సుబ్రహ్మణ్యం నిప్పులు.. 'డ్రైవింగ్ ఫోర్స్‌'పైనే దాడి! | BJP Mounts AgustaWestland Offensive, Targets Congress led UPA | Sakshi
Sakshi News home page

సుబ్రహ్మణ్యం నిప్పులు.. 'డ్రైవింగ్ ఫోర్స్‌'పైనే దాడి!

Published Wed, May 4 2016 8:18 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

సుబ్రహ్మణ్యం నిప్పులు..  'డ్రైవింగ్ ఫోర్స్‌'పైనే దాడి! - Sakshi

సుబ్రహ్మణ్యం నిప్పులు.. 'డ్రైవింగ్ ఫోర్స్‌'పైనే దాడి!

న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం బుధవారం పార్లమెంటును కుదిపేసింది. రాజకీయ దుమారం రేపుతున్న ఈ కుంభకోణంపై రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని లక్ష్యంగా చేసుకొని అధికార పక్షం బీజేపీ విమర్శల దాడి చేయగా.. ఆ దాడిని దీటుగా తిప్పికొట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నించింది. (చదవండి: రహస్యాలను బయటపెడతాం.. 'మోస్ట్ వెల్‌కం'!)

బీజేపీ కొత్త ఎంపీ సుబ్రహ్మణ స్వామి ఎంట్రీతో ఈ చర్చ మరింత వేడెక్కింది. గత యూపీఏ హయాంలో రూ. 3,600 కోట్ల విలువైన హెలికాప్టర్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు అగస్టా వెస్ట్‌లాండ్‌ సంస్థ లంచాలు ఇచ్చిందని, ఈ వ్యవహారంలో ప్రధానంగా 'డ్రైవింగ్ ఫోర్స్‌' హస్తముందని ఇటలీ కోర్టు తన తీర్పులో పేర్కొనగా.. ఆ 'డ్రైవింగ్ ఫోర్స్‌' సోనియాగాంధేనంటూ స్వామి తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. సోనియా పేరును ఆయన నేరుగా ప్రస్తావించకపోయినా, 'సూపర్ కేబినెట్‌', 'ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై పెత్తనం చెలాయించిన హైయర్‌ అథారిటీ' అంటూ, ఆమెనే ఈ ఒప్పందంలో అక్రమాలకు కారణమని ధ్వజమెత్తారు. ఈ స్కాంలో సోనియాకు వ్యతిరేకంగా బలంగా ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన విమర్శలను కాంగ్రెస్‌ పార్టీ తిప్పికొట్టింది. భవిష్యత్‌లో స్వామి వల్ల బీజేపీ చిక్కులు తప్పవని హెచ్చరించింది.

ఇక చర్చకు చివర్లో రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ సమాధానమిస్తూ.. ఈ ఒప్పందంలో అవినీతికి ఎవరు కారణమయ్యారో దేశం తెలుసుకోవాలనుకుంటుందని, దీనిని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాయమని స్పష్టం చేశారు. ఈ అవినీతి వ్యవహారంపై ఇటలీ కోర్టు తీర్పులో పేర్కొన్న వ్యక్తులందరిపై దృష్టిపెట్టి.. దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement