Party Workers
-
‘జనసేన వాళ్లమని చెప్పినా చితకబాదారు!’
ఎన్టీఆర్, సాక్షి: పండుగ పూట కూటమి నేతలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. రికార్డింగ్ డ్యాన్యుల ముసుగుతో అశ్లీల నృత్యాలను దగ్గరుండి మరీ ప్రొత్సహిస్తున్నారు. అలాగే బరుల్లో తమ ఆధిపత్యమే కొనసాగేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో దాడులకూ పాల్పడుతున్నారు. అయితే.. కోడి పందేలు కూటమి మధ్య లుకలుకలను బయటపెడుతున్నాయి. బరుల్లో తెలుగు తమ్ముళ్లు(TDP Activists) బరి తెగించేస్తున్నారు. ఎవరూ ముందుకు రాకుండా.. ఉత్త పుణ్యానికే దాడులకు దిగుతున్నారు. అయితే ‘‘ఎందుకు కొడుతున్నారు?’’ అని అడిగినందుకు కర్రలతో మూకుమ్మడి దాడి చేశారు. దాడిని అడ్డుకున్న వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు. దాడిలో ఆరుగురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ ఆరుగురు జనసేన కార్యకర్తలని తేలింది. కంచికచర్ల(Kanchikarla) మండలం గండేపల్లి కోడిపందేల బరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాము జనసేన వాళ్లమని చెప్పిన్నా వినకుండా దుర్భాషలాడుతూ తమను చితకబాదారని బాధితులు వాపోయారు. మరోవైపు తమ కార్యకర్తల పై జరిగిన దాడిపై జనసేన(Jana Sena) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చంద్రబాబు, పవన్లు 15 ఏళ్లు కలిసి పొత్తులో ఉందామనుకుంటున్నారు. కానీ టీడీపీ నేతలు అలా ఉండనిచ్చేలా లేరు’’ అని అంటున్నారు. తాజా దాడిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని జనసేన నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో కోడి పందేలు(Rooster Fightings) కూటమి నేతల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. జనసేన, బీజేపీ వాళ్లను టీడీపీ వాళ్లు ముందుకు రానివ్వకపోవడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించిన ఘటనలు.. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఇక.. ఏపీలో సాంప్రదాయ సంబరాల ముసుగులో యధేచ్ఛగా జూద క్రీడలు. కోడిపందాల బరులను ఆదాయ వనరులుగా మార్చేసుకుంటున్నారు కూటమి నేతలు. కోడి పందాల బరుల్లో వాటాల కోసం కూటమి పార్టీ ఎమ్మెల్యేలు తహతహలాడిపోతున్నారు. ఈ క్రమంలో.. తమ అనుచరులను రంగంలోకి దించుతున్నారు. ఏపీలో మునుపెన్నడూ లేనంతగా ఇష్టానుసారంగా బరులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందాల బరుల్లో జూదక్రీడలకు స్పెషల్ ఎరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. పేకాట, గుండాట, లోన బయట , నంబర్ల గేమ్స్ కోసం కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఇక.. జూద క్రీడలకు తోడు మద్యం ఏరులై పారుతోంది. మద్యం కోసం ప్రత్యేకంగా మినీ బార్లు , బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ.. తొలి రెండు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొత్తం.. ఈ పండక్కి జూదం ,మద్యం ద్వారా భారీగా సంపాదించాలని పక్కా ప్రణాళిక వేసుకున్న కూటమి నేతలు.. దానిని అంతే పక్కాగా అమలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. కోడిపందాలు , పేకాట ,గుండాటలు ఆడితే తాటతీస్తామని పండగ ముందు పోలీసులు హెచ్చరికల వరకే పరిమితం అయ్యారు. బరుల వద్ద కనీసం కనుచూపుమేరలో కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కనిపించకపోవడంతో.. కూటమి నేతలతో కుమ్మక్కయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: కోడి పందేల కోసం మహిళా బౌన్సర్లు!! -
బంగ్లా: అవామీ లీగ్ ర్యాలీ.. ఢాకాలో ఉద్రిక్తత
ఢాకా: బంగ్లాదేశ్లో నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని షేక్ హాసినా అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారినట్లు అక్కడి మీడియా పేర్కొంది. షహీద్ నూర్ హొస్సేన్ స్క్వేర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పలువురు అవామీ లీగ్ మద్దతుదారులపై దాడి జరిగినట్లు వెల్లడించింది. బంగాబంధు అవెన్యూలోని షేక్ హసీనా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక.. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 5న తిరుగుబాటు ద్వారా పతనమైన అనంతరం ఇవాళ(ఆదివారం) నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ మొదటిసారి నిర్ణయం తీసుకుంది. విమోచన యుద్ధం విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను విశ్వసించే సాధారణ ప్రజలు, కార్యకర్తలను నూర్ హుస్సేన్ చత్తర్ (జీరో పాయింట్) వద్ద మార్చ్లో చేరాలని పార్టీ ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను తొలగించి బంగ్లాదేశ్ అవామీ లీగ్ నాయకత్వంలో ప్రజాస్వామ్య పాలనను పునఃస్థాపన చేయాలని కూడా పిలుపునిచ్చింది.Despite suppression from 32 political groups, police, 191 platoons of BGB, the army, and espionage, the AL has marched across the zero point. These are not corrupt people; they’ve received no rewards from the AL in the past decade. Yet, today, they’re struggling for it! pic.twitter.com/Q9Q1JmY8YW— Tasin Mahdi 🇧🇩 (@in_tasin) November 10, 2024అయితే.. ఈ ప్రకటన వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న అవామీ లీగ్ ఫాసిస్ట్ పార్టీ.. ఈ ఫాసిస్ట్ పార్టీ బంగ్లాదేశ్లో నిరసనలు నిర్వహించేందుకు అనుమతించేది లేదని యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం అన్నారు. రాజకీయ కార్యకర్త, అవామీ లీగ్ యువజన ఫ్రంట్, జూబో లీగ్ నాయకుడు నూర్ హొస్సేన్ నవంబర్ 10, 1987న ఎర్షాద్ వ్యతిరేక ఉద్యమంలో హత్యకు గురయ్యాడు.చదవండి: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం -
ప్రశాంత్ కిశోర్ పార్టీ సమావేశంలో కుమ్ములాటలు
గయ: బీహార్లోని గయలో జన్ సూరజ్ పార్టీ సమావేశంలో కుమ్ములాటలు చోటుచేసుకున్నాయి. పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ పిలుపు మేరకు సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తలు గలాటా సృష్టించారు. బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏర్పాటు చేసిన పార్టీ సమావేశం రసాభాసగా మారింది. వివరాల్లోకి వెళితే గయలోని బెలగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నట్లు పీకే గతంలో ప్రకటించారు. అయితే తాజాగా జరిగిన ఈ సమావేశంలో ఈ స్థానానికి టిక్కెట్ ఆశిస్తున్న ఇద్దరు అభ్యర్థుల మద్దతుదారులు తొలుత తమ నేతలకు మద్దతుగా నినాదాలు చేశారు. దీనిని గమనించిన ప్రశాంత్ కిషోర్ స్టేజి మీద నుంచి వారిని వారించారు. అయితే ప్రశాంత్ కిశోర్ మాటలను అక్కడున్నవారెవరూ పట్టించుకోలేదు. పైగా కుర్చీలు విసురుకుంటూ ఎవరికి దొరికిన దాన్ని వారు ధ్వంసం చేశారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో ప్రశాంత్ కిశోర్ సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.దీనికి ముందు తొలుత బెలగంజ్ ఉప ఎన్నిక కోసం నాలుగు పేర్లను ప్రతిపాదించారు. వీరిలో అమ్జద్ హసన్, ప్రొ. ఖిలాఫత్ హుస్సేన్, డానిష్ ముఖియా, ప్రొ. సర్ఫరాజ్ ఖాన్లున్నారు. ఈ సమావేశంలో, అమ్జద్ హసన్కు మద్దతు పలుకుతూ డానిష్ ముఖియా తన పేరును ఉపసంహరించుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. దీంతో అమ్జాద్ హసన్, ఖిలాఫత్ హుస్సేన్ల పేర్లు చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బెలగంజ్ టిక్కెట్ను ఖిలాఫత్ హుస్సేన్కు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మాట వినగానే అమ్జాద్ హసన్, ఖిలాఫత్ హుస్సేన్ల మద్దతుదారులు కుమ్ముటాటకు దిగారు.ఇది కూడా చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో రూ.26 లక్షలకు కుచ్చుటోపీ -
Haryana: అభ్యర్థి చొక్కా చించిన మాజీ ఎమ్మెల్యే
చండీగఢ్: హర్యానాలో ఈరోజు (శనివారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కొన్నిచోట్ల చెదురుమదురు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మెహమ్ నుంచి పోటీ చేస్తున్న హర్యానా జనసేవక్ పార్టీ అభ్యర్థి బాల్రాజ్ కుందు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే తనపై దాడి చేసి, తన బట్టలు చించేశారని ఆరోపించారు. దీనిపై వీడియో సందేశం ద్వారా ఆయన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.జన్ సేవక్ పార్టీ అభ్యర్థి బాల్రాజ్ కుందు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ డాంగి తనపై దాడి చేశారని ఆరోపించారు. తాను, తన పీఏ రోహ్తక్ జిల్లాలోని ఒక బూత్కు వెళ్ళినప్పుడు మాజీ ఎమ్మెల్యే డాంగి దాడిచేశారని, తన దుస్తులను చింపేశారని కూడా ఆరోపించారు.కాంగ్రెస్ అభ్యర్థి బలరామ్ డాంగి ఓడిపోతారనే భయంతోనే అతని తండ్రి ఆనంద్ సింగ్ డాంగి ఈ దాడికి పాల్పడ్డారని బాల్రాజ్ కుందు ఆరోపించారు. హర్యానా జనసేవక్ పార్టీ అభ్యర్థి బాల్రాజ్ కుందు మెహమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆనంద్ సింగ్ డాంగి కుమారుడు బలరామ్ డాంగి ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి. ఇక్కడి నుంచి బీజేపీ తరపున దీపక్ హుడా పోటీ చేస్తున్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, దశాబ్దం తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోంది. ఇది కూడా చదవండి: హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్ -
హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్
చండీగఢ్: ఈరోజు(శనివారం) హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఇంతలో బీజేపీ సంచలన ప్రకటన చేసింది. నలుగురు నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన నలుగురూ హిసార్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ కూడా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేతల్లో ఉన్నారు. ఈమెతో పాటు గౌతమ్ సర్దానా, తరుణ్ జైన్, అమిత్ గ్రోవర్లను పార్టీ బహిష్కరించింది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్లాల్ బడోలీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగిన నలుగురు నేతలను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. బీజేపీ నుంచి బహిష్కరణకు గురికావడంపై విలేకరులు సావిత్రి జిందాల్ను ప్రశ్నించగా తనకేమీ తెలియదని, తెలిస్తే చెబుతానని అన్నారు. తాను ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. 2009లో సావిత్రి జిందాల్ హిసార్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్పై గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల్లో ఆమె ఓటమి చవిచూడాల్సి వచ్చింది.సావిత్రి జిందాల్ కుమారుడు నవీన్ జిందాల్ ఓటు వేసేందుకు గుర్రంపై స్వారీ చేసుకుంటూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రపు స్వారీ చేయడం శుభపరిణామంగా భావిస్తారని, మా అమ్మ సావిత్రి జిందాల్ హిసార్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, హిసార్ అభివృద్ధికి ఆమె పాటుపడాలనుకుంటున్నారన్నారు. కాగా నవీన్ జిందాల్ బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలనే తన తల్లి నిర్ణయాన్ని సమర్థించారు. తన తల్లికి మద్దతు ఇస్తానని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: సుప్రీం సిట్ అయినా నిజం నిగ్గుదేల్చేనా? -
Pakistan: ఇమ్రాన్ఖాన్ పార్టీ నేతలు అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన పలువురు అగ్రనేతలను జాతీయ అసెంబ్లీ సమావేశాల అనంతరం పార్లమెంట్ వెలుపల పోలీసులు అరెస్టు చేశారు. పలు మీడియా కథనాలలో ఇది ప్రముఖంగా ప్రచురితమయ్యింది.పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేతలు బారిస్టర్ గౌహర్ అలీ ఖాన్, షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్, అడ్వకేట్ షోయబ్ షాహీన్లను ఇస్లామాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికార ప్రతినిధి జావేద్ తాకీ తెలిపారని డాన్ పత్రిక పేర్కొంది. ఈ అరెస్టుకు స్పందిస్తూ పీటీఐ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో ‘నేషనల్ అసెంబ్లీలో సిట్టింగ్ సభ్యునిపై ఇటువంటి చర్య తీసుకున్నందుకు పీఎంఎల్ఎన్ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇది ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి.ఇస్లామాబాద్ పోలీసులు చట్టవిరుద్ధమైన ఆదేశాలను పాటిస్తున్నారు. ఈ చర్యను ఆపాలి’ అని ఇస్లామాబాద్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ)ని కోరింది.‘ఇమ్రాన్ ఖాన్తో పాటు అతని అనుచరులకు ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో మరోసారి రుజువు అయ్యింది’ అని మార్వాత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ప్రతిపక్ష నేత ఒమర్ అయూబ్ ఖాన్ ఈ అరెస్టులను ఖండించారు. ఇస్లామాబాద్ పోలీసులు వారిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారని ఆరోపించారు. నేషనల్ అసెంబ్లీలో పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్వాత్ను అరెస్టు చేసినట్లు సోర్సెస్ జియో న్యూస్కి తెలిపింది. పోలీసు సిబ్బందితో పీటీఐ ఎంపీ గొడవకు దిగారని ఆ మీడియా పేర్కొంది.రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ (71) పలు చట్టపరమైన కేసులను ఎదుర్కొంటున్నారు. అవినీతి కేసులో ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కాగా పీటీఐ నేతలు ఒమర్, జర్తాజ్లతో పాటు హమ్మద్ అజర్, కన్వాల్ షౌజాబ్, నయీమ్ హైదర్ పంజుతా, అమీర్ మొఘల్, ఖలీద్ ఖుర్షీద్లతో సహా ఇతర పీటీఐ నేతలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. A slap to the face of an already decimated democracy in Pakistan.The military backed, authoritarian, illegitimate regime is now illegally arresting & abducting PTI’s elected members of Parliament, from the premises of the Parliament itself.Interim Chairman PTI, Barrister… pic.twitter.com/43VD3Oal8U— PTI (@PTIofficial) September 9, 2024 -
Pakistan: ఇమ్రాన్ ఖాన్ పార్టీ ర్యాలీలో కాల్పులు.. పలువురు మృతి?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్’(పీటీఐ) చేపట్టిన ర్యాలీపై కాల్పులు జరిగాయి. ఈ ర్యాలీకి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. కాల్పుల అనంతరం తొక్కిసలాట జరిగింది.ఈ పరిస్థితుల నేపధ్యంలో అధికారులు ఇస్లామాబాద్కి వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. ఈ సందర్భంగా పీటీఐ నేత ఫవాద్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు మృతిచెందారని తెలిపారు. పాకిస్థాన్లో మార్షల్ లా తరహా పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.కాగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు జరిపిన రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ను జైలు నుండి విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ పార్టీ ఇస్లామాబాద్లో ర్యాలీ చేపట్టింది. కాగా ఇమ్రాన్ ఖాన్ గత 400 రోజులుగా జైలులో ఉన్నారు. తోషాఖానా కేసులో దోషిగా తేలడంతో 2023 ఆగస్టు 5న ఆయన అరెస్టయ్యారు. -
అర్ధరాత్రి ముజ్రా పార్టీ
-
అతికిరాతకంగా YSRCP కార్యకర్త హత్య
అన్నమయ్య, సాక్షి: ఎన్నికల కౌంటింగ్ ముందు హత్యారాజకీయాలతో ఏపీలో అలజడులు సృష్టించాలనే ప్రయత్నాలు మొదలయ్యాయా?. అన్నమయ్య జిల్లాలో తాజాగా జరిగిన ఘాతుకం అవుననే సంకేతాలిస్తోంది. మదనపల్లి శ్రీవారినగర్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మృతుడ్ని పుంగనూరు శేషాద్రిగా పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుఝామున శేషాద్రి ఇంట్లోకి చొరబడిన 30 మంది దుండగులు అతికిరాతకంగా నరికి చంపి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రక్తపు మడుగులో పడి ఉన్న శేషాద్రి మృతదేహాన్ని స్వాధీన పర్చుకున్నారు. శేషాద్రి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 70సార్లు నరికి.. శనివారం వేకువ ఝామున శేషాద్రి ఇంటి తలుపులు బద్ధలు కొట్టిన దుండగులు.. ఆయన భార్య కళ్ల ముందే అతి దారుణంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. కాళ్ల మీద పడి చంపొద్దని వేడుకున్నా.. ఆ కిరాతకులు కనికరించలేదు. జిల్లా ఆస్పత్రిలో శేషాద్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు.. శరీరంపై కత్తిపోట్లు చూసి విస్తూపోయారు. సుమారు 70 కత్తి పోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. దుండగులు భూ దందాల ముఠా సభ్యులై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
Yellow Babu : ప్రకృతి కూడా పసుపు పార్టీ సరుకేనా?
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాజకీయ పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి బి.ఆర్.ఎస్., బిజెపి ల నుండి పలువురు నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇలా చేస్తే ప్రకృతి ఊరుకోదని.. తీవ్ర పరిణామాలు తప్పవని గతంలో రేవంత్ రెడ్డి ఓ ఎల్లో మీడియా అధినేతతో కలిసి స్టూడియోలో కూర్చుని సిద్ధాంతీకరించారు. మరి ఇపుడు రేవంత్ రెడ్డి ఇలా BRS పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? ప్రమాదం ఏమీ ఉండదా? అని పొలిటికల్ ఎన్విరాన్ మెంటలిస్టులు ప్రశ్నిస్తున్నారు. పొరుగు పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదట. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని అనుకోవడం వల్లనే దివంగత వై.ఎస్.ఆర్. పై ప్రకృతి ప్రకోపించిందట. దాని కారణంగానే ఆయన మరణించారని ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లో మీడియా లో ఇంటర్వ్యూలో అభిప్రాయ పడ్డారు. ఇలా అభిప్రాయ పడ్డ రేవంత్ రెడ్డి.. ఏబీఎన్ రాధాకృష్ణ ఇద్దరూ కూడా చాలా చాలా మేధవులు. కాకపోతే ఇద్దరికీ కొద్ది పాటి సంస్కారం కూడా లేకుండా పోయిందంటున్నారు రాజకీయ పండితులు. దివంగత వై.ఎస్.ఆర్. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చనిపోయిన వారి గురించి ఎవ్వరూ కూడా హేళనగా మాట్లాడరు. కానీ ఈ ఇద్దరూ కూడా వై.ఎస్.ఆర్. మరణానికి ఆయన టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలనుకోవడమే కారణమన్నట్లు.. అందుకే ప్రకృతి ఆయన్ను శిక్షించింది అన్నట్లు తీర్మానించారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టమైన గురువు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? 23 మంది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కేసులు పెడతామని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి టిడిపిలో చేర్చుకున్నారు. మరి ఈ ఘటనపై ప్రకృతికి కోపం ఎందుకు రాలేదట? వై.ఎస్.ఆర్. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను చేర్చుకుందామా వద్దా అని ఆలోచన చేస్తేనే పగ బట్టేసిన ప్రకృతి చంద్రబాబు నిస్సిగ్గుగా 23 మందిని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడమే కాకుండా అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినా ప్రకృతి ఎందుకు ఊరుకున్నట్లు? కొంపదీసి ప్రకృతి కూడా ఎల్లో బ్యాచ్ లో చేరిపోయిందా? ఎల్లో మీడియా తరహాలో టిడిపి అధినేత ఏం చేసినా ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్ధి అయిన వై.ఎస్. ఆర్. తనను ఆశ్రయించిన వారిని తన పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటేనే ప్రకృతికి కోపం వస్తుందా? అన్నది రేవంత్ రెడ్డితో పాటు..రాధాకృష్ణకూడా సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదే చంద్రబాబు పురమాయిస్తే ఇదే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటికి కరెన్సీ కట్టలతో వెళ్లి బేరసారాలాడారు. మరి ఆ ఘటన పట్ల ప్రకృతికి అభ్యంతరాలేవీ ఉండవా? చంద్రబాబు వారి అనుచరులు ఎలా వ్యవహరించినా ప్రకృతి చూసి పరవశించిపోతుందా? అన్నది కూడా రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు వివరించాలి. ఈ ఒక్క విషయమే కాదు..చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు పీకలదాకా అప్పులు చేసి రాష్ట్ర ఖజానా దివాళా తీయించి గద్దె దిగేటపుడు 100కోట్లు మాత్రమే మిగిల్చి పోయారు. అపుడు ఏపీ అద్బుతంగా ఉందని భజన చేసింది ఎల్లో మీడియా. బాబుతో పోలిస్తే చాలా తక్కువగా అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తున్నారంటూ గగ్గోలు పెట్టే రాతలు రాసింది. మనోడు చేస్తే సంసారం..ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఎల్లో మీడియా పైత్యపు రాతలు.. ఆ భావజాలంతో ఉండే వారి పైత్యపు కూతలు కొత్త కాదు. సరే చంద్రబాబు నాయుడి ప్రకృతికి చుట్టం కాబట్టి ఆయన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా రాజ్యాంగ విరుద్ధంగా టిడిపిలో చేర్చుకున్నా ప్రకృతి ఏమీ అనలేదు. కానీ ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ప్రకృతి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన్ని అభిమానించే వారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బి.ఆర్.ఎస్. నుంచి ఇద్దరు ఎంపీలను ఒక ఎమ్మెల్యేనీ రేవంత్ రెడ్డి పార్టీ చేర్చుకుని కండువాలు కప్పింది. మరో మాజీ మంత్రి మల్లారెడ్డిని డి.కె.శివకుమార్ దగ్గరకు పంపి బేరాలాడించింది. ప్రకృతి ఏపీలోనే కాదు కర్నాటకపైనా నిఘా పెడుతుంది మరి. అందుకే అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిదంటున్నారు విజ్ఞులు. - సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
ఒడిశా కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ!
ఒడిశాలో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు వివిధ పదవులకు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్కు అంజేశారు. ఎమ్మెల్యే పాణిగ్రాహి గత 25 ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగారు. ఆయన త్వరలోనే బీజేడీలో చేరనున్నారని విశ్వసనీయ సమాచారం. ఖాడియాల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో చర్చించిన తర్వాతనే తాను కాంగ్రెస్ను వీడాలని నిర్ణయించుకున్నానని అధిరాజ్ మీడియాకు తెలిపారు. ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. అయితే ఆయన బీజేడీలో చేరుతారంటూ పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్పై అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయనకు 59,308 ఓట్లు వచ్చాయి. బీజేడీ నేత లంబోధర్ నియాల్కు 56,451 ఓట్లు వచ్చాయి. 2014లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి పాణిగ్రాహి ఓటమి చవిచూశారు. -
రేపు వైఎస్సార్సీపీ కీలక సమావేశం
గుంటూరు, సాక్షి: పార్టీ కేడర్తో కీలక సమావేశం నిర్వహించేందుకు అధికారపక్షం వైఎస్సార్సీపీ సిద్ధం అయ్యింది. మంగళవారం మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జరగబోయే ఈ మీటింగ్లో మండల, బూత్ లెవల్లో పని చేసే పార్టీ శ్రేణితో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు(కొత్త-పాత ఇన్ఛార్జిలు) పాల్గొననున్నారు. ఎన్నికలకు ముందర జరగబోయే క్షేత్రస్థాయి సమావేశం ఇదే చివరిది. రేపటి సమావేశానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా హాజరవుతారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో.. ఎన్నికల్లో ఎలా పని చేయాలో కేడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని అన్నారు. ఎన్నికలకు ముందు జరగబోయే ఆఖరు సమావేశం ఇది. క్షేత్రస్థాయి. .మండల కార్యకర్తల సమావేశం. సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు పాల్గొంటారు. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సీఎం జగన్ దిశానిర్ధేశం చేస్తారు. ప్రత్యర్ధులు అవకతవకలకు పాల్పడకుండా ఎలా చూడాలో చెప్తారు. ప్రజల్లోకి మరింతగా పార్టీని ఎలా తీసుకెళ్లాలో వివరిస్తారు.. గడపగడపకు కార్యక్రమంతో ఎప్పుడూ వైఎస్సార్సీపీ ప్రజల్లోనే ఉంది. నాయకులెప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని.. పథకాల్ని ప్రజలకు చేరవేస్తున్నాం. ఈ నాలుగున్నరేళ్లుగా ప్రజల అవసరాలను తెలుసుకుని మరీ తీరుస్తున్నాం. అందుకే.. అందరి కంటే ముందుగా ఎన్నికల కోసం గట్టి టీమ్ను సిద్ధం చేసుకున్నాం. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పూర్తి చేశాం. బూత్ కమిటీలు కూడా రెడీ చేస్తున్నాం. సమర్ధవంతమైన బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక ఓరియంటేషన్ ప్రక్రియ రేపు జరగనుంది. రేపటి సమావేశం తర్వాత మేం పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతాం. .. మా అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తున్నప్పుడు ఏదో అయిపోతుందని మమ్మల్ని విమర్శించారు. మేం ఆరోజే చెప్పాం. మీకే బ్యాడ్ టైం మొదలుకాబోతోందని. అసంతృప్తుల్ని పిలిచి మాట్లాడుతున్నాం.. అంతా సర్దుకున్నారు. టీడీపీ-జనసేన అతుకుల బొంతగా ఉంది. పవన్ ను ఘోరంగా అవమానించి 24 సీట్లు కేటాయించారు. ఆ రెండు పార్టీల్లోని అసంతృప్తులు మా పార్టీలోకి వస్తామంటున్నారు. గంపగుత్తగా వస్తున్నారని మేం ఎవరిని పడితే వారిని చేర్చుకోం. అలాంటి వారి వల్ల అనవసరమైన తలనొప్పులు.. పార్టీకి భారం. అవకాశం ఉన్న చోట వాళ్లను చేర్చుకునే అంశం పరిశీలిస్తాం అని సజ్జల పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ క్షేత్రస్థాయి సమావేశం ఏర్పాట్లను సజ్జలతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి పార్టీ ఇన్ఛార్జి గంజి చిరంజీవి సమీక్షించారు. ‘‘ఎంతమంది కలిసి వచ్చినా మా(వైఎస్సార్సీపీ) విజయాన్ని ఎవరూ ఆపలేరు. 175 కి 175 గెలవబోతున్నాం...ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి. మార్చి 3వ తేదీన చివరి సిద్ధం సభ జరగబోతోంది. ఎన్నికలకు సమాయాత్తమవుతున్న సమయంలో రేపటి మీటింగ్ కీలకం కాబోతోంది. కీలకమైన నాయకులు,బూత్ లెవల్లో నాయకులంతా రేపటి మీటింగ్ హాజరవుతారు. పార్టీ పరంగా వివిధ హోదాల్లో ఉన్న 2,700 మందికి ఆహ్వానం పంపించాం’’ అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. -
రా... కదలిరాలో కిందపడబోయిన చంద్రబాబు.. ఆగ్రహం
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ కార్యకర్తలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కోపమొచ్చింది. రాజానగరం టికెట్ కేటాయింపు అసంతృప్తి సెగలు ఆయనకు తగిలాయి. ఈ క్రమంలో రాజమండ్రి రూరల్ కాతేరులో సోమవారం ఆయన నిర్వహించిన రా కదలి రా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాజానగరం టికెట్ జనసేనకు కేటాయించడంపై చంద్రబాబు సమక్షంలో బొడ్డు వెంకటరమణ వర్గీయులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో స్టేజ్ పైనుంచి కార్యకర్తలు దూకుడుగా దిగే యత్నం చేయగా.. చంద్రబాబు కిందపడబోయారు. అయితే సెక్యూరిటీ ఆయన్ని కిందపడకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇదేం తీరు తమ్ముళ్లూ.. అంటూ సొంత పార్టీ కార్యకర్తల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
CM Jagan: రాష్ట్రవ్యాప్తంగా పర్యటన.. వైఎస్సార్సీపీ కేడర్తో భేటీ
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కీలక సమావేశాల నిర్వహణకు అధికార వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందుకోసం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. పార్టీ కేడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ రీజనల్ క్యాడర్ సమావేశాలు మొదలు కానుండగా.. తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానుంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. ఇప్పటికే వైఎస్సార్సీపీ పలు మార్పులతో కూడిన జాబితాల్ని సిద్దం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మొదటగా సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో కేడర్ సమావేశాలు జరుగుతాయన్నారు. ఇక నాలుగు నుంచి ఆరు జిల్లాలకు కలిపి ఒకే కేడర్ సమావేశంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీల్లో ఎన్నికల కోసం వ్యవహరించాల్సిన వ్యూహంపై పార్టీ కేడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. “Message to YSRCP Cadre” పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని "5 రీజియన్ లలో క్యాడర్ మీటింగ్"లను నిర్వహించి క్యాడర్ కి దిశానిర్దేశం చేయబోతున్నారు. 4-6 జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పార్టీ సభ్యులందరినీ ఏకంచేసి,… — YSR Congress Party (@YSRCParty) January 12, 2024 -
రణరంగంగా నాని వర్సెస్ చిన్ని.. జనసైనిక్స్ ఆగ్రహం!
ఎన్టీఆర్, సాక్షి: అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి బహిరంగంగానే తీవ్రస్థాయిలో బయటపడింది. బుధవారం తిరువూరులో టీడీపీ సమన్వయ భేటీ సాక్షిగా కేశినేని నాని-కేశినేని చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. చిన్నిని లోపలికి వెళ్లనీయకుండా నాని వర్గీయులు అడ్డుకోవడంతో పార్టీ ఆఫీస్ ప్రాంగణం రణరంగంగా మారింది. ఈ క్రమంలో.. అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైనా దాడికి దిగారు. ఈ పరస్సర దాడిలో ఎస్సై సతీష్కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉంది. ఈ ఏర్పాట్లను స్థానిక నేతలతో విడివిడిగా భేటీ అవుతూ ఆ అన్నదమ్ములిద్దరూ వేర్వేరుగానే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సమన్వయ భేటీ జరగ్గా.. దానికి జనసేన కార్యకర్తలు సైతం హజరయ్యారు. అయితే అక్కడ కేశినేని నాని ఫ్లెక్సీ లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడే ఉన్న చిన్ని ఫ్లెక్సీని చించేశారు. అయితే అందులో పవన్ కల్యాణ్ ఫొటో కూడా ఉండడంతో జనసైనికులు నొచ్చుకున్నారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సమావేశం బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. అదే సమయంలో తిరువూరు ఇన్ఛార్జి దత్తుపై నాని వర్గీయుల దాడి చేశారు. చిన్నిని లోపలికి రానివ్వబోమంటూ అడ్డుగా బైఠాయించారు. ఇక.. ఈ పరిణామం గురించి తెలుసుకుని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు కేశినేని చిన్ని. ఆయన్ని అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో టీడీపీ నేతలు సర్దిచెప్పే యత్నం చేశారు. అయినా పరిస్థితి సర్దుమణగలేదు. చివరకు ఎస్సై తలకు గాయం కావడంతో.. విస్తృతస్థాయి సమావేశం నిర్వహించుకుండానే టీడీపీ ముఖ్యనేతలు అక్కడి నుంచి జారుకున్నారు. -
జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి: కేజ్రీవాల్
ఢిల్లీ: ప్రజా క్షేమమే లక్ష్యంగా.. పనే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేసిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ కారణంగానే ఆప్కు ప్రజాధరణ లభించిందని చెప్పారు. ప్రజలకు మంచి చేయడానికి తాము ఎంచుకున్న మార్గం కోసం జైలుకు వెళ్లడానికైనా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలపై ఐదుగురు ఆప్ నేతలు జైలులో ఉన్నందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ నేతలను ఉద్దేశించి ఆప్ అధినేత ఈ మేరకు మాట్లాడారు. "పిల్లలకు మంచి చదువులు చెప్పాలని, పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు పంపిస్తారా?. అందుకు ఎప్పుడైనా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. మేము పోరాటాన్ని ఎదుర్కొంటున్నాం. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు జైలులో ఉన్న మా ఐదుగురు నాయకులు హీరోలే. వారందరినీ చూసి మేము చాలా గర్వపడుతున్నాం. ఏ ఇతర పార్టీలు దృష్టి సారించని విషయాలను పట్టించుకున్నందుకే ఆప్ రాజకీయాల్లోకి ఎదిగింది." అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జనవరి 3న హాజరుకావాలని ఈడీ సమన్లు పంపిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఈడీ రెండు సార్లు కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన గౌర్హాజరయ్యారు. ఇదీ చదవండి: PM Narendra Modi Wishes: దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు! -
చంద్రబాబు మోసం.. నక్కాకు చేదు అనుభవం
సాక్షి, అల్లూరి: చంద్రబాబు చేసిన దారుణ మోసాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అరకులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది ఆయనకి. నక్కా ఆనంద్ బాబు తాజాగా అరకు పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. టీడీపీ నేత అబ్రహాంకు అన్యాయం చేశారంటూ నినాదాలు చేశారు. మావోయిస్టుల చేతిలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సోము తనయుడు అబ్రహాం. అబ్రహాంకు టికెట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. దీంతో నక్కా ఆనంద్బాబును అడ్డుకోవడం ద్వారా టీడీపీ అధిష్టానానికి తమ నిరసన గళం వినిపించారు కార్యకర్తలు. -
ఛత్తీస్గఢ్ సీఎం ఎవరు? నేటితో చర్చలకు తెర?
ఛత్తీస్గఢ్కు నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపిక అవుతారనేదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. సీఎం ఎంపికకు బీజేపీ పరిశీలకులను నియమించింది. ఈ నేపధ్యంలో నేడు (ఆదివారం) శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో సీఎం పేరు ఖరారు కావచ్చని భావిస్తున్నారు. అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ గౌతమ్లను బీజేపీ ఛత్తీస్గఢ్ పరిశీలకులుగా నియమించింది. రాష్ట్ర ఇన్చార్జి ఓం మాథుర్, రాష్ట్ర కో-ఇన్చార్జ్ నితిన్ నబిన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా సింగ్, కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్ సాయి, రాంవిచార్ నేతమ్, అరుణ్ సావో, ఓపీ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక కోసం బీజేపీ పరిశీలకులను ప్రకటించింది. వీరు ఎమ్మెల్యేలతో చర్చలు సాగించి సీఎం పేర్లను ప్రకటిస్తారు. అనంతరం మూడు రాష్ట్రాలలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. కాగా మూడు రాష్ట్రాల్లో జరిగే ప్రమాణస్వీకారోత్సవాలు జరిగే తేదీలపై చర్చ పార్టీలో జరుగుతోంది. ఇది కూడా చదవండి: అందరికీ ‘రామ్ రామ్’ -
అసమ్మతుల చూపు.. ప్రగతి భవన్ వైపు..!
భద్రాద్రి: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే టికెట్లు దక్కించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు, టికెట్లపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు అంతా ‘చలో హైదరాబాద్’ అంటున్నారు. ఇప్పటికే కొందరు రాజధానిలో మకాం వేయగా.. మరికొందరు నేడు, రేపు హైదరాబాద్ బాట పట్టనున్నారు. చల్లారని ఇల్లెందు సెగ.. ఇల్లెందు నియోజవకర్గంలో బీఆర్ఎస్లో చెలరేగిన అసమ్మతి ఎంతకీ చల్లారడం లేదు. రెండు వారాల క్రితం మంత్రి హరీశ్రావుకు తమ ఇబ్బందులు చెప్పుకున్న అసమ్మతి వర్గం నేతలు గురువారం హైదరాబాద్ వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవితతో కలిసి ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డీవీ, పార్టీ అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, కృష్ణప్రసాద్, మధుకర్రెడ్డి కేటీఆర్ను కలిశారు. సుమారు రెండు గంటల పాటు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు. అసమ్మతి నేతలు చెప్పిన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ నుంచి వచ్చే ఏ ఆదేశాలనైనా పాటించేందుకు సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. సోమవారం తొలి జాబితా.. కమలం పార్టీకి సంబంధించి ఇల్లెందు నుంచి ఊకె అబ్బయ్య, భద్రాచలం నుంచి కుంజా సత్యవతి వంటి మాజీ ఎమ్మెల్యేలు ఆయా స్థానాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కొత్తగూడెం నుంచి పోటీకి రంగాకిరణ్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పినపాక నుంచి కేంద్ర సర్వీసులకు చెందిన కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. కాగా బీజేపీ మొదటి జాబితా వచ్చే సోమవారం వెలువడుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ‘గులాబీ’ అభ్యర్థుల పయనం.. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. గత నెల రోజులుగా వీరంతా నియోజకవర్గాల స్థాయిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తదితర అధికారిక కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. అయితే ఎన్నికలు సమీపించిన వేళ ఇల్లెందు, అశ్వారావుపేటలో అసమ్మతి చెలరేగడం అభ్యర్థులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఈనెల 15న హైదరాబాద్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశం జరగనుంది. టికెట్లు కేటాయించిన అభ్యర్థులకు ఆ సమావేశంలోనే బీ ఫామ్లు ఇస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా, రేగాకాంతారావు, హరిప్రియనాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తెల్లం వెంకట్రావు నేడు, రేపు హైదరాబాద్ వెళ్లనున్నారు. ఢిల్లీ టు హైదరాబాద్.. కాంగ్రెస్లో టికెట్ల కేటాయింపు అంశం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఆశావహులంతా గత పది రోజులుగా ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు. నిన్నా మొన్నటి వరకు టికెట్ల కేటాయింపు కోసం నియమించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఢిల్లీలో జోరుగా సాగాయి. దీంతో ఆశావహులు తమకు సానుకూలంగా ఉన్న అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు అక్కడే మకాం వేశారు. లంబాడా సామాజిక వర్గానికే ఇల్లెందు టికెట్ ఇవ్వాలంటూ ఆజ్మీరా శంకర్నాయక్, ప్రవీణ్ నాయక్, రామచంద్రునాయక్ తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఇక కొత్తగూడెం టికెట్ బీసీలకే ఇవ్వాలంటూ ‘గూడెం’ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గుర్రుగా ఉన్న పొదెం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో వామపక్షాలకు పొత్తు కుదిరితే భద్రాచలం అసెంబ్లీ స్థానం సీపీఎంకు కేటాయిస్తారనే ప్రచారం విపరీతంగా జరగడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఆమీతుమీ తేల్చుకునేందుకు భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య రెండు రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని పొత్తులో ఇతర పార్టీకి టికెట్ కేటాయించడమేంటని ఆయన పార్టీ పెద్దలను నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ పొత్తుల్లో భద్రాచలం స్థానాన్ని సీపీఎంకు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైతే పినపాక నుంచి పోటీ చేయాలని పొదెం వీరయ్యకు కాంగ్రెస్ ఆఫర్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే భద్రాచలం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వకుంటే ములుగు నుంచి పోటీకి సిద్ధమని ఆయన పార్టీ పెద్దలకు కబురు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. భద్రాచలం, ములుగు తప్ప మరో స్థానం నుంచి పోటీ చేసే ప్రసక్తి లేదని పొదెం వీరయ్య కుండబద్ధలు కొట్టినట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం. -
ఈ నెల 15వ తేదీ తర్వాత గెలుపు గుర్రాలను ప్రకటించనున్న బీజేపీ.. మరీ అసంతృప్తులకు..!
సూర్యపేట్: ఉమ్మడి జిల్లాలో పోటీలో ఉండే అభ్యర్థుల విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో ఒకరి పేరునే మొదటి ప్రాధాన్యంగా తీసుకొని అధిష్టానానికి పంపించగా.. మరికొన్ని నియోజకవర్గాలో రెండవ పేరుతో కూడిన జాబితాను పంపించినట్లు తెలిసింది. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన పార్టీ స్క్రీనింగ్ కమిటీ వాటి వడబోత కార్యక్రమాన్ని పూర్తి చేసింది. నియోజవకర్గాల్లో పోటీలో ఉండబోయే అభ్యర్థుల పేర్లను ఈ నెల 15వ తేదీ తరువాత ప్రకటించనుంది. అయితే, అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టతకు వచ్చిన పార్టీ.. మిగతా వారిని బుజ్జగించే పనిలో ఉంది. నాలుగు రకాలుగా వడబోత అభ్యర్థుల ఎంపికలో నాలుగు రకాల జాబితాలను సేకరించినట్లు తెలిసింది. ఇందులో ముఖ్యమైన నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన ఆశావహులపై అభిప్రాయాలను తీసుకున్నట్లు పార్లీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు బీజేపీకి వెన్నెముకగా వ్యవహరించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి కూడా నియోజకవర్గాల వారీగా పేర్లను తీసుకున్నట్లు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి కూడా ఇలా అభిప్రాయ సేకరణ చేసిన తరువాత వాటన్నింటని క్రోడీకరించి కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కరి పేరును, మరికొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరి పేర్లను, ఇంకొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురి పేర్లతో కూడా జాబితాను పార్టీ అధిష్టానానికి పంపించింది. నాలుగు చోట్ల ఒక్కరి పేరే.. నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో నాలుగు రకాల జాబితాల్లో ఒక్కరి పేరును మొదటిదిగా పేర్కొన్నట్లు తెలిసింది. అందులోని ఆ ఒక్కరి విషయంలో ఏకాభిప్రాయం రావడంతో వారికే టికెట్ను పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. మునుగోడు నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గం నుంచి సంకినేని వెంకటేశ్వర్రావు, భువనగిరి నుంచి గూడురు నారాయణరెడ్డి, తుంగతుర్తి నుంచి కడియం రామచంద్రయ్య పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది. అనుకోని పరిణామాలు ఎదురైతే తప్ప వారి విషయంలో మార్పు ఉండే అవకాశం లేదు. రంగంలోకి జిల్లా ఎన్నికల ఇన్చార్జీలు.. పార్టీ అధిష్టానం జిల్లా ఎన్నికల ఇన్చార్జీలను రంగంలోకి దింపుతోంది. టికెట్ ఎవరికి ఇచ్చినా పనిచేసేలా బుజ్జగింపులకు తెర తీసింది. అసంతృప్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మంత్రి శోభ కరాండ్లజే జిల్లాకు చేరుకున్నారు. వివిధ నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతున్నారు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోనూ మూడు నాలుగు రోజుల్లో జిల్లా ఎన్నికల ఇన్చార్జీల సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇద్దరి పేర్లను ప్రతిపాదించిన నియోజకవర్గాలు.. ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఒక్కో సెగ్మెంట్ నుంచి ఇద్దరి పేర్లను అధిష్టానానికి పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధానంగా పోటీపడుతున్న వారిలో నల్లగొండ నుంచి మాదగోని శ్రీనివాస్గౌడ్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, నాగం వర్షిత్రెడ్డి టికెట్ ఆశిస్తుండగా.. వారిలో ఇద్దరి పేర్లను పంపించినట్లు సమాచారం. నకిరేకల్ నుంచి చేపూరి రవీందర్, నకిరేకంటి మొగిలయ్య, దేవరకొండ నుంచి కేతావత్ లాలూనాయక్, జర్పుల కల్యాణ్నాయక్, నాగార్జునసాగర్ నుంచి కంకణాల నివేదితారెడ్డి, బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్యాదవ్, మిర్యాలగూడ నుంచి సాదినేని శ్రీనివాసరావు, రేపాల పురుషోత్తంరెడ్డి, పల్నాటి వెంకట్రెడ్డి, ఆలేరు నుంచి పడాల శ్రీనివాస్, కాసం వెంకటేశ్వర్లు, సూదగాని హరిశంకర్గౌడ్, కోదాడలో నూకల పద్మావతిరెడ్డి, ఓర్సు వేలంగిరాజు, హుజూర్నగర్లో బొబ్బా భాగ్యరెడ్డి, గట్టు శ్రీకాంత్రెడ్డి, చల్లా శ్రీలతారెడ్డి టికెట్ కోసం పోటీపడుతున్నారు. వారిలో ఇద్దరి పేర్లతో కూడిన జాబితాను పంపించింది. -
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం
ఢిల్లీ: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటకలో బీజేపీకి తన పాత మిత్రుడు తోడు నిలిచాడు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే, జేడీఎస్ కలిసే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈమేరకు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) ఎన్డీయేలో చేరుతున్నట్లు స్పష్టం చేసింది. జేడీఎస్ చీఫ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే ఈ చేరిక తదనంతర.. సీట్ల పంపకాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. జేడీఎస్కు నాలుగు సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఇరుపార్టీల నేతలు ఫొటోలు షేర్ చేస్తూ ఈ మేరకు తెలిపారు. 'ఎన్డీయే, జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని తెలపడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎన్డీయేలో చేరినందుకు జేడీఎస్కు అభినందనలు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయేకి మరింత బలం చేకూర్చినట్లయింది' అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. Met Former Chief Minister of Karnataka and JD(S) leader Shri H.D. Kumaraswamy in the presence of our senior leader and Home Minister Shri @AmitShah Ji. I am happy that JD(S) has decided to be the part of National Democratic Alliance. We wholeheartedly welcome them in the NDA.… pic.twitter.com/eRDUdCwLJc — Jagat Prakash Nadda (@JPNadda) September 22, 2023 బీజేపీతో చేరిపోతున్నారా..? అని గతవారం కుమారస్వామిని అడగగా.. గణేష్ చతుర్థి తర్వాత ఏదో ఒక ప్రకటన వెలువరిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం అధికారికంగా ప్రకటించారు. అయితే.. లోక్సభ ఎన్నికల కోసం నాలుగు సీట్లు జేడీఎస్కే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఓటమి పాలైంది. ఆ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఈ పొత్తు సార్వత్రిక ఎన్నికలకే పరిమితం అవుతుందా? రాష్ట్ర రాజకీయాల్లోనూ కొనసాగుతుందా? అనేదానిపై మాత్రం ఇరు వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. ఇదీ చదవండి: ఎన్సీపీలో రగులుతున్న వివాదం.. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? -
లోకేష్ రాక.. టీడీపీ గుండాగిరి
సాక్షి, కృష్ణా: జిల్లాలో తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యాత్ర సందర్భంగా.. ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బజారు రౌడీల్లాగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. లోకేశ్ రాక సందర్భంగా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాయి టీడీపీ శ్రేణులు. అయితే అదే సమయంలో కౌంటర్గా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశాయి వైఎస్సార్సీపీ శ్రేణులు. ఈ పరిణామాన్ని టీడీపీ గుండాలు జీర్ణించుకోలేకపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసి.. కర్రలతో ఇష్టానుసారంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వల్లభనేని పరామర్శ.. ఫిర్యాదు రంగన్నగూడెం చేరుకున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ మూకల దాడిలో గాయపడిన వైసీపీ శ్రేణులను పరామర్శించారు. లోకేష్ సమక్షంలోనే వంద మందికి పైగా మూకుమ్మడిగా తమ పై దాడిచేశారని వంశీ ఎదుట వాపోయారు బాధితులు. బాధితులతో కలిసి వీరవల్లి పోలీస్టేషన్ కు బయల్దేరిన ఎమ్మెల్యే వంశీ.. ఘటనపై వీరవల్లి పోలీసులకు ఫిర్యాదు చేయయనున్నారు. -
'పార్టీ మారడం లేదు.. ఇలాంటి పుకార్లలో టీడీపీ దిట్ట..'
హైదరాబాద్: తాను పార్టీ మారడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా తాను పార్టీ మారతానని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని చెప్పారు. ఏడాదిగా ఈ దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇంత శాడిజం ఎంటో తనకు అర్థం కావట్లేదని అన్నారు. బీఆర్ఎస్తో కొట్లాడి గెలిచానని చెప్పారు. తాను పార్టీ మారతానని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా కల్చర్ టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ అయిందని పేర్కొన్నారు. దీన్ని వాడటంలో టీడీపీ దిట్ట అని ఆరోపించారు. టీడీపీ కల్చర్ కాంగ్రెస్ను భ్రష్టు పట్టించిందని అన్నారు. ఇదీ చదవండి: Bholakpur Scrap Godown Blast: బోలక్పూర్లో పేలుడు.. -
నన్ను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుంది: చంద్రబాబు
సాక్షి, అన్నమయ్య/చిత్తూరు: చంద్రబాబు నాయుడిలో పరాకాష్టానికి చేరిన ఉన్మాదం మరోసారి బయటపడింది. శుక్రవారం అంగళ్లులో తన పర్యటనతో కల్లోల పరిస్థితికి కారణమైన ఆయన.. టీడీపీ కార్యకర్తలను నిలువరించాల్సిందిపోయి ఇంకా రెచ్చిపోయేలా మాట్లాడారు. పచ్చ దండును ఉసిగొల్పి.. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు అడ్డుకునేందుకు యత్నించిన పోలీస్ సిబ్బందిపైనా దాడులు జరిపించి ఉద్రిక్తతలకు కారణం అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూర్లోనూ ఉద్రికత్తలకు కారణమైంది. పుంగనూరులో టీడీపీ కార్యకర్తల దాడిలో ఇద్దరు ఎస్సైలు, పది మంది కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలూ గాయపడ్డారు. ఈ క్రమంలో.. అధికార పక్షానికి సవాల్ పేరిట ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడారు. తమాషాలు చేస్తున్నారా నా కొడుకులు అంటూనే.. తరమండిరా అంటూ టీడీపీ కార్యకర్తలకు హుకుం జారీ చేశాడు. ‘‘టైం చెప్పండి.. ప్లేస్ చెప్పండి.. ఎవరు గెలుస్తారో చూద్దాం.’’ ‘‘నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టా. బాంబులకే భయపడలేదు. నన్ను బెదిరించడం.. మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు’’. ‘‘కర్రలతో వస్తే కర్రలతో వస్తా.. రౌడీలకు రౌడీగా ఉంటా, ఏయ్ పోలీస్ వాళ్లను పంపించూ’’ అంటూ తన బావ బాలయ్య రేంజ్లో డైలాగులు పేల్చాడు. ఈ క్రమంలో డీఎస్పీ కేశప్పను ఉద్దేశిస్తూ.. ఆ బట్టలు తీసేయండయ్యా.. అందరూ పెయిడ్ ఆర్టిస్టులే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాను మాత్రం సిబ్బందితో షీల్డ్ అడ్డుపెట్టించున్నారు. నన్ను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుంది. దెబ్బలు తగిలినా.. తలలు పగిలినా భయపడేది లేదు. నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ని. మగాళ్లైతే పోలీసులు లేకుండా రండి.. తేల్చుకుందాం. ఏయ్ పోలీస్ బట్టలిప్పూ.. రోషం లేని జీవితం నాశనం. మీ పతనం చూసేవరకు వెంటపడతా.. అంటూ పుంగనూరులో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ నినాదాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పర్యటనను అడ్డుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో టీడీపీ గూండాలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినకుండా దాడులకు తెగబడ్డారు. ఓపెన్ టాప్ వాహనంలో చంద్రబాబు తన కార్యకర్తలను ఉద్దేశించి పరిస్థితిని మరింత దిగజార్చేలా మాట్లాడడం గమనార్హం. -
బాబు మీటింగ్లో బీటెక్ రవి అనుచరుల వీరంగం
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో పులివెందుల నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీటింగ్ సందర్భంగానే వీరంగం సృష్టించారు. అటుగా వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చినా పోలీసులపైనా దాడికి యత్నించారు. దాడికి యత్నించింది టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి(మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి) అనుచరులుగా తేలింది. ఒకానొక దశలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. మరోవైపు పోలీసుల విజ్ఞప్తితో వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించారు. -
రాజకీయ పార్టీ ర్యాలీలో భారీ పేలుడు.. 40 మంది మృతి..
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బజూర్లో భారీ పేలుడు సంభవించింది. దాదాపు 40 మంది మృతి చెందారు. 150 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (జేయూఐ-ఎఫ్) రాజకీయ పార్టీ ర్యాలీలో ఈ దుర్ఘటన జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. Powerful explosion at a political rally left several people dead in Khyber Pakhtunkhwa #Pakistan #BREAKING #BreakingNews #Pakistanblast pic.twitter.com/A7nD8Vaym1 — Eliteworld (@eliteworldwaves) July 30, 2023 ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్లోని బజూర్లో జేయూఐఎఫ్ రాజకీయ పార్టీ మీటింగ్ను నిర్వహించింది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. ఇందులో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. భారీగా ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. పేలుడును జేయూఐఎఫ్ నాయకుడు హఫీజ్ హమ్దుల్లా ఖండించాడు. మానవత్వంపై దాడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నాడు. పేలుళ్లపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: రష్యాపై డ్రోన్ల దాడికి పాల్పడ్డ ఉక్రెయిన్.. మాస్కో విమానాశ్రయం మూసివేత -
తెలంగాణ కమలం పార్టీ ఆఫీస్లో కలకలం.. ఒక్కసారిగా దూసుకొచ్చి..
సాక్షి, హైదరాబాద్: ఇందూరు కమలం దళంలో రేగిన చిచ్చు.. హైదరాబాద్ లోని స్టేట్ పార్టీ కార్యాలయానికి పాకింది. ఎంపీ ధర్మపురి అరవింద్ తీరుపై స్థానిక అసమ్మతి నేతలు ఆందోళనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ సీనియర్ నేతలు సముదాయించినా అసమ్మతి నేతలు వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. నిజామాబాద్ కాషాయ పార్టీ నేతల ఆందోళనకు కారణమేంటీ ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వారికి ఏం చెప్పి సముదాయించారు? నిజామాబాద్ జిల్లాలో కాషాయ పార్టీ రెండుగా చీలింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య ఇటీవల 13 మండలాల అధ్యక్షులను తొలగించి.. కొత్త వారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో చర్చించకుండా.. నేరుగా కొత్తవారిని ప్రకటించడంపై అసమ్మతివర్గం రగిలిపోయింది. ఎంపీ అరవింద్ పట్టుబట్టి పార్టీ మండల అధ్యక్షులను మార్చివేశారని అసమ్మతివర్గం ఆరోపిస్తోంది. (చదవండి: విశ్వనగరమట.. కనీస స్పందన ఉండదా?.. కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్రెడ్డి ఫైర్) బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్భన్ నియోజకవర్గాలకు చెందిన కొంత మంది నేతలు వచ్చి ఒక్కసారిగా బైఠాయించి.. ఆందోళనకు దిగారు. అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి.. వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేయడానికి చాలా మంది అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య పోటీ చేయాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. ఎంపీ అరవింద్ ప్రోత్సాహంతో ధన్ పాల్ సూర్యనారయణ గుప్త అక్కడ పనిచేసుకుంటున్నారు. ఇక ఆర్మూర్ లోనూ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వినయ్ రెడ్డితో పాటు ఇటీవల పార్టీలో చేరిన వ్యాపారవేత్త రాకేశ్ రెడ్డి ఆర్మూర్ బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. (చదవండి: మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానం.. లోక్సభలో ఎవరి బలం ఎంతంటే!) బోధన్ అసెంబ్లీ నుంచి ప్రకాశ్ రెడ్డితో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. (చదవండి: కాంగ్రెస్లోకి వస్తూనే టికెట్ల పంచాయితీ పెట్టిన జూపల్లి! నాగం ఆగమాగం.. చేరికపై ట్విస్టయితే ఉండదుగా!) ఇదే తరుణంలో మండలాల అధ్యక్షులను మార్చడం.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న కొంత మంది.. అసమ్మతి వర్గానికి ఆజ్యం పోయడంతో ఆ రచ్చ కాస్తా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరింది. ఎంపీ అరవింద్ మాత్రం.. మండలాల అధ్యక్షుల మార్పులో తనప్రమేయం లేదని చెబుతున్నారు. ఆందోళనకు దిగిన నిజామాబాద్ అసమ్మతి నేతలను కిషన్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేయడంపై వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. సమస్య ఉంటే అంతర్గతంగా కూర్చొని సెట్ చేసుకోవాలని.. ఇలా వీధిన పడటం భావ్యం కాదని క్లాస్ తీసుకున్నారు. ఈ నెల 29న అమిత్ షా పర్యటన తర్వాత... సర్ధుబాటు చేసుకుందామని చెప్పి ఆందోళనకు దిగిన అసమ్మతి నేతలను కిషన్ రెడ్డి తిరిగి పంపించారు. -సాక్షి, పొలిటికల్ డెస్క్ -
పని చేయలేకున్నాం బాబోయ్.. మంత్రులపై సీఎంకు ఎమ్మెల్యేల లేఖలు..
బెంగళూరు: ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా మూడు నెలలు గడవక ముందే కర్ణాటక కాంగ్రెస్లో ముసలం పట్టిందా..? బయటకు నేరుగా వెల్లడించకపోయినా.. నేతల్లో అసమ్మతి సెగలు రగులుతున్నాయా? సొంత నియోజకవర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని 30 మంది ఎమ్మెల్యేలు సీఎంకు మొరపెట్టుకున్నారా?.. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు ఈ పుకార్లలో వాస్తవం లేదని చెబుతున్నా.. తాజా పరిణామాలు ఇవన్నీ నిజమేనా? అనే సందేహాలను కల్గిస్తున్నాయి. కర్ణాటకాలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. దేశవ్యాప్తంగా నీరుగారుతున్న కాంగ్రెస్ ఆశల్ని పైకిలేపింది. సిద్ధరామయ్య నేతృత్వంలో చక్కగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య పీఠం అధిష్ఠించగానే ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ శ్రేయోరాజ్య స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచిందో లేదో.. ప్రభుత్వం కూలిపోనుందా? అనే పుకార్లు పుట్టాయి. పార్టీ నేతల్లో అసమ్మతి సెగలు కమ్ముకున్నట్లు వార్తలు వచ్చాయి. సొంత నియోజక వర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని 30 మంది ఎమ్మెల్యేలు సీఎంకు మొరపెట్టుకున్నారని ఊహాగానాలు వచ్చాయి. దానికి తోడు తమ ప్రభుత్నాన్ని కూల్చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేయడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అటు.. అభివృద్ధి పనులకు మంత్రులు సహకరించడం లేదని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. సీఎంను ఎలా కిందకు దించాలో తనకు తెలుసంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు.. ప్రభుత్వంలో నేతల మధ్య సఖ్యత దెబ్బతిందనే ఆరోపణలకు బలం చేకూర్చాయి. ఇదీ చదవండి: HD Deve Gowda: జేడీఎస్ భవిష్యత్పై పార్టీ అధినేత దేవె గౌడ కీలక వ్యాఖ్యలు.. అయితే ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని సీఎం సిద్ధరామయ్య తాజాగా స్పష్టం చేశారు. 30 మంది ఎమ్మెల్యేలు తనకు అసమ్మతి లేఖలు పంపలేదని వెల్లడించారు. ఈ వారం పార్టీ అసెంబ్లీ సభ్యుల సమావేశం ఉంటుందని చెప్పారు. గత వారం జరగాల్సిన మీటింగ్ పలు కారణాల వల్ల వాయిదాపడినట్లు చెప్పారు. అటు డీకే శివకుమార్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేల మధ్య సయోద్యతో పాటు ప్రభుత్వ అభివృద్ధి పనులపై చర్చించనున్నట్లు చెప్పారు. మంత్రులపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బెంగళూరుకు బయట కుట్ర జరుగుతోందని డీకే శివకుమార్ వ్యాఖ్యలపై స్పందించడానికి సిద్ధరామయ్య నిరాకరించారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఎదురవుతున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాల అమలుకు పలు నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఒక్క తన నియోజక వర్గంలోనే రూ.300 కోట్ల వరకు అవసరమవుతున్నట్లు చెప్పారు. పథకాలను అలాగే కొనసాగించాలని ఎమ్మెల్యేలు కోరుతున్న విషయాన్ని డీకే తెలిపారు. అయితే.. ఈ విషయాలను మరిచి ప్రజలతో మమేకమై నేతలు ఉండాలని సూచించినట్లు డీకే తెలిపారు. వర్షాలు, వరదల్లో ప్రజలకు తోడుగా ఉండాలని చెప్పినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు.. అమరుని కుటుంబాన్ని రక్షించిన బీఎస్ఎఫ్.. -
'స్వార్థం కోసం సిద్దాంతాల్ని వదిలేశారు'.. విపక్ష భేటీపై ప్రధాని మోదీ ఫైర్..
ఢిల్లీ: దేశాభివృద్ధే తమ అజెండా అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశం కోసం పనిచేయడంలో వెనకడుగు వేయబోమని అన్నారు. తన శరీరంలో ప్రతి కణం.. ప్రతీ క్షణం దేశం కోసమే కేటాయించానని ప్రధాని చెప్పారు. ఎన్డీఏ భేటీ అనంతరం మాట్లాడిన మోదీ.. విపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగారు. తనను తిట్టేందుకు కేటాయించే సమయం.. దేశం కోసం కేటాయిస్తే బాగుండునని అన్నారు. చిన్న చిన్న స్వార్థాలతో విపక్షాలు సిద్ధాంతాలను పక్కన పెడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. నిత్యం విమర్శించుకునే వీళ్లంతా ఒక్కదగ్గరికి చేరుతారేమో గానీ ముందుకు సాగలేరని ప్రతిపక్షాలనుద్దేశించి ప్రధాని మోదీ చెప్పారు. కశ్మీర్లో ఎన్సీ, పీడీపీ రోజూ తిట్టుకుంటాయని అన్నారు. బంగాల్లో టీఎంసీ, కాంగ్రెస్, కమ్యునిస్టుల మధ్య ఎప్పుడూ గొడవలేనని చెప్పారు. PM Narendra Modi garlanded by National Democratic Alliance (NDA) leaders at the NDA meeting in Delhi. pic.twitter.com/jtGJ9XvFiF — ANI (@ANI) July 18, 2023 ఎన్డీఏ హిస్టరీ, కెమిస్ట్రీ తెలుసు.. ఎన్డీఏ హిస్టరీ, కెమిస్ట్రీ ప్రజలకు తెలుసని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో 250 చోట్ల తమకు 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. నిజాయితీగా పనిచేశామని చెప్పిన మోదీ.. ఈ సారి కూడా అలాంటి ఓట్ షేర్నే సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ హయాంలోనే దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని తెలిపారు. ఎన్నికల ఏడాది దేశ రాజకీయాలను విదేశాలు కూడా గమనిస్తాయని తెలిపిన మోదీ.. అధికారం ముగిసిపోయే పార్టీలతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పారు. కానీ భారత్తో అమెరికా, ఫ్రాన్స్ దేశాలు స్నేహం చేస్తున్నాయని తెలిపారు. ఇదీ చదవండి: కళ్లముందు కూటమి కనిపిస్తున్నా.. కలిసుండేది కష్టమే.. ఎవరి లెక్కలు వారివి.. ఎన్డీఏ భేటీ.. 2024కు ముందు దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నేడు బెంగళూరులో 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా.. అటు ఢిల్లీలో ఎన్డీయే కూటమి కూడా 38 పార్టీలతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ రోజు ఢిల్లీలోని అశోక హోటల్లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఎన్డీయే కూటమి భేటీ జరిగింది. National Democratic Alliance (NDA) leaders pose for a group photograph ahead of their meeting in Delhi. A total of 38 political parties are attending the meeting. pic.twitter.com/KVG1j6QIwj — ANI (@ANI) July 18, 2023 భారతావని అంతటా విస్తరించి ఉన్న తమ కూటమి భాగస్వాములతో నేడు సమావేశం జరగనుండటం సంతోషంగా ఉందని భేటీకి ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరడానికి, దేశ అభివృద్ధికి ఇది సరైన సమయమని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముందు కూటమిలో ఉన్న పార్టీల నేతలు ప్రధాని మోదీకి పూల మాలతో సత్కరించారు. PM Narendra Modi garlanded by National Democratic Alliance (NDA) leaders at the NDA meeting in Delhi. pic.twitter.com/jtGJ9XvFiF — ANI (@ANI) July 18, 2023 అయితే.. ఎన్డీఏ కూటమికి హాజరైన పార్టీలు చాలావరకు చిన్న పార్టీలు. తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలు కాగా.. మరికొన్నింటికి అసలు ఎంపీలే లేరు. ఏదైమైనా.. ఈ భేటీతో వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో తేల్చుకునే అవకాశంగా ఈ భేటీని చిన్న పార్టీలు భావిస్తున్నాయి. #WATCH | National Democratic Alliance (NDA) meeting to chalk out a joint strategy to take on opposition alliance 'INDIA' in the 2024 Lok Sabha polls, begins in Delhi A total of 38 political parties are attending the meeting. pic.twitter.com/MDogidlRc6 — ANI (@ANI) July 18, 2023 దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతదేశంతో సహా ప్రధాన రాష్ట్రాల్లో తన స్థానం నిలుపుకుంది. ఉత్తరప్రదేశ్, బిహార్లాంటి రాష్ట్రాల్లో పట్టు నిలుపుకోవడానికి తగిన అన్ని చర్యలు చేపడుతోంది. NDA meeting in Delhi. #NDAMeeting pic.twitter.com/SmNCx8aW6c — Sai Meghana Maddela (@MeghanaMaddela) July 18, 2023 ఇదీ చదవండి: విపక్షాల కూటమికి నాయకుడు ఎవరు..? తేల్చేది ఎవరు..? పెదవి విప్పిన ఖర్గే.. -
తెలంగాణ బీజేపీ.. మరీ ఇంత గందరగోళమా?
తోచీ తోయనమ్మ తోడికోడలు.. పుట్టింటికి వెళ్లిందని ఒక సామెత. భారతీయ జనతా పార్టీ నేతల తీరుతెన్నులు అలాగే ఉన్నాయి. ఆయా రాష్ట్రాలలో మేధావులను,వివిధ వర్గాల ప్రముఖులను కలవడానికి ఆ పార్టీ ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుంది. మంచిదే!. ఆ సందర్భంగా వారు తమకు కాస్త సానుకూలంగా ఉండేవారినో, లేక తటస్థంగా ఉండేవారినో కలిస్తే ప్రయోజనం ఉంటుంది. అలాకాకుండా పూర్తి వ్యతిరేక సిద్దాంతంతో ఉండేవారిని, మరో పార్టీకి ఏజెంట్ గిరీ చేసేవారిని కలవడానికి ఆలోచించడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ✍️ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా.. హైదరాబాద్లో మేధావి, మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి వెళ్లి కలిశారు. ఆయన కూడా వీరిని సాదరంగా ఆహ్వానించి ఇంటిలోకి తీసుకువెళ్లారు. ఆయనకు మోదీ పాలనకు సంబంధించిన వివిధ పుస్తకాలను నడ్డా అందించారు. సిద్దాంతాలు వేరైనా ఇలా రాజకీయ ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలియచేయడానికి రావడం ప్రజాస్వామ్యంలో మంచిదేనని నాగేశ్వర్ అన్నారు. బాగానే ఉంది. నాగేశ్వర్ మర్యాదస్తుడు. అందరితో గౌరవించబడే వ్యక్తి. అంతవరకు ఓకే. అసలు బీజేపీ పెద్దలు ఆయనను కలవడం వల్ల ఏమి ప్రయోజనం వచ్చిందన్నది ప్రశ్న. తెలంగాణ బీజేపీ నేతలే కొందరు ఈ ప్రశ్న లేవనెత్తడం విశేషం. నాగేశ్వర్ వామపక్ష సిద్దాంత భావాలు ఉన్న ప్రముఖుడు. ఆయన కొంతకాలం సీపీఎం ఆధ్వర్యంలోని ఒక టీవీ చానల్ ను కూడా నిర్వహించారు. వివిధ టీవీ చానళ్లలో విశ్లేషకుడిగా కూడా తమ అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. ఇప్పుడు నడ్డా కలవడం వల్ల నాగేశ్వర్ తన భావాలను మార్చుకుంటారని అనుకోజాలం. తాను చెప్పదలచుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంటారు. అందుకు బీజేపీ నేతలు ఇష్టపడతారా? బీజేపీ సిద్దాంతం అంటే అంతగా ఇష్టపడని వ్యక్తి అని తెలిసి కూడా ఆయనను కలవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. గతంలో బీజేపీ అభ్యర్ధిని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించిన చరిత్ర కూడా నాగేశ్వర్కు ఉంది. రాజకీయ వర్గాలలోను, రాజకీయేతర వర్గాలలోను ఈయన పట్ల చాలా మందికి అబిమానం ఉంది కనుక ఎవరో ఈ భేటీని అభ్యంతరంగా తీసుకోరు. కాకపోతే బీజేపీ తెలంగాణలో గందరగోళంలోనే ఉందన్న సంగతి మరోసారి స్పష్టం అవుతుంది. ✍️ కొంతకాలం క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జర్నలిస్టు ముసుగులో ఉన్న తెలుగుదేశం ఏజెంట్ ఒకరిని కలవబోతున్నారని వార్తలు వచ్చాయి. చంద్రబాబుకు డైరెక్ట్ ప్రతినిధిగానే కాకుండా ఫిరాయింపులు, రాజకీయ ఆర్దిక లావేదేవీలు వంటివాటిలో క్రియాశీలకంగా ఉంటూ పవర్ బ్రోకర్ గా పేరొందిన జర్నలిస్టును కలవబోతున్నారని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. గతంలో ఒకసారి ఈయనను పిలిపించుకుని ఢిల్లీలో మాట్లాడారు. ఆ తర్వాత కాలంలో టీడీపీ కోసం ఈయన బీజేపీపై కారాలు, మిరియాలు నూరారు. కొంతకాలం రెండు పార్టీలు కలిస్తే ఏపీలో జగన్ ను ఇబ్బందిపెట్టవచ్చని అనుకున్నారు. ఆ దిశగానే పనిచేశారు. ఏపీ బీజేపీలోని ఒక నేతను ఈయన టీవీచానల్ లో డిబేట్ లోనే మరొకరు కొట్టినా ఎవరూ పట్టించుకోలేదు. టీడీపీ నేతలు కొందరు బిజెపిలో చేరి కోవర్టులుగా వ్యవహరిస్తుంటారు. వారందరికి ఈయనే సలహాలు ఇస్తారన్న ప్రచారం ఉంది. ఇలాంటి వ్యక్తిని జాతీయ స్థాయిలో హోం మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కలవడమా అని అంతా ముక్కున వేలేసుకున్నారు. ✍️ ఆ తర్వాత కారణం ఏమో తెలియదు కాని అమిత్ షా తెలంగాణ టూర్ రద్దు కావడంతో ఆ భేటీ అగిపోయింది. నిజమైన బీజేపీ నేతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ భవిష్యత్తులో ఎప్పుడైనా కలుస్తారేమో తెలియదు. జేపీ నడ్డా తన పర్యటనలో ఆ జర్నలిస్టు ఇంటికి వెళ్లకపోవడం గమనించదగ్గ అంశమే అవుతుంది.అంతకుముందు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చిన అమిత్ షా మరో మీడియా అధిపతిని ఆయన ఫిలిం సిటీకి వెళ్లి కలుసుకుని మద్దతు కోరారు. అయినా ఆ మీడియా అంతగా పట్టించుకోలేదు. అది పూర్తి స్తాయిలో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తోంది. కేసీఆర్ పాలన గురించి అద్భుతంగా పొగుడుతూ ఎడిటోరియల్ కూడా రాసింది. ఆ మీడియా అధిపతికి తన కారణాలు తనకు ఉండవచ్చు. కానీ అమిత్ షా ఆయన్ని కలవడం వల్ల బీజేపీకి ఒరిగే ప్రయోజనం ఏముంది?. ✍️ తెలంగాణలో బిజెపి పరిస్థితికి ఇది ఒక మచ్చుతునక కావొచ్చు. కర్నాటక ఎన్నికల ఓటమి తర్వాత తెలంగాణలో బీజేపీ అయోమయంలో పడిపోయింది. కారణం ఏమైనా దాని గ్రాఫ్ తగ్గుతున్న మాట వాస్తవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోపాల్ లో చేసిన విమర్శలు ఎలా ఉన్నా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కవితను పలుమార్లు విచారించిన తీరు. ఆ తర్వాత పలువురు ఇతరులను అరెస్టు చేసినా, ఆమె జోలికి వెళ్లకపోవడంపై కాంగ్రెస్ పక్షం విమర్శిస్తుంటుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేస్తోంది. దానికి తగ్గట్లుగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలికాలంలో బీజేపీపై విమర్శలు తగ్గించడం, కాంగ్రెస్పై దాడి పెంచడం చేస్తున్నారు. అంతేకాక దేశస్థాయిలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ వెళ్లకపోవడం, అదే టైమ్ లో కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కేంద్రంలో కొందరు మంత్రుల్ని కలవడం, చివరికి అమిత్ షా అప్పాయింట్మెంట్ పొందడం అందరి దృష్టిని ఆకర్షించాయి. కానీ, చివరి క్షణంలో అమిత్ షా తో భేటీ రద్దు అయింది. ✍️ మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతుండగా ఇప్పుడు కేంద్రాన్ని ఆయా డిమాండ్లపై కలవడంలో రాజకీయం కూడా ఉండొచ్చు. కానీ, రెండు పార్టీల అగ్రనేతల మధ్య ఏదో రాజీయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యాపించాయి. ఢిల్లీలో జాతీయ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నా.. హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాలు చేస్తామని కేటీఆర్ చెప్పడం చిత్రంగానే అనిపిస్తుంది. కేటీఆర్ డిల్లీ టూర్ లో ఉన్నప్పుడే బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలతో డిల్లీలో అమిత్ షా, నడ్డాలు సమావేశం అయి పార్టీ వ్యవహారాలు చర్చించారు. కేటీఆర్ను కలవడం వల్ల బిజెపి గ్రాఫ్ మరింత పడిపోతుందని వారు స్పష్టం చేయడంతోనే షా రద్దు చేసుకున్నారని అంటున్నారు. తాము బిజెపితో కలిసిందే బిఆర్ఎస్ కు , ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా అయితే, వారితో కాంప్రమైజ్ అయితే తాము బిజెపిలో కొనసాగి ప్రయోజనం ఏమి ఉంటుందని వారు ప్రశ్నించారట. ✍️ ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది. ఒకప్పుడు మంచి జోష్ వచ్చినా, ఇప్పుడు డల్ అవడంతో బీజేపీ పెద్దలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. మళ్లీ నడ్డా, అమిత్ షాలు వచ్చి కేసీఆర్ను ఎంత ఘాటుగా విమర్శించినా గ్రాఫ్ పెరుగుతుందా అనేది అనుమానంగానే ఉంది. మొత్తం రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే.. తెలంగాణలో తాము గెలవలేకపోతే బీఆర్ఎస్ విజయం సాధించడం బెటరా? కాంగ్రెస్ గెలిస్తే లాభమా ? అనేది ఆలోచించుకుంటారు. కచ్చితంగా బీఆర్ఎస్ ఉండడం వల్ల తమకు వచ్చే నష్టం లేదని బీజేపీ వారు అనుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ గెలిస్తే దాని ప్రభావం దేశంలోని వివిధ ప్రాంతాలపై పడవచ్చు. అందువల్ల ఎన్నికల నాటికి బీజేపీ హడావుడి చేసినా, కాంగ్రెస్ గెలవకూడదనే కోరుకుంటుంది. అది బీఆర్ఎస్కు కలిసి వచ్చే పాయింట్ కావచ్చు. ✍️ ఎన్నికల సమయంలో ఆదాయపన్ను ,సిబిఐ , ఈడి వంటివాటిని ప్రయోగించకుండా ఉంటే బీఆర్ఎస్ కు ఇబ్బంది ఉండదు. కొద్ది రోజుల క్రితం టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పై ఈడీ దాడులు చేసింది. అలాగే మెడికల్ కాలేజీలలో అక్రమాలపై దృష్టి సారించింది. అందులో బిఆర్ఎస్ కు బాగా దగ్గరగా ఉండే ప్రముఖులు కూడా ఉన్నారు. వారంతా ప్రస్తుతానికి మేనేజ్ చేసుకోగలిగారని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జోరు తగ్గిన బిజెపి ఆయా నియోజకవర్గాలలో కొత్త నేతలను ఇప్పటికైతే ఆకర్షించలేకపోతోంది. మాజీ ఎమ్.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లె కృష్ణారావు తదితరులు బిజెపి కన్నా కాంగ్రెస్ బెటర్ అనే భావనకు వచ్చారు. వారికోసం బిజెపి విఫల యత్నం చేసింది. ఈ నేపధ్యంలోనే ఈటెల రాజేందర్, రాజగోపాలరెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూడవచ్చన్న వార్తలు వస్తుండడంతో హైకమాండ్ అలర్ట్ అయింది. తెలంగాణ బిజెపి సీనియర్ నేతలలో ఉన్న విభేదాలు కూడా పార్టీని ఇరుకున పెడుతున్నాయి. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, మరో నేత డి.కె. అరుణ వంటివారు ఈ వాదనలను ఖండిస్తున్నా, బిఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒకటేనని చెబుతున్నా, జనం సీరియస్ గా తీసుకోవడం లేదు. రాజగోపాలరెడ్డి ఆయా టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఎక్కువకాలం బిజెపిలో ఉండరేమోననిపిస్తుంది. రాజకీయాలు మొత్తం మారిపోవడానికి ఒక స్టెప్ చాలు అనడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ప్రస్తుతం తెలంగాణలో బిజెపి ఇలాంటి సందిగ్ద పరిస్థితిలోనే కొట్టుమిట్లాడుతోందని చెప్పాలి. ::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
అనంతలో టీడీపీ మూకల దాష్టీకం
సాక్షి, అనంతపురం: తాడిపత్రి లో తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. గంగాదేవి పల్లిలో జగనన్న కాలనీ కోసం భూమిని చదును చేస్తుండగా.. అక్కడివారిపై దాడికి దిగారు. జగనన్న కాలనీ భూమిని వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల చదును చేస్తుండగా.. అడ్డుకుని టీడీపీ వర్గం కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించి.. 24 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే పరామర్శ టీడీపీ వర్గం దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో పరామర్శించారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇదీ చదవండి: ఓటర్ల సవరణ జాబితాపై ఫోకస్ పెట్టండి -
'ముస్లీం లీగ్ లౌకిక పార్టీ' రాహుల్ వ్యాఖ్యలపై.. బీజేపీ ఫైర్..
ఢిల్లీ: ముస్లీం లీగ్ పూర్తిగా సెక్యులర్ పార్టీ అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులకు దేశంలో ఇంకా మద్దతు దొరకడం దురదృష్టకరమని అన్నారు. మతం పేరిట దేశం రెండుగా విడిపోవడానికి ముస్లిం లీగ్ కారణమనే అంశాన్ని ఎలా మరిచిపోయారని ప్రశ్నించారు. అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్లో ముస్లిం లీగ్తో కాంగ్రెస్ పొత్తుపై విలేఖరి అడిగిన ప్రశ్నకు 'ముస్లీం లీగ్ పూర్తిగా లౌకికమైనది. ఆ పార్టీని సరిగా అర్థం చేసుకోలేనివాళ్లే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని అన్నారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యూడీఎఫ్లో ముస్లీం లీగ్ మిత్రపక్షంలో ఉంది. పార్లమెంట్ సభ్యుడిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయకముందు..వయనాడ్ నుంచే ఎంపీగా ప్రాతనిథ్యం వహించారు. 'మత ప్రాతిపదికన భారతదేశ విభజనకు కారణమైన జిన్నా 'ముస్లిం లీగ్'ను.. రాహుల్ గాంధీ 'సెక్యులర్' అని అంటున్నారు. చరిత్రను రాహుల్ సరిగా చదవలేదు' అని బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. చదవండి:పాకిస్తాన్ కంటే భారత్ ఆ విషయంలో చాలా బెటర్... ఆ మాటకొస్తే చైనా కూడా ఎందుకూ పనికిరాదు... -
షిండే వర్గంలో అసంతృప్తి.. 22 మంది ఎమ్మెల్యేలతో సహా..!
ముంబై: శివసేనను రెండుగా చీల్చి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఏక్నాథ్ షిండేకు ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు మొదలయ్యాయి. బీజేపీతో పొసగని తన ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలతో సహా 9 మంది ఎంపీలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ (యూబీటీ)కి చెందిన సామ్నా పత్రిక వెల్లడించింది. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలకు బీజేపీతో పొసగడంలేదని పేర్కొంది. షిండే వర్గంలోని కొంతమంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని యూబీటీ ఎంపీ వినాయక్ రౌత్ తెలిపారు. ఆ పార్టీ నుంచి బయటకు వస్తామని వారు తెలిపినట్లు చెప్పారు. ఎన్డీయే భాగస్వామ్యంలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని చెప్పినట్లు వెల్లడించారు. బీజేపీ-షిండేకు చెందిన శివసేన భాగస్వామ్యంలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గజానన్ కీర్తికార్ బహిరంగంగానే బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సామ్నా తెలిపింది. బీజేపీ నుంచి అంతర్గతంగా వారు వివక్షను ఎదుర్కొంటునట్లు చెప్పారు. 'మేము 13 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. ఎన్డీయే భాగస్వామ్యంలో మా సమస్యలు పరిష్కారమయ్యేలా లేవు'అని గజానన్ కీర్తికార్ ఇదివరకే అన్నారు. అయితే ఈ పరిస్థితిని షిండే వర్గం తోసిపుచ్చుతోంది. #WATCH | "Can Vinayak Raut see the future? Does he know face-reading? He says anything. There is no fact to what he says. We are all satisfied. Under the leadership of CM Eknath Shinde, we are working well. Vinayak Raut keeps saying things like this, we don't pay attention to… pic.twitter.com/vMTbpc1kxI — ANI (@ANI) May 30, 2023 'వ్యక్తిగత గౌరవాన్ని డబ్బులతో కొనలేం. ఇది మరోసారి రుజువైంది. ఈ సారి 22 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం' అని షిండే నేతృత్వంలోని శివసేన నేతలు ఇప్పటికే చెప్పారు. ఎన్డీయే భాగస్వామ్యంలోని షిండే వర్గానికి 22 సీట్లు ఇచ్చే అవకాశాలు దాదాపుగా లేవని సామ్నా తెలిపింది. చదవండి:కిడ్నీ సమస్యతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత.. తండ్రి చనిపోయిన మూడు రోజులకే! -
Imran Khan: మహిళా కార్యకర్తలపై జరుగుతున్న అకృత్యాలపై దర్యాప్తు చేయాలి!:
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో జరిగిన అల్లర్లు, హింసాకాండలో మహిళా కార్యకర్తలు, మద్దతుదారులు అరెస్టయ్యిన సంగతి తెలిసిందే. వారిపై అత్యాచారం వంటి అకృత్యాలు జరిగనట్లు ఇమ్రాన్ ఆరోపించడమే గాక దీన్ని సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఐతే పాక్ అంతర్గత మంత్రి పీటీఐ సభ్యులు బూటకపు ఎన్కౌంటర్, అత్యాచార ఘటనకు సంబంధించి కుట్రను బహిర్గతం చేసే కాల్ను ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు అడ్డుకున్నాయని విలేకరులు సమావేశంలో పేర్కొన్నారు. ఆ తదనంతరమే పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయా కాల్స్లో.. మంత్రి సనావుల్లా పీటీఐ కార్యకర్తల ఇంటిపై దాడి చేసి కాల్పు జరిపే పథకం ఉందని, ఫలితంగా ఫ్రాణం నష్టం జరిగి ప్రపంచానికి మానవహక్కుల ఉల్లంఘన జరిగినట్లు చిత్రీకరిస్తుందని పేర్కొన్నారు. అలాగే అత్యాచారాలు అనేది రెండవ ప్రణాళికలో భాగం అని, పీటీఐకి వ్యతిరేకంగా జరిగిన అన్యాయన్ని ప్రచారం చేయడానికి గ్లోబల్ మీడియా సంస్థలతో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్న పార్టీ మహిళ కార్యకర్తలకు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలాంటి చికిత్స అందిస్తున్నారని ప్రశ్నించారు. మహిళా కార్యకర్తలను బంధించి జైల్లో పడేసిన విధానం బాధించింది. అక్కడ వారిపై అత్యాచారాలు జరిగడంతో చికిత్స పొదుతున్నట్లు విన్నామని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల గురించి వివిధ ప్రాంతాల నుంచి నివేదికలు వస్తున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల సుప్రీం కోర్టు దయనీయ స్థితిలో ఉన్న మహిళ కార్శికుల గురించి దర్యాప్తు చేయాలని కోరారు ఇమ్రాన్ ఖాన్. (చదవండి: Imran Khan PTI Party: పాకిస్తాన్లో సంచలనం.. ఇమ్రాన్కు ఊహించని షాక్!) -
టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్.. ఎమ్మెల్యే ధీటైన జవాబు
సాక్షి పల్నాడు: వినుకొండ మండలం శావల్యాపురంలో తెలుగుదేశం నాయకులు ఓవరాక్షన్కు దిగారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా శావల్యపురంలో జీవీ ఆంజనేయులు పాదయాత్ర చేశారు. అయితే.. ఈ క్రమంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆ యాత్రకు తారసపడ్డారు. అయితే.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి వాహనానికి టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. వాహనాన్ని చుట్టుముట్టి పార్టీ నినాదాలు చేస్తూ రెచ్చిపోయారు. దీంతో సహనం నశించిన ఎమ్మెల్యే.. ఆగ్రహంతో బయటకు వచ్చారు. ‘రండిరా.. చూసుకుందాం..’ అంటూ యెల్లో బ్యాచ్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈలోపు రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు. పోలీసులు కలుగజేసుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఎమ్మెల్యే కారును అక్కడి నుంచి పంపించేశారు. -
పవన్ ‘టీ’కప్పులో ప్రకంపనలు.. జససేనాని ఇది ఊహించలేదేమో..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేనాని పవన్కళ్యాణ్ పొత్తుల వ్యాఖ్యలు గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ శ్రేణుల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ని నమ్ముకొని పదేళ్లుగా పార్టీనే అంటిబెట్టుకుని ఉన్న ఆశావహులు మొదలు ద్వితీయ శ్రేణి నేతలు సైతం పవన్ తీరుతో రగిలిపోతున్నారు. ఇన్నేళ్లుగా వెంట ఉన్నది చంద్రబాబు పల్లకీ మోయడానికా అంటూ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. రాజకీయ భవిష్యత్పై తాము పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లేశారని మండిపడుతున్నారు. పవన్ పొత్తులు, సీఎంపై ఆశలు లేవు వంటి వ్యాఖ్యలపై ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని జనసేన నేతలు, కార్యకర్తలతోపాటు పవన్ సామాజికవర్గ యువత సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేయకుండా ఇంకా బలహీనంగానే ఉన్నామని చెప్పడం, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలతో కలిసే వెళదామనడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి అన్ని రకాలుగా నష్టపోయిన నేతలు ఇప్పుడు పొత్తులు తప్పవని పవన్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా కుదేలైపోయారు. పార్టీలో కొనసాగడమా లేక ప్రత్యామ్నాయం ఆలోచించాలా అని జనసేన ముఖ్య నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఉన్నది ఉభయ గోదావరి జిల్లాల్లోనే.. జనసేన పార్టీకి కొద్దోగొప్పో ఆదరణ ఉన్నది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతుంటారు. పవన్ పొత్తులు తట్టుకోలేమంటూ ఈ జిల్లాల్లోని జనసేన అభిమానులు గురు, శుక్రవారాల్లో పెడుతున్న పోస్టింగ్లు ఆ పార్టీలో కాకపుట్టిస్తున్నాయి. చంద్రబాబుని నమ్మొద్దని వాటిలో నేరుగా కోరుతున్నారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటుంటే ఏమో అనుకున్నాం. అన్నయ్యా, మమ్మల్ని నువ్వే ఆపేది అని అర్థమైంది’, ‘ఎవరినో సీఎంను చేయడానికి మేము సిద్ధంగా లేం. పది సంవత్సరాలుగా జనసేన జెండా మోస్తున్నాం. కొత్తగా మరో జెండా మోయడం మావల్ల కాదు’ అంటూ పలు రకాలుగా జనసేన కార్యకర్తలు, పవన్ సామాజికవర్గ నేతలు, యువత నిప్పులు చెరుగుతున్నారు. ఆరేళ్ల కిందట కాపులపై చంద్రబాబు జరిపిన దమనకాండ మరిచిపోమ్మంటే ఎలా అని ప్రశి్నస్తున్నారు. చేగొండి సహా అనేకమంది మండిపాటు.. గోదావరి జిల్లాల్లో ఆ సామాజికవర్గానికి చెందిన వృద్థతరం నేత చేగొండి హరిరామజోగయ్య సామాజిక మాధ్యమాలలో ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. ‘పవన్కళ్యాణ్ కాపులకు నాయకుడిగా ఉంటాడని ఆశించాను. కానీ ఆయన మరొక్కసారి వేరే వారి పల్లకీ మోస్తాననడం సమంజసం కాదు. ‘నా అనుభవం రీత్యా చెబుతున్నాను. మరొక్కసారి ఇతర పార్టీల జెండా, అజెండాలను మోసే స్థాయిలో కాపు సామాజికవర్గం లేదు. పవన్ సీఎం అవుతానంటేనే ఇంతకు ముందు సమర్థించాను’ అని జోగయ్య ప్రతిస్పందించారు. ఆయనతోపాటు కాపు సామాజికవర్గంలో పలువురు ఇదే విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని పవన్ సినీ అభిమానులు సైతం పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఈ దమనకాండ బాబు చేసిందే.. బీసీ రిజర్వేషన్ల కోసం కాపు సామాజికవర్గం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున జరిగింది. ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, కుటుంబ సభ్యుల పైన, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ సామాజికవర్గంపైన అధికారం ఉందనే ధీమాతో చంద్రబాబు కక్షకట్టి ఉక్కుపాదం మోపి ఉద్యమాన్ని అణగదొక్కేసిన విషయం, అక్రమంగా పెట్టిన కేసులు గుర్తు లేదా అని పవన్ను ప్రశి్నస్తున్నారు. చంద్రబాబు, పవన్ సామాజికవర్గాల మధ్య వైరం ఈనాటిది కాదు. కాపు ఉద్యమం సందర్భంగా కోనసీమ సహా పలు ప్రాంతాల్లో ఆ సామాజికవర్గీయులలో మహిళలపైన కూడా చంద్రబాబు అండ్ కో కేసులు పెట్టించి వేదించింది. అవన్నీ మరిచిపోయి ఇప్పుడు తెలుగుదేశం పారీ్టతో పొత్తు పెట్టుకుంటామంటే ఎందుకు ఆయన వెంట నిలబడాలని ఆ సామాజికవర్గ నేతలు నిలదీస్తున్నారు. ఇది కూడా చదవండి: జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఖాయం -
రాప్తాడులో టీడీపీ కాకిగోల.. సాక్ష్యం ఇదిగో
సాక్షి, అనంతపురం: చేసింది, చేసేది తప్పుడు పనులు.. పైగా కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారాలకు దిగడం టీడీపీ బాగా అలవాటు చేసుకుంది. వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ విజయవంతం కాగానే.. తెలుగుదేశం నేతలకు ఏం చేయాలో తోచడం లేదేమో!. అందుకే మళ్లీ ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడులో జాకీ కంపెనీ యూనిట్ భూకేటాయింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారానికి దిగారు. ‘జాకీ కంపెనీని మేం తెస్తే.. దాన్ని బెదిరించి వెళ్లగొట్టారు’.. ఇది ఇప్పుడు టీడీపీ నేతలు చేసుకుంటున్న ప్రచారం. మరి వాస్తవాలు బయటపెట్టి.. ప్రజల దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఆధారాలతో సహా ఆ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఇందుకోసం జాకీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి.. యెల్లో బ్యాచ్ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టారు. రాప్తాడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలోనే జాకీ కోసం 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్థలం కేటాయించాడు. రాప్తాడులో హైవే పక్కనే ఉండే ఈ స్థలం కనీసం విలువ రూ.150 కోట్లు. దీన్ని కేవలం రూ.3 కోట్లకే కట్టబెట్టడం వెనక అవినీతి జరిగింది. పరిటాల సునీతతో పాటు అప్పటి మంత్రి నారా లోకేష్ కూడా ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచిత్రమేమంటే.. 2015లో జాకీ కంపెనీకి స్థలం కేటాయిస్తే.. అక్కడ ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. అంటే.. ఇక ఇటుక కూడా కనిపించని స్థలం నుంచి జాకీని వెళ్లగొట్టారంటూ టిడిపి ప్రచారం చేయడం దుర్మార్గం కాక మరేముంది!. మరో విచిత్రం ఏంటంటే.. రాప్తాడు టీడీపీ కట్టిన స్థలం కూడా పండమేటి వెంకటరమణ స్వామి ఆలయ భూమి కబ్జా చేసిందని తేలడం!. -
కోమటిరెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం ఆయన జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని ఇటుకలపాడులో పర్యటించారు. అయితే.. ఈ పర్యటనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని హాజరైన కోమటిరెడ్డి ప్రసంగించారు. రోడ్లు బాగోలేవని, ఇటుకలపాడుకు రావడానికి మూడు గంటలకు పైగా సమయం పట్టిందని.. సీఎం కేసీఆర్పై ఆయన విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ వ్యాఖ్యలు అక్కడే ఉన్న కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి. బొడ్రాయి ప్రతిష్టాపనకు వచ్చి రాజకీయం మాట్లాడుతున్నారంటూ అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనపై కుర్చీలు, కర్రలు విసిరి దాడి చేసేందుకు యత్నించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అయితే దాడి నుంచి ఆయన తప్పించున్నారు. ఈ క్రమంలో.. పోటీగా రంగంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యకర్తలతో తోపులాటకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు. -
TN: కార్యకర్తలపైకి రాయి విసిరిన మంత్రి
వైరల్: తమిళనాడు పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి ఎస్ఎం నాజర్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆయన రాయి విసిరిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తిరువల్లూరు జిల్లాలో బుధవారం జరగబోయే ఓ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరు కావాల్సి ఉంది. ఆ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించడానికి మంత్రి నాజర్ వెళ్లారు. అయితే.. ఆ సమయంలో ఆయనకు కూర్చోవడానికి కుర్చీ లేదట. వెంటనే ఆయన కార్యకర్తలపై కుర్చీ తేవాలని కేకలు వేశారు. అయితే.. అది తేవడం కాస్త ఆలస్యం కావడంతో సహనం కోల్పోయిన ఆయన అలా రాయి విసిరారు. మంత్రి నాజర్ రాయి విసిరి.. కార్యకర్తలను దూషిస్తున్న టైంలో వెనుకాల ఉన్న వాళ్లంతా నవ్వడం ఆ వీడియోలో చూడొచ్చు. #WATCH | Tamil Nadu Minister SM Nasar throws a stone at party workers in Tiruvallur for delaying in bringing chairs for him to sit pic.twitter.com/Q3f52Zjp7F — ANI (@ANI) January 24, 2023 ఇదిలా ఉంటే.. ఈ డీఎంకే మంత్రి స్వతహాగానే ఇలా తరచూ తన కోపాన్ని ప్రదర్శిస్తుంటారట. కార్యకర్తపై రాయి విసిరిన ఆయన తీరుపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బహుశా దేశ చరిత్రలో ఇలా ఏ మంత్రి కూడా జనాల మీదకు రాళ్లు విసిరి ఉండకపోవచ్చు అంటూ ట్వీట్ చేశారాయన. డీఎంకేవాళ్లు ఎదుటివాళ్లను బానిసలుగా చూస్తారనడానికి ఇదే నిదర్శనం కాబోలు అంటూ ట్వీట్ చేశారాయన. ఇంకోవైపు ఈ కోపధారి మంత్రిపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మంత్రిగారి కంటే రౌడీలే నయం అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. In India’s history, has anybody seen a govt minister throwing stones at people? Display of this by a @arivalayam party DMK Govt Minister, Thiru @Avadi_Nasar. Throwing stones at people in frustration No decency, No decorum & treating people like slaves! That's DMK for you. pic.twitter.com/D2iAKV4YZ4 — K.Annamalai (@annamalai_k) January 24, 2023 -
Tamil Nadu: అంబేద్కర్ పేరు పలకని గవర్నర్.. డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అసెంబ్లీ ప్రసంగ పాఠాన్ని గవర్నర్ మార్చి ప్రసంగించారు. ప్రసంగంలో బీఆర్ అంబేద్కర్, పెరియార్, సీఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి ప్రముఖుల పేర్లను దాటవేస్తూ కొత్త వ్యాఖ్యలను జోడించారు. ప్రసంగ పాఠంలో మార్పులను గుర్తించిన సీఎం స్టాలిన్.. దీనిపై అభ్యంతరం తెలియజేయగానే గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ వివాదం ఆరోజు నుంచి రగులుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న గవర్నర్ ప్రవర్తనపై తమిళనాడుతో సహా దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్త వాజీ కృష్ణమూర్తి గవర్నర్ ఆర్ఎన్ రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్ అంబేద్కర్ పేరు చెప్పలేకపోతే అతను కశ్మీర్ వెళ్లాలని, అక్కడికి ఉగ్రవాదులను పంపుతామని, వారు ఆయన్ను కాల్చి చంపుతారని బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ‘భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన పితామహుడు అంబేద్కర్ పేరును ఈ వ్యక్తి ఉచ్చరించడానికి నిరాకరిస్తే, ఆయనను చెప్పుతో కొట్టే హక్కు నాకు ఉందా లేదా?. అసలు గవర్నర్ రాజ్యాంగం పేరుతో ప్రమాణం చేయలేదా? దాన్ని రాసింది అంబేద్కర్ కాదా.. రాజ్యాంగం మీదనే ప్రమణం చేస్తే ప్రసంగంలోని అంబేద్కర్ పేరును ఎందుకు చదవలేదు. అంబేద్కర్ పేరు చెప్పకపోతే కాశ్మీర్కు వెళ్లిపో.. మేమే ఓ ఉగ్రవాదిని పంపిస్తాం.. వారు మిమ్మల్ని తుపాకీతో కాల్చిచంపగలరు’ అని డీఎంకే కార్యకర్త శివాజీ కృష్ణమూర్తి అన్నారు. చదవండి: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు.. If he (TN Gov RN Ravi) refuses to utter the name of Ambedkar in his Assembly speech, don't I have the right to assault him? If you (Gov) don't read out the speech given by Govt, go to Kashmir&we'll send terrorists so that they'll gun you down: DMK's Shivaji Krishnamoorthy (12.01) pic.twitter.com/OvcuauylVw — ANI (@ANI) January 13, 2023 మరోవైపు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గవర్నర్పై బెదిరింపు వ్యాఖ్యలపై రాజ్ భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎంకేకు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని గవర్నర్ డిప్యూటీ సెక్రటరీ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్పై శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతోందని చెన్నై సీపీకి రాసిన లేఖలో రాజ్ భవన్ పేర్కొంది. ఈ వీడియోలో శివాజీ కృష్ణమూర్తి గవర్నర్పై దుర్భాషలాడటంతో పాటు, పరువు నష్టం కలిగించే విధంగా భయపెట్టే పదజాలాన్ని ఉపయోగించారని లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా శివాజీ కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ ఫిర్యాదును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ విభాగానికి పంపారు. -
వైరల్ వీడియో: ఆప్ ఎమ్మెల్యేను దారుణంగా కొట్టిన సొంత పార్టీ కార్యకర్తలు
-
Video: ఆప్ ఎమ్మెల్యేపై సొంత పార్టీ కార్యకర్తల దాడి.. ఎందుకంటే!
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. పోటీలో మహిళల అభ్యర్థులే అధికంగా ఉన్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రత్యర్ధులపై విమర్శలు ఎక్కుపెడుతూ ఎవరికి వారే ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాగా మున్సిపోల్స్ ఎన్నికల వేళ ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్పై సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేయడం కలకలం రేపుతోంది. మటియాలా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ను జనాలు తీవ్రంగా కొట్టారు. ఎమ్మెల్యే యాదవ్ సోమవారం శ్యామ్ విహార్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ విషయంలో వాగ్వాదం చెలరేగడంతో యాదవ్ పట్ల కొంతమంది ఆప్ కార్యకర్తలు ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. చదవండి: తిహార్ జైలులో ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్.. అతను ఫిజియో థెరపిస్ట్ కాదు.. రేపిస్ట్.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఇందులో ఆప్ కార్యకర్తలు గులాబ్ సింగ్ యాదవ్ను కాలర్తో పట్టుకోవడం, చేతులతో దాడి చేయడం కనిపిస్తుంది. చివరకు తన సొంత పార్టీ కార్యకర్తల ఆగ్రహం నుంచి తనను తాను రక్షించుకోవడానికి పరుగులు తీయడం స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేపై దాడి ఘటనపై ఇప్పటి వరకు ఆప్ స్పందించలేదు. అయితే ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నందుకు సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యేలను కొట్టినట్లు బీజేపీ ప్రచారం చేస్తోంది. ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తన అవినీతి ఎమ్మెల్యేలందరికీ ఇక్కొక్కరిగా ఇదే జరుగుతుందని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే గులాబ్ సింగ్ కొట్టిపారేశారు. టికెట్లు అమ్ముకున్నారంటూ బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు. తనపై దాడి చేసింది బీజేపీ కార్యకర్తలేనని ఆరోపించారు. తాను చావ్లా పోలీస్ స్టేషన్లో ఉండగా.. ఆ వార్డుకు చెందిన బీజేపీ కార్పొరేటర్, వారి అభ్యర్థిని పీఎస్లో చూసినట్లు తెలిపారు. भाजपा उम्मीदवार थाने के अंदर आरोपियों की पैरवी कर रहा है भाजपा बुरी तरह नगर निगम चुनाव हार रहीं है जितनी मर्जी साजिश कर ले। https://t.co/q2minYuvHq pic.twitter.com/rPY2EDxikC — Gulab Singh yadav (@GulabMatiala) November 21, 2022 -
టిక్కెట్ ఇవ్వలేదని.. టవర్ ఎక్కిన ఆప్ నేత..
-
జగన్ సంకల్పం... జన సంక్షేమం
సాక్షి, పుట్టపర్తి: ప్రజా సంకల్పయాత్రలో అన్ని వర్గాలను పలకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ‘నవరత్నాలతో’ రాష్ట్రంలో సంక్షేమ బాట పరిచారని ఎమ్మెల్యేలు తెలిపారు. ‘ప్రజాసంకల్ప యాత్ర’ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు జిల్లా అంతటా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. అన్నదానాలు, పేదలకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేసి నాయకులు సేవాభావం చాటుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడారు. పెనుకొండలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించిందని ఎమ్మెల్యే శంకరనారాయణ తెలిపారు. పేదల కన్నీళ్లు తుడిచి సీఎం జగన్ వారి గుండెల్లో నిలిచారన్నారు. పెనుకొండలో నాయకులతో కలిసి ఆయన కేట్ చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. పెనుకొండలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో తనదైన మార్కు చూపించారని కొనియాడారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ప్రజా సంక్షేమానికి నాంది పలికిన మహా ఘట్టం ‘ప్రజా సంకల్ప యాత్ర’ అని అభివర్ణించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు పథకాలు వర్తింపజేసి.. జనం మెచ్చిన నేతగా జగన్ నిలిచిపోయారన్నారు. సంక్షేమ పాలన ద్వారా జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అమడగూరు మండలం గొల్లపల్లిలో భారీ కేక్ను ఎమ్మెల్యే కట్ చేసి నాయకులు, పిల్లలకు పంచిపెట్టారు. మడకశిరలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి మడకశిర పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే తిప్పేస్వామి వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తితోనే సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు ఐదేళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళి అరి్పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. హిందూపురంలో జయహో జగన్ నినాదం మార్మోగింది. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులరి్పంచిన అనంతరం భారీ కేక్ను ప్రజాప్రతినిధులు, నాయకులు కట్ చేశారు. పేదలకు అన్నదానం చేసి సేవాభావం చాటుకున్నారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ధర్మవరం పీఆర్టీ సర్కిల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. (చదవండి: ఫ్యామిలీ డాక్టర్’: వైద్యం మరింత చేరువ) -
ఏపీ: పేదవాడి కోసం పని చేస్తున్న ప్రభుత్వం ఇది
సాక్షి, తాడేపల్లి: విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో ఏపీ ప్రజలు లేరని.. సీఎం జగన్పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఎవరూ చెరిపేయలేరని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిలో మండపేట(డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా) నియోజకవర్గ కార్యకర్తలు, ముఖ్యనేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఎమ్మెల్సీ తోట మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వానికి.. ఎన్నికలు వచ్చినప్పుడే హామీలు గుర్తుకు వచ్చేవి. తప్పుడు ప్రచారాలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. పేదవాడి కోసం పని చేస్తున్న ప్రభుత్వం ఇది. దీనికి మళ్లీ గెలిపించుకుంటాం. మళ్లీ వైఎస్ జగనే సీఎం అవుతారు. ఆయన మాకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసమే శాయశక్తులా కృషి చేస్తాం. కాపు నాయకులకు సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. సీఎం జగన్ మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. 2024లో మళ్లీ వైఎస్సార్సీపీదే విజయమని కుండబద్దలు కొట్టారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఇదీ చదవండి: ఏ లక్ష్యం లేకుండా దిగజారిపోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్ -
92 శాతం ప్రజలకు పథకాలు అందుతున్నాయ్: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: మనకు ఓటు వేయకపోయినా.. అర్హులకు మంచి చేశాం. అలాంటప్పుడు వాళ్లు మనల్ని ఎందుకు ఆదరించారు?. కచ్చితంగా ఆదరించి తీరతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండపేట కార్యకర్తలతో తాడేపల్లిలో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేట ప్రజలకు 946 కోట్ల రూపాయలను డీబిటీ(డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్జాక్షన్) ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చాం. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా పనిచేశాం. గ్రామాల్లో వచ్చిన మార్పును మనం జనంలోకి తీసుకెళ్లాలి. ఒక మిషన్ ద్వారా దీన్ని జనంలోకి తీసుకెళ్లాలి. మండపేట నియోజకవర్గంలో 96,469 ఇళ్లకు గాను 92 శాతం ఇళ్లకు పథకాలు చేరాయి. ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే 92 శాతం మంచి పనులు చేయగలిగాము. ఆ మంచిని వివరిస్తూ గడపగడపకు వెళ్లేలా ప్లాన్ చేశాం. అలా వెళ్ళినప్పుడు అక్క చెల్లెమ్మలు మనకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటప్పుడు వచ్చే ఎన్నికలలో 175కు 175 సీట్లు ఎందుకు రావు?. ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. అర్హత ఉంటే చాలు.. అందరికీ మేలు చేశాం. మనకు ఓటు వేయకపోయినా మంచి చేస్తే వారి మనసు కరుగుతుందని మేలు చేశాం. కలిసికట్టుగా అందరూ పనిచేసి ఎన్నికలలో పార్టీని గెలిపించాలి’ అని సీఎం జగన్ కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. మిమ్నల్ని కలవడానికి ఇక్కడికి రమ్మని చెప్పడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి కలిసి చాలారోజులైంది. కలిసినట్టు ఉంటుందన్నది ప్రధాన కారణమైతే... రెండోది మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్దం కావాల్సి ఉంది. 18 నెలలు అంటే చాలా దూరం ఉంది అనుకోవచ్చు. దానికి సంబందించి ఇప్పుడే ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలు పెట్టాలా ? అని అనుకోవచ్చు. 18 నెలలు ఉన్నప్పటికీ ఆ దిశగా మనం అడుగులు ఎందుకు వేయాలన్నది చెప్పడానికే మిమ్నల్ని రమ్మన్నాం. ► ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరకి వెళ్లడం, ప్రజలను ఆశీర్వదించమని కోరడం సర్వసహజంగా జరుగుతాయి. కానీ మొట్టమొదటి సారిగా గత ప్రభుత్వాలలో ఎప్పుడూ, ఎక్కడా చూడనట్టుగా ఈ రోజు రాష్ట్రంలో మార్పులు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్ద ప్రతి 2వేల జనాభాకు 12 మంది అక్కడే కూర్చుని పనిచేసేటట్టుగా ఏర్పాటు చేశాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్తో అనుసంధానం చేసి, ప్రతి గడప, ప్రతి కుటుంబం కూడా అర్హత ఉండి రాని పరిస్థితులు ఉండకూడదని తాపత్రయపడుతున్నాం. పారదర్శకతతో అందరికీ అన్ని పథకాలు రావాలని ఎప్పుడూ జరగని విధంగా సాచ్యురేషన్ విధానంలో అడుగులు వేశాం. ► ఒక్క మండపేట నియోజకవర్గంలోనే రూ.946 కోట్లు ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో కేవలం బటన్ నొక్కి ప్రతి ఇంటికి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. వైయస్సార్ పెన్షన్ కానుక, రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా మొదలుకుని క్రాప్ ఇన్సూరెన్స్, చేయూత, విద్యాదీవెన వరకు రకరకాల పథకాలు డీబీటీ ద్వారా ఆధార్ కార్డు సహా ఎవరికి ఎంతిచ్చామో, ఎవరికి ఏ రకంగా మేలు జరిగిందన్నది ఆధారాలతో సహా పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హుడైన ఏ ఒక్కరు మిస్ కాకుండా దేవుడి దయతో అడుగులు వేయగలిగాం. ఇటువంటి మార్పు గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి మార్పు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇంత మార్పు జరుగుతున్నప్పుడు దాన్ని మనం ప్రజలదగ్గరకు తీసుకుని వెళ్లి...వారికి ఇవన్నీ గుర్తు చేసి.. ప్రజల ఆశీస్సులు మనం తీసుకుని అడుగులు ఇంకా ఎఫెక్టివ్గా వేసేదానికి మిమ్నల్ని భాగస్వామ్యులను చేస్తున్నాం. ► మొట్టమొదటిసారిగా గడప గడప అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం చేపట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. గడప గడప కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే.. మన ఎమ్మెల్యే కానీ, మన ఎమ్మెల్యే అభ్యర్ధి కానీ... గ్రామానికి వెళ్లినప్పుడు ఆ గ్రామంలో సచివాలయ వ్యవస్ధ, మండల స్ధాయి అధికారులు, గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ మమేకమై ప్రతి గడపనూ తట్టి, ప్రతి గడపలోనూ జరిగిన మంచిని వివరిస్తూ వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటూ మరోవైపు పొరపాటున ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే... అటువంటి వారు కూడా మిగిలిపోకూడదనే తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు డబ్బులు కూడా కేటాయించాం. ఆ సచివాలయానికి వెళ్లినప్పుడు ఆ సచివాలయ పరిధిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి. సచివాలయానికి రూ.20 లక్షలుఅంటే నియోజకవర్గానికి దాదాపు రూ.20 కోట్లు కేటాయించినట్లవుతుంది. ఆ సచివాలయంలో రెండు రోజుల పాటు ఉండాలి. ఒక్కోరోజు కనీసం 6 గంటలు ఆ సచివాలయంలో ఉండాలి. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి. ► మీ నియోజకవర్గంలో 96,469 ఇళ్లు ఉన్నాయి. ఇందులో మన పథకాలు చేరిన ఇళ్లు 91.96 శాతం. అంటే సుమారు 92 శాతం ఇళ్లలో ఆ అక్కచెల్లెమ్మల పేర్లతో ఏ పథకం చేరింది, ఎన్ని పథకాలు చేరాయి అని ఏకంగా ఆథార్ కార్డు డీటైల్స్తో సహా చెప్పగలికే పరిస్థితుల్లో సహాయం చేయగలిగాం. ► గ్రామమే ఒక యూనిట్గా తీసుకుంటే ఆ గ్రామంలో 92 శాతం ఇళ్లకు.. ప్రతి ఇంట్లో మనం మంచి చేశామని సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ జరిగిన మంచిని వివరిస్తూ మనం గడప, గడపకూ కార్యక్రమం చేస్తున్నప్పుడు అవునన్నా పథకాలు అందాయి అని చల్లని ఆశీస్సులు ఆ అక్కచెల్లెమ్మలు మనమీద చూపించినప్పుడు ఆగ్రామంలో మనం గెలుస్తాం. ► గ్రామం గెల్చినప్పుడు నియోజకవర్గం గెలుస్తాం. గ్రామం, నియోజకవర్గం గెల్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175 కి 175 ఎందుకు రావు ?. ఒక్క మండపేట నియోజకవర్గంలో మండపేట మున్సిపాల్టీతో సహా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు లెక్క తీసుకుంటే.. మున్సిపాల్టీలో 30 కి 23 వైయస్సార్సీపీ, జడ్పీటీసీలు మూడింటికి మూడు, ఎంపీపీలు మూడింటికి మూడు ఏ లెక్కలు తీసుకున్నా గతంలో రానివి ఇప్పుడు వచ్చాయి. కుప్పం నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీ అన్నీ క్లీన్స్వీప్ చేశాం. ప్రజల దీవెనలు మనవైపు కనిపిస్తున్నాయి. కారణం పాలన పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడా లంచాలు అవసరం లేదు. వివక్ష చూపించడం లేదు. మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉండి రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే కచ్చితంగా వచ్చేటట్టు చేస్తాం. మనం చేసిన మంచిని చూసి మార్పు వస్తుంది. ► సోషల్ ఆడిట్లో జాబితాలు ప్రదర్శిస్తున్నాం. ఇవన్నీ జరుగుతుండగానే మారుతున్న గ్రామాలు కనిపిస్తున్నాయి. గ్రామంలోకి అడుగుపెడుతూనే సచివాలయం కనిపిస్తుంది. వాలంటీర్ వ్యవస్ధ కనిపిస్తుంది. ఆర్బీకేల ద్వారా రైతన్నను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతుంది. ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, విలేజ్ క్లీనిక్కులు కనిపస్తాయి. శరవేగంగా డిజిటల్ లైబ్రరీలు కట్టే కార్యక్రమం కూడా మొదలుపెడుతున్నాం. ఇవన్నీ గతంలో లేనివి. ఇవన్నీ గ్రామాల రూపురేఖలు మారుస్తున్నాయి. గతంలో పిల్లలు చదువుకునే వయస్సుకు వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం గ్రామాలు వదిలిపెట్టే పరిస్థితి. ఆ పరిస్థితి పోయి ఇంగ్లిషు మీడియం బడులు మన గ్రామాల్లో వస్తున్నాయి. వైద్యం అన్నది విలేజ్ క్లీనిక్కుల ద్వారా మన గ్రామంలోనే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంతా ఒకేచోట ఉంటూ.. 24 గంటలపాటు అందుబాటులో ఉంటారు. 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు చేసేటట్టుగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఊర్లోనే వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఇంత మార్పు గతంలో జరగలేదు. ► డీసెంట్రలైజేషన్ ఈ స్ధాయిలోకి వెళ్లి మంచి చేయాలన్న ఆరాటం గతంలో లేదు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న నేపధ్యంలో కచ్చితంగా ఈ నియోజకవర్గంలో కూడా మార్పు రావాలి. వై నాట్ 175. కచ్చితంగా జరుగుతుంది. మీరు నేను ఒక్కటైనప్పుడు ఇది జరుగుతుంది. ఇది నా ఒక్కడి వలన జరిగేది కాదు. నేను చేయాల్సింది నేను చేయాలి. మీరు చేయాల్సింది మీరు చేయాలి. ఇద్దరం కలిసికట్టుగా చేయాలి. నేను బటన్ సరిగ్గా నొక్కాలి. అక్కడ పొరపాట్లు జరగకూడదు. నా ధర్మం నేను చేయాలి. మీరు అంతా కలిసి ప్రతి గ్రామంలో మనం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికి తీసుకునిపోవడమే కాకుండా, వారికి అర్ధమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ల చల్లని ఆశీస్సులు తీసుకోవాలి. ఆ ఆశీస్సులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇద్దరం కలిస్తే సాధ్యం కాకుండా ఉండే ప్రసక్తే లేదు. ఇది చేయడం కోసం మీ అందరి మద్దతు కూడా ఈ దిశగా కూడగట్టేందుకు ఈ రోజు మిమ్నల్ని ఇక్కడికి ఆహ్వానించాం అని సీఎం జగన్ ప్రసంగించారు. టార్గెట్ 175లో భాగంగా.. కొన్ని నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలతో బుధవారం సీఎం జగన్ సమావేశం అయ్యారు. సీఎం వైఎస్ జగన్తో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజ్యసభసభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. -
తాడేపల్లి: టెక్కలి వైఎస్సార్సీపీ ప్రతినిధులతో సీఎం జగన్ (ఫొటోలు)
-
మంచి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: అర్హులైన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ.. ప్రజా ప్రభుత్వంగా పేరు దక్కించుకున్నాం. అలాంటప్పుడు లక్ష్య సాధన పెద్ద కష్టమేమీ కాదని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో సీఎం జగన్ బుధవారం సాయంత్రం తాడేపల్లిలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మిమ్మల్ని కలవడం ఒక కారణం అయితే, ఇక రెండోది మరో పద్దెనిమిది నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. 18 నెలలంటే చాలా కాలం ఉందికా? ఇవ్వాళ్టి నుంచే ఆలోచన చేయాలా? అనుకోవచ్చు. ఆ అడుగులు ఇవ్వాళ్టి నుంచి కరెక్టుగా పడితేనే.. మనం క్లీన్స్వీప్ చేయగలుగుతాం. చాలా నియోజకవర్గాలకు సంబంధించిన ఇలాంటి సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా టెక్కలికి సంబంధించి రివ్యూ చేస్తున్నాం. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది. మీరు అందరూ కూడా అందులో పాల్గొంటున్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ పరిపాలన జరుగుతోంది. గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగుతోంది. మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన ఉంది. ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల రూ.1026 కోట్ల రూపాయలు గడపగడపకూ చేర్చగలిగాం. ఎవరెవరికి ఇచ్చామో.. ఆధార్ కార్డు వివరాలతో సహా, అక్కచెల్లెమ్మల పేర్లతో సహా చెప్పగలిగేలా ప్రతి ఇంటికీ చేర్చగలిగాం. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, ఎవ్వరూ మిస్ కాకుండా, సంతృప్తస్థాయిలో, ప్రతి 50 ఇళ్లకుఒక వాలంటీర్ ద్వారా, ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ద్వారా వీటిని చేర్చాం. అర్హత ఉన్నవారికి మిస్ కాకూడదనే తపన, తాపత్రయంతో అడుగులు వేశాం. గతానికి భిన్నంగా ప్రతి కుటుంబానికి మేలు చేశాం. ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు 175 కి 175 నియోజకవర్గాలు ఎందుకు మనం కొట్టలేం?: తప్పకుండా గెలవగలుగుతాం.. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకోగలిగితే.. 87శాతం ఇళ్లకు మంచి చేశాం. మంచి జరిగిన ఇళ్లలో ఉన్న వారు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఎందుకు మనం 175 కి 175 సాధించలేం. మన గ్రామంలో ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, గ్రామ సచివాలయాలు, విత్తనం నుంచి పంటకొనుగోలు దాకా ఆదుకునే ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఉగాది నుంచి పూర్తిస్థాయిలో అమలవుతోంది. యాభై ఇళ్లకు వాలంటీర్లు కనిపిస్తున్నారు. ఇలా గ్రామ రూపురేఖలన్నీ మార్చాం. ఇలాంటి మార్పులు కనిపిస్తున్నప్పుడు ప్రతి కార్యకర్తా, నాయకుడూ కూడా 175 కి 175 స్థానాలు ఎందుకు సాధించలేమని మనం గుండెలమీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలి. కలిసికట్టుగా ఉంటేనే ఇది సాధ్యం! జగన్ చేసే పని జగన్ చేయాలి. అదే మాదిరిగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలుగా, నాయకులుగా మనం చేసే పని మనం చేయాలి. ప్రతి గడపకూ వెళ్లాలి.. మనంచేసిన మంచిని వారికి గుర్తుచేయాలి, వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కేవలం ఏ ఒక్కరి వల్లనే ఇది జరగదు. నేను చేయాల్సింది నేను చేయాలి.. మీరు చేయాల్సింది మీరు చేయాలి. అందరూ కలిసికట్టుగా అడుగులేస్తేనే సాధ్యం అవుతుంది. టెక్కలి నియోజకవర్గంలో సర్పంచి ఎన్నికల్లో 136కు 119 పంచాయతీలు, ఎంపీటీసీలు 78కి 74, ఎంపీపీలు 4కు 4, జడ్పీటీసీలు 4కు 4 గెలిచాం. ఒక్క టెక్కలిలోనే కాదు.. కుప్పం నియోజకవర్గంలో కూడా ఇలాగా మంచి విజయాలు నమోదు చేశాం. మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 175కి 175 ఎందుకు మనం తెచ్చుకోలేమన్న ప్రశ్నను ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. మనకు ఎన్ని గొడవలు ఉన్నాసరే.. పక్కనపెడదాం. బిగ్గర్ పిక్చర్ గుర్తుకు తెచ్చుకుందాం. రేపు ఎన్నికల్లో మనం గెలిస్తే.. వచ్చే ౩౦ ఏళ్లూ మనం ఉంటాం: ఇవాళ మనం చేసిన కార్యక్రమాలన్నీకూడా వచ్చే కాలంలో మంచి ఫలితాలు వస్తాయి అని కార్యకర్తలు, కీలక నేతలను ఉద్దేశించి సీఎం జగన్ ఉద్భోధించారు. పార్టీ పటిష్టతలను కొనసాగించే క్రమంలో.. నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో ఆయన వరుసగా భేటీలు జరుపుతున్న విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మునుగోడులో నేతల సిత్రాలు..
-
కారు పార్టీలో కోల్డ్వార్.. టీఆర్ఎస్లో ఎవరి దారి వారిదే!
సాక్షి, రంగారెడ్డి: అధికార పార్టీలో నేతల మధ్య సయోధ్య కరువవుతోంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం, మీర్పేట, బడంగ్పేట్, తుక్కుగూడ మున్సిపాలిటీల్లో అధికార పార్టీ పాలక మండలి సభ్యులు రెండుగా చీలిపోయి పరస్పర ఫిర్యాదులు చేసుకుంటుండగా తాజాగా అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. ఇప్పటి వరకు మిన్నకుండిన ద్వితీయశ్రేణి నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే దారులు సిద్ధం చేసుకుంటున్నారు. అధిష్టానం వద్ద తమకే గుర్తింపు ఉందని, వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకు వస్తుందంటే తమకేనంటూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం విశేషం. ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో కేడర్ అయోమయానికి గురవుతోంది. చేవెళ్లలో కాలె వర్సెస్ రత్నం చేవెళ్ల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని, అధిష్టానం ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఎవరికి వారు సొంతంగా కేడర్ను తయారు చేసుకుని అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ చర్చనీయాంశమవుతున్నారు. మహేశ్వరంలో తీగల.. పటోళ్ల మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆయన కోడలు జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి సబిత, తీగల ఇద్దరూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఇద్దరు నేతల మధ్య అంతర్గత విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఎల్బీనగర్లో దేవిరెడ్డి.. ముద్దగోని ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి అధికారపార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ముద్దగోని రామ్మోహన్గౌడ్ మళ్లీ తన అస్థిత్వాన్ని నిలుపుకొనేందుకు యత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గెలుపొంది ఆ తర్వాత అధికారపారీ్టలో చేరిన ఎమ్మెల్యే దేవిరెడ్డి్కి దీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తానూ ఎన్నికల బరిలో ఉన్నాననే సంకేతాలు అటు కేడర్, ఇటు అధిష్టానానికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ‘పట్నం’లో మంచిరెడ్డి వర్సెస్ క్యామ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి గత ఎన్నికల్లో స్వల్ప మెజార్జీతో గెలుపొందారు. మనీలాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణ లపై తాజాగా ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. యాచారం ఫార్మాసిటీ, వెలిమనేడు ఇండ్రస్టియల్ పార్కు, ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాలకు భూసేకరణ విషయంలో ఆయనపై కొంత వ్యతిరేకత ప్రారంభమైంది. గత ఎన్నికలకు ముందే కాంగ్రెస్ను వీడి అధికార పారీ్టలో చేరిన క్యామ మల్లేశ్ దీన్ని అవకాశంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన సమయంలోనే సీఎం కేసీఆర్ తనకు హామీ ఇచ్చారని.. వచ్చే ఎన్నికల్లో తనకే బి ఫాం అంటూ నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. కల్వకుర్తిలో జైపాల్.. కసిరెడ్డి కల్వకుర్తిలో పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకరు నిర్వహించే కార్యక్రమంలో మరొకరు పాల్గొనని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మళ్లీ తనకే టికెట్ వస్తుందని, పోటీ చేసేది తానేనని ప్రచారం చేసుకుంటున్నారు. నిత్యం ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయతి్నస్తున్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నిక విషయంలో ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా వెల్దండ ఎంపీపీ, మరో ఆరుగురు సర్పంచ్లు ఇటీవల తిరుగుబాటుబావుటా ఎగురవేయడం గమనార్హం. మరోవైపు తలకొండపల్లి జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్ సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. టికెట్ తనకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అసెంబ్లీపై చేవెళ్ల ఎంపీ గురి చేవెళ్ల ఎంపీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ లేకున్నా తనకున్న ఆర్థిక వనరులు, అధిష్టానం ఆశీస్సులతో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్లలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. -
కాంగ్రెస్కు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా 5వేల మంది కార్యకర్తల రాజీనామా!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్తో 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసింది. ఆయన నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. హస్తం పార్టీకి దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదురయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడారు. తాజాగా గులాం నబీ ఆజాద్కు మద్దతుగా దేశవ్యాప్తంగా సుమారు 5000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. జమ్ముకశ్మీర్ సహా పలు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్యకర్తలు గురువారమే తమ రాజీనామాలను అందించనున్నట్లు తెలిసింది. ఆజాద్కు మద్దతు తెలుపుతున్నట్లు అధిష్టానానికి తెలియజేయటమే దీని ముఖ్య ఉద్దేశంగా స్పష్టమవుతోంది. కొద్ది నెలల్లోనే గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న వేళ కాంగ్రెస్కు అతిపెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. మరోవైపు.. జమ్ముకశ్మీర్ ఎన్నికలు సైతం 2023లో జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల రాజీనామా ఒక్కటే కాదు.. ఇటీవల సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా, ఆజాద్ల భేటీ హరియాణా కాంగ్రెస్లో కలకలం సృష్టిస్తోంది. గురువారం ఆజాద్తో భేటీ అయిన వారిలో ఆనంద్ శర్మ, భూపింద్ సింగ్ హుడా, పృథ్విరాజ్ చావన్లు ఉన్నారు. దీంతో గాంధీ కుటుంబానికి, పార్టీకి విదేయతపై ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి: కశ్మీర్ లోయలో కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ.. ఆజాద్ వెంటే కార్యకర్తలంతా! -
మంచి మార్పుతో చరిత్ర లిఖిద్దాం: కార్యకర్తలతో సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల టైంలో చేసిన వాగ్దానాల్లో 95 శాతం పూర్తి చేశామని, ఆ ధైర్యంతోనే ఆశీర్వదించమని రాష్ట్రంలోని గడప గడపకూ వెళ్లగలుగుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ముఖాముఖిలో భాగంగా.. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో ఆయన భేటీ నిర్వహించారు. ‘‘మనం తెచ్చిన మార్పులు అన్నీకూడా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇవన్నీ చూశాక మరో ముప్ఫై ఏళ్లపాటు మన ప్రభుత్వమే ఉండాలని ప్రజలు ఆశీర్వదిస్తారు. మీ నియోజకవర్గంలో డీబీటీ కింద రూ.775 కోట్లు ఇచ్చాం. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇలాగే మంచి చేశాం. ఈసారి మన లక్ష్యం 151 కాదు.. 175కి 175 అని ఉద్ఘాటించారు సీఎం జగన్. గతంలో ఉన్న ప్రభుత్వ పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకూ ఉన్న తేడాను గమనించి.. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేసిన ఈ ప్రభుత్వం చేసిన మంచిని మరింత విపులంగా చెప్పాలని ఆయన కార్యకర్తలతో చెప్పారు. మనం చేసిన మంచిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలి. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకన్నా.. ఈసారి మరింత పెరగాలి. మేనిఫెస్టో ద్వారా చేసిన వాగ్దానాల్లో దాదాపు వాగ్దానాలను నిలబెట్టుకున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ గడపగడపకూ కార్యక్రమంలో ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ వాస్తవాలు అయితేనే మళ్లీ మా ప్రభుత్వాన్ని, జగనన్నను ఆశీర్వదించండి అని ధైర్యంగా అడగగలుగుతున్నాం. మిగిలింది మీ కృషినే.. రాజాం నియోజకవర్గంలో 12,403 ఇంటి స్థలాలు ఇచ్చాం. దాదాపు రూ.240 కోట్లు విలువైన ఇంటి పట్టాలు ఇచ్చాం. వీటిలో 9,509 ఇళ్లను ఇప్పుడు కడుతున్నారు. వాటి విలువ కనీసంగా మరో రూ.171 కోట్లు ఉంటుంది. గతంలో.. నాన్నగారి హయాంలో ప్రతి ఎమ్మెల్యే, కార్యకర్త ధైర్యంగా గ్రామాలకు వెళ్లేవాళ్లు. ఇల్లు, రేషన్కార్డు, పెన్షన్.. ఇలా అన్నీ సమకూర్చారు. ఈరోజు అదే నిజాయితీతో, అదే అంకిత భావంతో మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ ధైర్యంగా వెళ్లగలుగుతున్నాం. చేయాల్సిన మంచి అంతా చేశాం. ఇప్పుడు మనం చేయాల్సింది.. చేసిన మంచిని ఓట్ల రూపంలో మార్చుకోవడం. దీనికి కార్యకర్తలుగా మీ కృషి ఎంతో అవసరం. పార్టీపరంగా జిల్లా, మండలస్థాయి, గ్రామ స్థాయి వరకూ కమిటీలు ఏర్పాటు కావాలి. దాదాపు 24 అనుబంధ విభాగాలు పార్టీకి ఉన్నాయి. ఈ విభాగాలన్నింటికీ కమిటీలు ఏర్పాటు కావాలి. ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలి అని సీఎం జగన్.. కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు. అన్నీ అందుతున్నాయ్ బూత్ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. వీలైనంత వరకూ ప్రతి కమిటీలో కూడా కచ్చితంగా యాభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూసుకోవాలి. మొత్తం కమిటీలో యాభైశాతం మహిళలు ఉండేలా చూడండి. ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మను బాగా చూసుకుంటే కుటుంబాలు బాగుపడతాయని మనస్ఫూర్తిగా నమ్మి ప్రతి పథకం కూడా వాళ్లకు తగ్గట్లుగానే పేర్లతో పెట్టాం. అందుకే వాళ్లనూ భాగస్వామ్యం చేయాలి. సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున ప్రాధాన్యతా క్రమంలో పనులకు మంజూరు కూడా చేస్తున్నాం. మళ్లీ మనం(కార్యకర్తలను కలిపి) అఖండ మెజార్టీతో గెలవాలి. ఈసారి టార్గెట్ 151 కాదు, 175. ఈ టార్గెట్ కష్టంకాదు. మీ నియోజకవర్గంలో ఏమేర లబ్ధి జరిగిందో, ప్రతి నియోజకవర్గంలోనూ జరిగింది. దాదాపు 87శాతం కుటుంబాలకు పథకాలు అందాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఘనవిజయాలు సాధించగలిగాం. మున్సిపాల్టీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీ ఎన్నికల్లో ఘన విజయాలు అందుకున్నాం. ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది అంతకుముందు ప్రజలకు ఏదైనా అందాలంటే.. పది మంది చుట్టూ తిరగాలి. లంచాలు ఇచ్చుకోవాలి. ఇంతచేసినా వెయ్యి మందిలో నలుగురికో, పదిమందికో పథకాల లబ్ధి అందేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివక్ష లేకుండా, పక్షపాతం లేకుండా ప్రజలకు అన్నీ సంక్షేమాలు అందుతున్నాయి. గతంలో సచివాలయ వ్యవస్థ అనేదే లేదు. ఇప్పుడు ఉన్నాయి. నాలుగు అడుగులు వేస్తే ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్క్లినిక్స్ కనిపిస్తున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే.. ఇంగ్లిషు మీడియం స్కూళ్లు కనిపిస్తున్నాయి. నేడు గ్రామాల్లో ఇలాంటి వ్యవస్థ కనిపిస్తోంది. ప్రజల్లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వాళ్లు అని గ్రహిస్తున్నారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాం. ఆరోగ్యశ్రీ కింద 3వేలకుపైగా చికిత్సలకు వర్తింపు చేస్తున్నాం. మన గ్రామంలోనే మన కళ్లముందే మార్పులు కనిపిస్తున్నాయి. వీటి గురించే ప్రజలకు చెప్పండి. వారి మద్దతును కూడగట్టండి. మీతోడు జగన్కు కావాలి. మనం అంతా ఇంకా కలిసికట్టుగా ముందుకెళ్లాలి. జీవితంకాలం మిగిలిపోయే విధంగా మనం అంతా చరిత్రను లిఖించాలి. మన తీసుకొచ్చిన మార్పులు అన్నీకూడా మన కళ్లముందే ఫలితాలను ఇస్తాయి. ఇవన్నీ చూశాక 30ఏళ్లపాటు మనమే ఉండాలని ప్రజలే ఆశీర్వదిస్తారు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: కుప్పం నుంచే తొలి అడుగు! -
కుప్పం అభివృద్ధికి అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో కంటే.. గత మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో భేటీలో భాగంగా.. గురువారం సాయంత్రం మొదటగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ నిర్వహించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ‘ కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం. ఇక్కడ భరత్ను గనుక గెలిపిస్తే.. ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీ. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి మేలు ఎంతో జరిగింది. భవిష్యత్తులోనూ మరింత జరగుతుంది కూడా. ఈ వేళ కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనుల నిధులను మంజూరు చేస్తున్నాం. కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటాం అని సీఎం జగన్.. కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు. పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేసేలా సీఎం జగన్.. దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పంనుంచే ప్రారంభిస్తున్నాం కుప్పం అంటే టీడీపీకి ఒక కంచుకోట అని అంతా అనుకుంటారు వాస్తవం ఏంటంటే.. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గం బీసీలకు మంచి చేస్తున్నాం అంటే .. అది ప్రతి పనిలోనూ కనిపించాలి బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తి, ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టి మనం అడుగులు ముందుకేశాం దురదృష్టవశాత్తూ చంద్రమౌళి మనకు దూరమయ్యారు అంతటితో ఆ కుటుంబాన్ని వదిలేయకుండా.. ఆయన కుమారుడు భరత్ను తీసుకు వచ్చాం చంద్రమౌళి చికిత్స పొందుతున్న సమయంలో నేను ఆస్పత్రికి కూడా వెళ్లాను ఆ రోజు భరత్ నాకు పరిచయం అయ్యాడు నేను భరత్ను ప్రోత్సహిస్తానని ఆ రోజే చెప్పాను ముందుండి ప్రతి అడుగులోనూ సపోర్ట్ చేశాం మీరు కూడా భరత్పై అదే ఆప్యాయతను చూపించారు దీనివల్ల భరత్ నిలదొక్కుకున్నాడు భరత్ను ఇదేస్థానంలో నిలబెడతారా? లేదా ఇదే భరత్ను మళ్లీ పై స్థానంలోకి తీసుకు వెళ్తారా? అన్నది మీమీద ఆధారపడి ఉంది భరత్ను గెలుపించుకు రండి..భరత్ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తాను నియోజకవర్గంలో చంద్రబాబు గెలుస్తారు, ఆయన సీఎం అవుతాడు, కుప్పం అభివృద్ధి చెందుతుంది అనే ఒక భ్రమను టీడీపీ, చంద్రబాబు కల్పించుకుంటా వెళ్లారు నిజం చెప్పాలంటే.. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈమూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగింది స్కూళ్లలో నాడు –నేడు, ఇళ్ల పట్టాలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు, ఇక ప్రతి గ్రామంలోనూ సచివాలయం, విలేజ్ క్లినిక్, ఆర్బీకే.. ఇవన్నీకూడా గతంలో ఏ గ్రామంలోనూ కనిపించలేదు మన కళ్ల ఎదుటే ఇవి కనిపిస్తున్నాయి నాడు – నేడుతో బడులన్నీకూడా రూపురేఖలు మారుతున్నాయి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కూడా అమల్లోకి వస్తుంది ఇదీ చదవండి: నాడు అసాధ్యమన్నారు.. నేడు సాధ్యమైందిగా!