కేంద్రం తదుపరి నిర్ణయం వింటే ఇక అంతే! | Charge on cash usage maybe next as govt promotes digital payments | Sakshi
Sakshi News home page

కేంద్రం తదుపరి నిర్ణయం వింటే ఇక అంతే!

Published Tue, Dec 13 2016 3:04 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

కేంద్రం తదుపరి నిర్ణయం వింటే ఇక అంతే!

కేంద్రం తదుపరి నిర్ణయం వింటే ఇక అంతే!

న్యూఢిల్లీ: అవినీతి నిరోధం, నల్లధనాన్ని అరికట్టడం, దేశంలో నగదు రహిత లావాదేవీలను అమాంతం పెంచేందుకు అనూహ్యంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న కేంద్ర ప్రభుత్వం త్వరలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టబోతోంది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఓ ప్యానెల్‌ నగదు చెల్లింపు లావాదేవీలను తగ్గించే చర్యలకు దిగాలని సూచించినట్లు తెలిసింది. దీంతో నగదు చెల్లింపులను తగ్గించేందుకు ఎవరైతే డబ్బు ద్వారా చెల్లింపులు చేస్తారో వారి నుంచి అదనపు చార్జీలు వసూలు చేసేందుకు సమాయత్తమవనుంది.

దీంతో సాధారణంగా ఇప్పటి వరకు ఏటీఎంలు, క్రెడిట్‌ కార్డుల ద్వారా స్వైపింగ్‌ చేసినప్పుడు వసూలు చేసి కనీస ఛార్జీలు త్వరలో కార్డులకు కాకుండా ఎవరైతే డబ్బు ద్వారా చెల్లిస్తారో వారి నుంచి అదనపు చార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ పేమెంట్లను రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను చేపట్టే అవకాశం ఉందని, పెద్ద నోట్ల రద్దు అంశం తర్వాత త్వరలో కేంద్రం తీసుకురానున్న మరో మార్పు ఇదేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలుచెబుతున్నాయి. ఆర్ధికశాఖ మాజీ కార్యదర్శి రతన్‌ వతల్‌ పెద్ద మొత్తంలో నగదు చెల్లింపులు తగ్గించేందుకు ఈ సూచనలు చేశారంట. ప్రస్తుతం జీడీపీలో 12శాతం ఉన్నవాటాను 30 నుంచి 90రోజుల మధ్య తగ్గించాలని అనుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement