చెన్నై: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎయిరిండియా రెండు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. దేశంలోని మెట్రో నగరాల మధ్య విమాన సర్వీసుల టికెట్ల ధరలకు డిస్కౌంట్ ఇచ్చింది.
డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 8 గంటల మధ్య దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడిచే ఎయిరిండియా సర్వీసులలో అన్ని పన్నులతో సహా 5,016 రూపాయలతో ప్రయాణించవచ్చు. ఇక జనవరి 1 నుంచి 15 వరకు ఢిల్లీ-ముంబై మహానగరాల మధ్య ఎయిరిండియా బీ 777 విమానాల్లో ఎకానమీ లేదా బిజినెస్ క్లాస్ల్లో ప్రయాణించే ప్రయాణికుల టికెట్లను లక్కీ డ్రా తీస్తారు. విమానం టేకాఫ్ తీసుకునేముందు డ్రా తీస్తారు. విజేతను ఫస్ట్ క్లాస్లో ప్రయాణించేందుకు అనుమతిస్తారు.
కొత్త ఏడాదిన ఎయిరిండియా ఆఫర్లు
Published Tue, Dec 29 2015 8:30 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement