
జై తిరథ్ దహియా
చండీఘర్: హర్యానాలో సోనెపట్ జిల్లాలోని రాయ్ శాసనసభ నియోజకవర్గంలో ఇద్దరు వృద్ధుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ జరిగింది. పోటీ ఏ స్థాయిలో జరిగిందంటే, 62 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ సిటింగ్ ఎమ్మెల్యే జై తిరథ్ దహియా కేవలం మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి 68 ఏళ్ల ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎన్డి)ఇంద్రజిత్ దహియాపై ఆయన గెలుపొందారు.
ఎన్నిక ల అధికారులు ప్రకటించిన ప్రకారం జై తిరథ్ దహియాకు 36,703 ఓట్లు, 68 ఏళ్ల ఇంద్రజిత్ దహియాకు 36,700 ఓట్లు వచ్చాయి. మూడవ స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కృష్ణ గేహ్లవాట్కు 34,523 ఓట్లు పోలయ్యాయి.
**