marginal
-
రూపాయి బలహీనపడినా.. ఎగుమతిదారులకు లాభాలు అంతంతే..!
న్యూఢిల్లీ: ఒక దేశం కరెన్సీ బలహీనపడితే, ఆ దేశం ఎగుమతిదారులకు లాభాలు భారీగా వచ్చిపడతాయన్నది ఆర్థిక సిద్దాంతం. అయితే భారత్ ఎగుమతిదారుల విషయంలో ఇది పూర్తి స్థాయిలో వాస్తవ రూపం దాల్చడం లేదు. రూపాయి బలహీనపడినా.. వారికి వస్తున్న లాభాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. వారు చేస్తున్న విశ్లేషణల ప్రకారం ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల తయారీ.. ముడి వస్తువుల దిగుమతులపై ఆధారపడుతుండడం.. ఈ నేపథ్యంలో దిగుమతుల బిల్లు తడిసి మోపెడవుతుండడం దీనికి ఒక కారణం. దీనికితోడు ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి దేశీయ ఎగుమతిదారులకు పరిమిత ప్రయోజనాలను అందిస్తోంది. గత ఏడాది జనవరి నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ 4 శాతానికిపైగా పతనమైంది. గత ఏడాది జనవరి 1వ తేదీన రూపాయి విలువ 83.19 పైసలు అయితే 2025 జనవరి 13వ తేదీన ఒకేరోజు భారీగా 66 పైసలు పడిపోయి 86.70కి చేరింది. అన్ని రకాలుగా ఇబ్బందే... రూపాయి దిగువముఖ ధోరణులు ఎగుమతిదారులకు లాభాలు పంచలేకపోతున్నాయి. రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతయ్యే ముడి పదార్థాలు, విడిభాగాలు, ఇతర ఉత్పత్తుల ధరలు డాలర్లలో పెరుగుతాయి. ఈ వ్యయాల పెరుగుదల బలహీనమైన రూపాయి నుండి పొందిన పోటీ ప్రయోజనాన్ని దెబ్బతీస్తోంది. ఫార్మా, రత్నాలు–ఆభరణాల వంటి రంగాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇంకా షిప్పింగ్, బీమా, మార్కెటింగ్ వంటి ఖర్చులు కూడా డాలర్–డినామినేట్ అవుతాయి. ఇది కూడా క్షీణించిన రూపాయి ప్రయోజనాలు ఎగుమతిదారుకు దక్కకుండా చేస్తోంది. ఇక డాలర్ మారకంలో చైనీస్ యువాన్, జపనీస్ యెన్, మెక్సికన్ పెసో వంటి ఇతర పోటీ దేశాల కరెన్సీలు కూడా భారత రూపాయితో పోలిస్తే మరింత క్షీణించాయి. ఎగుమతిదారులకు ఇదీ ఒక ప్రతికూల అంశమే. చాలా మంది ఎగుమతిదారులు కరెన్సీ హెచ్చుతగ్గుల సమస్యను ఎదుర్కొనడానికి హెడ్జింగ్ కవర్ తీసుకుంటారు. ఎందుకంటే వారి ఇన్పుట్ ఖర్చు పెరుగుతుంది. రూపాయి బలహీనత వల్ల వారికి తగిన ప్రయోజనం లభించడం లేదు. – సంజయ్ బుధియా, సీఐఐ (ఎగ్జిమ్) నేషనల్ కమిటీ చైర్మన్అనిశ్చితిని భరించలేం.. రూపాయి విలువ పడిపోతోందా? పెరుగుతోందా? అన్నది ఇక్కడ సమస్య కాదు. బాధ కలిగిస్తున్న అంశం రూపాయి విలువలో అస్థిరత. కరెన్సీలో స్థిరత్వం ఉండాలి. అస్థిరత ఉంటే అనిశ్చితిని ఎలా నిర్వహించాలో ఎవరికీ తెలియదు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్య. – ఎస్ సి రాల్హాన్, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతిదారు (లూథియానా) -
పేద పిల్లల నేస్తం
బిహార్ విద్యాశాఖలో ఉన్నతాధికారి అయిన డాక్టర్ మంజు కుమారి రోహ్తాస్ జిల్లాలో, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతమైన తిలౌతు బ్లాక్లో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. బ్లాక్ రిసోర్స్ సెంటర్(బీఆర్సి) ఇంచార్జిగా ఆమె తన అధికారిక విధులకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆర్థికంగా వెనకబడిన పిల్లలు చదువులో ముందుండేలా తన వంతు కృషి చేస్తోంది....ఆఫీసు సమయం అయిపోగానే అందరిలా ఇంటికి వెళ్లదు మంజు కుమారి. సమీపంలోని ఏదో ఒకగ్రామానికి వెళ్లి పేదపిల్లలకు పుస్తకాలు. బ్యాగులు, యూనిఫామ్ లాంటివి అందజేస్తుంది. దీని కోసం ఇతరులు ఇచ్చే డబ్బులు, స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడకుండా తన జీతం నుంచే కొంత మొత్తాన్ని వెచ్చిస్తుంది. మంజు కుమారికి సామాజిక సేవపై ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది. నాన్న శివశంకర్ షా తనకు స్ఫూర్తి.‘సామాజిక సేవకు సంబంధించి నాన్న ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. మా ఊరి పాఠశాల కోసం భూమిని ఉదారంగా ఇవ్వడమే కాదు అవసరమైన వనరులు అందించారు. ఇలాంటివి చూసి నాలో సామాజిక బాధ్యత పెరిగింది. ఆ స్కూల్ ఇప్పటికీ ఉంది. సామాజిక సేవాకార్యక్రమాలు మరిన్ని చేసేలా నిరంతరం స్ఫూర్తినిస్తుంది’ అంటుంది మంజు కుమారి.రాంచీ యూనివర్శిటీ నుంచి పోస్ట్గ్రాడ్యుయేషన్... ఆ తర్వాత పీహెచ్డీ చేసిన మంజు డెహ్రీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దశాబ్దానికి పైగా హిందీ టీచర్గా పనిచేసింది. 2023లో బీ ఆర్సి ఇంచార్జిగా నియామకం అయింది. దీంతో సామాజిక సేవలో మరింత క్రియాశీలంగా పనిచేస్తోంది.స్థానిక పాఠశాలలను తనిఖీ చేస్తుంటుంది. పాఠశాల పరిశ్రుభతపై ఎన్నో సూచనలు ఇస్తుంటుంది. విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ముందు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది మంజు కుమారి. ఆ సమయంలో గిరిజన గూడేలకు వెళ్లి ఎప్పుడూ స్కూల్కు వెళ్లని పిల్లలకు అక్షరాలు నేర్పించేది, పాఠాలు చెప్పేది. ఇది చూసి తల్లిదండ్రులు పిల్లలను రోజూ స్కూల్కు పంపించేవారు.‘ఇది నేను సాధించిన పెద్ద విజయం’ అంటుంది మంజు కుమారి. అయితే మంజుకుమారి ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అత్తమామలు, భర్త అభ్యంతరం చెప్పేవాళ్లు. మంజుకుమారిని సామాజిక సేవ దారి నుండి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్లు. అయినప్పటికీ ఆమె పట్టుదలగా ముందుకు వెళ్లింది.సామాజిక బాధ్యత, నైతిక విలువలు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మంజు కుమారి... ‘తమ గురించి మాత్రమే ఆలోచించే ధోరణి ప్రజలలో బాగా పెరిగింది. సామాజిక స్పృహ లోపిస్తుంది. సేవా స్ఫూర్తిని, సామాజిక నిబద్ధతను పునరుద్ధరించాలని ఆశిస్తున్నాను’ అంటుంది. -
మూడోరోజూ మార్కెట్ ముందుకే...
ముంబై: స్టాక్ సూచీలు గురువారం స్వల్పంగా లాభపడి మూడోరోజూ ముందడుగేశాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్, దేశీయ క్యూ2 జీడీపీ వృద్ధి రేటు, అక్టోబర్ ద్రవ్యలోటు డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. అమెరికా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. ట్రేడింగ్లో 460 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 87 పాయింట్లు పెరిగి 66,988 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు బలపడి 20,133 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు నవంబర్ నెలవారీ డెరివేటివ్ల గడువు ముగింపు కావడంతో ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫార్మా, కన్జూమర్, రియలీ్ట, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. బ్యాంకులు, యుటిలిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియాలో చైనా, హాంగ్కాంగ్ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 5 పైసలు బలహీనపడి 83.37 వద్ద స్థిరపడింది. -
బడుగు వర్గాలపై ప్రధాని మోదీ కక్ష సాధింపు
న్యూఢిల్లీ: ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(ఓఎంఎస్ఎస్) కింద రాష్ట్రాలకు ఇచ్చే బియ్యం, గోధుమలను ఇకపై ఇవ్వకుండా కేంద్రం నిలిపివేయడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ గురువారం తప్పుపట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ప్రధాని మోదీ మనోవేదనకు గురవుతున్నారని, అందుకే బడుగు వర్గాల ప్రజలపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. కర్ణాటకకు కేంద్రం బియ్యం ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడాన్ని మోదీ సహించలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు సెంట్రల్ పూల్ నుంచి బియ్యం, గోధుమల పంపిణీని కేంద్రం నిలిపివేసింది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం దీనివల్ల నష్టపోనుంది. -
స్వల్ప లాభాల్లో సూచీలు, అదానీ ట్విన్స్ షేర్లలో కొనుగోళ్ళ జోష్
సాక్షి,ముంబై: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడింగ్ను ఆరంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 70 పాయింట్లు ఎగిసి 60710 వద్ద నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 17 వేల 945 వద్ద కదలాడుతోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్, విప్రో అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ విన్నర్స్గానూ, యాక్సిస్ బ్యాంకు, హెచ్యూఎల్, బజాజ్ ఫిన్సర్వ్, టైటన్, ఏషియన్ పె యింట్స్ నష్టపోతున్నాయి. -
స్వల్ప లాభాలకు పరిమితం: ఆటో, రియల్టీ గెయిన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. సోమవారం ఉదయం ఆరంభం తరువాత 150 పాయింట్ల మేర లాభాల్లోకి మళ్లినప్పటికీ చివరల్లో వెల్లువెత్తిన అమ్మకాలతో చివరికి సెన్సెక్స్ 13.54 పాయింట్లు లేదా 0.02 శాతం లాభంతో 59,847 వద్ద, నిఫ్టీ 27.30 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 17,626 వద్ద ముగిశాయి. ఆటో, రియల్టీ రంగ షేర్ల లాభాలు మార్కెట్కు ఊతమిచ్చాయి. మరోవైపు బ్యాంకులు ఫైనాన్షియల్స్ భారీగా నష్ట పోయాయి. టాటా మోటార్స్, విప్రో మరియు పవర్గ్రిడ్ టాప్ గెయినర్లుగాను, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్యుఎల్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ముగిసింది. మునుపటి సెషన్లోని 81.88తో పోలిస్తే అమెరికా డాలర్ మారకంలో రూపాయి 81.98 వద్ద ముగిసింది. -
Today StockMarket: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఫ్లాట్గా ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో ఆరంభంలో లాభాలతో ఉన్నప్పటికీ ఆ తరువాత ఒడిదుడుకులనెదుర్కొన్నాయి. చివరికి 44.4 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 61,320 వద్ద, నిఫ్టీ50 20 పాయింట్లు పెరిగి 18,036 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్ల లాభాలు మద్దతిచ్చి యూఎస్ ఫెడ్ వడ్డీరేటు పెంపు ఉండకపోవచ్చుననే అంచనాలు ఆందోళనలను తగ్గించింది. ఓఎన్జీసీ, టెక్మహీంద్ర, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, నెస్లే టాప్ గెయినర్స్గా, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్యూఎల్, ఎం అండ్, బజాజ్ ఫినాన్స్ టాప్ లూజర్స్గా స్థిరపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి 10పైసలు 82.71 వద్ద ముగిసింది. -
ఆశాజనకంగా జీడీపీ వృద్ది 4.7 శాతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశీ స్థూల జాతీయోత్పత్తి ఆశాజనకంగా నమోదైంది. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో జీడీపీ వృద్ధి 4.7 శాతంగా వుంది. మునుపటి త్రైమాసికంలో నమోదైన ఆరేళ్ల కనిష్టం 4.5 శాతంతో పోలిస్తే స్వల్పంగా పుంజుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 5.6 శాతంగా వుంది. కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం జీడీపీ వృద్ధి 4.7 శాతంగా నమోదైంది. అలాగే మూడవ త్రైమాసికంలో స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి 4.5 శాతంగా ఉంది, ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 4.3 శాతం ఉండగా, డిసెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా ఉంది. ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నాయని, భారత దేశాన్ని 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశలో తమ తాజా బడ్జెట్ పునాది వేసిందని ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలోతాజా గణాంకాల్లో జీడీవీ వృద్ధి రేటు సుమారు 5 శాతంగా ఉండటం విశేషం. -
లాభాల స్వీకరణ: ఏడు రోజుల లాభాలకు బ్రేక్
సాక్షి, ముంబై: ఫ్లాట్గాప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిసాయి. వరుస ఏడు రోజుల లాభాలకు చెక్ చెప్పిన కీలక సూచీలు ఒడిదొడుకుల మధ్య రోజంతా కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 150పాయింట్లకుపైగా పతనం కాగా,నిఫ్టీ 11900 స్థాయికి చేరింది. చివరికి సెన్సెక్స్ 54 పాయింట్లు క్షీణించి 40248 వద్ద, నిఫ్టీ 24పాయింట్ల బలహీనంతో 11917 వద్ద ముగిసాయి. వరుసగా లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ మార్కెట్లను ప్రభావితం చేసిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్, ఆటో, మెటల్ బలపడగా.. మీడియా, ఐటీ నష్టపోయాయి. ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేష్ ఝున్ఝున్వాలా రూ.87 కోట్ల షేర్లను కొనుగోలు చేయడంతో యస్ బ్యాంక్ 9 శాతం జంప్చేయగా.. ఎస్బీఐ, భారతి ఇన్ఫ్రాటెల్, టాటా మోటర్స్, వేదాంతా, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో లాభాలనార్జించాయి. జీ, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, అల్ట్రాటెక్ సిమెంట్, ఐషర్ మోటార్స్, గ్రాసిం, కోటక్ బ్యాంక్, టీసీఎస్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, టైటన్, ఏషియన్ పెయింట్స్, హెచ్యూఎల్, ఐటీసీ నష్టపోయిన వాటిల్లో టాప్లో ఉన్నాయి. మరోవైపు వాణిజ్య వివాద పరిష్కార అంచనాలతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో చరిత్రాత్మక గరిష్టాల వద్ద నిలవడం విశేషం! -
భారీ ఒడిదుడుకులు, స్వల్ప లాభాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు చివర్లో స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. ఆరంభంలోనే సెంచరీ లాభాలనుసాధించిన కీలక సూచీ సెన్సెక్స్ ఆ తరువాత 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. తిరిగి అదే స్థాయిలో పుంజుకుని 360 పాయింట్లకు పైగా ఎగిసింది. రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్యకొనసాగి చివరికి 87పాయింట్ల లాభంతో 38214 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు లాభంతో 11341 వద్ద ముగిసింది. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీలో భారీ ఊగిసలాట కనిపించింది. ఐటీ నష్టపోగా, దాదాపు అన్ని సెక్టార్లు నామమాత్రంగా లాభపడ్డాయి. ఐఆర్సీటీసీ స్టాక్ బంపర్ లిస్టింగ్తో భారీ లాభాలను నమోదు చేసింది. ఏకంగా 128 శాతం ఎగిసి రూ. 729 వద్ద ముగిసింది. అలాగే ఫ్రెంచ్ దిగ్గజం పెట్టుబడుల వార్తతో అదానీ గ్యాస్ 18శాతం లాభపడింది. వీటితోఆటు ఓఎన్జీసీ, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్, సన్ ఫార్మ, ఇండస్ ఇండ్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి, ఆటా స్టీల్, ఎంఅండ్ఎం లాభపడ్డాయి. మరోవైపు ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, పవర్గ్రిడ్, యూపీఎల్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. -
స్వల్ప లాభాలతో కదులుతున్న స్టాక్మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఆరంభంలో స్తబ్దుగా ఉన్న సూచీల్లో ఒక దశలో 100 పాయింట్లుగా పుంజుకున్న సెన్సెక్స్ 96 పాయింట్లు లాభపడి 34,411 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 10,323 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ లాభాలతోనూ, ఐటీ, మెటల్ స్వల్ప నష్టాలతోనూ కొనసాగుతున్నాయి. ఐబీ హౌసింగ్ భారీ లాభపడుతుండగా, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్, గెయిల్, ఐషర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ ఇతర టాప్ విన్నర్స్గా ఉన్నాయి. బీపీసీఎల్, అల్ట్రాటెక్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, ఐవోసీ, ఓఎన్జీసీ, హెచ్పీసీఎల్, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్ నష్టపోతున్నాయి. -
తెప్పరిల్లుతున్న రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రికార్డు కనిష్టాలనుంచి స్వల్పంగా కోలుకుంది. రోజుకో కొత్త కనిష్టాన్ని తాకుతున్న రూపాయి బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త కోలుకుంది. వరుసగా అయిదురోజుల రికార్డు పతనం ముఖ్యంగా మంగళవారం నాటి చరిత్రాత్మక కనిష్టం నుంచి పుంజుకుంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో18 పైసలు(0.25 శాతం) బలపడి 71.40 వద్ద మొదలైంది. ప్రస్తుతం స్వల్ప లాభంతో 71.51 వద్ద ట్రేడవుతోంది. కాగా మంగళవారం ఆరంభంలో రూపాయి కొద్దిగా కోలుకున్నా చివరికి 37 పైసలు(0.5 శాతం) పతనమై రికార్డు కనిష్టం 71.58 వద్ద ముగిసింది. వర్థమాన దేశాల కరెన్సీలు పతనబాటలో సాగుతుండటం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు విశ్లేషించాయి. మరి బుధవారం వరుస నష్టాలనుంచి తెప్పరిల్లుతుందా, లేక ముగింపులో ఎనలిస్టులు భయపడుతున్నట్టుగా మరింత పతనమవుతుందా అనేది కీలకం. -
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప నష్టాలకు పరిమితమయ్యాయి. దాదాపు100పాయింట్లకుపైగా పతనమైన కీలక సూచీలు ఆరంభ నష్టాలనుంచి చివర్లో పుంజుకుని స్వల్ప నష్టాలతో పటిష్టంగా ముగిశాయి. ముఖ్యంగా ఆగస్టు నెల డెరివేటివ్ కాంట్రాక్టు ముగింపునేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సెన్సెక్స్ 38700వ స్థాయిని, నిఫ్టీ 11700 స్థాయిని కోల్పోయింది. సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టంతో 38,690 వద్ద నిఫ్టీ 15 పాయింట్లు క్షీణించి 11,677 వద్ద ముగిసాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు 1.2 శాతం జంప్చేయగా.. మెటల్, రియల్టీ 0.7 శాతం ఎగశాయి. ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో స్వల్ప నష్టపోయాయి. సన్ పార్మా, గెయిల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, యూపీఎల్, ఐటీసీ, ఎయిర్టెల్, హిందాల్కో, పవర్గ్రిడ్, హెచ్యూఎల్ లాభపడగా, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, హెచ్పీసీఎల్, ఇండస్ఇండ్, మారుతీ, హెచ్సీఎల్ టెక్, ఆర్ఐఎల్, ఐవోసీ, హెచ్డీఎఫ్సీ, యస్బ్యాంక్ నష్టపోయాయి. -
స్వల్ప నష్టాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. రికార్డు స్తాయిలనుంచి వరుసగా రెండో రోజు కూడా వెనక్కి తక్కిన సెన్సెక్స్ ప్రస్తుతం 56 పాయింట్లు క్షీణించి 38,666కు చేరగా, నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 11,666 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా ఎఫ్అండ్వో కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నారని నిపుణులు భావిస్తున్నారు.పీఎస్యూ, ప్రయివేట్ బ్యాంక్స్ నష్టాల్లో ఉండగా ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా నామమాత్రపులాభాల్లోకొనసాగుతున్నాయి. ఎయిర్టెల్, యూపీఎల్, పవర్గ్రిడ్, ఐటీసీ, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, హెచ్యూఎల్, జీ లాభాల్లోనూ, హెచ్పీసీఎల్, ఐవోసీ, యాక్సిస్, ఆర్ఐఎల్, హెచ్సీఎల్ టెక్, కొటక్ బ్యాంక్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ నష్టపోతున్నాయి. -
స్వల్ప లాభాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైనాయి. అటు చైనా,ఇటు అమెరికా16బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై అదనంగా విధించిన టారిఫ్లు అమలుకానున్న నేపథ్యంలో ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. అయితే నష్టాలనుంచి దేశీయ మార్కెట్లు పుంజుకుని స్వల్ప లాభాలతో కొనసాగు తున్నాయి. సెన్సెక్స్ 82 పాయింట్లుఎగిసి 88,418 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 11,601వద్ద ప్రధాన మద్దతుస్థాయికి పైన ఉంది. క్రయ విక్రయాల మధ్య సూచీలు ఊగిసలాటకు గురవుతూ వీకెండ్లో స్తబ్దుగా ఉన్నాయి. బ్యాంకింగ్, మెటల్స్, ఆటో షేర్లు లాభపతుండగా, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మీడియా నష్టపోతున్నాయి. టాటా స్టీల్, ఆక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. లుపిన్, సిప్లా, ఐసీఐసీఐ, ఎయిర్టెల్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, హెక్సావేర్ నష్టపోతున్నాయి. హెక్సావేర్ కంపెనీకి చెందిన ప్రధాన ఇన్వెస్టర్ భారీ ఎత్తున షేర్లను విక్రయించడంతో ఈ షేర్ 14.5 శాతం మేర నష్టాలతో కొనసాగుతోంది. -
స్వల్పంగా తగ్గిన డబ్ల్యూపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత సూచీ( డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం జూలైనెలలో దిగి వచ్చింది. జూన్ లో నాలుగేళ్ల గరిష్టాన్ని తాకిన డబ్ల్యుపీఐ స్వల్పంగా పుంజుకుంది. మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో 5.09శాతంగా నమోదైంది. కొన్ని ఆహార పదార్థాల ధరలు తగ్గు ముఖంపట్టడంతో టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు 5.09 శాతానికి దిగివచ్చింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. జూన్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 5.77 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో (2017 జూలైలో) ద్రవ్యోల్బణం రేటు 1.88 శాతంగా ఉంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలకుగాను 4.17 శాతంగా నమోదైంది. ఇది 9నెలల కనిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. కూరగాయలు, పళ్ల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. 2018 జూన్లో కూరగాయల ధరలు 7.8 శాతం పెరగ్గా, జూలైలో 2.19 శాతం క్షీణించాయి. -
వేదాంతా లాభాలు ఓకే
సాక్షి, ముంబై: మెటల్, మైనింగ్ దిగ్గజం వేదాంత క్యూ1 ఫలితాల్లో పరవాలేదనిపించింది. మొదటి త్రైమాసికంలో నికర లాభంలో స్వల్ప ( 0.7 శాతం) వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 2233 కోట్లతో పోలిస్తే తాజాగా రూ. 2248 కోట్ల నికర లాభాలను సాధించింది. అలాగే 21.4 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.22,206 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎబిటా 28.4 శాతం - రూ.6284 కోట్లగా ఉంది. తమిళనాడులో ప్లాంటును ఆందోళన కారణంగా మూసివేయాల్సి వచ్చిందని, దీన్ని తెరిపించేందుకు ప్రభుత్వంతో చర్యలు జరుపుతున్నట్టు వేదాంతా ఛైర్మన్ అనిల్అగర్వాల్ ప్రకటించారు. తద్వారా 100 మిలియన్ డాలర్లను నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. అయితే అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్ జింక్ గణనీయమైన ఉత్పత్తితో ఈ లాభాలను సాధించినట్టు సీఈవో కుల్దీప్ కూరా ఫలితాల ప్రకటన సందర్భంగా వెల్లడించారు. ప్రాజెక్టులు పురోభివృద్ధితో రాబోయే క్వార్టర్లలో మరిన్ని మైలురాళ్లను అధిగమించనున్నామని చెప్పారు. కాగా ఆయిల్ అండ్ గ్యాస్ ఎబిటా - రూ.852 కోట్లు, ఐరన్ అండ్ ఓర్ ఎబిటా రూ.163 కోట్లు, అల్యూమినియం ఎబిటా రూ.1259 కోట్లు, పవర్ ఎబిటా రూ.425 కోట్లుగా నమోదు చేసింది. -
స్వల్ప లాభాల్లో మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు పాజిటివ్గా మొదలైనాయి. రికార్డు స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న కీలకసూచీ సెన్సెక్స్ తాజాగా కొత్త గరిష్టాన్ని అందుకుంది. బుధవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 36,928 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. అయితే గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణతో స్వల్పంగా వెనక్కి తగ్గాయి. సెన్సెక్స్26 పాయింట్ల లాభంతో 36,851 వద్ద,నిఫ్టీ 4 పాయింట్లు ఎగిసి 11, 139 వద్ద కొనసాగినా, ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. మెటల్, పీఎస్యూ బ్యాంక్స్ పుంజుకోగా, ఐటీ బలహీనంగా ఉంది. ముఖ్యంగా ఆయిల్ కంపెనీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ, భారతి ఎయిర్టెల్ టాప్లూజర్స్గా ఉన్నాయి. అలాగే ఫలితాల నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ కౌంటర్ కూడా భారీగా నష్టపోతోంది. మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కో, వేదాంత, బజాజ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ టాప్ విన్నర్స్ ఉన్నాయి. అటు కరెన్సీ మార్కెట్లో దేశీయ కరెన్సీ రుపీ బలహీనంగా మొదలైంది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. ట్రంప్-కిమ్ భేటీ సానుకూల ఫలితాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కూడా పాజిటివ్గా స్పందించారు. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పుంజుకున్న కీలక సూచీ 69 పాయింట్లు పుంజుకుని, నిఫ్టీ 25 పాయింట్ల ఎగిసి 10800కి ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు పాజిటివ్గా ఉన్నాయి. ప్రధానంగా ఫార్మా, పీఎస్యూ బ్యాంక్స్, ఆటో ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. భారీ లాభాలతో వక్రంగీ అప్పర్ సర్క్యూట్ అయింది. ఐవోసీ, బీపీసీఎల్ డాక్టర్ రెడ్డీస్, సిప్లా, విప్రో, లుపిన్, ఐవోసీ, అదానీ పోర్ట్స్,టాటా మోటార్స్, కెనరాబ్యాంకు బీజీఆర్ ఎనర్జీ, లాభపడుతుండగా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హిందాల్కో, వేదాంతా తదితర షేర్లు నష్టపోతున్నాయి. -
స్వల్ప లాభాల ముగింపు: అయినా ఒకే
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో అక్కడికక్కడే ముగిశాయి. ఆరంభంలో సెంచరీ లాభాలతో మురిపించినా, మిడ్ సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో స్వల్ప ఒడిదుడుకుల మధ్య కన్సాలిడేట్ అయిన కీలక సూచీలు చివరికి స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 8 పాయింట్ల స్వల్ప లాభంతో 35,216 వద్ద, నిఫ్టీ కూడా కేవలం పాయింట్లు పెరిగి 10,718 వద్ద ముగిసింది. అయితే కీలక మద్దతు స్తాయిలకు పైన నిలవడం సానుకూల సంకేతం. బ్యాంక్ నిఫ్టీ, రియల్టీ లాభపడగా, ఆటో, ఐటీ, ఫార్మా, మెటల్ రంగాలు నష్టపోయాయి. హెచ్పీసీఎల్, ఐషర్, బీపీసీఎల్, ఎస్బీఐ, పవర్గ్రిడ్, యాక్సిస్, ఐవోసీ, గ్రాసిమ్, ఎయిర్టెల్ లాభపడిన వాటిల్లో ఉన్నాయి. మరోవై పు సోమవారం ప్రకటించిన క్యూ4 ఫలితాల్లో 45శాతం నష్టపోయిన ఐసీఐసీఐ బ్యాంకు నేడు దాదాపు 7 శాతం పుంజుకోవడం విశేషం. ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, ఇన్ఫోసిస్, జీ, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, యస్బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, వేదాంతా నష్టపోయాయి. అటు కరెన్సీ మార్కెట్లో రుపీ బలహీన ధోరణికొనసాగింది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పది గ్రా. 120 రూపాయలు క్షీణించి 31, 138 వద్ద ఉంది. -
స్వల్ప లాభాలే: టీసీఎస్ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు ఎక్కడ మొదలయ్యాయో దాదాపు అక్కడే ముగిశాయి. మిడ్సెషన్లో దాదాపు 150 పాయింట్లకు పైగా ఎగిసిన కీలక సూచీలు చివర్లో ఇన్వెస్టర్ల అమ్మకాలతో స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో నష్టాలు మార్కెట్లను లీడ్ చేశాయి. టీసీఎస్ మూడు రోజుల లాభాలు, రికార్డు హై నుంచి దిగజారి ముగింపులో 4శాతం పడిపోయింది. అయితే బ్యాంకింగ్ , ఫార్మా సెక్టార్ బాగా పుంజకుంది. దీంతో డే హైనుంచి 200 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 35పాయింట్లు లాభంతో 34450వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల స్వల్ప లాభంతో 10600వకు దిగువన 10,584 వద్ద ముగిసింది. హిందాల్కో, ఇండియాబుల్స్ హౌసింగ్, యూపీఎల్, గ్రాసిం, వేదాంతా టాప్ లూజర్స్గా నిలిచాయి. అరబిందో, క్యాడిలా, సన్ఫార్మ హెచ్పీసీఎల్, బీపీసీఎల్ ఎస్బీఐ, ఇండస్ ఇండ్, ఎస్ బ్యాంక్, ఎం అండ్ ఎం లాభపడిన వాటిల్లో ఉన్నాయి. అటు కరెన్సీ మార్కెట్లో రూపాయి వరుసగా ఆరో సెషన్లోకూడా బలహీనపడింది. 0.35 పైసలు నష్టపోయి 66.46 స్థాయికి చేరింది. -
స్వల్ప లాభాల్లో కీలక సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. గ్లోబల్ మార్కెట్లు నెగిటివ్ ఉన్నప్పటికీ మన ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్గా ఉన్నాయి. అయితే పీఎస్యూ బ్యాంకింగ్ సెక్టార్లో వీక్నెస్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 40 పాయింట్ల లాభంతో, నిఫ్టీ9 పాయింట్ల లాభంతో మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం ఇన్వెస్టర్ల అమ్మకాలతో స్వల్ప నష్టాల్లోకి మళ్లాయి. లాభనష్టాల మధ్య ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని , బ్యాంక్ నిఫ్టీని గమనించాల్సి ఉందని ఎనలిస్టుల విశ్లేషణ. మెటల్, ఆటో రంగాలు లాభపడుతుండగా , ఐటీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎస్బీఐ, వర్గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్, సిప్లా , ఇండియా బుల్స్ వెంచర్స్, టాటా మోటార్స్ హిందాల్కో, నాల్కో, అపోలో టైర్స్, ఐడియా, ఎంఅండ్ఎం, లుపిన్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఐవోసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, హెచ్యూఎల్ లాభపడుతుండగా, ఎస్బ్యాంక్, ఫోర్టిస్, హెచ్పీసీఎల్,ఇన్ఫోసిస్, యాక్సిస్, గ్రాసిమ్, విప్రో, జీ, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, మారుతీ, ఇన్ఫ్రాటెల్, టైటన్ తదితర షేర్లు నష్టపోతున్నాయి. మరోవైపు టైర్ షేర్లలాభపడుతున్నాయి. ముఖ్యంగా టైర్ సెక్టార్ దిగ్గజం ఎంఆర్ఆఫ్ మరోసారి రికార్డ్ స్థాయిని తాకింది. -
ట్రేడ్ వార్ భయం: ఫ్లాట్ ముగింపు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన కీలక సూచీలు స్వల్ప లాభాలతో పాజిటివ్ నోట్ తో ముగిశాయి. సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 33,637 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభంతో 10331 వద్ద ముగిశాయి. మిడ్క్యాప్, బ్యాంక్ నిఫ్టీకూడా గ్రీన్లోనే ముగిశాయి. చైనా- అమెరికా ట్రేడ్వార్ ఆందోళన నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగింది. మరోవైపు ఈ సాయంత్రం మరో ఆసక్తికర ప్రకటనకు చైనా సిద్ధమవుతోంది.లుపిన్, బీపీసీఎల్, టైటన్, హెచ్పీసీఎల్, బజాజ్ ఫిన్ , మారుతి సుజుకి, టెక్ మహీంద్ర, ఎంఫసిస్, పిరామిల్, జూబ్లియంట్, ఫెడరల్ బ్యాంక్ లాభపడగా, వక్రంగీ, ఐడియా, అదానీ, భారతీ, వేదాంతా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్సీఎల్ టెక్, బజాజ్ఆటో, అల్ట్రాటెక్, విప్రో, యూపీఎల్, హెచ్సీఎల్ టెక్, ఎంఅండ్ఎం,బజాజ్ ఆటో, ఎల్అండ్టీ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. -
స్వల్ప లాభాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ 56 పాయింట్లు పుంజుకుని 34239 వద్ద నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో10,514 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్, రియాల్టీ, ఆటో కౌంటర్లకు కొనుగోళ్ళ ధోరణి కనిపిస్తోంది. మరోవైపు బ్యాంకింగ్ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి అలాగే కొనసాగుతోంది. అటు ఐటీ కూడా నష్టాలోల్లోనే. అయితే ఆటో సేల్స్ గణాంకాలు మెరుగ్గా వుండటంతో ఆటో సెక్టార్, ఇంకా ఫార్మా లాభపడుతోంది. బజాజ్ ఆటో, సిప్లా, సన్ఫార్మా, భారతి ఇన్ఫ్రాటెల్, టీసీఎస్ లాభాల్లోనూ , వేదాంతా, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో , యాక్స్ బ్యాంక్ , ఎస్బీఐ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. -
ఐటీలో కొత్తగా లక్ష ఉద్యోగాలు -నాస్కామ్
సాక్షి, హైదరాబాద్: ఐటీ పరిశ్రమ విభాగం సంస్థ నాస్కామ్ 2017-18 ఐటీ రిపోర్ట్ ను విడుదల చేసింది. వరుసగా రెండవ సంవత్సరం ఐటీ పరిశ్రమ వృద్ది ఫ్లాట్గా ఉందని, అయితే రాబోయే ఏడాదికి పరిస్థితి మెరుగ్గా ఉంటుందని తెలిపింది. వచ్చే ఏడాదికి ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 7-8శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2019 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ 10-12 శాతం ఆదాయాన్ని అంచనా వేసినట్టు నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ ప్రకటించారు. నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం 30 శాతం వాటాతో 2017-18లో ఐటి సేవల మొత్తం ఆదాయంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ విభాగం నిలవగా ఇంజనీరింగ్, ఆర్ అండ్ డి 13 శాతం, వ్యాపార ప్రక్రియ నిర్వహణ 8 శాతంతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఐటీ, ఐటీ సంబంధిత రంగాల్లో కొత్తగా లక్ష ఉద్యోగాలు వస్తాయనీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పింది. అయితే ఈ వృద్ధి అంచనా వేసిన దాని కంటే 50శాతం తక్కువని వెల్లడించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 7-9 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2018-19 నాటికి 10-12 శాతం వృద్దితో 167 బిలియన్ డాలర్స్ ఆదాయం సాధించ వచ్చన్నారు. భారతదేశ మొత్తం ఎగుమతుల్లో 24శాతం ఐటీ ఎగుమతులే. డిజిటల్ బిజినెస్1.5-2శాతం వృద్ధిని నమోదు చేయనుండగా, దేశీయంగా ఇది రెండంకెల వృద్ధిని కొనసాగిస్తుందని చెప్పింది. కాగా గత జూన్లో నాస్కామ్ 2018 ఆర్థిక సంవత్సరానికి ఫ్లాట్ వృద్ధి రేటును అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు ఆదాయాలు కేవలం 7.6 శాతం మాత్రమే పెరిగాయి. దేశీయ ఆదాయం 10-11 శాతం పెరిగింది. అయితే పరిస్థితి ఆశాజనకంగా ఉందనీ, ట్రెండ్ పాజిటివ్గానే ఉండటంతో మంచి వ్యాపార అవకాశాలు లభించనున్నాయని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. దీంతో స్టాక్మార్కెట్లో ఐటీ రంగ షేర్లు బాగా లాభపడుతున్నాయి. -
ఇన్వెస్టర్ల అప్రమత్తత..స్వల్ప లాభాలు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు శుక్రవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు ఎగియగా నిప్టీ 22 పాయింట్లు లాభపడింది. అయితే ఇన్వెస్టర్ల అమ్మకాలతో వెనక్కి తగ్గినా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 35,300కి ఎగువన, నిఫ్టీ 10800ఎగువన ఉన్నాయి. అయితే సరికొత్త గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడి, ఫలితాల ప్రభావం ఉంటుందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. బ్యాంకింగ్, ఐటీ సెక్టార్ లాభాలు మార్కెట్లకు ఉత్సాహాన్నిస్తున్నాయి. హెచ్పీసీఎల్, ఎస్బ్యాంక్, అదానీ, యునైటెడ్ ' స్పిరిట్స్, ఇండియా బుల్స్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్ లాభపడుతుండగా, భారతి ఎయిర్టెల్, ఐడియా, ఆర్కాం, తదితర టెలికాం షేర్లు బలహీనంగా ఉన్నాయి. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ ఇండ్, టీసీఎస్, విప్రో, అశోక్ లేలాండ్, జీ నష్టపోతున్నాయి. -
నష్టాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో మంగళవారం నాటి బలహీన ధోరణి నేడు కూడాకొనసాగుతోంది. సెన్సెక్స్ 73 పాయింట్ల నష్టంతో 33,154 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 10,216 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తున్నాయి. పీఎస్యూ బ్యాంకు టాప్ లూజర్ సెక్టార్గా ఉంది. రియల్టీ మెటల్స్, ఫార్మా లాభాల్లో ఉంది. అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత కొనసాగుతోందని నిపుణులు విశ్లేషణ. భారతి ఎయిర్టెల్, డా. రెడ్డీస్ , లుపిన్, గ్లెన్మార్క్, ఫోర్టిస్ హెల్త్కేర్, అరబిందో , డిష్ టీవీ, లాభపడుతుండగా, ఆసియన్ పెయింట్స్, సెంచురీ టెక్స్టైల్, బాటా, కార్పోరేషనన్ బ్యాంక్, ఎస్బీఐ,, వేదాంతా, పవర్గ్రిడ్, ఐటీసీ, సన్ ఫార్మ, అదానీ నష్టపోతున్నాయి. -
ఫార్మా షైన్..మార్కెట్లు డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆరంభంనుంచి ఒడిదుడుకుల మధ్య సాగిన కీలక సూచీలు ఒక దశలో సెన్సెక్స్ 100 పాయింట్లు కోల్పోయింది. చివరికి స్వల్పనష్టాలకు పరిమితమై వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్30 పాయింట్లు క్షీణించి 32370 వద్ద నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 10,121 వద్ద ముగిసింది. పీఎస్యూ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ సెక్టార్ బాగా నష్టపోగా, రియల్టీ స్వల్ప నష్టలు, ఫార్మా లాభాల్లో టాప్ విన్నర్గా నిలిచింది. వర్క్ హార్డ్, లుపిన్, సన్ ఫార్మా, డా. రెడ్డీస్, సిప్లా, భారతి ఎయిర్టెల్ లాభాల్లో ముగిసాయి. జీ ఎంటర్టెయిన్మెంట్, గెయిల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్ డీవీఆర్ షేర్లు భారీగా నష్టపోయాయి. -
మరో 4 ప్రభుత్వ బ్యాంకుల రుణ రేటు తగ్గింపు
ముంబై: కొత్త నెల ఆరంభం అయిన నేపథ్యంలో– తమ నిధుల లభ్యత వ్యయం ప్రాతిపదికన పలు బ్యాంకులు మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను తగ్గిస్తున్నాయి. ఈ వరుసలో బుధవారం తాజాగా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంసీఎల్ఆర్ను 0.45 శాతం వరకూ తగ్గించాయి. బెంచ్ మార్క్ రేటు కోతతో అనుసంధానమైన గృహ, కారు ఇతర రుణాలు కొంత చౌక కానున్నాయి. రేట్ల తగ్గింపును బ్యాంకుల వారీగా చూస్తే... పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్: ఓవర్నైట్ రేటు పరిమితి 0.45% వరకూ తగ్గించింది. దీనితో ఈ రేటు 8.15%కి తగ్గింది. నెలవారీ కాలపరిమితి రేటు 0.40% తగ్గి 8.20 శాతానికి చేరింది. ఏడాది రేటు 0.15 శాతం తగ్గి 8.55 శాతానికి చేరింది. ♦ ఇండియన్ బ్యాంక్: అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ 0.15 శాతం తగ్గించింది. ♦ విజయా బ్యాంక్: ఏడాది కాలపరిమితి రేటు 0.15 శాతం తగ్గి 8.50కి చేరింది. ♦ ఐడీబీఐ బ్యాంక్: అన్ని కాల వ్యవధులపై రేటు 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ♦ ఇప్పటికే పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, దేనాబ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గింపును ప్రకటించాయి. -
ఒడిదుడుకుల మధ్య స్టాక్మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. స్వల్ప నష్టాలతో మొదలైన ప్రధాన సూచీలు వెంటనే ఫ్లాట్ గామారాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 18 పాయింట్లు కోల్పోయి 31, 628వద్ద, నిఫ్టీ నష్టంతో వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకుషేర్లు నష్టాలతో బ్యాంక్ నిఫ్టీ నష్టాలతో ప్రారంభమైంది. మార్కెట్లో ఒడిదుడుకుల వాతావరణం నెలకొంది. రిలయన్స్ డిఫెన్స్ 5శాతానికి పైగా లాభపడి టాప్లో ఉంది. ఉజ్జీవన్ 3శాతం లాభాలతో, బీఈఎంఎల్, రిలయన్స్, విప్రో, అదాని లాభాల్లో కొనసాగుతున్నాయి. అగాఖాన్ చేతికి డీసీబీ వెడుతోందన్న వార్తలతో డీసీబీ (6శాతం) భారీ పతనాన్ని నమోదు చేసింది. భారతి ఎయిర్టెల్, ఎన్ఫీసీ, బాష్, సన్ఫార్మా, లుపిన్, బయోకాన్, ఎంఅండ్ఎం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 0.01 నష్టాలతో రూ. 64.03 వద్ద ఉండగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి పది గ్రా. రూ.115 క్షీణించి రూ. 29, 547 వద్ద ఉంది -
స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. లాభనష్టాల మధ్య ఒడిదుడుకులతో సాగిన మార్కెట్లు చివరికి నష్టాలనుంచికోలుకున్నాయి. ముఖ్యంగా తొలుత 180 పాయింట్లు జంప్చేసిన సెన్సెక్స్ అనంతరం నష్టాల్లోకి జారుకుంది. చివరలో పుంజుకుని సెన్సెక్స్ 33 పాయింట్లు లాభంతో 31,291 వద్ద, నిఫ్టీ11 పాయింట్ల లాభంతో 9765వద్ద ముగిశాయి. మిడ్, స్మాల్ క్యాప్స్ ఆటో, రియల్ ఎస్టేట్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. భారత్ ఫైనాన్షియల్స్, ఎన్టీపీసీ, ఇండియా బుల్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటార్కార్ప్, అంబుజా,ఇండియన్ హోటల్స్, రిలయన్స్ కేపిటల్, ఎక్సైడ్, క్రాంప్టన్, సన్ టీ వీ, ఆల్కెమ్ లేబ్, టొరంట్ ఫార్మా, టాటా కమ్యూనికేషన్స్, ఇండియన్ బ్యాంక్, టాటా గ్లోబల్ నష్టాల్లోనూ ఇన్ఫోసిస్ స్వల్పంగా, ట్రెండ్, హెచ్సీఎల్ లాభాల్లోనూ ముగిశాయి. -
జీఎస్టీ ఎఫెక్ట్: క్షీణించిన బజాజ్ ఆటో మార్జిన్లు
ముంబై: జీఎస్టీ ఎఫెక్ట్ దేశీయ ఆటో రంగ దిగ్గజం బజాజ్ ఆటో లిమిటెడ్ ను తాకింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నికరలాభంలో బాగా నీరసించింది. క్యూ1(ఏప్రిల్-జూన్)ఈ ఫలితాల్లో కంపెనీ నికర లాభం 6 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే 5.6 శాతం తగ్గి రూ. 924 కోట్లను సాధించింది. ఆదాయం 4 శాతం క్షీణించి రూ. 5,854 కోట్లకు చేరింది. అయితే నికర లాభం, రూ. 907.7 కోట్లుగాను, ఆదాయం రూ. 5,499 కోట్లగాను అంచనాలవేసిన విశ్లేషకులను అధిగమించింది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 17.2 శాతంగా నమోదయ్యాయి. వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచన అనంతర లాభాలు 20.2 శాతం తగ్గి 938.24 కోట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో మార్జిన్లు 20.2 శాతం నుంచి 17.2 శాతానికి తగ్గాయి. భారత్ స్టేజ్ -4 ఉద్గార నిబంధనల మార్పు, జూలై 1 న అమల్లోకి గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బదిలీ కంపెనీ పనితీరు ప్రభావితం చేసిందని రెగ్యులేటరీ ఫైలింగ్ లోకంపెనీ ప్రకటించింది. బీఎస్-3 వాహనాల రద్దు, బీఎస్-4 నిబంధనలకు మారడం, జీఎస్టీ పరిధిలో కొత్త పన్నులు తదితర అంశాలు బజాజ్ ఫలితాలను ప్రభావితం చేశాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. దీంతో అమ్మకాలు క్షీణించాయని పేర్కొన్నారు. జీఎస్టీ అమలు నేపథ్యంలో డీలర్స్కు 320 మిలియన్ల రూపాయలను చెల్లించినట్టు బజాజ్ ఆటో తెలిపింది. వాల్యూమ్లు 10.7 శాతం క్షీణించి ఎనిమిదేళ్ల గరిష్టాన్ని నమోదు చేసింది. 2009 మార్చి క్వార్టర్కు చేరాయని ఈక్విటీ ఎనలిస్టు అశ్విన్ పటేల్ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో షేరు స్వల్పంగా నష్టపోతోంది. -
స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. మిడ్ సెషన్ తరువాత ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ కౌంటర్లలో కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్ 52 పాయింట్లు పుంజుకుని 31,155వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు బలపడి 9,618 వద్ద ముగిసింది. రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ , బ్యాంకింగ్ లాభపడగా, మెటల్ సెక్టార్ నష్టపోయింది. ప్రధానంగా మొండిబకాయిల సమస్క పరిష్కారానికి రూపొందించిన దివాలా చట్టం(ఐబీసీ), చిన్న బ్యాంకుల విలీనం ద్వారా బ్యాంకింగ్ రంగంలో కన్సాలిడేషన్కు తెరలేవనుండటం వంటి అంశాల నేపథ్యంలో పీఎస్యూ బ్యాంకు షేర్లకు డిమాండ్ పుట్టింది. అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఐడీబీఐ ఆంధ్రా బ్యాంక్, బీవోబీ, కెనరా, యూ నియన్ బ్యాంక్, పీఎన్బీ, ఓబీసీ, బీవోఐ బాగా లాభపడ్డాయి. వీటితో పాటుముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ విన్నర్ గా నిలిచింది.అలాగే డా. రెడ్డీస్, లవబుల్ లింగరీస్ భారీగా లాభపడ్డాయి. సిప్లా ఎస్ బ్యాంక్, ఐసీసీ, ఎసీసీ నష్టాల్లో ముగిశాయి. అటు డాలర్ మారకంలో రుపాయి 0.07పైసలు లాభపడి రూ.64.27వ ద్ద ఉండగా, ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. 12 రూపాయలు క్షీణించి రూ.28, 932 వద్ద ఉంది. -
స్వల్ప లాభాలు: మార్కెట్ల లో ఒడిదుడుకులు, ఒత్తిడి
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో 50415 వద్ద,నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 9390 వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా నిఫ్టీ కీలకమైన 9400 స్థాయిని దిగవకు పడిపోయింది. దీంతో ఈ రోజుకూడా తీవ్ర ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫార్మా, ప్రభుత్వ బ్యాంక్ ఇండెక్సులు వరుసగా రెండో రోజు నెగిటివ్గా ఉండగా, ఐటీ , రియల్టీ, ఆటో రంగం స్వల్పంగా లాభాల్లో ఉన్నాయి. టాటా మెటార్స్ టాప్ గెయినర్గాను, టీసీఎస్, విప్రో గెయిల్, టాటా స్టీల్, పవర్గ్రిడ్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, సిప్లా, అరబిందో, బీవోబీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎఫ్పీఐలు అమ్మకాలవైపే మొగ్గు చూడం గమనార్హం. అటు డాలర్మారకంలో రుపీ 0.30 పైసలు పతనమై రూ. 64.85 వద్ద బలహీనంగా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ. 33 లాభపడి రూ. 28,810 వద్ద ఉంది. -
ఈ – ఆఫీసు అమలులో...అట్టడుగున ‘అనంత’
అనంతపురం అర్బన్ : ఈ – ఆఫీసు అమలులో అనంతపురం రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది. ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఫైళ్లు ఈ–ఆఫీసు ద్వారానే పరిష్కరించాలని అధికారులు ఆదేశాలిస్తున్నారు. జిల్లాలో 100కు పైగా ప్రభుత్వ శాఖల్లో ఈ - ఆఫీసు అమలు చేస్తున్నారు. అయితే అమలులో చాలా వెనుకబడి ఉంది. జనవరిలో 1,380 ఫైళ్లు, ఫిబ్రవరిలో 1,004 ఫైళ్లు పరిష్కరించారు. మార్చిలో 741 ఫైళ్లను పరిష్కరించడంతో సరిపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఫ్లైళ్ల పరిష్కారంలో జాప్యం జరిగిందని కొందరు అధికారులు సాకు చూపిస్తున్నారు. వాస్తవంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అనంతపురం జిల్లాలో మాత్రమే జరగలేదు. అనంతపురం ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్, కర్నూలు జిల్లాలు కూడా వస్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా యంత్రాంగానికి అదనపు పని ఏదైనా ఉందంటే అది ఓట్ల లెక్కింపు మాత్రమే. మిగతా ఎన్నికల ప్రక్రియ మూడు జిల్లాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. మార్చిలో వైఎస్ఆర్ జిల్లాలో 6,906 ఫైళ్లు, కర్నూలు జిల్లాలో 1,347 ఫైళ్లను పరిష్కరించారు. జిల్లాలో మాత్రం 741కే పరిమితమైంది. ఒక్క మార్చిలోనే కాదు జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనూ కర్నూలు, వైఎస్సార్ జిల్లాల కంటే అనంతపురం జిల్లా వెనకబడి ఉంది. ఇక రాష్ట్రంలో ఏకంగా 13వ స్థానంలో నిలిచింది. ఈ–ఆఫీసుపై తగ్గిన శ్రద్ధ జిల్లా ఉన్నతాధికారులు ఈ–ఆఫీసు అమలు ప్రారంభంలో పెద్ద ఎత్తున హడావుడి చేశారు. ప్రతి ఫైలు ఈ–ఆఫీసు ద్వారానే రావాలనే కచ్చితమైన ఆదేశాలిచ్చారు. రానురాను ఈ–ఆఫీసుపై సమీక్షలు తగ్గిపోయాయి. అదే స్థాయిలో ఫైళ్ల పరిష్కారమూ మొక్కుబడి తంతుగా మారింది. -
ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 44 పాయింట్ల నష్టంతో 29398 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 9084 వద్ద ముగిశాయి. రోజు మొత్తం కన్సాలిడేషన్ బాటలో ప్రతికూలంగా సాగిన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలో పావు శాతం వడ్డీ పెంపు ఉండొచ్చన్న అంచనాలు బలపడిన నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. ఫెడ్ రేట్లను పెంచనుందనే అంచనాలనేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో అయిదు రాష్ట్రాల్లో బీజేపీ హవాతో రికార్డ్ స్థాయిలను టచ్ చేసిన సెన్సెక్స్, నిఫ్టీ స్వల్పనష్టాలతో అప్రమత్తంగా ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా నెలకొంది. దీంతో ఐటీ 1.8శాతం నష్టపోగా, టీసీఎస్,ఇన్ఫోసిస్ 2 శాతం దిగజారాయి. కాగా మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ షేర్లు మంచి ప్రదర్శన కనబర్చాయి. మిగిలిన అన్ని ఇండెక్సులూ లాభపడగా.. పీఎస్యూ బ్యాంక్, ఆటో లాభపడ్డాయి. ఐడియా 9శాతం, హీరో మోటా కార్ప్, టాటాస్టీల్, ఆర్ ఐఎల్, టాటా మెటార్స్ లాభపడగా, పీవీఆర్ 4శాతం నష్టపోయింది. అలాగే హెచ్యుఎల్, విప్రో ఐసీఐసీఐ కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ నష్టపోయిన వాటిల్లోఉన్నాయి. మరోవైపు డాలర్ మారకంలో రూపాయి 16న నెలల గరిష్టాన్ని తాకింది. 0.20పైసలు లాభపడి 65.64 వద్ద రూ. 65ల ఎగువకు చేరింది. అటు ఫెడ్ అంచనాలతో పుత్తడి బలహీనత కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా.పసిడి రూ. 101లు పతనమై రూ. 27,975వద్ద ఉంది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
పేలవమైన ట్రేడింగ్ అనంతరం స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 50.96 పాయింట్ల లాభంలో 27308.60 వద్ద, నిఫ్టీ 18.10 పాయింట్ల లాభంలో 8435.10 వద్ద క్లోజ్ అయ్యాయి. ఐటీసీ, ఇన్ఫోసిస్, టాటామోటార్స్, గెయిల్ ఇండియా లాభాలతో పేలవంగా ఉన్న మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. గ్లోబల్ సంకేతాలపై పెట్టుబడిదారులు మరింత క్లారిటీ కోసం వేచిచూస్తున్నారని విశ్లేషకులన్నారు. 5.8 శాతం లాభంతో గెయిల్ ఇండియా నిఫ్టీలో టాప్ గెయినర్గా నిలిచింది. బీపీసీఎల్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్, భారీ ఎయిర్ టెల్ నేటి మార్కెట్లో లాభాలు పండించగా... యాక్సిస్ బ్యాంకు, అరబిందో ఫార్మా, లుపిన్, సన్ ఫార్మా, జీ ఎంటర్టైన్మెంట్ నష్టాలు గడించాయి. ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు నేటి సెషన్లో టాప్ లూజర్లుగా ఉన్నాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంకు 1 శాతం పడిపోయాయి. బీఎస్ఈ మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు 0.4 శాతం, 0.3 శాతం పైకి ఎగిశాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.11 పైసలు పడిపోయి 68.18 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధరలు కూడా 200 రూపాయల నష్టంతో 28,591గా నమోదైంది. -
యాక్సిస్ బ్యాంక్ రుణ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో మూడవ బ్యాంకింగ్ దిగ్గజం- యాక్సిస్ బ్యాంక్ పలు కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.15 శాతం నుంచి 0.20 శాతం శ్రేణిలో తగ్గించింది. శుక్రవారం నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది. ఏడాది వరకూ అన్ని కాలపరిమితులపై రుణ రేటును 15 బేసిస్ పారుుంట్లు (లేదా 0.15 శాతం) తగ్గించడం జరిగింది. రెండు, మూడు సంవత్సరాలకు సంబంధించిన కాలపరిమితులపై రేటు 20 బేసిస్ పారుుంట్లు తగ్గింది. దీనిప్రకారం.. ఓవర్నైట్ కాలపరిమితి ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతం. నెలకు సంబంధించి రేటు 8.70 శాతం. మూడు, ఆరు నెలల రేటు వరుసగా 8.90 శాతం 9 శాతంగా ఉంది. ఏడాది కాలాలనికి ఎంసీఎల్ఆర్ 9.05 శాతం అని బ్యాంక్ పేర్కొంది. -
ఫలితాల్లో దూసుకుపోయిన సన్ ఫార్మా
ముంబై: భారతీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా మెరుగైన ఫలితాలను ప్రకటించింది. వడోదరకు చెందిన ఈ కంపెనీ అంచనాలను మించి ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో నికర లాభం రూ. 556 కోట్ల నుంచి రూ. 2034 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం కూడా 22 శాతం ఎగసి రూ. 8243 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 65 శాతం పెరిగి రూ. 2921 కోట్లుగా నమోదైంది. ఇబిటా మార్జిన్లు కూడా 26.1 శాతం నుంచి 35.4 శాతానికి భారీగా బలపడ్డాయి. ఈ కాలంలో రూ. 685 కోట్లమేర అనూహ్య నష్టాలు(ఎక్సెప్షనల్ లాస్) నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. అలాగే పన్ను వ్యయాలు రూ. 113 కోట్ల నుంచి రూ. 353 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. ఈ ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు భారీగా లాభపడింది. ముగింపులో 0.95 శాతం లాభపడి రూ. 800 దగ్గర స్థిర పడింది. -
నిత్యావసర ధరలపై పోరు
2021 వరకూ ద్రవ్యోల్బణం లక్ష్యం 4% న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువుల ధరల కట్టడికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఐదేళ్లలో 4 శాతం ద్రవ్యోల్బణాన్ని లక్ష్యాన్ని స్థిరీకరించింది. మార్జిన్ ‘ప్లస్ లేదా మైనస్ 2’గా నిర్దేశించుకుంది. అంటే పెరిగితే గరిష్ఠ పరిమితి 6 కాగా, తగ్గితే కనిష్ఠ పరిమితి 2 శాతంగా ఉండాలన్న మాట. డిపాజిట్లపై ఇటీవల తగ్గించిన వడ్డీరేట్లు, వాస్తవ రిటర్న్స్ వంటి అంశాల ప్రాతిపదికన ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం ఆరంభంలో ద్రవ్యోల్బణం 4 శాతం వద్ద కట్టడి చేయడానికి ప్రభుత్వానికి, ఆర్బీఐకి మధ్య అవగాహన కుదరటం తెలిసిందే. ప్రభుత్వ తాజా చర్యతో ఆర్బీఐ గవర్నర్ రూపొందించిన ‘ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి ద్రవ్యోల్బణం నమూనా’కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లయింది. ఆగస్టు 9న రాజన్ ద్రవ్యపరపతి సమీక్ష నేపథ్యంలో ఆర్థికశాఖ తాజా అడుగు వేసింది. సెప్టెంబర్ 2013లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టాక రాజన్ మెల్లగా రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. ప్రస్తుతం రెపో రేటు 6.5 శాతానికి దిగివచ్చింది. ద్రవ్యోల్బణం పైపైకే..! జూన్లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 22 నెలల గరిష్ట స్థాయిలో 5.77 శాతంగా ఉంది. ప్రభుత్వం- ఆర్బీఐ మధ్య ఫిబ్రవరిలో కుదిరిన అవగాహన ప్రకారం, ద్రవ్యోల్బణం కట్టుతప్పితే అందుకు కారణాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తుంది. జైట్లీతో రాజన్ భేటీ న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి జైట్లీతో శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ రాజన్ భేటీ అయ్యారు. వచ్చే ఐదేళ్లు 4% ద్రవ్యోల్బణం లక్ష్య నిర్ణయం, ఆగస్టు 9 ద్రవ్య సమీక్ష నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులపై వీరు చర్చలు జరిపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కీలక మద్దతు స్థాయిలకు పైన ఓపెన్ అయ్యి, స్థిరంగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 49పాయింట్ల లాభంతో 28,025 దగ్గర, నిఫ్టీ 22పాయింట్ల లాభంతో 8,612దగ్గర మొదలయ్యాయి. అనంతరం బీఎస్ఈ సెన్సెక్స్ వంద పాయింట్లకుపైగా లాభపడింది. మంగళవారం నిరాశాజనక ఫలితాలను నమోదు చేసిన డా.రెడ్డీ ల్యాబ్స్ భారీగా నష్టపోతోంది. ప్రపంచ మార్కెట్ల విషయానికి వస్తే.. ఆసియా, యూరోప్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. జీఎస్టీ బిల్లు, ఫెడ్ వడ్డీ రేట్ల తదితర అంశాలు మార్కెట్ ను ప్రభావితం చేయనున్నయాని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. అటు కరెన్సీ మార్కెట్ లో రూపాయి డాలర్ తో పోలిస్తే పాజిటివ్ గా ఉంది.స్వల్పలాభంతో 0.10 పైసల లాభంతో 67.26 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి రూ. 30,912 లుగా ఉంది. -
స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: బ్రెగ్జిట్ ప్రకంపనల అనంతరం సోమవారం నాటి దేశీయ మార్కెట్లు స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. 30 స్క్రిప్టుల సెన్సిటివ్ ఇండెక్స్ ( సెన్సెక్స్ ), 53 పాయింట్ల నష్టంతో 26,347 దగ్గర ప్రారంభం కాగా, నిఫ్టీ 17 పాయింట్లనష్టంతో 8.071 పాయింట్ల దగ్గర ప్రారంమైంది,గ్లోబల్ మార్కెట్ల అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో భారత ఈక్విటీ సూచీలు స్వల్పం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మదుపర్లు వేచి చూసే ధోరణిని కొనసాగించే అవకాశం ఉందిన విశ్లేషకుల అంచనా. అటొ రంగం నష్టాల్లో ఉండగా, ఆయిల్ రంగంపాజిటివ్ ట్రెండ్ లో ఉంది. ఎఫ్ ఎంసీజీ, బ్యాంక్ , ఇన్ ఫ్రా సెక్టార్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. వాతావరణ సూచనలతో కొనుగోళ్ల మద్దతులభించే అవకావం ఉందని భావిస్తున్నారు. మరోవైపు దేశీయ కరెన్సీ, పుత్తడి పాజిటివ్ గా ఉన్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి 12 పైసలు లాభపడి 67.84 దగ్గర ఉంది. మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడటం రూపాయి కోలుకుందని ఎనలిస్టులు అంటున్నారు. అటు ఈరోజుకూడా పసిడి మెరుపులు కొనసాగుతున్నాయి. 200 రూ. లాభంతో పది గ్రా. 31,605 దగ్గర ఉంది. దీంతో జ్యువెల్లరీ షేర్ల లాభాలుకొనసాగుతున్నాయి. -
స్వల్పంగా తగ్గిన ఎస్బీఐ రుణ రేటు
5 బేసిస్ పాయింట్లు తగ్గింపుతో 9.15%కి ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును స్వల్పంగా ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 9.20 శాతం నుంచి 9.15 శాతానికి తగ్గింది. దీనివల్ల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్కు అనుసంధానమయ్యే రుణ రేట్లు ఆ మేరకు తగ్గనున్నాయి. మే 1వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా తగ్గింపు ప్రకారం... ఎస్బీఐ ప్రకటన ప్రకారం... మహిళా కస్టమర్లు మినహా మిగిలిన వారికి ఈ స్థిర రేటు 9.40 శాతంగా ఉంటుంది. మహిళా కస్టమర్ల విషయంలో ఈ రుణ రేటు 9.35 శాతంగా ఉంది. కారు రుణ రేటు కూడా ఐదు బేసిస్ పాయింట్లు తగ్గుతుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకూ మినహాయించిన కారు రుణ ప్రాసెసింగ్ ఫీజు రూ.500ను బ్యాంక్ మళ్లీ అమల్లోకి తీసుకువచ్చింది. ఎన్ఆర్ఐ కార్ లోన్స్, ఎస్బీఐ కాంబో రుణ పథకం, ఎస్బీఐ లాయల్టీ కార్ లోన్ స్కీమ్లకు తాజా నిర్ణయం వర్తిస్తుంది. -
తగ్గిన ఎస్బీఐ, ఐసీఐసీఐ గృహరుణ రేటు
న్యూఢిల్లీ: మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు(ఎంసీఎల్ఆర్) ప్రాతిపదికన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ల గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గాయి. ఎస్బీఐ వెబ్సైట్ తెలిపిన సమాచారం ప్రకారం... మహిళా కస్టమర్లు మినహా మిగిలిన వారికి ఈ స్థిర రేటు 9.45 శాతంగా ఉంటుంది. మహిళా కస్టమర్ల విషయంలో ఈ రుణ రేటు 9.4 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ ఈ రేట్లు 9.55 శాతం, 9.5 శాతంగా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ రుణ రేటు కూడా ఎస్బీఐకి సమానంగా ఉంది. ఏప్రిల్ 1 నుంచీ ఎంసీఎల్ఆర్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన ప్రయోజనాన్ని కూడా బ్యాంకులు కస్టమర్కు బదలాయిస్తే... రేణ రేట్లు మరింత తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. గృహాలకు సంబంధించి తాజా ఎస్బీఐ 9.45 శాతం రేటు- ఏడాది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ ఆధారిత రుణ రేటు 9.20 శాతం కన్నా 0.25 శాతం అధికంగా ఉంది. మహిళల విషయంలో ఈ వ్యత్యాసం 0.20 శాతం. మార్చిన రేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయి. కాగా బ్యాంక్ వాహన రుణాల రేట్లు ఏడాది ఎంసీఎల్ఆర్కన్నా 0.60 శాతం అధికంగా 9.80 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ కనీస రుణ రేటు 9.3 శాతం. ఎస్బీహెచ్ లో కొత్త వడ్డీ రేట్ల విధానం షురూ! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) కొత్త వడ్డీ రేట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఒక్క రోజు నుంచి ఏడాది కాల వ్యవధి దాకా 9.20% - 9.65% శ్రేణిలో ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రేట్లను నెలవారీగా సమీక్షించడం జరుగుతుందని బ్యాంకు తెలియజేసింది. ప్రస్తుతం ఎస్బీహెచ్ బేస్ రేటు 9.75% గాను, బెంచ్మార్క్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్) 14.90 శాతంగాను ఉంది. బేస్ రేటు, బీపీఎల్ఆర్ ప్రాతిపదికన రుణాలు తీసుకున్న వారు సైతం కావాలనుకుంటే నిర్దిష్ట నిబంధనల ప్రకారం ఎంసీఎల్ఆర్ విధానానికి మారవచ్చని బ్యాంకు పేర్కొంది. -
మహిళలను తొక్కేస్తున్న వెబ్ మీడియా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ వార్తా వెబ్సైట్లు మహిళల అందానికిచ్చే ప్రాధాన్యం, వారి ఆలోచనలకు ఇవ్వడంలేదట. పురుషులకు సంబంధించి విషయ అవగాహనకు, విశ్లేషణలకు వెబ్సైట్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని తేలింది. ఆన్లైన్లోని వార్తల్లో పురుషుల అభిప్రాయాలు, వాదనలు అక్షరాలతో డామినేట్ చేస్తే మహిళలు మాత్రం ఎక్కువగా ఫోటోలకే పరిమితమయ్యారని యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్ అండ్ కార్డిఫ్ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. అనుభవం లేదు అనే కారణం చూపిస్తూ మహిళలు ఎక్కువగా ఫీచర్స్ ఆర్టికల్స్, ఫ్యాషన్, ఎంటర్ టైన్ మెంట్, ఆర్ట్లకే పరిమితవ్వగా పురుషులు మాత్రం స్పోర్ట్స్, పాలిటిక్స్వంటి వాటిలో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందట. 950 వార్తా వెబ్సైట్లు, 23 లక్షల ఆర్టికల్లు, 6 నెలల సమయం తీసుకొని ఈ పరిశోధనలు చేశారు. వార్తల్లో అట్రాక్షన్ కోసమే కేవలం అలంకార ప్రాయంగానే మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ విషయ పరిజ్ఞానికి వచ్చేసరికి తక్కువ ప్రాధాన్యం లభిస్తోందని తేలింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూమ్!
క్యూ4 లాభంలో 21 శాతం వృద్ధి; రూ. 2,807 కోట్లు - అధిక నికర వడ్డీ ఆదాయాల,మార్జిన్ల తోడ్పాటు - మొండిబకాయిలు తగ్గుముఖం... న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో నికర లాభం 21 శాతం ఎగబాకి రూ.2,807 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,327 కోట్లుగా ఉంది. ప్రధానంగా నికర వడ్డీ ఆదాయాలు(ఎన్ఐఐ) పుంజుకోవడం లాభాల జోరుకు దోహదం చేసింది. కాగా, బ్యాంక్ మొత్తం ఆదాయం క్యూ4లో రూ.15,570 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.12,790 కోట్లతో పోలిస్తే 21.7 శాతం వృద్ధి చెందింది. కాగా, గతేడాదివరకూ బ్యాంక్ త్రైమాసిక లాభాల్లో 30% స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది. ఎన్ఐఐ 21 శాతం అప్... హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎన్ఐఐ మార్చి క్వార్టర్లో రూ.6,013 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రూ.4,953 కోట్లతో పోలిస్తే 21.4 శాతం ఎగసింది. ఇక బ్యాంక్ ఎన్ఐఎం క్యూ4లో 4.4 శాతంగా నమోదైంది. బ్యాంకింగ్ పరిశ్రమలో ఇదే అత్యధికమని బ్యాంక్ డిప్యూటీ ఎండీ పరేష్ సుక్తాంకర్ చెప్పారు. బేస్ రేటులో 0.15 శాతం కోత ప్రకటించినప్పటికీ.. ఎన్ఐఎంను ఈ స్థాయిలోనే కొనసాగించగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. వడ్డీయేతర ఆదాయం(ఫీజులు ఇతరత్రా) 30 శాతం ఎగసి రూ.2,564 కోట్లకు చేరింది. మొండిబకాయిలు తగ్గాయ్... బ్యాంక్ మొండిబకాయిలు(ఎన్పీఏ) క్యూ4లో మరింత మెరుగుపడ్డాయి. స్థూల ఎన్పీఏలు 1 శాతం నుంచి 0.93 శాతానికి తగ్గింది. నికర ఎన్పీఏలు 0.3 శాతం నుంచి 0.2 శాతానికి దిగొచ్చాయి. అయితే, ప్రొవిజనింగ్ మొత్తాన్ని బ్యాంక్ రూ.286 కోట్ల నుంచి రూ.577 కోట్లకు పెంచింది. రుణ పునర్వ్యవస్థీకరణ కంపెనీ(ఏఆర్సీ)లకు రూ.500 కోట్ల విలువైన రుణాలను క్యూ4లో విక్రయించింది. పూర్తి ఏడాదికి ఇలా...: 2014-15 పూర్తి ఏడాదిలో బ్యాంక్ నికర లాభం రూ. 10,216 కోట్లుగా నమోదైంది. రూ.10 వేల కోట్ల మార్కు దాటడం ఇదే తొలిసారి. అంతక్రితం ఏడాది రూ.8,478 కోట్లతో పోలిస్తే లాభం 20.5% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 17.1% వృద్ధితో రూ.49,055 కోట్ల నుంచి రూ.57,466 కోట్లకు ఎగసింది. ఇతర ముఖ్యాంశాలివీ.. ⇒ క్యూ4లో బ్యాంక్ 300 కొత్త బ్రాంచ్లను ఏర్పాటు చేసింది. పూర్తి ఏడాదిలో ఈ సంఖ్య 611గా ఉంది. 10 వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. ⇒ మార్చి క్వార్టర్ రుణాల్లో 21.2% మెరుగైన వృద్ధి నమోదైంది. రిటైల్ విభాగంలో 17%, కార్పొరేట్ విభాగంలో 26% వృద్ధి సాధించింది. మొత్తం రుణాల విలువ రూ.3.65 లక్షల కోట్లకు చేరింది. ⇒ గురువారం బీఎస్ఈలో బ్యాంక్ షేరు ధర స్వల్పంగా క్షీణించి రూ.1,013 వద్ద స్థిరపడింది. గృహ రుణాలపై మహిళలకువడ్డీ తగ్గింపు... ఎస్బీఐ, ఐసీఐసీఐల బాటలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా మహిళలకు గృహ రుణాలపై స్వల్పంగా వడ్డీ తగ్గింపును ప్రకటించింది. మిగతా కస్టమర్లందరికీ 9.9 శాతం వడ్డీ రేటును అమలు చేస్తున్నామని.. మహిళలకు ఈ రేటును 9.85 శాతానికి తగ్గిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ రేణు సూద్ కర్నాడ్ పేర్కొన్నారు. ‘మహిళా శక్తి’ పేరుతో ఈ ఆఫర్ను ఇస్తున్నట్లు చెప్పారు. జాయింట్ ఓనర్గా లేదా సింగిల్గా కొనుగోలు చేసే ప్రాపర్టీపైన మాత్రమే ఈ రేటు వర్తిస్తుంది అని అమె చెప్పారు. ప్లాట్లకు సంబంధించిన రుణాలపై రేటు 9.9 శాతమే ఉంటుందని కూడా కర్నాడ్ వివరించారు. -
ఎల్అండ్టీ లాభం 7% ప్లస్
ముంబై: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 7% పెరిగి రూ. 862 కోట్లకు చేరింది. గతేడాది(2013-14) క్యూ2లో రూ. 806 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. విద్యుత్, హైడ్రోకార్బన్ల విభాగం అమ్మకాలు మందగించడం లాభాలపై ప్రభావాన్ని చూపింది. ఇదే కాలానికి కంపెనీ మొత్తం ఆదాయం సుమారు 11% పుంజుకుని రూ. 21,159 కోట్లను అధిగమించింది. గతంలో రూ. 19,130 కోట్ల ఆదాయం నమోదైంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా అమ్మకాలు మందగించాయని, అయితే వాతావరణం మెరుగుపడుతున్నదని కంపెనీ సీఎఫ్వో ఆర్.శంకర్ రామన్ చెప్పారు. ప్రభుత్వం తీసుకువచ్చిన వృద్ధి ఆధారిత సంస్కరణల ప్రభావం కనిపించడానికి మరికొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. కొత్తగా రూ. 39,797 కోట్ల ఆర్డర్లు సంపాదించింది. ఇది 17% అధికం. దీంతో మొత్తం ఆర్డర్బుక్ విలువ రూ. 2,14,429 కోట్లను తాకింది. దీనిలో అంతర్జాతీయ మార్కెట్ల వాటా 27%. ఇన్ఫ్రా ప్రాజెక్ట్ల అండ ప్రధానంగా మౌలిక సదుపాయాలు(ఇన్ఫ్రాస్ట్రక్చర్), అభివృద్ధి ప్రాజెక్ట్లు సాధించిన పురోగతి ఆదాయాల్లో వృద్ధికి దోహదపడినట్లు రామన్ పేర్కొన్నారు. ఇన్ఫ్రా విభాగం ఆదాయం 27% ఎగసి రూ. 9,633 కోట్లను తాకిందని, ఇందుకు భారీస్థాయిలో లభించిన ఆర్డర్బుక్ సహకరించిందని తెలిపారు. దీనిలో అంతర్జాతీయ వాటా 27%గా వెల్లడించారు. పలు బిజినెస్ విభాగాల్లో ప్రాజెక్ట్లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే విద్యుత్, మెటల్స్, హైడ్రోకార్బన్లు విభాగాలు నెమ్మదించాయని తెలిపారు. డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ల ఆదాయం రూ. 993 కోట్లుగా నమోదుకాగా, విద్యుత్ విభాగం అమ్మకాలు 20% తగ్గి రూ. 1,153 కోట్లకు పరిమితమయ్యాయి. కొత్తగా పొందిన ప్రాజెక్ట్లు అభివృద్ధి దశలో ఉండటమే దీనికి కారణమని రామన్ తెలిపారు. కాగా, హైడ్రోకార్బన్ల బిజినెస్ నుంచి 24% తక్కువగా రూ. 1,804 కోట్ల ఆదాయం లభించినట్లు కంపెనీ వెల్లడించింది. -
‘నేను బతికే ఉన్నా’
ఐ.పోలవరం :రికార్డుల్లో చనిపోయినట్టు చూపించి పింఛను తొలగించడంతో ‘నేను బతికున్నాను’ అంటూ జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఓ మహిళ ప్రజాప్రతినిధులు, అధికారులను మొరపెట్టుకుంది. ఐ.పోలవరం గ్రామంలో గురువారం జరిగిన ‘జన్మభూమి’ గ్రామసభలో ఈ సంఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పాటి సత్యవతి చనిపోయినట్టుగా అధికారులు రికార్డుల్లో చూపించి ఆమె పింఛను తొలగించారు. సత్యవతి భర్త సుబ్బారావు అనారోగ్యంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ 2010 మార్చి 23న మరణించాడు. ఈ మేరకు మరణ ధ్రువీకరణ పత్రాన్ని అప్పట్లో ఆమె అధికారుల వద్ద తీసుకుంది. ఈ క్రమంలో నాలుగేళ్లుగా ఆమె వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల ప్రభుత్వం గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి పింఛను లబ్ధిదారుల సర్వే నిర్వహించింది. ఆ కమిటీ సభ్యులకు కూడా తన ఆవేదనను వెళ్లగక్కి, వితంతు పింఛను మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తును పరిశీలించిన అధికారులు.. ఆమె చనిపోయినట్టుగా రికార్డుల్లో ఉందని గుర్తించారు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి, పింఛను మంజూరు చేయలేమని దరఖాస్తును తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ‘జన్మభూమి’ గ్రామసభలో ఆమె అధికారులు, ప్రజాప్రతినిధుల ముందు తన ఆవేదన వెళ్లగక్కింది. దీనిపై ఎమ్మెల్యే బుచ్చిబాబు, జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్.. ఎంపీడీఓ, తహశీల్దార్, పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. ఆమె బతికుండగా చనిపోయినట్టు ఎలా నమోదు చేశారంటూ ప్రశ్నించారు. ఎంపీడీఓ అప్పారావు సమాధానమిస్తూ రికార్డుల నమోదులో తప్పిదం జరిగిందంటూ చెప్పారు. దీంతో ఎమ్మెల్యే , జెడ్పీటీసీ సభ్యులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పిదాల వల్ల ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. ఇటువంటి పొరబాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రికార్డులు సరిచేసి పింఛను అందేలా చర్యలు తీసుకొంటామని సత్యవతికి ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. -
రెండేళ్లలో డాక్టర్ రెడ్డీస్ మార్జిన్ గెడైన్స్ 25%
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్: ఫార్మా వ్యాపారంలో లాభదాయకత పెంచేందుకు తక్కువ మార్జిన్లున్న ఉత్పత్తులను వదిలించుకొని, వ్యయాలను నియంత్రించేందుకు నిర్మాణాత్మక వ్యూహ రచన చేస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. వచ్చే రెండేళ్లలో మార్జిన్ గెడైన్స్ 25 శాతంగా లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ప్రధమార్థంతో పోలిస్తే ద్వితీయార్థంలో మరిన్ని కొత్త ఔషధ ఉత్పత్తులు మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని బుధవారం రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాత వివిధ ఈక్విటీ రీసెర్చ్ సంస్థలకు చెందిన విశ్లేషకులతో జరిపిన కాన్ఫరెన్స్కాల్లో ఆయన ఈ విషయం వెల్లడించారు.డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్కు నోటి ద్వారా తీసుకునే మందుల (ఓరల్ సాలిడ్స్) తయారీ సంస్థగా మార్కెట్లో పేరుంది. అయితే దీనికి భిన్నంగా కొన్నేళ్లుగా ఇన్జెక్టబుల్స్పై దృష్టి పెట్టామని, ఈ ఏడాది ఫైల్ చేసిన 11 ఏఎన్డీఏ (అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్స్)లలో 50 శాతం ఇంజెక్టబుల్స్, టాపికల్స్, ప్యాచెస్, సాఫ్ట్ జెల్స్ ఉన్నాయని అభిజిల్ ముఖర్జీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఏడాది 60 శాతానికి పెరుగుతుందని, దీని వల్లనే పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) వ్యయాలు పెరుగుతున్నాయన్నారు. చర్మ వ్యాధుల చికిత్సలో వాడే ఔషధాల తయారీలో పోటీ తక్కువగా ఉండటంతో పాటు లాభదాయకత అధికంగా ఉండటంతో ఆ మార్కెట్పై దృష్టి పెట్టామన్నారు. వెనిజులా ప్రధాన మార్కెట్? అమెరికా, రష్యా తర్వాత వెనిజులా దేశం తమకు అత్యంత ప్రధాన మార్కెట్గామారిందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రధామార్థంతో పోలిస్తే ద్వితీయార్థం ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉంటాయన్నారు. అమెరికా మార్కెట్లో సరఫరా చేస్తున్న జనరిక్ ఔషధాల ధరలు గత రెండేళ్లలో అనూహ్యంగా పెరగడంపై దర్యాప్తు కోరుతూ అక్కడి ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన వివాదాస్పద అంశాలపై సాధికార వివరణలిచ్చామని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) సౌమెన్ చక్రవర్తి తెలిపారు. -
మూడు ఓట్ల మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి!
చండీఘర్: హర్యానాలో సోనెపట్ జిల్లాలోని రాయ్ శాసనసభ నియోజకవర్గంలో ఇద్దరు వృద్ధుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ జరిగింది. పోటీ ఏ స్థాయిలో జరిగిందంటే, 62 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ సిటింగ్ ఎమ్మెల్యే జై తిరథ్ దహియా కేవలం మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి 68 ఏళ్ల ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎన్డి)ఇంద్రజిత్ దహియాపై ఆయన గెలుపొందారు. ఎన్నిక ల అధికారులు ప్రకటించిన ప్రకారం జై తిరథ్ దహియాకు 36,703 ఓట్లు, 68 ఏళ్ల ఇంద్రజిత్ దహియాకు 36,700 ఓట్లు వచ్చాయి. మూడవ స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కృష్ణ గేహ్లవాట్కు 34,523 ఓట్లు పోలయ్యాయి. ** -
బ్యాంకులు అటూ.. ఇటూ..
ముంబై: ఆర్బీఐ పాలసీ విధానంపై బ్యాంకుల్లో మిశ్రమ స్పందన కనిపించింది. ఎస్బీఐ వంటి కొన్ని బ్యాంకులు మినహా మిగతావి స్వాగతించాయి. బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయాలను తగ్గించే దిశగా సమతుల్యమైన, ఆచరణాత్మకమైన చర్యగా అభివర్ణించాయి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని (ఎంఎస్ఎఫ్) తగ్గించడం వల్ల తమ బ్యాంకు నిధుల సమీకర ణ వ్యయాలు తగ్గుతాయని, అయితే రెపో రేటు పెంపు వల్ల ఆ ప్రయోజనాలు దక్కకుండా పోతాయని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఆర్బీఐ తాజాగా రెపో రేటు పెంచిన ప్రభావం.. వడ్డీ రేట్లపై తక్షణమే పెద్దగా ఉండకపోవచ్చని కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఏకే గుప్తా తెలిపారు. ఆర్బీఐ ఒక విధంగా సమతుల్యం పాటించే ప్రయత్నం చేసిందన్నారు. ద్రవ్యోల్బణం కట్టడిపైనే ప్రధానంగా దృష్టి నిలపడం మంచిదేనని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కంట్రీ సీఈవో సునీల్ కౌశల్ చెప్పారు. మార్కెట్ ప్రారంభంలో తీవ్ర అసంతృప్తికి లోనైనప్పటికీ, తాము ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. దీన్ని వృద్ధి విఘాత చర్యగా భావించరాదని తెలిపింది. స్వల్పకాలికంగా మనీమార్కెట్ రేట్లు, డిపాజిట్ రేట్లూ తక్షణమే దిగి రాగలవని, బ్యాంకులకు కొంత ఊరట లభించగలదని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ ఎం నరేంద్ర తెలిపారు. వడ్డీ రేట్లు పెరుగుతాయ్.. పండున సీజన్ సమయంలో రుణాలకు భారీ డిమాండ్ ఉం టుంది. దానికి అనుగుణంగా బ్యాంకు లూ డిపాజిట్ల సమీకరణలో ఉంటాయి. ఈ పరిస్థితుల్లో డిపాజిట్ రేట్లు పెరగొచ్చు.. అలాగే రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరగొచ్చు. బేస్ రేటు అనేది పాలసీ రేటుపై కాకుం డా బ్యాంకుల వద్ద ద్రవ్య లభ్యత, డిపాజిట్లు..రుణాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. - ప్రతీప్ చౌదరి, చైర్మన్, ఎస్బీఐ సమతౌల్యమైన విధానం.. సమీప భవిష్యత్లో సమస్యలను పరిష్కరించే దిశగా ఇది సమతౌల్యమైన విధా నం. స్వల్పకాలంలో మార్కెట్లలో స్థిరత్వం, దీర్ఘకాలికంగా ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేదిగా దీన్ని సానుకూల దృక్పథంతో చూడాలి. - చందా కొచర్, ఎండీ, ఐసీఐసీఐ బ్యాంక్