భువనేశ్వర్: హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్న ఓ విమానాన్ని సోమవారం భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి ఛాతినొప్పి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని చికిత్స నిమిత్తం భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. 30 నిమిషాల అనంతరం విమానం కోల్కతాకు బయల్దేరినట్టు విమానాశ్రయ అధికారులు చెప్పారు. అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని శశి మీనన్గా గుర్తించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.
హైదరాబాద్ ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్
Published Mon, Nov 30 2015 7:28 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement