
శ్రీనగర్ : ఇద్దరు ఉగ్రవాదులను సోమవారం అర్థరాత్రి భద్రతాదళాలు మట్టుబెట్టినట్లు ఆర్మీ అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు. షోపియన్లోని వానీపోరా ప్రాంతంలో టెర్రరిస్టులు నక్కి ఉన్నారనే సమాచారం ఆ ప్రదేశాన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
అనంతరం వెతుకులాట ప్రారంభించామని, ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో భద్రతా దళాలు వారిని కాల్చివేశాయని వివరించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. మూడో ఉగ్రవాదిని పట్టుకునేందుకు భద్రతా దళాలు యత్నిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment