత్రులపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బెంగళూరుకు బయట కుట్ర జరుగుతోందని డీకే శివకుమార్ వ్యాఖ్యలపై స్పందించడానికి సిద్ధరామయ్య నిరాకరించారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఎదురవుతున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాల అమలుకు పలు నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఒక్క తన నియోజక వర్గంలోనే రూ.300 కోట్ల వరకు అవసరమవుతున్నట్లు చెప్పారు. పథకాలను అలాగే కొనసాగించాలని ఎమ్మెల్యేలు కోరుతున్న విషయాన్ని డీకే తెలిపారు. అయితే.. ఈ విషయాలను మరిచి ప్రజలతో మమేకమై నేతలు ఉండాలని సూచించినట్లు డీకే తెలిపారు. వర్షాలు, వరదల్లో ప్రజలకు తోడుగా ఉండాలని చెప్పినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు.. అమరుని కుటుంబాన్ని రక్షించిన బీఎస్ఎఫ్.. -
'స్వార్థం కోసం సిద్దాంతాల్ని వదిలేశారు'.. విపక్ష భేటీపై ప్రధాని మోదీ ఫైర్..
ఢిల్లీ: దేశాభివృద్ధే తమ అజెండా అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశం కోసం పనిచేయడంలో వెనకడుగు వేయబోమని అన్నారు. తన శరీరంలో ప్రతి కణం.. ప్రతీ క్షణం దేశం కోసమే కేటాయించానని ప్రధాని చెప్పారు. ఎన్డీఏ భేటీ అనంతరం మాట్లాడిన మోదీ.. విపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగారు. తనను తిట్టేందుకు కేటాయించే సమయం.. దేశం కోసం కేటాయిస్తే బాగుండునని అన్నారు. చిన్న చిన్న స్వార్థాలతో విపక్షాలు సిద్ధాంతాలను పక్కన పెడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. నిత్యం విమర్శించుకునే వీళ్లంతా ఒక్కదగ్గరికి చేరుతారేమో గానీ ముందుకు సాగలేరని ప్రతిపక్షాలనుద్దేశించి ప్రధాని మోదీ చెప్పారు. కశ్మీర్లో ఎన్సీ, పీడీపీ రోజూ తిట్టుకుంటాయని అన్నారు. బంగాల్లో టీఎంసీ, కాంగ్రెస్, కమ్యునిస్టుల మధ్య ఎప్పుడూ గొడవలేనని చెప్పారు. PM Narendra Modi garlanded by National Democratic Alliance (NDA) leaders at the NDA meeting in Delhi. pic.twitter.com/jtGJ9XvFiF — ANI (@ANI) July 18, 2023 ఎన్డీఏ హిస్టరీ, కెమిస్ట్రీ తెలుసు.. ఎన్డీఏ హిస్టరీ, కెమిస్ట్రీ ప్రజలకు తెలుసని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో 250 చోట్ల తమకు 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. నిజాయితీగా పనిచేశామని చెప్పిన మోదీ.. ఈ సారి కూడా అలాంటి ఓట్ షేర్నే సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ హయాంలోనే దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని తెలిపారు. ఎన్నికల ఏడాది దేశ రాజకీయాలను విదేశాలు కూడా గమనిస్తాయని తెలిపిన మోదీ.. అధికారం ముగిసిపోయే పార్టీలతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పారు. కానీ భారత్తో అమెరికా, ఫ్రాన్స్ దేశాలు స్నేహం చేస్తున్నాయని తెలిపారు. ఇదీ చదవండి: కళ్లముందు కూటమి కనిపిస్తున్నా.. కలిసుండేది కష్టమే.. ఎవరి లెక్కలు వారివి.. ఎన్డీఏ భేటీ.. 2024కు ముందు దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నేడు బెంగళూరులో 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా.. అటు ఢిల్లీలో ఎన్డీయే కూటమి కూడా 38 పార్టీలతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ రోజు ఢిల్లీలోని అశోక హోటల్లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఎన్డీయే కూటమి భేటీ జరిగింది. National Democratic Alliance (NDA) leaders pose for a group photograph ahead of their meeting in Delhi. A total of 38 political parties are attending the meeting. pic.twitter.com/KVG1j6QIwj — ANI (@ANI) July 18, 2023 భారతావని అంతటా విస్తరించి ఉన్న తమ కూటమి భాగస్వాములతో నేడు సమావేశం జరగనుండటం సంతోషంగా ఉందని భేటీకి ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరడానికి, దేశ అభివృద్ధికి ఇది సరైన సమయమని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముందు కూటమిలో ఉన్న పార్టీల నేతలు ప్రధాని మోదీకి పూల మాలతో సత్కరించారు. PM Narendra Modi garlanded by National Democratic Alliance (NDA) leaders at the NDA meeting in Delhi. pic.twitter.com/jtGJ9XvFiF — ANI (@ANI) July 18, 2023 అయితే.. ఎన్డీఏ కూటమికి హాజరైన పార్టీలు చాలావరకు చిన్న పార్టీలు. తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలు కాగా.. మరికొన్నింటికి అసలు ఎంపీలే లేరు. ఏదైమైనా.. ఈ భేటీతో వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో తేల్చుకునే అవకాశంగా ఈ భేటీని చిన్న పార్టీలు భావిస్తున్నాయి. #WATCH | National Democratic Alliance (NDA) meeting to chalk out a joint strategy to take on opposition alliance 'INDIA' in the 2024 Lok Sabha polls, begins in Delhi A total of 38 political parties are attending the meeting. pic.twitter.com/MDogidlRc6 — ANI (@ANI) July 18, 2023 దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతదేశంతో సహా ప్రధాన రాష్ట్రాల్లో తన స్థానం నిలుపుకుంది. ఉత్తరప్రదేశ్, బిహార్లాంటి రాష్ట్రాల్లో పట్టు నిలుపుకోవడానికి తగిన అన్ని చర్యలు చేపడుతోంది. NDA meeting in Delhi. #NDAMeeting pic.twitter.com/SmNCx8aW6c — Sai Meghana Maddela (@MeghanaMaddela) July 18, 2023 ఇదీ చదవండి: విపక్షాల కూటమికి నాయకుడు ఎవరు..? తేల్చేది ఎవరు..? పెదవి విప్పిన ఖర్గే.. -
తెలంగాణ బీజేపీ.. మరీ ఇంత గందరగోళమా?
తోచీ తోయనమ్మ తోడికోడలు.. పుట్టింటికి వెళ్లిందని ఒక సామెత. భారతీయ జనతా పార్టీ నేతల తీరుతెన్నులు అలాగే ఉన్నాయి. ఆయా రాష్ట్రాలలో మేధావులను,వివిధ వర్గాల ప్రముఖులను కలవడానికి ఆ పార్టీ ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుంది. మంచిదే!. ఆ సందర్భంగా వారు తమకు కాస్త సానుకూలంగా ఉండేవారినో, లేక తటస్థంగా ఉండేవారినో కలిస్తే ప్రయోజనం ఉంటుంది. అలాకాకుండా పూర్తి వ్యతిరేక సిద్దాంతంతో ఉండేవారిని, మరో పార్టీకి ఏజెంట్ గిరీ చేసేవారిని కలవడానికి ఆలోచించడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ✍️ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా.. హైదరాబాద్లో మేధావి, మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి వెళ్లి కలిశారు. ఆయన కూడా వీరిని సాదరంగా ఆహ్వానించి ఇంటిలోకి తీసుకువెళ్లారు. ఆయనకు మోదీ పాలనకు సంబంధించిన వివిధ పుస్తకాలను నడ్డా అందించారు. సిద్దాంతాలు వేరైనా ఇలా రాజకీయ ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలియచేయడానికి రావడం ప్రజాస్వామ్యంలో మంచిదేనని నాగేశ్వర్ అన్నారు. బాగానే ఉంది. నాగేశ్వర్ మర్యాదస్తుడు. అందరితో గౌరవించబడే వ్యక్తి. అంతవరకు ఓకే. అసలు బీజేపీ పెద్దలు ఆయనను కలవడం వల్ల ఏమి ప్రయోజనం వచ్చిందన్నది ప్రశ్న. తెలంగాణ బీజేపీ నేతలే కొందరు ఈ ప్రశ్న లేవనెత్తడం విశేషం. నాగేశ్వర్ వామపక్ష సిద్దాంత భావాలు ఉన్న ప్రముఖుడు. ఆయన కొంతకాలం సీపీఎం ఆధ్వర్యంలోని ఒక టీవీ చానల్ ను కూడా నిర్వహించారు. వివిధ టీవీ చానళ్లలో విశ్లేషకుడిగా కూడా తమ అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. ఇప్పుడు నడ్డా కలవడం వల్ల నాగేశ్వర్ తన భావాలను మార్చుకుంటారని అనుకోజాలం. తాను చెప్పదలచుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంటారు. అందుకు బీజేపీ నేతలు ఇష్టపడతారా? బీజేపీ సిద్దాంతం అంటే అంతగా ఇష్టపడని వ్యక్తి అని తెలిసి కూడా ఆయనను కలవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. గతంలో బీజేపీ అభ్యర్ధిని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించిన చరిత్ర కూడా నాగేశ్వర్కు ఉంది. రాజకీయ వర్గాలలోను, రాజకీయేతర వర్గాలలోను ఈయన పట్ల చాలా మందికి అబిమానం ఉంది కనుక ఎవరో ఈ భేటీని అభ్యంతరంగా తీసుకోరు. కాకపోతే బీజేపీ తెలంగాణలో గందరగోళంలోనే ఉందన్న సంగతి మరోసారి స్పష్టం అవుతుంది. ✍️ కొంతకాలం క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జర్నలిస్టు ముసుగులో ఉన్న తెలుగుదేశం ఏజెంట్ ఒకరిని కలవబోతున్నారని వార్తలు వచ్చాయి. చంద్రబాబుకు డైరెక్ట్ ప్రతినిధిగానే కాకుండా ఫిరాయింపులు, రాజకీయ ఆర్దిక లావేదేవీలు వంటివాటిలో క్రియాశీలకంగా ఉంటూ పవర్ బ్రోకర్ గా పేరొందిన జర్నలిస్టును కలవబోతున్నారని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. గతంలో ఒకసారి ఈయనను పిలిపించుకుని ఢిల్లీలో మాట్లాడారు. ఆ తర్వాత కాలంలో టీడీపీ కోసం ఈయన బీజేపీపై కారాలు, మిరియాలు నూరారు. కొంతకాలం రెండు పార్టీలు కలిస్తే ఏపీలో జగన్ ను ఇబ్బందిపెట్టవచ్చని అనుకున్నారు. ఆ దిశగానే పనిచేశారు. ఏపీ బీజేపీలోని ఒక నేతను ఈయన టీవీచానల్ లో డిబేట్ లోనే మరొకరు కొట్టినా ఎవరూ పట్టించుకోలేదు. టీడీపీ నేతలు కొందరు బిజెపిలో చేరి కోవర్టులుగా వ్యవహరిస్తుంటారు. వారందరికి ఈయనే సలహాలు ఇస్తారన్న ప్రచారం ఉంది. ఇలాంటి వ్యక్తిని జాతీయ స్థాయిలో హోం మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కలవడమా అని అంతా ముక్కున వేలేసుకున్నారు. ✍️ ఆ తర్వాత కారణం ఏమో తెలియదు కాని అమిత్ షా తెలంగాణ టూర్ రద్దు కావడంతో ఆ భేటీ అగిపోయింది. నిజమైన బీజేపీ నేతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ భవిష్యత్తులో ఎప్పుడైనా కలుస్తారేమో తెలియదు. జేపీ నడ్డా తన పర్యటనలో ఆ జర్నలిస్టు ఇంటికి వెళ్లకపోవడం గమనించదగ్గ అంశమే అవుతుంది.అంతకుముందు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చిన అమిత్ షా మరో మీడియా అధిపతిని ఆయన ఫిలిం సిటీకి వెళ్లి కలుసుకుని మద్దతు కోరారు. అయినా ఆ మీడియా అంతగా పట్టించుకోలేదు. అది పూర్తి స్తాయిలో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తోంది. కేసీఆర్ పాలన గురించి అద్భుతంగా పొగుడుతూ ఎడిటోరియల్ కూడా రాసింది. ఆ మీడియా అధిపతికి తన కారణాలు తనకు ఉండవచ్చు. కానీ అమిత్ షా ఆయన్ని కలవడం వల్ల బీజేపీకి ఒరిగే ప్రయోజనం ఏముంది?. ✍️ తెలంగాణలో బిజెపి పరిస్థితికి ఇది ఒక మచ్చుతునక కావొచ్చు. కర్నాటక ఎన్నికల ఓటమి తర్వాత తెలంగాణలో బీజేపీ అయోమయంలో పడిపోయింది. కారణం ఏమైనా దాని గ్రాఫ్ తగ్గుతున్న మాట వాస్తవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోపాల్ లో చేసిన విమర్శలు ఎలా ఉన్నా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కవితను పలుమార్లు విచారించిన తీరు. ఆ తర్వాత పలువురు ఇతరులను అరెస్టు చేసినా, ఆమె జోలికి వెళ్లకపోవడంపై కాంగ్రెస్ పక్షం విమర్శిస్తుంటుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేస్తోంది. దానికి తగ్గట్లుగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలికాలంలో బీజేపీపై విమర్శలు తగ్గించడం, కాంగ్రెస్పై దాడి పెంచడం చేస్తున్నారు. అంతేకాక దేశస్థాయిలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ వెళ్లకపోవడం, అదే టైమ్ లో కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కేంద్రంలో కొందరు మంత్రుల్ని కలవడం, చివరికి అమిత్ షా అప్పాయింట్మెంట్ పొందడం అందరి దృష్టిని ఆకర్షించాయి. కానీ, చివరి క్షణంలో అమిత్ షా తో భేటీ రద్దు అయింది. ✍️ మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతుండగా ఇప్పుడు కేంద్రాన్ని ఆయా డిమాండ్లపై కలవడంలో రాజకీయం కూడా ఉండొచ్చు. కానీ, రెండు పార్టీల అగ్రనేతల మధ్య ఏదో రాజీయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యాపించాయి. ఢిల్లీలో జాతీయ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నా.. హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాలు చేస్తామని కేటీఆర్ చెప్పడం చిత్రంగానే అనిపిస్తుంది. కేటీఆర్ డిల్లీ టూర్ లో ఉన్నప్పుడే బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలతో డిల్లీలో అమిత్ షా, నడ్డాలు సమావేశం అయి పార్టీ వ్యవహారాలు చర్చించారు. కేటీఆర్ను కలవడం వల్ల బిజెపి గ్రాఫ్ మరింత పడిపోతుందని వారు స్పష్టం చేయడంతోనే షా రద్దు చేసుకున్నారని అంటున్నారు. తాము బిజెపితో కలిసిందే బిఆర్ఎస్ కు , ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా అయితే, వారితో కాంప్రమైజ్ అయితే తాము బిజెపిలో కొనసాగి ప్రయోజనం ఏమి ఉంటుందని వారు ప్రశ్నించారట. ✍️ ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది. ఒకప్పుడు మంచి జోష్ వచ్చినా, ఇప్పుడు డల్ అవడంతో బీజేపీ పెద్దలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. మళ్లీ నడ్డా, అమిత్ షాలు వచ్చి కేసీఆర్ను ఎంత ఘాటుగా విమర్శించినా గ్రాఫ్ పెరుగుతుందా అనేది అనుమానంగానే ఉంది. మొత్తం రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే.. తెలంగాణలో తాము గెలవలేకపోతే బీఆర్ఎస్ విజయం సాధించడం బెటరా? కాంగ్రెస్ గెలిస్తే లాభమా ? అనేది ఆలోచించుకుంటారు. కచ్చితంగా బీఆర్ఎస్ ఉండడం వల్ల తమకు వచ్చే నష్టం లేదని బీజేపీ వారు అనుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ గెలిస్తే దాని ప్రభావం దేశంలోని వివిధ ప్రాంతాలపై పడవచ్చు. అందువల్ల ఎన్నికల నాటికి బీజేపీ హడావుడి చేసినా, కాంగ్రెస్ గెలవకూడదనే కోరుకుంటుంది. అది బీఆర్ఎస్కు కలిసి వచ్చే పాయింట్ కావచ్చు. ✍️ ఎన్నికల సమయంలో ఆదాయపన్ను ,సిబిఐ , ఈడి వంటివాటిని ప్రయోగించకుండా ఉంటే బీఆర్ఎస్ కు ఇబ్బంది ఉండదు. కొద్ది రోజుల క్రితం టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పై ఈడీ దాడులు చేసింది. అలాగే మెడికల్ కాలేజీలలో అక్రమాలపై దృష్టి సారించింది. అందులో బిఆర్ఎస్ కు బాగా దగ్గరగా ఉండే ప్రముఖులు కూడా ఉన్నారు. వారంతా ప్రస్తుతానికి మేనేజ్ చేసుకోగలిగారని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జోరు తగ్గిన బిజెపి ఆయా నియోజకవర్గాలలో కొత్త నేతలను ఇప్పటికైతే ఆకర్షించలేకపోతోంది. మాజీ ఎమ్.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లె కృష్ణారావు తదితరులు బిజెపి కన్నా కాంగ్రెస్ బెటర్ అనే భావనకు వచ్చారు. వారికోసం బిజెపి విఫల యత్నం చేసింది. ఈ నేపధ్యంలోనే ఈటెల రాజేందర్, రాజగోపాలరెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూడవచ్చన్న వార్తలు వస్తుండడంతో హైకమాండ్ అలర్ట్ అయింది. తెలంగాణ బిజెపి సీనియర్ నేతలలో ఉన్న విభేదాలు కూడా పార్టీని ఇరుకున పెడుతున్నాయి. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, మరో నేత డి.కె. అరుణ వంటివారు ఈ వాదనలను ఖండిస్తున్నా, బిఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒకటేనని చెబుతున్నా, జనం సీరియస్ గా తీసుకోవడం లేదు. రాజగోపాలరెడ్డి ఆయా టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఎక్కువకాలం బిజెపిలో ఉండరేమోననిపిస్తుంది. రాజకీయాలు మొత్తం మారిపోవడానికి ఒక స్టెప్ చాలు అనడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ప్రస్తుతం తెలంగాణలో బిజెపి ఇలాంటి సందిగ్ద పరిస్థితిలోనే కొట్టుమిట్లాడుతోందని చెప్పాలి. ::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
అనంతలో టీడీపీ మూకల దాష్టీకం
సాక్షి, అనంతపురం: తాడిపత్రి లో తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. గంగాదేవి పల్లిలో జగనన్న కాలనీ కోసం భూమిని చదును చేస్తుండగా.. అక్కడివారిపై దాడికి దిగారు. జగనన్న కాలనీ భూమిని వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల చదును చేస్తుండగా.. అడ్డుకుని టీడీపీ వర్గం కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించి.. 24 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే పరామర్శ టీడీపీ వర్గం దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో పరామర్శించారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇదీ చదవండి: ఓటర్ల సవరణ జాబితాపై ఫోకస్ పెట్టండి -
'ముస్లీం లీగ్ లౌకిక పార్టీ' రాహుల్ వ్యాఖ్యలపై.. బీజేపీ ఫైర్..
ఢిల్లీ: ముస్లీం లీగ్ పూర్తిగా సెక్యులర్ పార్టీ అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులకు దేశంలో ఇంకా మద్దతు దొరకడం దురదృష్టకరమని అన్నారు. మతం పేరిట దేశం రెండుగా విడిపోవడానికి ముస్లిం లీగ్ కారణమనే అంశాన్ని ఎలా మరిచిపోయారని ప్రశ్నించారు. అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్లో ముస్లిం లీగ్తో కాంగ్రెస్ పొత్తుపై విలేఖరి అడిగిన ప్రశ్నకు 'ముస్లీం లీగ్ పూర్తిగా లౌకికమైనది. ఆ పార్టీని సరిగా అర్థం చేసుకోలేనివాళ్లే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని అన్నారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యూడీఎఫ్లో ముస్లీం లీగ్ మిత్రపక్షంలో ఉంది. పార్లమెంట్ సభ్యుడిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయకముందు..వయనాడ్ నుంచే ఎంపీగా ప్రాతనిథ్యం వహించారు. 'మత ప్రాతిపదికన భారతదేశ విభజనకు కారణమైన జిన్నా 'ముస్లిం లీగ్'ను.. రాహుల్ గాంధీ 'సెక్యులర్' అని అంటున్నారు. చరిత్రను రాహుల్ సరిగా చదవలేదు' అని బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. చదవండి:పాకిస్తాన్ కంటే భారత్ ఆ విషయంలో చాలా బెటర్... ఆ మాటకొస్తే చైనా కూడా ఎందుకూ పనికిరాదు... -
షిండే వర్గంలో అసంతృప్తి.. 22 మంది ఎమ్మెల్యేలతో సహా..!
ముంబై: శివసేనను రెండుగా చీల్చి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఏక్నాథ్ షిండేకు ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు మొదలయ్యాయి. బీజేపీతో పొసగని తన ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలతో సహా 9 మంది ఎంపీలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ (యూబీటీ)కి చెందిన సామ్నా పత్రిక వెల్లడించింది. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలకు బీజేపీతో పొసగడంలేదని పేర్కొంది. షిండే వర్గంలోని కొంతమంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని యూబీటీ ఎంపీ వినాయక్ రౌత్ తెలిపారు. ఆ పార్టీ నుంచి బయటకు వస్తామని వారు తెలిపినట్లు చెప్పారు. ఎన్డీయే భాగస్వామ్యంలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని చెప్పినట్లు వెల్లడించారు. బీజేపీ-షిండేకు చెందిన శివసేన భాగస్వామ్యంలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గజానన్ కీర్తికార్ బహిరంగంగానే బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సామ్నా తెలిపింది. బీజేపీ నుంచి అంతర్గతంగా వారు వివక్షను ఎదుర్కొంటునట్లు చెప్పారు. 'మేము 13 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. ఎన్డీయే భాగస్వామ్యంలో మా సమస్యలు పరిష్కారమయ్యేలా లేవు'అని గజానన్ కీర్తికార్ ఇదివరకే అన్నారు. అయితే ఈ పరిస్థితిని షిండే వర్గం తోసిపుచ్చుతోంది. #WATCH | "Can Vinayak Raut see the future? Does he know face-reading? He says anything. There is no fact to what he says. We are all satisfied. Under the leadership of CM Eknath Shinde, we are working well. Vinayak Raut keeps saying things like this, we don't pay attention to… pic.twitter.com/vMTbpc1kxI — ANI (@ANI) May 30, 2023 'వ్యక్తిగత గౌరవాన్ని డబ్బులతో కొనలేం. ఇది మరోసారి రుజువైంది. ఈ సారి 22 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం' అని షిండే నేతృత్వంలోని శివసేన నేతలు ఇప్పటికే చెప్పారు. ఎన్డీయే భాగస్వామ్యంలోని షిండే వర్గానికి 22 సీట్లు ఇచ్చే అవకాశాలు దాదాపుగా లేవని సామ్నా తెలిపింది. చదవండి:కిడ్నీ సమస్యతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత.. తండ్రి చనిపోయిన మూడు రోజులకే!
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
No Headline
పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఎన్టీఆర్ ఆశీస్సులతో సీఎం జగన్ ప్రమాణస్వీకారం
వేప చెట్టుకు మామిడి కాయలు.. మరో వింత
మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
30 టన్నుల మామిడి పండ్లు ఎగుమతి
మూడు దశల్లో 90 వేల పోస్టల్ బ్యాలెట్లు
చివరి విడత ప్రచారానికి కాంగ్రెస్ ప్రముఖులు
తప్పక చదవండి
- కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి
- రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
- రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
- మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత
- ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
- ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- Today Horoscope: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
Advertisement