పట్నా: వచ్చే ఏడాది నుంచి బిహార్లో కల్లుపై కూడా నిషేధం విధిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ చెప్పారు. మద్య నిషేధం అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో నేరాల సంఖ్య బాగా తగ్గిందన్నారు. కల్లును ఆహార పదార్థాల్లో వినియోగించేలా ప్రోత్సహిస్తామని, అందుకోసం ఒక కమిటీ ఏర్పాటు చేశామని శనివారం ముజఫర్పూర్లో చెప్పారు. తమిళనాడులో గత 25 ఏళ్లుగా ఈ విధానం విజయవంతంగా కొనసాగుతోందన్నారు.