ముగ్గురు సజీవ దహనం, 14మంది అరెస్ట్ | 14 arrested for arson in Bihar's Muzaffarpur after 3 people killed in clashes | Sakshi
Sakshi News home page

ముగ్గురు సజీవ దహనం, 14మంది అరెస్ట్

Published Mon, Jan 19 2015 11:51 AM | Last Updated on Tue, Oct 16 2018 8:23 PM

బీహార్లోని ముజఫర్పూర్లో మత ఘర్షణలు చెలరేగాయి. అజీజ్‌పూర్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు సజీవ దహనమయ్యారు.

ముజఫర్పూర్ : బీహార్లోని ముజఫర్పూర్లో మత ఘర్షణలు చెలరేగాయి. అజీజ్‌పూర్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు సజీవ దహనమయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనకు సంబంధించి 14మందిని అరెస్ట్ చేసినట్లు ముజఫర్ పూర్ డీఎం అనుపమ్ కుమార్ తెలిపారు. పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు ఈ ఘర్షణల్లో మృతి చెందినవారి కుటుంబాలకు జిల్లా అధికారులు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

వివరాల్లోకి వెళితే ఓ వర్గానికి చెందిన యువతి...మరో వర్గానికి చెందిన యువకుడితో వెళ్లిపోయింది. అయితే ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. దాంతో ఆగ్రహించిన మృతుని బంధువులు, గ్రామస్తులు అజీజ్పూర్పై దాడి చేసి, ఇళ్లకు నిప్పుపెట్టి...పలు వాహనాలను ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement