ప్రసాదం తిని 60 మందికి అస్వస్థత | 60 persons fall ill after eating prasad | Sakshi
Sakshi News home page

ప్రసాదం తిని 60 మందికి అస్వస్థత

Published Tue, Jun 17 2014 5:41 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

బీహార్లో ముజఫర్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో దేవుడి ప్రసాదం తిని 60 మంది అస్వస్థతకు గురయ్యారు.

పాట్నా: బీహార్లో ముజఫర్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో దేవుడి ప్రసాదం తిని 60 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ చికిత్స నిమిత్తం ముజఫర్పూర్లోని శ్రీకృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.  

ఎక్కువ సమయం నిల్వ ఉంచిన ప్రసాదం తినడం వల్ల వాంతులు అయ్యాయని పోలీసులు చెప్పారు. వీరికి వెంటనే ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ముజఫర్పూర్ తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా మెరుగవుతున్నట్టు వైద్యులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement