కష్టాల కడలిలో కాంగ్రెస్ | congress loose in JharkhandKashmir elections | Sakshi

కష్టాల కడలిలో కాంగ్రెస్

Dec 24 2014 1:58 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌కు మళ్లీ చావుదెబ్బ! మరో రెండు రాష్ట్రాలు ఆ పార్టీ చేజారాయి.

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు మళ్లీ చావుదెబ్బ! మరో రెండు రాష్ట్రాలు ఆ పార్టీ చేజారాయి. జార్ఖండ్, కశ్మీర్ ఎన్నికల్లో ఓటమితో  కష్టాలు పెరిగాయి. గత లోక్‌సభ ఎన్నికల నుంచి వరుస పరాజయాలే ఎదురవుతున్న నేపథ్యంలో పార్టీలో అంతర్మథనం మొదలైంది. లోక్‌సభ 44 మంది ఎంపీలకే పరిమితమైన కాంగ్రెస్.. ఆ తర్వాత మహారాష్ర్ట, హరియాణా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. మోదీ హవాలో కొట్టుకుపోయింది. తాజాగా జార్ఖండ్‌లోనూ అదే పునరావృతమైంది. జేడీయూ, ఆర్జేడీతో కాంగ్రెస్ చేతులు కలిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ఈ కూటమి పదిలోపు సీట్లకే పరిమితం కావడం ఊహించని పరిణామం. జార్ఖండ్ ప్రభుత్వంలో జేఎంఎంతో కలిసి భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీలు ఎన్నికల వేళ వేరుగా పోటీచేసినా పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఇక కశ్మీర్‌లో ఎన్‌సీతో కలిసి ఆరేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు షాక్‌నిచ్చాయి. బీజేపీ అనూహ్య విజయాలు సాధించి రాష్ర్టంలో రెండో పెద్ద పార్టీగా మారడం ఆ పార్టీకి శరాఘాతమే.

తన ఓటమి కంటే కాషాయ పార్టీ బలపడటమే కాంగ్రెస్‌ను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. బీజేపీని అడ్డుకునేందుకు పీడీపీకి మద్దతిచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఈ దిశగా ప్రకటన లు కూడా గుప్పిస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని పార్టీ ప్రతినిధి అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement