సామాన్యుల చెంతకు.. సంపన్నురాలు | Country's richest woman campaigns like a commoner | Sakshi
Sakshi News home page

సామాన్యుల చెంతకు.. సంపన్నురాలు

Oct 4 2014 2:57 PM | Updated on Aug 14 2018 7:49 PM

సావిత్రి జిందాల్ 64 ఏళ్ల వయసులోనూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

హిసార్: ఆమె దేశంలోనే అత్యంత సంపన్నురాలు. కార్పొరేట్ దిగ్గజం, రాజకీయ వేత్త నవీన్ జిందాల్కు స్వయానా తల్లి. హర్యానా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి. అయితేనేం ఓట్ల కోసం ఓ సామన్య పౌరురాలిగా రోడ్ల వెంటపడ్డారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. ఆమే ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్.

హిసార్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న సావిత్రి జిందాల్  64 ఏళ్ల వయసులోనూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉండే సావిత్రి ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటూ నియోజకవర్గమంతా కలియదిరుగుతున్నారు. ఉపన్యాసాలు పెద్దగా ఇవ్వకుండా తాను చేసిన అభివృద్ధి గురించి చెబుతూ మరో అవకాశం ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. హిసార్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన సావిత్రి హ్యాట్రిక్ విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన వందమంది జాబితాలో సావిత్రి కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement