![Chandrababu Angry With TDP Workers At Katheru Raa Kadali Raa - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/29/cbn-angry-tdp.jpg.webp?itok=GMzTtl_6)
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ కార్యకర్తలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కోపమొచ్చింది. రాజానగరం టికెట్ కేటాయింపు అసంతృప్తి సెగలు ఆయనకు తగిలాయి. ఈ క్రమంలో రాజమండ్రి రూరల్ కాతేరులో సోమవారం ఆయన నిర్వహించిన రా కదలి రా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
రాజానగరం టికెట్ జనసేనకు కేటాయించడంపై చంద్రబాబు సమక్షంలో బొడ్డు వెంకటరమణ వర్గీయులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో స్టేజ్ పైనుంచి కార్యకర్తలు దూకుడుగా దిగే యత్నం చేయగా.. చంద్రబాబు కిందపడబోయారు. అయితే సెక్యూరిటీ ఆయన్ని కిందపడకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇదేం తీరు తమ్ముళ్లూ.. అంటూ సొంత పార్టీ కార్యకర్తల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment