Bhubaneswar
-
ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం.. 30 బోట్లు దగ్ధం
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పారాదీప్ ఫిషింగ్ హార్బర్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 30 ఫిషింగ్ బోట్లు దగ్థం.. కోట్లలో ఆస్తి నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
కలిమెల సమితిలో దారుణం
మల్కన్గిరి(భువనేశ్వర్): మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి గుముకా పంచాయతీలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఆత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేశాడో మృగాడు. వివరాల్లోకి వెళితే.. గుముకా గ్రామంలో సీంగే మడ్కమి (30) అనే మహిళ నివసిస్తుంది. ఆమె భర్త మాల్ల మడ్కమి వలస కూలీగా ఆంధ్రాలో పని చేస్తున్నాడు. వీరి తొమ్మిదేళ్ల కుమారుడు వెంకటాపల్లేం ఆశ్రమ పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్నారు. సీంగే పొలం పనులు చేసుకుంటూ ఒక్కర్తే ఉంటుంది. సీంగే ఓంటరిగా ఉంటున్నట్టు తెలుసుకున్న పుల్లిమేట్ల గ్రామానికి చెందిన ముక్క పడియామి గురువారం సాయంత్రం ఆమె ఇంట్లోకి చొరబడి ఆత్యాచారం జరిపి అనంతరం చంపేశాడు. సీంగే కేకలు విన్న స్థానికులు ఇంటి తలుపులు తెరచి చూడగా నిందితుడు పారిపోతుండగా పట్టుకొని చెట్టుకు కట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం కలిమెల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసు ఐఐసీ చంద్రకాంత్ తండ వచ్చి నిందితుడ్ని అరెస్టు చేశారు. అయితే స్థానికులు కొట్టడంతో తీవ్రంగా గాయపడడంతో అతన్ని కలిమెల ఆరోగ్యకేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా సీంగే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు భర్తకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు. -
చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా
కోదాడ రూరల్: ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు చాక్లెట్ల రూపంలో గంజాయి తరలిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను సూర్యాపేట జిల్లా కోదాడ ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం రామాపురం క్రాస్రోడ్లో అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఆపారు. బస్సులో అనుమానాస్పదంగా కనిపించిన భువనేశ్వర్లోని మయూర్బంజ్కు చెందిన అనిల్కుమార్, రజని, బంకిమ్చంద్ర, మమితనాయక్, సంజిబాని దెబురాయ్, జానునాయక్ను కిందకు దింపి వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, 25 ప్యాకెట్లలో 5 కేజీల బరువున్న వెయ్యి గంజాయి చాక్లెట్లు బయటపడ్డాయి. ఆరుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎౖక్సైజ్ సీఐ తెలిపారు. ఈ ఆరుగురు నిందితులు హైదరాబాద్లో పనిచేస్తుంటారు. ట్రావెల్స్ బస్సు ఏపీలోకి ప్రవేశించిన తర్వాత పలాసలో అక్కడి పోలీసుల తనిఖీ చేసినప్పటికీ వాటిని ఆయుర్వేదిక్ చాక్లెట్లుగా వారిని నమ్మించి బయటపడ్డారు. బస్సు తెలంగాణలోకి ప్రవేశించే మార్గంలో రామాపురం క్రాస్రోడ్లో కోదాడ ఎక్సైజ్ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. -
ఆగిన గుండె.. 90 నిమిషాలకు తిరిగి కొట్టుకుంది!
భువనేశ్వర్: ఆగిపోయిన ఒక సైనికుడి గుండెను.. తిరిగి కొట్టుకునేలా చేసి ఆ వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు. శుభాకాంత్ సాహు అనే ఈ జవాను వయసు 24 ఏళ్లు. అక్టోబర్ 1వ తేదీన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతనికి చికిత్స కొనసాగుతోంది. అయితే..ఉన్నట్లుండి ఈ మధ్య అతని గుండె ఆగిపోయింది. దీంతో డాక్టర్లు సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. అయినా చలనం లేకపోవడంతో ఎక్స్ట్రాకార్పోరియల్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (ఈసీపీఆర్) చేశారు. దీంతో 90 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైంది. ఆపై 30 గంటల గుండె లయబద్ధంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మరో 96 గంటల తర్వాత అతనికి ఎక్మోను తొలగించారు. ఇలా..ఒడిషా భువనేశ్వర్లోని ఎయిమ్స్ బృందం అతని ప్రాణాలు నిలబెట్టింది. సాంకేతికంగా ఈసీపీఆర్ విధానం అనేది సవాళ్లతో కూడుకున్నదని, అయినప్పటికీ గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అనువైందని డాక్టర్ శ్రీకాంత్ బెహరా చెబుతున్నారు. ప్రస్తుతం శుభాకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారాయన. -
కల్కి అవతారమంటూ బాలుడికి పూజలు
భువనేశ్వర్: రాష్ట్రంలో ఓ బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ వైఖరి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎస్సీపీసీఆర్) స్వయంగా కేసు నమోదు చేసింది. స్థానిక ఖండగిరి ప్రాంతంలో శ్రీ వైకుంఠ ధామం ప్రాంగణంలో బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్న ప్రసారం ఆధారంగా భరత్పూర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దుమారం తార స్థాయికి తాకింది. బాలల హక్కుల సంఘం ఈ మేరకు సమగ్ర నివేదిక దాఖలు చేయాలని భరత్పూర్ ఠాణా పోలీసులకు తాఖీదులు జారీ చేసింది. ఈ మేరకు 15 రోజుల గడువు మంజూరు చేసింది. బాలల సంక్షేమ కమిటి ఈ ప్రసారంపై విచారణ చేపట్టాలని ఎస్సీపీసీఆర్ ఆదేశించింది. వివాదంలో చిక్కుకున్న కల్కి అవతార బాలుడు ప్రముఖ భాష్యకారుడు కాశీనాథ్ మిశ్రా కుమారుడు. సాంఘిక మాధ్యమంలో ప్రసారమైన ఫొటోలు అభూత కల్పనగా ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాలపై లోతుగా విచారణ చేపట్టి వాస్తవాస్తవాల్ని వెలుగులోకి తేవాలని ఆయన అభ్యరి్థంచారు. -
ఛాతీపై కొట్టి, లైంగికంగా వేధించి.. ఆర్మీ ఆఫీసర్కు కాబోయే భార్యపై పోలీసుల దాష్టీకం
భువనేశ్వర్: న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం చేసిన దారుణ ఘటనలో విస్తుగొలిపే వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులను ఒడిశా సర్కార్ సస్పెండ్చేసి కేసును సీఐడీకి అప్పగించింది. అసలేం జరిగింది? పశ్చిమ బెంగాల్లో ఆర్మీ మేజర్గా పనిచేసే ఒక యువ ఆర్మీ అధికారి తన కాబోయే భార్యను భువనేశ్వర్లో సెప్టెంబర్ 14వ తేదీన ఆమెకు చెందిన రెస్టారెంట్ వద్ద కలిశారు. తర్వాత రెస్టారెంట్ మూసేసి ఇద్దరూ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కారులో ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో కొందరు ఆకతాయిలు వీరిని కారు ఆపి వేధించారు. ఆకతాయిలపై ఫిర్యాదుచేసేందుకు వీరిద్దరూ దగ్గర్లోని భరత్పూర్ పోలీస్స్టేషన్కు వెళ్లారు. అయితే అక్కడ తమకు ఘోర అవమానం జరిగిందని బాధిత మహిళ చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో గురువారం బెయిల్పై విడుదలయ్యాక గాయాలతో ఆమె ప్రస్తుతం భువనేశ్వర్ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ‘‘ఆకతాయిలపై ఫిర్యాదు చేయడానికి పోలీస్స్టేషన్కు వెళ్తే అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. ఎఫ్ఐఆర్ నమోదుచేయడానికి నిరాకరించారు. పైగా బూతులు తిట్టారు. వాగ్వాదానికి దిగిన ఆర్మీ ఆఫీసర్ను లాకప్లో పడేశారు. అదేంటని ప్రశ్నించినందుకు నన్ను అక్కడి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కట్టేసి లాకప్లో పడేశారు. చాలా సేపటి తర్వాత ఒక పోలీసు అధికారి ఒకతను గదిలోకి వచ్చి నా ఛాతీ మీద చాలా సార్లు కొట్టాడు. తర్వాత నా ప్యాంట్ విప్పి అతని ప్యాంట్ కూడా విప్పాడు. జననాంగం చూపిస్తూ ‘‘అరవకుండా నువ్వు నోరు మూసుకుని ఉండటానికి నీకు ఎంత సమయం కావాలి?’ అని బెదిరించాడని వివరించింది. ఘటనను జాతీయ మహిళా కమిషన్ సూమోటోగా స్వీకరించింది. మూడ్రోజుల్లోగా ఘటనపై నివేదించాలని ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) వైబీ ఖురానియాను ఆదేశించింది. జ్యుడీషియల్ విచారణ జరపాలి: పటా్నయక్ ఘటనపై మాజీ సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘హేయమైన ఘటనలో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలి. కోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు జరిపించాలి’’ అని శాసనసభలో పట్నాయక్ డిమాండ్చేశారు. శనివారం రాజ్భవన్ ఎదుట ధర్నా చేస్తామని బీజేడీ ప్రకటించింది. ‘‘కాషాయపార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ పోలీసులు రక్షకులుగా కంటే భక్షకులుగా తయారయ్యాయి. మహిళకు పోలీస్స్టేషన్లో ఇంతటి అవమానం జరిగితే, ఆర్మీ కెప్టెన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రధాని ఒక్కమాటైనా మాట్లాడరా?. బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోంది?’’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్భవన్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు ధర్నాకు దిగారు.పోలీసుల సస్పెన్షన్ ఘటనపై భారత సైన్యం సైతం స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఒడిశా సర్కార్ను కోరింది. దీంతో ఈ ఉదంతంలో సంబంధం ఉన్న భరత్పూర్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జ్ దినకృష్ణ మిశ్రా, సబ్ ఇన్స్పెక్టర్లు వైశాలిని పాండా, సలిలామయీ సాహో, సాగరికా రథ్, కానిస్టేబుల్ బలరాం హన్స్డాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేసును సీఐడీకి బదిలీచేయగా సస్పెండ్ అయిన పోలీసులపై శుక్రవారం కేసు నమోదుచేశారు. ‘‘నా కూతురును దవడ కదిలిపోయేలా దారుణంగా కొట్టారు. న్యాయం కోసం వస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారు’’ బాధిత మహిళ తండ్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన సైన్యంలో బ్రిగేడియర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ జంటను వేధించిన ఏడుగురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
గణపతి పూజలో పాల్గొన్నా కాంగ్రెస్కు నచ్చట్లేదు
భువనేశ్వర్: సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజలో పాల్గొన్నందుకు తనపై విమర్శలు పెంచిన కాంగ్రెస్కు ప్రధాని మోదీ మంగళవారం దీటుగా బదులిచ్చారు. ఒడిశాలోని భువనేశ్వర్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ గణేశ్ ఉత్సవం దేశంలో కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన వేడుక కాదు. దేశ స్వాతం్రత్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉత్సవం. ఆకాలంలో బ్రిటిష్ పాలకులు సైతం గణేశ్ ఉత్సవాలను ద్వేషించాలంటూ భారత్లో విభజించు, పాలించు కుట్రను అమలుచేశారు. ఇప్పుడు కూడా అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్న కొందరు గణపతి పూజలో పాల్గొంటే సమస్యలొస్తాయంటూ సమాజాన్ని విభజించే పనిలో బిజీగా మారారు. గణపతి పూజలో పాల్గొన్న నాపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాల్లో పీకలదాకా కోపముంది. కాంగ్రెస్పాలిత కర్ణాటకలో గొడవలు జరుగుతాయంటూ ఏకంగా గణపతి విగ్రహాన్నే కటాకటాల వెనక్కి నెట్టారు. పోలీస్వ్యాన్లో గణపతి విగ్రహం ఫొటో చూసి యావత్భారతావని బాధపడింది. ఇక ఇలాంటి విద్వేష శక్తుల ఆట కట్టించాల్సిందే. దేశాన్ని కుల, మత ప్రాతిపదికన బ్రిటిషర్లు విభజించాలని చూస్తే లోకమాన్య తిలక్ గణేశ్ ఉత్సవాలతో దేశ సమైక్య స్ఫూర్తిని మరింతగా రగిల్చారు. కుల మతాలకతీతంగా ఐక్యంగా ఎలా ఉండాలో గణేష్ ఉత్సవాలు మనకు చాటిచెప్పాయి’’ అని మోదీ అన్నారు. రూ.2,871 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభం తన నాయకత్వంలో మూడోదఫా పాలన మొదలై 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం మోదీ ఒడిశాలో రూ.2,871 కోట్ల విలువైన రైల్వే, జాతీయరహదారులకు సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపనలు చేసి కొన్నింటిని ప్రారంభించారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వ కీలక పథకం ‘ సుభద్ర యోజన’ను ప్రారంభించారు. భువనేశ్వర్లోని సబర్ సాహీ మురికివాడలో ప్రధానమంత్రి ఆవాస్యోజన(పట్టణ) 20 మంది లబి్ధదారుల ఇళ్లను మోదీ స్వయంగా ప్రారంభించి వారితో మోదీ ముచ్చటించారు. పుట్టినరోజున తమ ఇంటికొచి్చన మోదీకి ఆ గిరిజనులు అంగవస్త్రం ఇచ్చి ఆహా్వనించి నుదుటిన గంధం»ొట్టు పెట్టారు. ప్రేమతో తనకు వారు ఇచి్చన తీపి వంటకం ఖీర్ను మోదీ రుచిచూశారు. -
Ratna Bhandar: తెరిచి ఉన్న చెక్క పెట్టెలు!
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం రత్న భాండాగారం స్థితిగతుల పట్ల సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రత్న భాండాగారం ఉన్నత స్థాయి తనిఖీ పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ విశ్వనాథ్ రథ్ తాజా ప్రకటన మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రత్న భాండాగారం లోపలి గదిలో ఓ ఇనుప పెట్టె ఉంది. దీనికి 2 తాళాలు వేసేందుకు సదుపాయం ఉంది. ఒక తాళం సరిగ్గా ఉండగా, మరొకటి వదులుగా వేలాడుతుందని పేర్కొన్నారు. అలాగే మరో 2 చెక్క పెట్టెలు తాళాలు లేకుండా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 1978లో రత్న భాండాగారంలోకి ప్రవేశించిన వారు ఇలా తాళాలు వేయకుండా బయటకు వచ్చారని తాను నమ్మలేకపోతున్నానని రథ్ పేర్కొనడం గమనార్హం. -
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
భువనేశ్వర్: విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా వడగళ్ల వాన వల్ల దెబ్బతింది. విమానం విండ్షీల్డ్ పగుళ్లిచ్చింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.భువనేశ్వర్తోపాటు పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ నుంచి ఢిల్లీ విమానం టేకాఫ్ అయిన కేవలం పది నిమిషాల్లో తిరిగి ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానంలో ప్రయాణిస్తున్న ఉన్న 169 మంది ప్రయాణికులు, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.వడగళ్ల వాన వల్ల విస్తారా విమానం దెబ్బతిన్నట్లు బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. వడగళ్ల వల్ల విమానం విండ్షీల్డ్ పగుళ్లిచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలిపారు. విమానంలోని 169 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. -
Brain Dead: బాలుడి అవయవాలు దానం.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఒడిశాలో బ్రెయిన్ డెడ్తో మరణించిన ఎనిమిదేళ్ల బాలుడి అవయవాలను అతని తల్లిదండ్రులు దానం చేశారు. బాలుడి మృతదేహాన్ని ఒడిశా ప్రభుత్వం సోమవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. భువనేశ్వర్కుచెందిన శుభజిత్ సాహు రెండో తరగతి చదువుతున్నారు. ఇటీవల పరీక్షకు హాజరవుతుండగా మూర్ఛతో కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్చగా.. కోమాలోకి వెళ్లిన్నట్లు వైద్యులు వెల్లడించారు. క్రమంగా అతడి మెదడు పనిచేయడం మానేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బాలుని అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రి వైద్యులకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. బాలుడిమూత్ర పిండాలు, ఇతర అవయవాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించి భద్రపరిచి పార్థివ దేహాన్ని వారికి అప్పగించారు. అవయవ దానం చేసిన వారికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయించింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం జంట నగరాల పోలీస్ కమిషనర్ సంజీవ్ పండా, ఇతర అధికారుల సమక్షంలో సత్యనగర్ రుద్రభూమిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
రూ.2వేల నోట్లు మార్చడానికి కిరాయి మనుషులు.. ఆర్బీఐ ఆఫీస్ వద్ద హల్చల్!
రూ.2 వేల నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. ఆ తర్వాత అక్టోబర్ 8 నుంచి ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లు మార్చుకునేందుకు వీలు కల్పించారు. దీంతో ఇంకా తమ వద్ద రూ.2 వేల నోట్లు ఉన్నవారు ఆర్బీఐ కార్యాలయాలకు వచ్చి మార్చుకుంటున్నారు. అయితే కొంత మంది కిరాయి వ్యక్తులు క్యూలైన్లలో హల్చల్ చేస్తున్నారు. ఈ మేరకు మీడియాలో రావడంతో ఒడిశా పోలీస్ శాఖలోని ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు భువనేశ్వర్లోని ఆర్బీఐ కార్యాలయానికి చేరుకున్నారు. రూ. 2 వేల నోట్లు మార్చుకునేందుకు ఇక్కడి క్యూ లైన్లలో నిలబడిన వ్యక్తులను.. తమ నోట్లే మార్చుకుంటున్నారా లేదా వేరొకరి కోసం వచ్చారా అని ఆరా తీశారు. ఒక్కొక్కరికి రూ.300! నోట్ల మార్పిడి కోసం ఆర్బీఐ కార్యాలయం వద్ద క్యూలో ఉన్నంటున్న వారిలో కొంతమంది వేరొకరి నోట్లను మార్చడం కోసం క్యూలో నిల్చుంటున్నారని, ఇందు కోసం రూ.300 కిరాయి తీసుకుంటున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఆర్బీఐ కౌంటర్లో రూ. 2,000 కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు కొంతమంది కిరాయి వ్యక్తులు వస్తున్నట్లు మీడియా కథనాలు రావడంతో తాము ఇక్కడికి వచ్చినట్లు ప్రత్యేక బృందానికి చెందిన ఒక అధికారి తెలిపారు. నోట్లను మార్చుకోవడానికి క్యూలో నిలబడిన వ్యక్తుల ఆధార్ కార్డులను పరిశీలించామని, వారి వృత్తి గురించి కూడా అడిగామని చెప్పారు. క్యూలో చాలా మంది కచ్చితంగా 10 రూ. 2,000 నోట్లను పట్టుకుని కనిపించారని మరో అధికారి తెలిపారు. కాగా ఆర్బీఐ కార్యాలయాల కౌంటర్లలో ఒక్కొక్కరు గరిష్టంగా 10 రూ.2 వేల నోట్లు అంటే రూ.20 వేలు మాత్రమే మార్చుకునేందుకు వీలుంది. ఈ నేపథ్యంలో క్యూలో నిల్చున్న వ్యక్తులను ప్రశ్నించడమే కాకుండా అక్కడి సీసీటీవీ ఫుటేజీని కూడా అధికారులు తనిఖీ చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఒడిశా పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు తనను కలవలేదని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ ఎస్పీ మహంతి తెలిపారు. క్యూలో అనుమానిత వ్యక్తులను వారు ఆరా తీసి ఉండవచ్చని, దీనికి సంబంధించి దర్యాప్తు సంస్థ వివరణ కోరడానికి వస్తే పూర్తిగా సహకరిస్తామని ఆయన చెప్పారు. -
గాల్లోకి కరెన్సీ నోట్లు
భువనేశ్వర్: సిబ్బందితో వాగ్వాదం వలన వినియోగదారులు కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరిన విచిత్ర ఘటన స్థానిక భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కార్యాలయం ఆవరణలో బుధవారం చోటుచేసుకుంది. పలువురు వ్యక్తులు చిరిగిన మరియు తడిసిన ఇతరేతర కారణాలతో పాడైన నగదు నోట్లను మార్చి, కొత్త నోట్లు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంకును సందర్శించారు. అయితే చెడిపోయిన నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర నిరుత్సాహానికి గురైన వినియోగదారులు తమ దగ్గర అక్కరకు రాకుండా ఉన్న నగదు నోట్లను గాలిలోకి రువ్వి వినూత్న రీతిలో నిరసన ప్రదర్శించారు. ఫలితంగా రూ.100, రూ.200, రూ.500ల విలువైన చెడిపోయిన కరెన్సీ నోట్లు ఆర్బీఐ కార్యాలయం ఆవరణ మరియు ఎదురుగా ఉన్న వీధిలో పడి ఉండడంతో అసాధారణ పరిస్థితి నెలకొంది. చెడిపోయిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు వచ్చాం. బ్యాంకు ఉద్యోగులు ఆ నోట్లను స్వీకరించలేదు. అందుకే ఇలా నిరసనగా నోట్లను గాలిలోకి విసిరినట్లు కొంతమంది బాధిత వర్గాలు తెలిపారు. నోట్ల మార్పిడి కౌంటర్ మూసివేత ఈనెల 3వ తేదీ నుంచి చెడిపోయిన నోట్ల మార్పిడి కౌంటర్ను మూసివేసినట్లు బ్యాంకు అధికారులు తెలియజేసి వినియోగదారులను నచ్చజెప్పేందుకు విఫలయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ఖాతాదారులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. బ్యాంకు అధికారులు, ఖాతాదారుల మధ్య మాటల తూటాలు పేలడంతో పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించి ఆందోళనకారులను శాంతింపజేశారు. తడిసిన, చిరిగిన, మరియు పాడైన నోట్లను మార్చుకోవాలని మరియు నాణేలు, నోట్లను ప్రజల నుంచి లావాదేవీలు లేదా మార్పిడి కోసం స్వీకరించాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు సూచించినట్లు భారత రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. దీనికోసం ప్రజలు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యవహారంలో ఖాతాదారులు, వినియోగదారులకు అసౌకర్యం లేకుండా బ్యాంకు వర్గాలు స్పందించాల్సి ఉంది. -
హాస్టల్ భోజనంలో చచ్చిన కప్ప.. షాకైన విద్యార్థి
రెస్టారెంట్, హోట్సల్, హాస్టల్స్, ఇలా ప్రతిచోట సర్వ్ చేస్తున్న భోజనంలో కీటకాలు, పురుగు దర్వనమిస్తుండటం కలవరం రేపుతోంది. భోజనంలో బల్లులు, ఎలుకలు, బొద్దింకలు, కప్పలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒడిశాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. భువనేశ్వర్లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ(కేఐఐటీ) హాస్టల్ భోజనంలో ఓ విద్యార్థికి చచ్చిన కప్ప ప్రత్యక్షమైంది. కేఐఐటీ భువనేశ్వర్ విద్యార్థి ఆర్యన్ష్ హాస్టల్లో భోజనం చేస్తుండగా పేరుగన్నంలో కప్ప కనిపించింది. దీంతో ఖంగుతున్న విద్యార్థి వెంటనే ఆ ఆహారాన్ని పడవేశాడు. తనకు ఎదురైన అనుభవాన్ని విద్యార్థి సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ విద్యాసంస్థల్లో పరిస్థిని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: డిసెంబర్లోనే అయోధ్య ఎయిర్పోర్ట్ సేవలు! This is KIT Bhubaneswar, ranked ~42 among engineering colleges in India, where parents pay approx 17.5 lakhs to get their child an engineering degree. This is the food being served at the college hostel. Then we wonder why students from India migrate to other countries for… pic.twitter.com/QmPaz4mD82 — Aaraynsh (@aaraynsh) September 23, 2023 ‘ఇది దేశంలోనే ఇంజనీరింగ్ కళాశాలలో 47వ ర్యాంక్ కలిగిన కేఐటీ భువనేశ్వర్ కాలేజ్. ఇక్కడ ఓ విద్యార్థి తమ డిగ్రీని పూర్తి చేసేందుకు తల్లిదండ్రులు దాదాపు 17.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అంత డబ్బులు తీసుకుని కాలేజీ హాస్టల్లో ఇలాంటి ఆహారాన్ని అందిస్తున్నారు. మెరుగైన విద్య, సౌకర్యాల కోసం ఇండియా నుంచి విదేశాలకు ఎందుకు విద్యార్థులు వలస వెళ్తున్నారో మాకు ఇప్పుడు అర్థమవతుంది’ అని ఆహారంలో కప్ప కనపడిన ఫోటోను షేర్ చేశాడు. ఆర్యాన్ష్ ట్వీట్కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కేఐఐటీ కళాశాల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోస్టు చేసిన కొన్ని గంటలకే స్పందించిన కళాశాల యాజమాన్యం మెస్ కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేసింది. హాస్టల్లో అందిస్తున్న ఆహారం పూర్తిగా అపరిశుభ్రంగా ఉందని, భోజనంపై విద్యార్థులు అసంతృప్తి చెందారని ఇనిస్టిట్యూట్ పేర్కొంది. కిచెన్, స్టోర్, వంట సరుకులు పరిశుశ్రంగా ఉంచుకోవాలని, ఆహారం తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తూ.. పనిష్మెంట్గా ఓ రోజు పేమెంట్ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. So, this is the value of human life. The hostel where the frog was served, at Bhubaneswar University, in an attempt to do damage control, decided to deduct only one day's payment from the mess provider company! Just wow. pic.twitter.com/2BSDhUwI8I — Aaraynsh (@aaraynsh) September 24, 2023 అయితే కేవలం ఒక్క రోజు పేమెంట్ను మాత్రమే కట్ చేస్తూ తమ వర్సిటీ స్పందించిన తీరుపై ఆర్యాన్ష్ మండిపడ్డాడు. వర్సిటీ పరువును కాపాడుకోవడానికే ఈ చర్య తీసుకుందని, మనిషి జీవితానికి ఉండే విలులు ఇదేనని అసహనం వ్యక్తం చేశాడు. -
క్షేత్రస్థాయిలో బీజేపీ బలాబలాలపై ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన 119 బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరా తీయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు నాయకత్వం అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమవుతారు. వారంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు శనివారంరాత్రి బయలుదేరివెళ్లారు. ‘ఎమ్మెల్యే ప్రవాస్ యోజన’లో భాగంగా తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్రానికి, వివిధవర్గాలకు చేకూరినప్రయోజనాలు, కేంద్ర పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీస్తారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల పార్టీ నేతలు, కార్యకర్తలను కలుసుకుని అభిప్రాయాలు తెలుసుకుంటారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం, వివరాల ఆధారంగా జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పించనున్నారు. శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అస్సాం, పుదుచ్చేరిలకు చెందిన 119 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్షాపు నిర్వహించి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర పార్టీ నాయకులు అవగాహన కల్పించారు. కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చాచార్జీ ప్రకాష్ జవదేకర్ 119 ఎమ్మెల్యేలకు 18 పాయింట్ల ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి తమకు అందిన ఫీడ్బ్యాక్కు అనుగుణంగా ఈ నెల 28–31 తేదీల మధ్య నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తామని ఎమ్మెల్యే వర్క్షాపు తెలంగాణ ఇన్చార్జీ, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి తెలిపారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా పోరాడి అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్తో పొత్తు లేదా అవగాహనకు ఆస్కారం లేదని ఆమె స్పష్టం చేశారు. వర్క్షాపులో పార్టీ నేతలు డీకే అరుణ, మురళీధర్రావు, అర్వింద్ మీనన్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వందకుపైగా ట్రైన్లు రద్దు
తాటిచెట్లపాలెం/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని ఖుర్దా రోడ్ డివిజన్లో భువనేశ్వర్–మంచేశ్వర్, హరిదాస్పూర్–ధన్మండల్ సెక్షన్ పరిధిలలో మూడో లైన్ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్, ఇంటర్ లాకింగ్ పనుల కోసం ఈ మార్గంలో ప్రయాణించే, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే వందకు పైగా రైళ్లను ఈ నెల 14 నుంచి 30వ తేదీల మధ్య వివిధ రోజుల్లో రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం త్రిపాఠి శనివారం తెలిపారు. కొన్ని రైళ్ల గమ్యాన్ని కుదించడంతోపాటు మరికొన్ని రైళ్లు దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 14 నుంచి 20 వరకు కాకినాడ–విశాఖపట్నం–కాకినాడ (17267/17268) ఎక్స్ప్రెస్, రాజమండ్రి–విశాఖపట్నం–రాజమండ్రి(07466/07467) స్పెషల్ పాసింజర్, విశాఖపట్నం–విజయవాడ–విశాఖపట్నం (22701/22702) ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం–గుంటూరు–విశాఖపట్నం(17240/17239) సింహాద్రి ఎక్స్ప్రెస్లను రెండు వైపులా రద్దు చేసినట్లు వివరించారు. విజయవాడ డివిజన్లో... విజయవాడ డివిజన్లో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగా, కొన్ని పాక్షికంగా రద్దు చేయడంతోపాటు మరికొన్ని దారిమళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విజయవాడ–బిట్రగుంట (07978) రైలు ఈ నెల 13 నుంచి 19 వరకు, బిట్రగుంట–విజయవాడ (07977) రైలు ఈ నెల 14 నుంచి 20 వరకు, బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) ఈ నెల 16 నుంచి 18 వరకు, విజయవాడ–గూడూరు (07500)రైలు ఈ నెల 16 నుంచి 20 వరకు, గూడూరు–విజయవాడ (07458) రైలు ఈ నెల 17 నుంచి 20 వరకు రద్దు చేశారు. కాగా, నర్సాపూర్–గుంటూరు (17282/17281) రైలును ఈ నెల 14 నుంచి 20 వరకు విజయవాడ–గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. యర్నాకుళం–పాట్నా (22643) రైలును ఈ నెల 14, 15 తేదీల్లో, బెంగళూరు–గౌహతి (12509) రైలును ఈ నెల 16, 17, 18 తేదీల్లో, కోయంబత్తూర్–సిల్చర్ (12515) రైలును ఈ నెల 13, 20 తేదీల్లో, భావనగర్ టెరి్మనల్–కాకినాడ పోర్ట్ (12756) రైలును ఈ నెల 12, 19 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. -
దీర్ఘకాలం సీఎంగా కొనసాగిన జాబితాలో నవీన్ పట్నాయక్ రికార్డు..
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దేశంలో దీర్ఘకాల ముఖ్యమంత్రిగా కొనసాగిన ప్రముఖుల జాబితాలో చేరనున్నారు. జాతీయ స్థాయిలో రెండో దీర్ఘకాలిక సీఎంగా సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. నవీన్ ప్రత్యక్ష రాజకీయ జీవితంలో ఇదో సుస్థిర మైలురాయిగా నిలుస్తుందని బిజూ జనతాదళ్ శిబిరంలో ఆనందం వెల్లివిరుస్తోంది. పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి దివంగత జ్యోతి బసు తరువాత దీర్ఘకాలం ఈ పదవిలో కొనసాగిన రికార్డు ఆక్రయించనున్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ఒడిశా పరివర్తన ప్రధాన కార్యాచరణ ఆయనకు ఈ రికార్డు సాధకులుగా చరిత్రలో నిలుపుతుంది. జ్యోతి బసు సమగ్రంగా 23 సంవత్సరాల 138 రోజులు నిరవధికంగా పదవిలో కొనసాగారు. ఆయన తర్వాత సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్కుమార్ చామ్లింగ్ 24 ఏళ్ల 166 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నవీన్ పట్నాయక్ స్థానం సాధించడం విశేషం. ఆయన వరుసగా 5సార్లు సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఈనెల 22తో ముఖ్యమంత్రి పాలన సమగ్రంగా 23 సంవత్సరాల 138 రోజులు పూర్తి చేసుకుంటుంది. గతంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు ఇదే కాల పరిమితిలో గతంలో దీర్ఘకాలిక ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొలిపారు. తాజా రికార్డుతో నవీన్ ఆయన సరసన చోటు దిక్కించుకుకోవడం విశేషం. జాతీయ స్థాయిలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా ఎదిగేందుకు స్వల్ప దూరంలో ఉన్నారు. 2000, 2004, 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ రాష్ట్ర శాసనసభకు వరుసగా ఎన్నికయ్యారు. ఆయన అకుంఠిత కార్యదక్షత ముఖ్యమంత్రి హోదాని సొంతం చేసింది. ఎత్తుకు ప్రత్యర్థులు చిత్తు.. మహిళ, రైతు సాధికారిత ఇతరేతర రంగాల్లో సంస్కరణలు రాష్ట్రానికి సరికొత్త రూపురేఖలు అద్దాయి. సేవాభావం, సామాజిక శ్రేయస్సు పట్ల అంకితభావం ప్రజా ప్రాతినిధ్యానికి ప్రామాణికంగా రుజువు చేసిన దాఖలాలు కోకొల్లలు. గంజాం జిల్లా అసికా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మహిళా స్వయం సహాయక సంఘం సాధికార మహిళ ప్రమీల బిసొయిని ఎంపీగా గెలిపించుకున్న తీరు.. బిజూ జనతాదళ్ అధ్యక్షుడుగా నవీన్ పట్నాయక్ సాధించిన అపురూప విజయం. ప్రత్యర్థుల్లో ధీటైన సభ్యులను సమయోచితంగా ఆకట్టుకుని, పార్టీని బలోపేతం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలను ఖంగు తినిపించడంలో ఆయన ధీరత్వానికి ప్రతీక. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల కంచుకోటలుగా నిలిచిన పలు నియోజక వర్గాలను బీజేడీ ఖాతాలో చేర్చుకున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఒడిశా సమగ్రంగా కై వసం చేసుకునే వ్యూహంతో పావులు కదుపుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో.. గంజాం జిల్లా హింజిలికాట్ నవీనపట్నాయక్కు కలిసి వచ్చిన నియోజకవర్గంగా మిగిలింది. దీనితో పాటు పాలనలో విపత్కర పరిస్థితులను అవలీలగా అధిగమించి, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల విశేష గుర్తింపుతో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచారు. రాష్ట్రంలో ఆకలి చావులకు తెరదించిన దిశలో ఆయన కృషి అనన్యమని చెప్పవచ్చు. ప్రజలకు పారదర్శక పాలన ఇంటి ముంగిటకు చేర్చడంలో సాధించిన విజయం అత్యద్భుతం. ప్రభుత్వ సేవలు ప్రజలకు నిర్థారిత కాల పరిమితిలో కల్పించడమే ధ్యేయంగా చేపట్టిన 5టీ కార్యాచరణ రాష్ట్ర పరివర్తనలో సరికొత్త మలుపు తిప్పింది. అవినీతి రహిత పాలన కార్యాచరణ సులభతరం చేసిన సాటిలేని ముఖ్యమంత్రిగా పేరొందారు. సమాచారం, రవాణా, బాహ్య ప్రపంచంతో రాష్ట్రాన్ని అనుసంధానం చేయడం.. జాతీయ, అంతర్జాతీయ వర్తక వ్యాపారాలు, పారిశ్రామిక విస్తరణతో రాష్ట్ర పురోగతిలో వేగం పుంజుకుంది. విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలు సకాలంలో అక్కరకు వచ్చే రీతిలో ప్రవేశ పెట్టిన పథకాలు, కార్యక్రమాలు జాతీయ స్థాయిలో మార్గదర్శకంగా నిలిచాయి. -
ఝరపడా జైలుకు నిందితుల తరలింపు
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో అరెస్టయిన ముగ్గురు నిందితుల రిమాండ్ గడువు శుక్రవారంతో ముగిసింది. ఈ ముగ్గురినీ ఝరపడా జైలుకు తరలించారు. ఈనెల 7న స్థానిక ప్రత్యేక సీబీఐ కోర్టు నిందితులకు 5 రోజుల రిమాండ్ విధించింది. కేసు విచారణ మరింత లోతుగా నిర్వహించాల్సి ఉందనే అభ్యర్థనతో దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) న్యాయస్థానాన్ని కోరడంతో ఈనెల 11న కోర్టు రిమాండ్ను మరో 4 రోజులు పొడిగించేందుకు అనుమతించింది. ఈ వ్యవధి పూర్తి కావడంతో ముగ్గురు నిందితులు(సీనియర్ సెక్షన్ ఇంజనీర్(సిగ్నల్) అరుణ్కుమార్ మహంత, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్ఖాన్, టెక్నీషియన్ పప్పుకుమార్)ను స్థానిక జైలుకు తరలించారు. కేసు తదుపరి విచారణను ఈనెల 27కి కోర్టు వాయిదా వేసినట్లు ప్రకటించింది. జైలుకు తరలించిన వారిని ఈనెల 7న సీబీఐ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. వీరికి వ్యతిరేకంగా ఐిపీసీ సెక్షన్లు 304(మరణానికి కారకులు), 201(సాక్ష్యాధారాల గల్లంతు) ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. నార్త్ సిగ్నల్ గూమ్టీ(స్టేషన్) వద్ద సిగ్నలింగ్ సర్క్యూట్ మార్పులో లోపం కారణంగా ప్రమాదం జరిగింది. ఇది మానవ తప్పిదమని ఆగ్నేయ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్ఎస్) విచారణ నివేదికలో వెల్లడించింది. నలుగురు ఉద్యోగులపై.. బహనాగా బజార్ రైలు దుర్ఘటన ఘటనలో మరో నలుగురు ఉద్యోగులను సీబీఐ దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. స్థానిక ఝరపడా జైలు ప్రాంగణంలో ఈ విచారణ కొనసాగుతోంది. వీరిలో ఇద్దరు సిగ్నల్ ఆపరేటర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, స్టేషన్ మాస్టర్ ఉన్నారు. వీరందరినీ రైల్వేశాఖ విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
ఒడిశా రైలు ప్రమాద ఘటన.. నిందితుల రిమాండ్ పొడిగింపు
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ స్టేషన్ వద్ద ట్రిపుల్ ట్రైన్స్ యాక్సిడెంట్ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్ను భువనేశ్వర్ ప్రత్యేక సీబీఐ కోర్టు పొడిగించేందుకు అనుమతించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అభ్యర్థన మేరకు కోర్టు అంగీకారం తెలిపింది. లోగడ జూలై 7న నిందితులకు 5 రోజుల రిమాండ్ను కోర్టు మంజూరు చేసింది. రిమాండ్ను మరో నాలుగు రోజులు పొడిగించాలని కోర్టుకు దరఖాస్తు చేయడంతో అనుమతించినట్లు మంగళవారం కోర్టు ప్రకటించింది. ఈ సందర్భంగా నిందితులు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్ మరియు టెక్నీషియన్ పప్పు కుమార్ని కోర్టులో హాజరుపరిచారు. లోతుగా విచారణ ఈ దుర్ఘటన వెనక అసలు నిజాలు బట్టబయలు చేసే దిశలో సీబీఐ విచారణ లోతుగా కొనసాగుతోంది. తొలి దశలో ముగ్గురుని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్న దర్యాప్తు బృందం తాజాగా మరో ఇద్దరు రైల్వే సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. వీరిలో బహనాగా బజార్ రైల్వేస్టేషను మాస్టర్ ఒకరు. సీబీఐ వీరిని సోమవారం నుంచి విచారించింది. స్టేషను మాస్టరుతో సహా మరో సిబ్బందిని ప్రశ్నించింది. కాగా తాజాగా మరో ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. వీరిని బుధవారం నుంచి ప్రశ్నించడం ఆరంభిస్తుంది. ఈ లెక్కన దర్యాప్తు బృందం 8 మందిపై దృష్టి సారించింది. లోగడ ముగ్గురు నిందితులను జూలై 7న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి వ్యతిరేకంగా ఐపీసీ సెక్షన్లు 304 (హత్య కాకున్న మరణానికి హేతువు) మరియు 201 (సాక్ష్యాధారాల గల్లంతు) కింద కేసులు నమోదు చేశారు. వీరిలో అరుణ్ కుమార్ మహంత మరియు అమీర్ ఖాన్ బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. సీఆర్ఎస్ విచారణలో... రైల్వే భద్రతా కమిషనర్ (ఆగ్నేయ సర్కిల్) సీఆర్ఎస్ విచారణ నివేదికలో నార్త్ సిగ్నల్ గూమ్టీ (స్టేషన్) వద్ద సిగ్నలింగ్ సర్క్యూట్ మార్పులో లోపం కారణంగా ప్రమాదం జరిగిందని పేర్కొంది. జూన్ 2వ తేదీ సాయంత్రం కోరమాండల్ ఎక్స్ప్రెస్ బహనాగా బజార్ స్టేషన్లో స్థిరంగా ఉన్న సరుకు రవాణా రైలును ఢీకొట్టింది. అనంతరం దాని పట్టాలు తప్పిన కొన్ని కోచ్లను పక్క ట్రాక్పై వస్తున్న యశ్వంత్పూర్–హౌరా ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 293 మంది మరణించారు. ఇప్పటికీ పలువురి ఆచూకీ తెలియక మృతదేహాలు కంటైనర్లలో మగ్గుతున్నాయి. స్థానిక ఎయిమ్స్ ప్రాంగణంలో కంటైనర్లలో 41 శవాలు ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నాయి. వీటిలో 10 శవాల డీఎన్ఏ పరీక్షల నివేదిక అందడంతో బంధు వర్గాలకు అప్పగించేందుకు సన్నాహాలు చేపట్టారు. నిబంధనల మేరకు మృతదేహాలను అప్పగిస్తారు. స్వస్థలాలకు తరలించలేని పరిస్థితుల్లో స్థానికంగా అంత్యక్రియలు ఉచితంగా నిర్వహించేందుకు స్థానిక నగర పాలక సంస్థ ఏర్పాట్లు చేసింది. -
మాజీ మంత్రి నవ కిషోర్ దాస్ హత్యలో కీలక పరిణామం
భువనేశ్వర్: మాజీ మంత్రి నవ కిషోర్ దాస్ హత్యలో కీలక పరిణామం శుక్రవారం చోటుచేసుకుంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఒడిశా క్రైమ్ బ్రాంచ్ 540 పేజీలకు పైగా చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ విషాద ఘటనలో ప్రధాన నిందితుడు గోపాల్ కృష్ణ దాస్ (53) వ్యతిరేకంగా ఆయుధాల చట్టం ప్రకారం 307, 302, 27 (1) సెక్షన్లు కింద అభియోగాలు నమోదు చేశారు. పాత వైరం కారణంగా నిందితుడు దారుణ హత్యకు పాల్పడినట్లు విచారణలో ధ్రువీకరించినట్లు చార్జ్షీటులో వెల్లడించారు. జనవరి 29న హత్య ఈ ఏడాది జనవరి 29న మంత్రి అధికారిక కార్యక్రమం పర్యటనలో నడి రోడ్డమీద జన సందోహం మధ్య నిందితుడు తుపాకీ గురిపెట్టి పేల్చడంతో మంత్రి అక్కడిక్కడే కుప్పకూలిపోయిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, శాసీ్త్రయ బృందం పరిశీలన నివేదికల ఆధారంగా నిందిత ఏఎస్ఐ గోపాల కృష్ణ దాస్ని విధుల నుంచి బహిష్కరించారు. మంత్రితో బ్రజ్రాజ్నగర్ ఠాణా ఇన్చార్జి ఇన్స్పెక్టర్ (ఐఐసీ) పి.కె.స్వంయి మరో సిబ్బంది జీవన్ కుమార్ నాయక్ని హత్య చేసేందుకు నిందితుడు విఫలయత్నం చేసినట్లు ఝార్సుగుడ ఎస్డీజేఎం కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ మీడియాకు తెలియజేసింది. ముందస్తు ప్రణాళికతోనే... నిందితుడు ఏఎస్ఐ గోపాల్కృష్ణ దాస్ తెలివిగా ముందస్తు ప్రణాళికతో ఈ నేరానికి పాల్పడ్డాడని క్రైం బ్రాంచ్ తెలిపింది. అతని మానసిక పరిస్థితి స్థిరంగా, సాధారణమైనదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎటువంటి మానసిక అనారోగ్య లక్షణాలు దర్యాప్తులో బయటపడనట్లు వివరించింది. సంచలనాత్మక హత్య సంఘటనకు సంబంధించిన అన్ని రకాల సాక్ష్యాలను పరిశీలించి విశ్లేషించింది. ఈ నేపథ్యంలో మౌఖిక, దస్తావేజులు, మెడికో–లీగల్, సైబర్ ఫోరెన్సిక్ మరియు బాలిస్టిక్ నివేదికలను క్రైం శాఖ లోతుగా సమీక్షించింది. ఈ సమీక్షలో నిందితుడు గోపాల్ కృష్ణ దాస్ దివంగత మంత్రి నవ కిషోర్ దాస్ మరియు అతని అనుచరులతో తనకు ప్రాణాపాయం ఉన్నట్లు భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంత్రి అనుచర వర్గాలు తరచు ఆయనకు ప్రాణాపాయ హెచ్చరికలు జారీ చేస్తుండడంతో మంత్రిపై వ్యక్తిగత ద్వేషం బలపడి మానసిక వేదనతో మంత్రిని నిలువునా హత్య చేసి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో స్పష్టమైంది. అభద్రతా భావంతోనే మంత్రి హత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. దీనికోసం పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకుని బెడిసి కొట్టని వ్యూహంతో తుపాకీ గురి పెట్టి ఘటనా స్థలంలో మంత్రిని కుప్పకూల్చినట్లు క్రైం శాఖ తెలిపింది. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ, కొన్ని నివేదికలు, వివరణలను పొందడం కోసం దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. మానసిక రోగి: కుటుంబ సభ్యులు నిందితుడి కుటుంబ సభ్యులు గోపాల్ కృష్ణదాస్ చాలాకాలంగా మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కొంతకాలంగా బైపోలార్ డిజార్డర్తో బాధపడుతున్నాడని అంటున్నారు. అయితే అనుబంధ చికిత్స కొనసాగుతుందని దర్యాప్తు వర్గాలు విచారణలో పేర్కొన్నాయి. మానసిక ఇబ్బందుల విషయం ధ్రువీకరించేందుకు వైద్య విద్య మరియు శిక్షణ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు అనుబంధ పరీక్షలను నిర్వహించి, నిందితుడిలో మానసిక అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలు లేవని స్పష్టం చేసింది. స్థానికులు, సహోద్యోగుల వాంగ్మూలం వైద్య బోర్డు అభిప్రాయానికి చేరువగా ఉన్నట్లు క్రైమ్ శాఖ తెలిపింది. నిందితుడు సాదాసీదాగా కలిసిమెలిసి తిరుగాడే వ్యక్తిగా తోటి వ్యక్తుల వాంగ్మూలం దర్యాప్తు బృందం నమోదు చేసింది. ఇలా పరిసరాల పరిశీలన, అనుబంధ విశ్లేషణలో నిందితుని మానసిక పరిస్థితి చాలా సాధారణంగా ఉందని, ఎటువంటి అసాధారణత లేదని నిర్ధారించారు. విచారణకు నిందితుడు సంతృప్తికరంగా సహకరించారని, అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. అధికారిక రివాల్వరే హత్యాస్త్రం విధి నిర్వహణలో ఉండగా పోలీసు ఏఎస్ఐ గోపాల్ కృష్ణ దాస్ హత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా తన దగ్గర ఉన్న అధికారిక రివాల్వర్తో సిటింగు ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నవ కిషోర్ దాస్ను జన సందోహం మధ్య కాల్చి నడిరోడ్డు మీద కుప్పకూల్చేశాడు. ఈ హత్య వెనుక కుట్ర ఉందని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు నిలువెత్తున ఆరోపించాయి. విచారణ చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసిన క్రైమ్ బ్రాంచ్ విచారణలో కుట్ర కోణం జాడ లేనట్లు వెల్లడించింది. 10 బృందాలతో దర్యాప్తు సిటింగ్ మంత్రి హత్య జరిగిన రోజు నుంచే క్రైమ్ బ్రాంచ్, బ్రజరాజ్నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లోతైన దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్ 10 బృందాలను ఏర్పాటు చేసింది. హత్య వ్యూహం పూర్వాపరాలను ఆరా తీసేందుకు రాష్ట్రంలో ఝార్సుగుడ, భువనేశ్వర్, బరంపురం మరియు పలు ఇతర రాష్ట్రేతర ప్రాంతాలు సందర్శించి దర్యాప్తు బృందాలు పూర్వాపరాలు ఆరా తీశాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు వర్గాలు 89 మంది సాక్షులను ప్రశ్నించారు. తుపాకీలు, లైవ్ కాట్రిడ్జ్లు, ఖాళీ కాట్రిడ్జ్లు ఇతరేతర పలు రుజువుపూరిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ జరిగింది ఝార్సుగూడ జిల్లాలో మంత్రి కార్యక్రమం పురస్కరించుకుని నిందిత ఏఎస్ఐ గోపాల్ కృష్ణదాస్ని ట్రాఫిక్ క్లియరెన్స్ డ్యూటీ కోసం నియమించారు. ఈ అవకాశాన్ని వ్యూహాత్మకంగా మలచుకుని తన దగ్గర ఉన్న 9 ఎంఎం సర్వీస్ పిస్టల్ని ఉపయోగించి అతి సమీపం నుంచి మంత్రిపై కాల్పులు జరిపాడు. రక్తపు మడుగులో కూరుకుపోయిన మంత్రిని హెలికాప్టర్లో హుటాహుటిన భువనేశ్వర్కు తరలించారు. అయితే అంతర్గత రక్తస్రావం కారణంగా చికిత్స పొందుతూ మంత్రి తుదిశ్వాస విడిచాడు. నిందితుడు 2013లో ఝార్సుగుడ జిల్లాలో పోలీసు ఉద్యోగం పొందాడు. తన ఉద్యోగ జీవితంలో నిందిత గోపాల కృష్ణ దాస్ శ్రేష్టమైన పనితీరుకు తొమ్మిది రివార్డులు, 18 ప్రశంసా పత్రాలు పొందడం విశేషం. అతని కుటుంబం బరంపురం శివారులోని జలేశ్వరఖండిలో ఉంటుంది. విచారణలో భాగంగా నిందితుడికి మానసిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రేతర (బెంగుళూరు) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్కు తీసుకెళ్లాలన్న అభ్యర్థనను స్థానిక కోర్టు తిరస్కరించింది. -
సభాపతి ఎవరు.. అనుభవం కలిగిన నేత కోసం వెతుకులాట
భువనేశ్వర్: రాష్ట్ర మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవుల పట్ల ఊహాగానాలకు తెరపడింది. ప్రస్తుతం శాసనసభ తదుపరి స్పీకర్ ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. ఈ పదవి కోసం పలువురు సీనియర్లు రేసులో ఉన్నట్లు సమాచారం. వీరిలో ప్రఫుల్ల సామల్, దేవీప్రసాద్ మిశ్రా, అమర్ప్రసాద్ శత్పతి, బద్రి నారాయణ్ పాత్రొ స్పీకర్ ముందున్నారు. మహిళా అభ్యర్థి స్నేహాంగిని చురియా పేరు కూడా ప్రచారంలో ఉంది. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రతి చోటా మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆమెకు అదృష్టం కలిసి రావచ్చని సర్వత్రా చర్చ సాగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలో అస్కా లోక్సభ ఎన్నికలో మహిళా కార్డు బీజేడీకి దిగ్విజయం కల్పించింది. ఈ నియోజకవర్గం మహిళా స్వయం సహాయక బృందం అధినేత ప్రమీలా బిసోయ్తో చేసిన ప్రయోగం పార్టీకి విశేష గుర్తింపు సాధించింది. అయితే ధామ్నగర్ ఉప ఎన్నికలో ఈ ప్రయోగం బెడిసి కొట్టింది. మహిళా సాధికారత మంత్రం నిరంతరం ఫలప్రదం కావడం కష్టతరమని ఈ ఎన్నిక రుజువు చేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహంతో ఆచితూచి అడుగు వేయకుంటే రానున్న ఎన్నికల్లో పార్టీ బలం పుంజుకోవడం బలహీన పడుతుందని బీజేడీ శిబిరంలో జోరుగా చర్చ సాగుతోంది. నవీన్ నిర్ణయంపైనే.. మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో స్పీకర్ విక్రమ్కేశరి ఆరూఖ్తో రాజినామా చేయించారు. ఈ స్థానం భర్తీ తదుపరి ఎన్నికలకు లాభసాటిగా ఉండేలా అభ్యర్థి ఎంపిక పట్ల బీజేడీ అధిష్టానం పదునైన ప్రక్రియతో కసరత్తు చేస్తోంది. స్పీకర్ ఆశావహుల్లో ప్రఫుల్ల సామల్, దేబీప్రసాద్ మిశ్రా, అమర్ప్రసాద్ శత్పతి తగిన అనుభవం అలాగే శాసన విధానాలపై పూర్తి అవగాహన కలిగిన ప్రతినిధులుగా పేరొందారు. వీరిలో ఒకరికి ప్రతిష్టాత్మక సభాపతి పదవిని కట్టబెట్టే యోచన శిబిరంలో గింగుర్లు కొడుతోంది. అయితే మహిళా మంత్రంతో ఈ నిర్ణయం ఊగిసలాడుతోంది. అయితే ప్రయోగాలు చేయడానికి సమయం కాదని, అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సమర్థత కలిగిన అభ్యర్థిని మాత్రమే స్పీకర్గా నియమించాలని సీఎం నవీన్ పట్నాయక్ భావిస్తున్నట్లు సమాచారం. -
స్పీకర్గా తప్పించి.. మంత్రిగా..
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం తన కొలువులో కొద్దిపాటి మార్పులు చేపట్టారు. ముగ్గురు కొత్త మంత్రులకు కేబినెట్లో స్థానం కల్పించారు. ఖాళీ పదవుల్లో వారికి సర్దుబాటు చేయడం విశేషం. స్థానిక లోక్సేవా భవన్లో సోమవారం ఉదయం జరిగిన మంత్రిమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో కొత్తగా చేరిన సభ్యులు బిక్రమ్కేశరి అరుఖా, శారదాప్రసాద్ నాయక్, సుదామ్ మరండిలతో గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరయ్యారు. విక్రమ్ అరూఖ్ 2008 నుంచి ప్రభుత్వ చీఫ్ విప్, స్పీకర్, గ్రామీణాభివృద్ధి, న్యాయ, అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పు, శాసనసభ వ్యవహారాలు, సమాచారం–ప్రజా సంబంధాలు, సహకారం ప్రభుత్వరంగ సంస్థలు తదితర శాఖల్లో మంత్రిగా కీలకమైన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. నవీన్ కొలువులో మరో మాజీమంత్రి సుధామ్ మరాండీకి పాఠశాలలు, సామూహిక విద్యాశాఖను కేటాయించారు. గతవారం విద్యాశాఖ మాజీమంత్రి సమీర్రంజన్ దాస్ పదవికి రాజీనామా చేయడంతో ఈ మంత్రిత్వ శాఖ ఖాళీ అయ్యింది. నిరంజన పూజారికి ఆరోగ్యశాఖ.. మరాండి గతంలో క్రీడలు–యువజన వ్యవహారా లు, షెడ్యూల్డ్ తెగలు–కులాల అభివృద్ధి(గిరిజన సంక్షేమం), రెవెన్యూ, విపత్తు నిర్వహణ సహాయమంత్రిగా పని చేశారు. ఈదఫా మరాండీని కేబినెట్ హోదాకు ప్రమోషన్ కల్పించారు. అదే విధంగా శ్రీకాంత సాహు గతవారం రాజీనామా చేయడంతో ఖాళీ అయిన కార్మిక శాఖను శారదాప్రసాద్ నాయక్కు కేటాయించారు. నాయక్ 2009 నుంచి 2012 వరకు రాష్ట్ర ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమం, గృహనిర్మాణం, నగర అభివృద్ధి, అబ్కారీ శా ఖ సహాయ మంత్రిగా పని చేశారు. నవీన్ కేబినెట్లో సీనియర్ మంత్రి, మాజీ స్పీకర్ విక్రమ్ కేశరీ అరూఖ్ కు ఆర్థికశాఖ కేటాయించారు. ఈ ఏడాది జనవరి 29న ఝార్సుగుడలో నవకిషోర్ దాస్ హత్యతో ఖాళీ అయిన ఆరోగ్యశాఖను ప్రస్తుత ఆర్థికమంత్రి నిరంజన్ పూజారికి ఇన్చార్జిగా స్థిరపరిచారు. స్పీకర్గా తప్పించి.. మంత్రిగా.. గంజాం ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఆది నుంచి బీజేడీకి కంచుకోటగా ఈ ప్రాంతం చలామణి అవుతోంది. ఈ పరపతి ఏమాత్రం సడలి పోకుండా శంఖం దళం అధ్యక్షుడిగా సీఎం నవీన్ సకాలంలో స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ జిల్లా నుంచి విక్రమకేశరి అరూఖ్ బలమైన నాయకుడిగా అధ్యక్షుడి దృష్టిని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి కట్టబెట్టడంతో సొంత జిల్లా, నియోజకవర్గ పురోగతి అనుబంధ కార్యకలాపాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు సమయం అనుకూలించని పరిస్థితులు తలెత్తాయి. దీని దృష్ట్యా ఆయనకు స్పీకర్ పదవి బరువు బాధ్యతలను తొలగించి, మంత్రి పదవితో జిల్లాలో పట్టు సాధించేందుకు సువిశాల అవకాశం కల్పించడం పునర్వ్యవస్థీకరణ వ్యూహంగా స్పష్టం అవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలో గంజాం జిల్లాలోని 13 స్థానాల్లో 12 స్థానాలను కై వసం చేసుకుంది. ఈ పట్టును రానున్న ఎన్నికల్లో ఏమాత్రం చేజార్చుకోకుండా జాగ్రత్త వహించడంలో విక్రమ అరూఖ్ తగిన అభ్యర్థిగా భావించి కొలువులో చోటు కల్పించారు. ఆయన రాజకీయ శైలితో జిల్లాలో బీజేడీ కంచుకోట పట్టు యథాతధంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. బలోపేతమే లక్ష్యంగా.. సుందరగడ్, మయూర్భంజ్ జిల్లాల్లో బిజూ జనతాదళ్ గత ఎన్నికల్లో నిరాశజనకమైన ఫలితాలతో సరిబెట్టుకుంది. మయూర్భంజ్ లోని 9 స్థానాల్లో బీజేడీ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. సుందరగడ్ 7 స్థానాల్లో నామమాత్రంగా 2 స్థానాలకే పరిమితమైంది. ఈ రెండూ గిరిజన ప్రభావిత జిల్లాలు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేడీ నిరవధిక కృషికి ఫలితంగా 2022లో జరిగిన జిల్లా పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశాజనకమైన ఫలితాలు సాధించింది. ఈ ప్రేరణతో రానున్న ఎన్నికల్లో బలం పుంజుకునేందుకు ఇద్దరు అనుభవజ్ఞులకు మంత్రి పదవులతో పట్టం గట్టింది. ఈ జిల్లాల నుంచి మంత్రి పదవులు పొందిన సుధాం మరాండి, శారదాప్రసాద్ నాయక్కు రానున్న ఎన్నికలు కత్తిమీద సాములాంటి సవాల్గా మారాయి. ఈ సందర్భంలో పార్టీ బలం పటిష్ట పరచడం ఇరువురి లక్ష్యంగా కార్యాచరణ కొనసాగించాల్సి ఉంటుంది. నవీన్ చతురత.. భువనేశ్వర్: మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రానున్న ఎన్నికల్లో బిజూ జనతాదళ్ను బలోపేతం చేయడం సంకల్పంగా స్పష్టం అవుతోంది. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బలం పుంజుకునేలా చేయడంతో గట్టి ప్రభావం ఉన్న ప్రాంతంలో పట్టు సడలిపోకుండా అత్యంత జాగరూకత ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ పురస్కరించుకుని గంజాం, సుందర్గడ్, మయూర్భంజ్ జిల్లాలకు ప్రాతినిధ్యం పునరుద్ధరించారు. ఈ ప్రాంతాల నుంచి మాజీ మంత్రులకు పదవులు కట్టబెట్టారు. గంజాం నుంచి విక్రమకేశరి అరూఖ్, మయూర్భంజ్ నుంచి సుధాం మరాండి, సుందరగడ్ నుంచి శారదాప్రసాద్ నాయక్కు మంత్రి పదవులు వరించాయి. గంజాం జిల్లాలో బీజేడీ కోటను మరింత బలోపేతం చేసేందుకు, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సరైన రీతిలో రాణించని సుందర్గడ్, మయూర్భంజ్ జిల్లాలలో బీజేడీ బలాన్ని పెంచడానికి అనుభవజ్ఞులను ఎంపిక చేసి, మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. ఈ పదవులతో సొంత జిల్లాల్లో పురోగతి దిశలో కృషి చేసేందుకు మార్గం సుగమం అవుతుందనే దృక్పథంతో కేబినెట్ విస్తరణ పురస్కరించుకుని నవీన్ పట్నాయక్ ఆచితూచి మార్పుచేర్పులు చేపట్టడం విశేషం. -
వీధినపడిన బొలంగీర్ రాజ కుటుంబీకుల అంతర్గత విబేధాలు
భువనేశ్వర్: బొలంగీర్ జిల్లా రాజ వంశీకుల కుటుంబ కలహాలు వీధికెక్కాయి. ఈ కుటుంబంలో యువరాజు అర్కేష్ నారాయణ సింఘ్దేవ్ దంపతుల వివాదం రాజభవనం దాటి పోలీసు ఠాణాకు చేరింది. అర్కేష్ వ్యతిరేకంగా ఆయన భార్య అద్రిజా గృహహింస ఆరోపణతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను అర్కేష్ సింఘ్దేవ్ ఖండించారు. దాదాపు 6నెలల క్రితం ఈ ఫిర్యాదు నమోదైంది. ఈ నేపథ్యంలో తాను ఇల్లు వదిలి వెళ్లిపోయానని ఆయన తెలిపారు. ‘ఆమె నాపై గృహహింస కేసు పెట్టడంతో నేను ఇల్లు వదిలి వెళ్లిపోయాను. ప్రస్తుతం, ఆమె సోదరి అక్కడ నివసిస్తున్నారు. ఆమె తండ్రి కూడా ప్రతినెలా 15 రోజులు రాజ భవానాన్ని సందర్శించేవారు. అవసరమైన వస్తువులు తీసుకునేందుకు నెలకోసారి మాత్రమే ఇంటికి వెళ్తున్నాను. పోలీసుల సలహా మేరకు ఆమె, నా భద్రతను నిర్థారించడానికి ఇంట్లో సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయించా. అయితే వాటిని అద్రిజా ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులకు పంపించా’నని అర్కేష్ వివరించారు. మూడు రోజుల క్రితం అద్రిజా తండ్రి తమ వద్దకు వచ్చి చేసిన డిమాండ్ పట్ల ప్రతికూలించినట్లు అర్కేష్ నారాయణ సింఘ్దేవ్ తెలిపారు. వివాదం కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున న్యాయస్థానం నిర్ణయం మేరకు కొనసాగడం జరుగుతుందని పదేపదే ప్రాధేయపడినా.. ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, సహరాపూర్లోని కొందరు ల్యాండ్ మాఫియాతో తన మామకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. తన ఇంటిపైకి దౌర్జన్యంగా 10మంది వ్యక్తులను పంపించారని, ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించగా.. అవసరమైతే 100 మందితో వస్తానని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అద్రిజా ఓ న్యూస్ ఛానెల్తో మాట్లాడుతూ తన భర్త 2022 ఆగస్టులో విడాకులు కోరినట్లు తెలిపారన్నారు. డీజీపీని కలిసి.. ఇదిలా ఉండగా.. అర్కేష్ సింఘ్దేవ్ భార్య అద్రిజా భర్తతో పాటు మామ అనంగ ఉదయసింఘ్ దేవ్, బావ కళికేష్ నారాయణ్ సింఘ్దేవ్, అత్త విజయ లక్ష్మీదేవి, మేఘనా రాణా లపై 2022 సెప్టెంబర్ 30న రాజ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్తింటి వారు తనను ఇంటి నుంచి బయటకు నెట్టేయాలని, ఒడిశాను సందర్శించకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెట్టినింటి వారి సిబ్బంది కూడా దుర్భాషలాడుతూ గోప్యతకు భంగం కలిగించడంతో పాటు తన గదివైపు కెమెరా ఏర్పాటు చేసి ప్రతి కదలికపై నిఘా ఏర్పాటు చేశారని ఆరోపించారు. అయితే తన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె ఇటీవల ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) సునీల్ బన్సాల్ను కలిశారు. ఈ కేసును ప్రస్తుతం డెహ్రాడూన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఏస్పీ)కి అప్పగించారు. వీపీ సింగ్ మనుమరాలు.. అర్కేష్ సింఘ్దేవ్ గతంలో కాంట్రాక్ట్ కిల్లర్తో తనను చంపడానికి ప్రయత్నించారని అద్రిజా డెహ్రాడూన్ లోని స్థానిక మీడియాకు వివరించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని పోలీసుల వద్దకు వెళ్లి, రక్షణ కోరారు. మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్సింగ్(వీపీ సింగ్) మనవరాలైన అద్రిజా ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో ఉత్తరాఖండ్లో ఉంటున్నారు. అర్కేష్, అద్రిజాల 2017 నవంబర్లో జరిగింది. -
రాష్ట్రపతి హెలీకాప్టర్తో సెల్ఫీ
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము 3 రోజుల రాష్ట్ర పర్యటన గందరగోళంగా మారింది. ఆమె చివరి రోజు పర్యటనలో పలు సమస్యాత్మక పరిస్థితులు తలెత్తాయి. దీంతో రాష్ట్రపతి పర్యటనలో భద్రత లోపించిందనే ఆరోపణలు బలపడుతున్నాయి. మయూర్భంజ్ జిల్లా బరిపద మహారాజా శ్రీరామచంద్ర భంజ్దేవ్ విశ్వ విద్యాలయంలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆమె ప్రసంగిస్తుండగా.. 9నిమిషాల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఈ వివాదం చల్లారక ముందే మరో వివాదం తెరకెక్కింది. సోషల్ మీడియా ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము శుక్రవారం మయూర్భంజ్ జిల్లా సిమిలిపాల్ టైగర్ రిజర్వ్(ఎస్టీఆర్)ను సందర్శించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ విధుల్లో ఉన్న ఫార్మసిస్ట్ జస్వంత్ బెహరా అత్యంత భద్రత, కీలకమైన భారతదేశ ప్రథమ మహిళ ప్రయాణించనున్న హెలీకాప్టర్(ఛాపర్)తో సెల్ఫీలు దిగారు. జషిపూర్ సమీపం చెలిగోధులి హెలీప్యాడ్లో దిగిన తర్వాత రాష్ట్రపతి రోడ్డు మార్గంలో సిమిలిపాల్ జాతీయ పార్కును సందర్శించారు. ఆమె సందర్శన దృష్ట్యా ఈనెల 4, 5 తేదీల్లో సాధారణ సందర్శకుల పర్యటన నివారించారు. ఈ సందర్భంగా ప్రత్యేక విధులకు నియమితులైన సిబ్బంది రాష్ట్రపతి హెలీకాప్టర్తో సెల్ఫీ తీసుకోవడం సమస్యగా తయారైంది. ఈ వ్యవహారం రాష్ట్రపతి భద్రతపై ప్రశ్నలు తలెత్తడంతో జస్వంత్ బెహరా పోస్ట్ను తొలగించినట్లు సమాచారం. సిబ్బందిపై వేటు.. మరోవైపు యూనివర్సిటీలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన సమయంలో ముర్మును ఎందుకు సురక్షిత ప్రదేశానికి తరలించలేదని భద్రతా నిపుణులు ఇంతకుముందు ప్రశ్నించగా.. ఇది రాష్ట్రపతి కార్యక్రమాన్ని విధ్వంసం చేసే ప్రయత్నమని బీజేపీ కార్యాలయం ఆరోపించింది. రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఈ చిక్కు సమస్య చోటు చేసుకుంది. విద్యుత్ సరఫరా అంతరాయంతో దీపాలు ఆరిన వేదిక వద్ద ఉన్న మైక్ సిస్టమ్ ప్రభావితం కాకపోవడంతో ఆమె ప్రసంగం నిరవధికంగా కొనసాగించారు. ఉదయం 11.56 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు ఈ పరిస్థితి కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో యూనివర్సిటీ అధికారులు ఎలక్ట్రీషియన్ జయంత్ త్రిపాఠిని విధుల నుంచి తొలగించారు. పర్యటన ఏర్పాట్ల లోపాలపై విచారణకు రిజిస్ట్రార్, పీజీ కౌన్సిల్ చైర్మన్, డెవలప్మెంట్ అధికారితో కూడిన ముగ్గురు సభ్యుల బృందం నియమించారు. ఈ బృందం విచారణ ఆధారంగా బాధ్యులను ఖరారు చేసి తగిన చర్యలు చేపడతారు. -
రాష్ట్రపతి ముర్ము ప్రసంగానికి విద్యుత్ అంతరాయం
భువనేశ్వర్: మయూర్భంజ్ జిల్లా బరిపద మహారాజా శ్రీరామచంద్ర భంజాదేవ్ (ఎంఎస్సీబీ) విశ్వవిద్యాలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యక్రమంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో భద్రతా వ్యవస్థ అంధకారంలోకి వెళ్లి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్సిటీ ప్రాంగణంలో రాష్ట్రపతి తన ప్రసంగాన్ని చీకటిలో కొనసాగించాల్సి వచ్చింది. ఉదయం 11.56 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు ఆకస్మాత్తుగా తొమ్మిది నిమిషాలు పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భద్రత గార్డులు, సహాయక సిబ్బంది ఒకరికొకరు కానరాని పరిస్థితులు తాండవించాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే పోడియంపై మసకబారిన మిణుగురు కాంతితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం నిరవధికంగా కొనసాగించారు. అనంతరం ఈ పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విశ్వ విద్యాలయం అందం చీకటిమయం అని సుతిమెత్తగా వ్యాఖ్యానించారు. ఘటనపై విచారణ ఘటనపై యూనివర్సిటీ వీసీ సంతోష్ త్రిపాఠి విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముందే జనరేటర్ను మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు. సకాలంలో ఎందుకు పని చేయలేదో అర్ధం కావడం లేదన్నారు. ఈ విషయంపై విచారణ చేపడతామని తెలియజేశారు. ఇడ్కో ఈ భవనాన్ని నిర్మించింది. జనరేటర్కు మరమ్మతులు కూడా చేసింది. ప్రత్యేక జనరేటర్ ఉన్నప్పటికీ అది పనిచేయలేదన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ప్రాథమిక చర్యగా ఈ సంస్థ ఎలక్ట్రికల్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. టాటా పవర్కు చెందిన హరీష్ కుమార్ పండా మాట్లాడుతూ.. కార్యక్రమానికి ముందు విద్యుత్ కనెక్షన్లను తనిఖీ చేశామన్నారు. అన్నీ సక్రమంగా పనిచేస్తుండేవని పేర్కొన్నారు. అలాగే బ్యాకప్గా అక్కడ ఒక జనరేటర్ సెట్ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. టాటా పవర్ నార్తర్న్ ఒడిషా డిస్ట్రిక్ట్ లిమిటెడ్ (టీపీఎన్ఓడీఎల్) సీఈవో భాస్కర్ సర్కార్ మాట్లాడుతూ డీజీ సెట్లు నడుస్తున్నాయని, ఏసీలు, మైక్రోఫోన్ పని చేస్తున్నాయని, అయితే భవనం అంతర్గత వైరింగ్ లోపం కారణంగా లైట్లు ఆరిపోయాయని నివేదించారు. విచారణకు ఆదేశం ఇదిలా ఉండగా రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా జరిగిన విద్యుత్ వైఫల్యంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. యూనివర్సిటీ కూడా సమాంతర విచారణ ప్రారంభించింది. పీజీ కౌన్సిల్ చైర్మన్ పి.కె.శతపతి, రిజిస్ట్రార్ సహదేవ్ సమాధియా, డవలప్మెంట్ ఆఫీసర్ బసంత్ మొహంతాతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం లోపాన్ని విచారణ చేపట్టనుంది. విచారణలో దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని సెంట్రల్ రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఆర్డీసీ) సురేష్ దలాసి తెలిపారు. అదేవిధంగా విద్యుత్ అంతరాయం వెనుక కారణాలను తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరుపుతామని బరిపద అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) రుద్ర నారాయణ్ మహంతి తెలిపారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతిక లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలిపిన అనంతరం రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఆర్డీసీ) అత్యవసర సమావేశం నిర్వహించారు. -
చకచకా తుంబ పనులు
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని యాత్రకు రథాల తయారీ పనులు ఊపందుకున్నాయి. అక్షయ తృతీయ నుంచి ఈ పనులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మూడో రోజు మంగళవారం నాటికి ఇరుసు ప్రాథమిక స్థాయి తుంబ పనులు తొలిదశ పూర్తయ్యింది. శ్రీమందిరం సింహద్వారం ఆవరణ బొడొదండొ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద ఈ పనులు నిరవధికంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి వడ్రంగి సేవకులు పనుల్లో నిమగ్నం అవుతున్నారు. మంగళవారం సమగ్రంగా 40 మంది వడ్రంగి సేవకులు పాల్గొన్నారు. వీరిలో 17మంది మహరణ వర్గం, 12మంది భొయి వర్గం, 4 మంది కొరొతి (రంపపు కోత) వర్గం, ఆరు కమ్మరి కార్మికులు ఉన్నారు. సాయంత్రం చీకటి పడేంత వరకు శ్రమించి 3 రథాల కోసం మొత్తం మీద 9 తుంబల తయారు చేశారు. రథ చక్రం ఇరుసు యొక్క వృత్తాకార మధ్య భాగం తుంబగా వ్యవహరిస్తారు. 3 రథాల ప్రత్యేక విశ్వకర్మ ప్రముఖ వడ్రంగి సేవకుల పర్యవేక్షణలో వడ్రంగి పనులు చురుకుగా సాగుతున్నాయి. యాత్ర కోసం తయారు అవుతున్న తాళ ధ్వజం, దేవ దళనం, నంది ఘోష్ 3 రథాల కోసం సమగ్రంగా 42 తుంబలను తయారు చేస్తారు. వీటిలో బలభద్ర స్వామి రథం తాళ ధ్వజానికి 14, దేవీ సుభద్ర రథం దేవ దళానికి 12 మరియు శ్రీ జగన్నాథుని నంది ఘోష్ రథానికి అత్యధికంగా 16 తుంబల్ని అమర్చుతారు. బలభద్రుడు, శ్రీ జగన్నాథుని రథాల తుంబల కొలమానం 2 అడుగుల 8 అంగుళాలు కాగా దేవీ సుభద్ర రథం తుంబ పరిమాణం 3 అడుగులు ఉంటుంది. -
కేఐఐటీ డీయూలో వై20 కన్సల్టేషన్స్
భువనేశ్వర్: జీ20 సదస్సులో భాగంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ(కేఐఐటీ డీయూ)లో ‘వై20 కన్సల్టేషన్స్’ శుక్రవారం ప్రారంభమైంది. ఒడిశా రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని 21వ శతాబ్దంలో మన దేశాన్ని అగ్రగామిగా తీర్చదిద్దడానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సౌభాగ్యాలను నెలకొల్పడంలో యువత పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. వై20 కన్సల్టేషన్స్కు కేఐఐటీ వ్యవస్థాపకులు డాక్టర్ అచ్యుత సమంత అధ్యక్షత వహించారు. -
Hockey World Cup 2023: 48 ఏళ్ల కల నెరవేరేనా!
ఎప్పుడో 1975లో... భారత హాకీ జట్టు అజిత్పాల్ సింగ్ నాయకత్వంలో ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా నాటి మేటి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. ట్రోఫీ గెలవడం సంగతేమో గానీ ఆ తర్వాత 11 ప్రపంచ కప్లు జరిగినా మన టీమ్ కనీసం సెమీ ఫైనల్ కూడా చేరలేకపోవడం నిరాశ కలిగించే అంశం. వరుసగా రెండో సారి మనమే ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో భారత జట్టు రాత మారుతుందా... కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి కాంస్యం సాధించిన మన టీమ్ అదే జోరును చూపిస్తుందా అనేది ఆసక్తికరం. భువనేశ్వర్: భారత గడ్డపై మరో విశ్వ సంబరానికి సమయం ఆసన్నమైంది. 15వ హాకీ వరల్డ్ కప్ నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఒడిషాలోని రెండు వేదికలు భువనేశ్వర్, రూర్కెలాలలో 17 రోజుల పాటు మొత్తం 44 మ్యాచ్లు జరుగుతాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్లో అర్జెంటీనాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. తొలి రోజే బరిలోకి దిగనున్న భారత్... స్పెయిన్ను ఎదుర్కోనుంది. భువనేశ్వర్లోని కళింగ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉండగా... కొత్తగా ఈ టోర్నీ కోసం మరో పెద్ద హాకీ స్టేడియాన్ని రూర్కెలాలో నిర్మించారు. 24 మ్యాచ్లు భువనేశ్వర్లో, 20 మ్యాచ్లు రూర్కెలాలో జరుగుతాయి. మొత్తం 16 జట్లు బరిలోకి దిగుతుండగా వాటిని నాలుగు పూల్లుగా విభజించారు. ముందుగా తమ గ్రూప్లో ఇతర మూడు జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘క్రాస్ ఓవర్స్’, క్వార్టర్స్, సెమీస్ ఉంటాయి. జనవరి 29న ఫైనల్ నిర్వహిస్తారు. నేటి మ్యాచ్లు అర్జెంటీనా X దక్షిణాఫ్రికా (మ.గం. 1.00 నుంచి) ఆస్ట్రేలియా X ఫ్రాన్స్ (మం.గం. 3.00 నుంచి) ఇంగ్లండ్ X వేల్స్ (సా.గం. 5.00 నుంచి) భారత్ X స్పెయిన్ (సా.గం. 7.00 నుంచి) పూల్ల వివరాలు ‘ఎ’ – అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ‘బి’ – బెల్జియం, జర్మనీ, జపాన్, కొరియా ‘సి’ – చిలీ, మలేసియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ ‘డి’ – భారత్, స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్ * ప్రపంచకప్ను అత్యధికంగా పాకిస్తాన్ (4 సార్లు) గెలవగా...నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా చెరో 3 టైటిల్స్ సాధించాయి. జర్మనీ రెండు సార్లు విజేతగా నిలవగా...భారత్, బెల్జియం ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి. -
నాలుగు నగరాల్లో రిటైల్ డిజిటల్ రూపీ
న్యూఢిల్లీ: రిటైల్ డిజిటల్ రూపాయిని ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ గురువారం నాలుగు నగరాల్లో తొలి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ ఈ నగరాల్లో ఉన్నాయి. పరిమిత సంఖ్యలో యూజర్లతో ఆర్బీఐ ఈ ప్రాజెక్టును పరీక్షిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఇందులో పాలుపంచుకుంటున్నాయి. రెండో విడతలో దీన్ని హైదరాబాద్ సహా తొమ్మిది నగరాలకు విస్తరించనుండగా, మరో నాలుగు బ్యాంకులు కూడా పాల్గోనున్నాయి. ఆర్బీఐ ఇప్పటికే టోకు లావాదేవీల కోసం నవంబర్ 1న డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. భౌతిక రూపంలో నగదు నిర్వహణ వ్యయాలను తగ్గించేందుకు, అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ఇది ఉపయోగపడగలదని విశ్లేషకులు తెలిపారు. బ్యాంకులు అందించే మొబైల్ యాప్ వాలెట్ ద్వారా కస్టమర్లు ఈ–రూపీతో లావాదేవీలు నిర్వహించవచ్చని వివరించారు. కస్టమర్ల అభ్యర్ధన మేరకు వారి వాలెట్లలోకి బ్యాంకులు ఈ–రూపీని క్రెడిట్ చేస్తాయని, వ్యక్తులు .. వ్యాపార సంస్థలకు డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిపేందుకు దీన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలకు భిన్నంగా బ్యాంకుల అవసరాలను బట్టి ఆర్బీఐ అధికారికంగా ఈ కరెన్సీని జారీ చేస్తుంది. -
చిన్నప్పటి బడికి రాష్ట్రపతి
భువనేశ్వర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిన్నప్పుడు తాను చదువుకున్న పాఠశాలను సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో కందగిరిలోని తపోబన హైస్కూల్ను ఆమె శుక్రవారం సందర్శించారు. ‘‘నా చదువు సొంతూరు ఉపార్బెడాలో మొదలైంది. గడ్డితో కప్పిన గుడిసెలో చదువుకున్నా. చుట్టూ పేడ, చెత్తను ఊడ్చి మేమే శుభ్రం చేసేవాళ్లం.’’ అన్నారు. అనంతరం 8 నుంచి 11వ తరగతి వరకు తాను చదువుకున్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. చదువుకునే రోజుల్లో తానున్న కుంతల కుమారీ ఆదివాసీ హాస్టల్ను సందర్శించారు. 13 మంది చిన్ననాటి మిత్రులను కలుసుకున్నారు. -
రాజ్భవన్ ప్రాంగణంలోని చందనం చెట్టు మాయం
భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని రాజ్భవన్ ఆవరణలో ఉన్న అరుదైన చందనం చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో ఉన్న చెట్టును మంగళవారం దుండగులు నరికేసి, ఎత్తుకుపోయారు. గవర్నర్ అధికార నివాసంలో చోటుచేసుకున్న ఘటనపై రాజ్భవన్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా కొందరు అనుమానితులపై నిఘా పెట్టామని, దోషులెవరో త్వరలోనే తేలుస్తామని పోలీసులు గురువారం చెప్పారు. చందనం చెట్ల పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది. చందనం కలపను కోతకు, రవాణాకు అటవీ శాఖ నుంచి ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. -
ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్పై భారత్ విజయం
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీని భారత జట్టు విజయంతో మొదలు పెట్టింది. న్యూజిలాండ్తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 4–3 గోల్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. ఒక దశలో 2–3తో వెనుకబడినా... కోలుకొని భారత్ చివరకు విజేతగా నిలవడం విశేషం. భారత్ తరఫున మన్దీప్ మోర్ (13వ నిమిషం), హర్మన్ప్రీత్ సింగ్ (41) రెండు గోల్స్ చేయగా... స్యామ్ లేన్ (23వ నిమిషం, 35) రెండు గోల్స్, జేక్ స్మిత్ (34) ఒక గోల్ సాధించారు. ఫలితంగా మూడో క్వార్టర్ ముగిసే సరికి కివీస్ 3–2తో ముందంలో ఉంది. అయితే నాలుగో క్వార్టర్లో చెలరేగిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మన్దీప్ సింగ్ 51వ, 56వ నిమిషాల్లో గోల్స్ సాధించి జట్టు గెలుపు బాట పట్టించాడు. ఇరు జట్లు అటాకింగ్కు ప్రాధాన్యతనివ్వగా, అర్ధ భాగం ముగిసే సరికి స్కోరు 1–1తో సమమైంది. మూడో క్వార్టర్ చివర్లో సుమీత్కు ఎల్లో కార్డు చూపించడంతో 10 నిమిషాలు అతను ఆటకు దూరం కాగా 10 మందితోనే భారత్ పోరాడింది. చదవండి: ISL 2022: ముంబై చేతిలో కేరళ ఓటమి -
FIFA 2022: భారత్లో అమ్మాయిల ‘కిక్’స్టార్ట్
భువనేశ్వర్: ‘ఫిఫా’ అమ్మాయిల అండర్–17 ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్కు సర్వం సిద్ధమైంది. 16 జట్ల మధ్య ఈనెల 30 వరకు జరిగే ఈ టోర్నీని భువనేశ్వర్, గోవా, నవీ ముంబైలలో నిర్వహిస్తారు. గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్లో బ్రెజిల్తో మొరాకో తలపడనుండగా, మరో మ్యాచ్లో 2008 రన్నరప్ అమెరికాతో భారత్ ఎదుర్కోనుంది. ఈ వయో విభాగంలో జరుగుతున్న ఏడో ప్రపంచకప్ లో భారత్ ఆడటం ఇదే మొదటిసారి. ఆతిథ్య హోదాతో బెర్త్ లభించగా మిగతా జట్లు ఆరు కాన్ఫెడరేషన్ల టోర్నీలతో అర్హత సాధించాయి. ఆసియా నుంచి భారత్తో పాటు చైనా, జపాన్... ఆఫ్రికా కాన్ఫెడరేషన్ నుంచి మొరాకో, నైజీరియా, టాంజానియా... సెంట్రల్, ఉత్తర అమెరికా, కరీబియన్ల నుంచి కెనడా, మెక్సికో, అమెరికా, దక్షిణ అమెరికా నుంచి బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఓసియానియా నుంచి న్యూజిలాండ్, యూరోప్ నుంచి ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్లు ప్రపంచకప్కు అర్హత సాధించాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్కు ప్రతీ మ్యాచ్ అగ్నిపరీక్షే! అమెరికా, బ్రెజిల్, మొరాకోలతో క్లిష్టమైన పోటీలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్ దశ దాటడం అసాధ్యమే! అద్భుతాలకు ఏ మాత్రం చోటులేదు. ‘బి’ గ్రూపులో జర్మనీ, నైజీరియా, చిలీ, న్యూజిలాండ్.. ‘సి’లో స్పెయిన్, కొలంబియా, మెక్సికో, చైనా.. ‘డి’లో జపాన్, టాంజానియా, కెనడా, ఫ్రాన్స్ ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. ఈ నెల 30న ఫైనల్ జరుగుతుంది. -
Padampur MLA: పద్మపూర్ ఎమ్మెల్యే మృతి
భువనేశ్వర్: పద్మపూర్ శాసనసభ సభ్యుడు, మాజీమంత్రి బిజయ్రంజన్ సింఘ్ బొరిహా(65) స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం పద్మపూర్లో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. పద్మపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలి 2సార్లు జనతా దళ్ టికెట్తో పోటీ చేసి గెలుపొందారు. బిజూ జనతాదళ్ ఆవిర్భావం నుంచి బీజేడీ టికెట్తో పోటీ చేసి, నిరవధికంగా గెలుపొందారు. 1990 నుంచి 2000 వరకు జనతాదళ్ అభ్యర్థిగా, 2000, 2009, 2019 ఎన్నికల్లో బిజూ జనతాదళ్ అభ్యర్థిగా శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 2009లో రాష్ట్ర దళిత, హరిజన అభివృద్ధి విభాగం మంత్రి పదవి ఆయనకు వరించింది. ఈ సందర్భంగా సమర్ధవంతమైన నాయకుడిని బీజేడీ కోల్పోయిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. ప్రజా సంక్షేమం ధ్యేయంగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు సాధించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చదవండి: (దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. స్టేజ్పైనే కుప్పకూలిన ప్రముఖ గాయకుడు) శాసనసభ ఆవరణలో గార్డ్ ఆఫ్ ఆనర్ భువనేశ్వర్: బర్గడ్ జిల్లా పద్మపూర్ ఎమ్మెల్యే దివ్యరంజన్ బొరిహాకు శాసనసభ ఆవరణలో అంతిమ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం గార్డు ఆఫ్ ఆనర్ నిర్వహించారు. సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల సాధికారిత విభాగం మంత్రి అశోక్చంద్ర పండా, ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమశాఖ మంత్రి అతున్ సవ్యసాచి నాయక్, శాసనసభ విపక్షనేత జయనారాయణ మిశ్రా, పార్లమెంట్ సభ్యురాలు సులత దేవ్, ఎమ్మెల్యేలు ప్రణబ్ ప్రకాశ్దాస్, అనంత నారాయణ జెనా, సుశాంత రౌత్, మాజీ ఎమ్మెల్యే రమారంజన బలియార్ సింఘ్, రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు మీనతి బెహరా, రాష్ట్ర శాసనసభ కార్యదర్శి దాశరథి శత్పతి, పలువురు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. -
Men Hockey World Cup 2023: హాకీ ప్రపంచకప్ డ్రా విడుదల
భువనేశ్వర్: వచ్చే ఏడాది భారత్లో నిర్వహించే పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్కు సంబంధించిన డ్రా గురువారం విడుదల చేశారు. భువనేశ్వర్, రూర్కెలా వేదికల్లో వచ్చే జనవరి 13 నుంచి 28వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. ప్రపంచ ఐదో ర్యాంకర్, ఆతిథ్య భారత్ ‘పూల్–డి’లో ఇంగ్లండ్, స్పెయిన్, వేల్స్లతో తలపడనుంది. ఈ పూల్లో మెరుగైన ర్యాంకింగ్ జట్టు భారతే! ఇంగ్లండ్ (6), స్పెయిన్ (8), వేల్స్ (16)లు ఆతిథ్య జట్టుకు దిగువనే ఉన్నాయి. ‘పూల్–ఎ’లో ప్రపంచ నంబర్వన్ ఆస్ట్రేలియా, 2016 ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ప్రపంచ చాంపియన్ బెల్జియం ‘పూల్–బి’లో ఉంది. ఈ పూల్లో జర్మనీ, కొరియా, జపాన్ మిగతా జట్లు. ‘పూల్–సి’లో గత రన్నరప్ నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మలేసియా, చిలీ ఉన్నాయి. -
Indian Navy: ఉమెన్–ఫ్రెండ్లీ ధీర... : అగ్నివీర
శిక్షణ కఠినంగా ఉండాలి. అదే సమయంలో అవసరాలు, సౌకర్యాల విషయంలో కరుణతో వ్యవహరించాలి. కళింగ గడ్డ మీద ఉన్న సువిశాల ‘ఐఎన్ఎస్ చిలికా’ శిక్షణా కేంద్రం ఫస్ట్ బ్యాచ్ అగ్నివీర్ ఉమెన్ ట్రైనీలను దృష్టిలో పెట్టుకొని ‘ఉమెన్–ఫ్రెండ్లీ’ విధానానికి శ్రీకారం చుట్టింది... అగ్నివీర్ చుట్టూ రగిలిన వివాదాల మాట ఎలా ఉన్నా సైన్యంలోని వివిధ విభాగాల్లో పని చేయాలనే ఆసక్తి, ఉత్సాహాన్ని ఆ వివాదాలు అంతగా ప్రభావితం చేయలేకపోయాయి. నేవీలో 3,000 ఉద్యోగాల కోసం లక్షలాది మంది పోటీలోకి దిగారు. వీరిలో 82,000 మంది మహిళలు ఉన్నారు. భువనేశ్వర్కు సమీపంలోని ప్రసిద్ధ ‘ఐఎన్ఎస్ చిలికా’ శిక్షణా కేంద్రంలోకి నేవి అగ్నివీర్ ఫస్ట్ ఉమెన్ బ్యాచ్కు చెందిన 600 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. దాంతో మహిళా శిక్షణార్థుల అవసరాలు, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఐఎన్ఎస్. సువిశాలమైన ఐఎన్ఎస్ శిక్షణాకేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకమైన గదులు, డైనింగ్ ఏరియాను ఏర్పాటు చేస్తారు. అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని టాయిలెట్లను నిర్మిస్తున్నారు. శానిటరీ పాడ్ వెండింగ్, డిస్పోజల్ యంత్రాలను, సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు. వర్కర్స్, స్విమ్మింగ్ ఇన్స్ట్రక్టర్స్గా మహిళలనే నియమిస్తారు. ఉమెన్ ఆఫీసర్స్ ట్రైనీలకు సంబంధించి శిక్షణపరమైన పర్యవేక్షణ బాధ్యతలతో పాటు వారి వ్యక్తిగత ఇబ్బందులు, అసౌకర్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరిస్తారు. ‘ప్రైవసీతో సహా మహిళా శిక్షణార్థులకు సంబంధించి రకరకాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం. సమస్యలు, సౌకర్యాలపై వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన మార్పులు చేయనున్నాం’ అంటున్నారు నేవీ ఉన్నతాధికారి ఎం.ఏ.హంపిహోలి. స్త్రీ, పురుషులకు సంబంధించి ట్రైనింగ్ కరికులమ్లో తేడా అనేది లేకపోయినా తప్పనిసరి అనిపించే ఫిజికల్ స్టాండర్డ్స్లో తేడాలు ఉంటాయి. అగ్నిపథ్ తొలిదశలో పర్సనల్ బిలో ఆఫీసర్ ర్యాంక్(పిబివోఆర్) క్యాడర్లో మహిళలను రిక్రూట్ చేస్తున్న తొలి విభాగం నేవి. ‘సెయిలర్స్’గా మహిళలకు తొలిసారిగా అవకాశం కల్పించడం ఒక చారిత్రక అడుగు. ‘భవిష్యత్ అవసరాలు, స్త్రీ సాధికారతను దృష్టిలో పెట్టుకొని నావికాదళం ప్రగతిశీలమైన అడుగులు వేస్తుంది’ అంటుంది కమాండర్ గౌరీ మిశ్రా. కొన్ని నెలలు వెనక్కి వెళితే... నేవీకి చెందిన ఆల్–ఉమెన్ టీమ్ ‘నావిక సాగర్ పరిక్రమ’ పేరుతో ప్రపంచ నౌకాయాత్ర చేసి చరిత్ర సృష్టించింది. ‘ఇది మా వ్యక్తిగత సంతోషానికి, సాహసానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు... ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చి సాహసంతో ముందుకు నడిపే చారిత్రక విజయం’ అన్నారు ‘నావిక సాగర్ పరిక్రమ’లో భాగం అయిన అయిదు మంది మహిళా అధికారులు. కొన్ని రోజులు వెనక్కి వెళితే... ఉత్తర అరేబియా సముద్రంలో సర్వైవలెన్స్ మిషన్లో భాగం అయిన ‘ఆల్–ఉమెన్ క్రూ’ మరో సంచలనం. తాజా విషయానికి వస్తే... భవిష్యత్ పనితీరుకు శిక్షణ సమయం పునాదిలాంటిది. అది గట్టిగా ఉండాలంటే సౌకర్యాలు, అవసరాల విషయంలో తగిన శ్రద్ధ చూపాలి. ఇప్పుడు మహిళా ట్రైనీల విషయంలో ‘ఐన్ఎన్ఎస్ చిలికా’ చేస్తున్నది అదే. -
బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ
సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా జూన్ 18 రాత్రి ఆత్యహత్యకు పాల్పడింది. భువనేశ్వర్లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఉన్న తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. గత కొద్ది రోజులుగా ఈ ఇంట్లోనే రష్మీ అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో తన మరణానికి ఎవరు కారణం కాదని తెలిపింది. ఇంకా 'ఐ లవ్ యూ సాన్' అని రాసుకొచ్చింది. అయితే 23 ఏళ్ల రష్మీ రేఖ కొన్నాళ్లుగా సంతోష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. రష్మీ మరణానికి సంతోష్ కారణమై ఉండొచ్చని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. 'శనివారం (జూన్ 18) రష్మీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. తర్వాత తను చనిపోయినట్లు సంతోష్ మాకు చెప్పాడు. సంతోష్, రష్మీ భార్యాభర్తలుగా నివసిస్తున్నట్లు ఇంటి యజమాని చెప్పేంత వరకు ఆ విషయం మాకు తెలియదు.' అని రష్మీ రేఖ తండ్రి తెలిపారు. జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన రష్మీ 'కెమిటి కహిబి కహా' అనే ఒడియా సీరియల్తో గుర్తింపు పొందింది. చదవండి: సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్లో కరణ్ జోహార్.. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నాగుపాముకి అరుదైన శస్త్రచికిత్స
ఒడిశా (భువనేశ్వర్) : నాగుపాముకి అరుదైన శస్త్రచికిత్స చేసి, దాని పొట్టలో ఇరుక్కున్న సారా సీసా మూతను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్న పాము ఆరోగ్య పరిస్థితులను దాదాపు వారం రోజుల పాటు పరిశీలిస్తారు. నాలుగు రోజుల తర్వాత దానికి ద్రవ పదార్థాలను మాత్రమే ఆహారంగా ఇచ్చి, క్రమంగా కోలుకునేలా జాగ్రత్త వహిస్తారు. వివరాలిలా ఉన్నాయి.. స్థానిక వాసుదేవ్ నగర్లోని నిర్మాణ దశలో ఉన్న ఓ భవనం దగ్గరున్న కొట్టు గదిలో మూడున్నర అడుగుల నాగుపాముని అక్కడి కార్మికులు గుర్తించి, స్నేక్ హెల్ప్లైన్కు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది పామును చాకచక్యంగా పట్టుకుని, పరిశీలించగా, పాము పొట్ట భాగంలో ఏదో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ మూగజీవాల చికిత్స విభాగానికి తరలించగా, అక్కడ తీసిన ఎక్స్–రేలో పాము పొట్టలో సీసా మూత ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మూగజీవాల శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ ఇంద్రమణి నాథ్, రేడియాలజీ నిపుణులు డాక్టర్ సిద్ధార్థ్ శంకర బెహరా ఆ పాముకు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి, సీసా మూతను తొలగించారు. -
ఇలాంటి ఆధార్ కార్డును ఎప్పుడైనా చూశారా? సోషల్ మీడియా ఫిదా
భువనేశ్వర్: కోవిడ్ నియంత్రణలో భాగంగా పండగలు, ఉత్సవాలు, వివాహాది శుభకార్యాల నిర్వహణపై ప్రభుత్వ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఏ కార్యక్రమం అయినా జనసమూహానికి తావులేకుండా పరిమిత వ్యక్తులతో కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా జరుపుకోవాలనేది ప్రధానమైన నిబంధన. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఛత్తీస్గఢ్లోని యశ్పూర్ జిల్లా, ఫర్సభ సమితి, అంకిరా గ్రామానికి చెందిన లోహిత్ సింఘ్ కాస్త వినూత్నంగా ఆలోచించాడు. ఆధార్ తరహాలో తన పెళ్లి కార్డ్ను ప్రింట్ చేయించి, బంధుమిత్రులకు పంచిపెట్టాడు. పెళ్లికి విచ్చేసే వారంతా ముఖానికి మాస్క్ ధరించడమే కాకుండా భౌతికదూరం పాటించాలని పిలుపునిస్తూ శుభలేఖలో పేర్కొనడం విశేషం. బార్ కోడ్ సైతం కలిగి ఉన్న ఈ కార్డ్లో ఆధార్ నంబరు స్థానంలో పెళ్లి తేది, అడ్రస్ స్థానంలో ఆచరించాల్సిన కోవిడ్ నియమాలు ఉండడం ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం ఈ పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో సైతం ఈ తరహా వెడ్డింగ్ కార్డులు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్ల దుర్మరణం
సాక్షి, భువనేశ్వర్: కెంజొహర్ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీర్లు దుర్మరణం పాలయ్యారు. బాసుదేవ్పూర్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జోడా నుంచి చంపువా వెళ్తుండగా బాసుదేవ్పూర్ వద్ద వెనుక నుంచి వచ్చిన ట్రక్కు దూసుకు పోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ఒకరు మృతిచెందగా.. చంపువా ప్రభత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇంజినీర్ మృతిచెందాడు. కెంజొహర్ జిల్లా కొడొగొడియా ప్రాంతంలో భారీ నీటి సరఫరా ప్రాజెక్టు నిర్మాణం సమీక్షించేందుకు వెళ్తూ ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. చంపువా ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమానుషం: భర్త కంట్లో కారం చల్లి.. కుమారుడితో కలిసి.. -
ఎమ్మెల్యే కిశోర్ మహంతి కన్నుమూత
భువనేశ్వర్: బ్రజ్రాజ్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కిశోర్ మహంతి(63) కన్నుమూశారు. గుండెపోటుతో ఝార్సుగుడ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన 1990లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఝార్సుగుడ శాసనసభ స్థానం నుంచి వరుసగా 3 సార్లు పోటీ చేసి గెలుపొందారు. ►2004 నుంచి 2008 నుంచి ప్రభుత్వ చీఫ్ విప్గా, మంత్రిగా, స్పీకరుగా, పశ్చిమ ఒడిశా అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బ్రజ్రాజ్నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన ప్రస్తుతం బీజేడీలో సీనియర్ నాయకునిగా వెలుగొందారు. ►ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరవధికంగా కొనసాగిన పలు సభలు, సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. సాయంత్రం పార్టీ కార్యాలయంలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని అలా పడుకుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడం గమనార్హం. ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం నవీన్, గవర్నరు గణేషీలాల్, ఏపీ గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం ప్రకటించారు. కిశోర్ మృతి తీరని లోటు.. ఒడిశా శాసనసభ సభ్యుడు కిశోర్ మహంతి మృతి తీరని లోటని ఏపీ గవర్నరు సంతాపం ప్రకటించారు. నిష్పక్షపాత వైఖరితో అందరినీ ఆకట్టుకునే నాయకుడిగా విశేష గుర్తింపు సాధించారు. ఆయన మన మధ్య లేరన్న వార్త జీర్ణించుకోలేనిది. ప్రభుత్వ చీఫ్ విప్గా ప్రభుత్వ వ్యవహారాల్లో అనన్య దక్షత ప్రదర్శించిన నాయకుడు కిశోర్. -బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ గవర్నర్ ప్రజా ప్రతినిధిగా చిరస్మరణీయులు.. రాజకీయ నాయకునిగా రాష్ట్ర శాసనసభ సభ్యునిగా కిశోర్ మహంతి పాత్ర చిరస్మరణీయం. 3 దశాబ్దాల పాటు ప్రజా నాయకునిగా> వెలుగొందడం కొంతమందికే సొంతమని, ఈ తరం నాయకుల్లో ఆ గొప్పతనం ఒక్క కిశోర్ దక్కుతుంది. ఆయన మృతి పశ్చిమ ఒడిశా ప్రజలను కలచివేసిందని ఈ సందర్భంగా దివంగత నాయకుని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – ప్రొఫెసరు గణేషీలాల్, రాష్ట్ర గవర్నర్ మంచి నాయకుడిని కోల్పోయాం.. రాష్ట్ర ప్రజలు ఓ మంచి నాయకుడిని కోల్పోయారు. స్పీకరుగా శాసనసభ వ్యవహారాల్లో దక్షత చాటుకుని అఖిల పక్షాల ప్రియతమ స్పీకరుగా గుర్తింపు సాధించారు. పశ్చిమ ఒడిశా అభివృద్ధిలో ఆయనది విశేష పాత్ర. పార్టీ వ్యవహారాల్లో ఆయన సేవ, అంకిత భావం భవిష్యత్ తరాలకు ఆదర్శం. ఆయన మరణం పూడ్చలేనిది. బాధిత కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – సీఎం నవీన్ పట్నాయక్ -
గుండెల్ని పిండే ఘటన: అమ్మా లే అమ్మ.. అమ్మా లే అమ్మ!
భువనేశ్వర్/బొలంగీరు: తల్లి ఒడి ప్రతి బిడ్డకు అమోఘం. ప్రాణం లేకున్నా తల్లి ఒడిని వీడేందుకు ఇష్టపడని ఓ చిన్నారి ఏకంగా 2 రోజుల పాటు తల్లి శవంతో కలిసి జీవించడం హృదయాన్ని కలచివేస్తోంది. బొలంగీరు సగరపడా శివాలయం దగ్గర ఈ హృదయ విదారక సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఇళ్లల్లో పాచి పనులు చేసుకుని తన మూడేళ్ల పాపని పోషించుకుంటున్న కున్ని నాయక్ కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో మంచానపడింది. సరిగ్గా రెండు రోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె చనిపోయింది. ఈ విషయం ఎరుగని ఆ పసిబిడ్డ తల్లి పడుకునే ఉందనుకుని మృతదేహంతో నిద్రాహారాలు మానేసి 2 రోజులు గడిపింది. మూడో రోజు నాటికి తన అమ్మ నోటి నుంచి పురుగులు బయటకు రావడంతో కంగారుపడిన ఆ పసిబిడ్డ ఇరుగుపొరుగు వారికి ఈ విషయం తెలియజేసింది. దీంతో తన తల్లి చనిపోయిన వాస్తవం బయటపడింది. ఇది తెలుసుకుని కన్నీరుమున్నీరవుతున్న ఆ పసికందు అమ్మా లే అమ్మ.. అమ్మా లే అమ్మ.. నాకు అమ్మ కావాలి.. అని ఆ బాలిక ఏడుపు విన్నవారి గుండె బరువెక్కింది. చిన్న బిడ్డకు ఎంత పెద్దకష్టం వచ్చిందని, ఈ పసిపాప ఆలనా పాలనా ఎవరు చూసుకుంటారని తల్లడిల్లుతున్నారు. చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే) వివరాలిలా ఉన్నాయి.. భర్త మరణించిన తర్వాత పుట్టినింటి వారు, మెట్టినింటి వారు నిరాకరించడంతో కున్ని నాయక్ బతుకు వీధిన పడింది. చేత చిన్నారి పసి పాపను పట్టుకుని బొలంగీరు సగరపడా ప్రాంతంలోని శివాలయం దగ్గర ఒకేఒక్క గది ఉన్న ఇంట్లో అద్దెకు చేరింది. ఆ ఇంటా ఈ ఇంటా పాచి పనులు చేసుకుని ఇరుగుపొరుగు వారి ఆదరణతో జీవితం సాగనంపింది. ఇలా ఏడాదిన్నర గడిచేసరికి కున్ని తరచూ అనారోగ్యం బారినపడేది. ఎప్పటిలాగే ఒంట్లో బాగోలేకపోవడంతో కున్ని నాయక్ నిద్రపోయింది. అలా నిద్రలోనే ఉంటుండగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఇది తెలియని ఆ పసి బిడ్డ ఇరుగుపొరుగు వారు అమ్మ ఏదని అడిగితే ఒంట్లో బాగోలేక అమ్మ నిద్ర పోతుందని చెప్పేది. ఉదయం తన తల్లి నోటి నుంచి పురుగులు వస్తున్న విషయం బయటకు రావడంతో తన తల్లి చనిపోయినట్లు తెలుసుకుని ఆ పసి హృదయం రోదించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి మృతదేహం తరలించారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) -
దేశీయ సెమీకండక్టర్ చిప్లను అభివృద్ధి చేసిన ఆ ఐఐటీ..!
టెక్నాలజీ పరంగా దేశంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రముఖ ఐఐటీ-భువనేశ్వర్ క్యాంపస్ అత్యాధునిక యాప్స్ కోసం రెండు సెమీకండక్టర్ చిప్లను అభివృద్ధి చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్(ఐసీ) చీప్ ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్(ఐఓఎంటి)లో శక్తివంతమైన సురక్షిత బయోమెడికల్ డేటా ప్రసారానికి సహాయపడితే, మరో చీప్ స్వల్ప-శ్రేణి తక్కువ శక్తి గల ఆర్ఎఫ్ ఫ్రంట్ ఎండ్ఐసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) యాప్స్ వంటి వాటిలో శక్తిని ఆదా చేస్తుంది. డాక్టర్ ఎంఎస్ మణికందన్, డాక్టర్ శ్రీనివాస్ బొప్పు నేతృత్వంలోని పరిశోధకుల బృందం అల్ట్రా-లో పవర్ కాంప్లిమెంటరీ మెటల్-ఆక్సైడ్ సెమీకండక్టర్(సీఎంఓఎస్) డేటా మార్పిడి ఐసీని రూపొందించి అభివృద్ధి చేసింది. "ఈ ఐసీ వేగంగా బయోమెడికల్ డేటాను ప్రసారం చేస్తుంది, తక్కువ శక్తిని ఎడ్జ్ కంప్యూటింగ్ లేదా క్లౌడ్ కంప్యూటింగ్ పరికరాలకు వినియోగిస్తుంది" అని మణికందాన్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ మ్యాన్ పవర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ ఐసీ అభివృద్ధి చేశారు. మొహాలీలోని సెమీ కండక్టర్ లేబొరేటరీ(ఎస్ సిఎల్)లో ఫ్యాబ్రికేట్ చేసినట్లు తెలిపారు. డాక్టర్ విజయ శంకర రావు, పసుపురేడి నేతృత్వంలోని మరో బృందం డిజిటల్ ఇంటెన్సివ్ సబ్ శాంపులింగ్ షార్ట్ రేంజ్ గల పవర్ ఆర్ఎఫ్ ఫ్రంట్ ఎండ్ ఐసీని రూపొందించి అభివృద్ధి చేసింది. చిప్లో అనేక డిజైన్ ఆవిష్కరణలు ఉన్నాయి. దీనిని తైవాన్ సెమీకండక్టర్ తయారీ కంపెనీలో ఫ్యాబ్రికేట్ చేశారు. ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్ వి రాజా కుమార్ మాట్లాడుతూ.. "గత నాలుగు సంవత్సరాలుగా చాలా కష్టపడి పనిచేసిన తర్వాత ఈ సెమీకండక్టర్ చిప్స్ అభివృద్ధి చేసినట్లు" తెలిపారు. (చదవండి: 2021లో భారత్లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!) -
స్కూల్కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు!
భువనేశ్వర్: స్కూల్కు సెలవులు ఇవ్వడం లేదని ఓ విద్యార్ధి ఏకంగా 20 మంది విద్యార్ధుల జీవితాలను ఇరకాటంలో పెట్టాడు. ఎందుకు చేశావని స్కూల్ ప్రిన్సిపాలు అడిగితే అతను చెప్పిన సమాధానం విని అందరూ నోరెళ్ల బెట్టారు. అసలేంజరిగిందంటే.. ఒడిశాలోని బర్గార్ జిల్లాకు చెందిన కామగాన్ హయ్యర్ సెకండరీ స్కూల్ల్లో 11వ తరగతి చదివే విద్యార్థి (16) తన 20 మంది స్నేహితులకు బాటిల్ నీళ్లలో విషం కలిపి ఇచ్చాడు. ఆ బాటిల్లోని నీళ్లు తాగిన వారంతా వాంతులు, వికారంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స అనంతరం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనపై ప్రిన్సిపాల్ ప్రేమానంద్ పటేల్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కారణంగా మరోమారు లాక్డౌన్ విధించే అవకాశం ఉందని నేరానికి పాల్పడిన విద్యార్ధి ఆశించాడు. అలా జరగకపోవడంతో ఈ పనికి పూనుకున్నాడని తెలిపాడు. ఐతే అనారోగ్యంపాలైన విద్యార్ధుల తల్లిదండ్రులు సదరు విద్యార్ధిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐతే విద్యార్ధి కెరీర్, చిన్న వయసును దృష్టిలో ఉంచుకుని ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదు. ఐతే పాఠశాల యాజమన్యం సదరు విద్యార్ధిని కొన్ని రోజులపాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. పాఠశాలలోని హాస్టల్లో నివసిస్తున్న విద్యార్ధి ఎలాగైనా ఇంటికి వెళ్లాలనుకున్నాడు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్లు వచ్చినప్పుడు స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు ఒమిక్రాన్ వల్ల కూడా స్కూళ్లు మూతపడి సెలవులిస్తారని అనుకున్నాడు. అలా జరగకపోవడంతో తోటలోని పురుగుల మందును నీళ్లలో కలిపి విద్యార్ధులకు తాగేందుకు ఇచ్చాడు. నీళ్లను తాగిన విద్యార్ధులు ఆనారోగ్యానికి గురయ్యారు. చదవండి: జపాన్లో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు.. ఆ దేశంలో రోజుకు 7 వేలకు పైనే..! -
ప్రపంచకప్ నుంచి భారత్ ఔట్..
భువనేశ్వర్: వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్గా నిలవాలనుకున్న భారత జూనియర్ హాకీ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 2–4 గోల్స్తో ఆరుసార్లు చాంపియన్ జర్మనీ చేతిలో ఓడింది. జర్మనీ తరఫున ఎరిక్ (15వ ని.లో), ఫ్లాటెన్ (21వ ని.లో), ముల్లర్ (24వ ని.లో), క్రిస్టోఫర్ (25వ ని.లో) గోల్స్ చేశారు. భారత ఆటగాళ్లలో ఉత్తమ్ సింగ్ (25వ ని.లో), బాబీ సింగ్ (60వ ని.లో) చెరో గోల్ సాధించారు. మరో సెమీఫైనల్లో అర్జెంటీనా ‘షూటౌట్’లో 3–1 తో ఫ్రాన్స్పై నెగ్గింది. ఆదివారం మూడో స్థానం కోసం జరిగే పోరులో ఫ్రాన్స్తో భారత్ ఆడుతుంది. చదవండి: IND vs NZ: ఐపీఎల్లో ఆ అంపైర్తో గొడవపడ్డ కోహ్లి.. అందుకే ఔట్ ఇచ్చాడా... -
వరల్డ్కప్ నుంచి పాకిస్తాన్ ఔట్..
భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 3–4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడింది. దాంతో గ్రూప్ ‘డి’లో ఒక విజయం, రెండు ఓటములతో 3 పాయింట్లు సాధించిన పాక్ మూడో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధించలేకపోయింది. అర్జెంటీనా తరఫున బాటిస్టా (10వ ని.లో), నార్డోలిలో (20వ ని.లో), ఫ్రాన్సిస్కో (30వ ని.లో), ఇబార (47వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పాక్ ఆటగాళ్లు రాణా అబ్దుల్ (17వ నిమిషంలో), రిజ్వాన్ అలీ (28వ నిమిషంలో), అహ్మద్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. చదవండి: BAN Vs PAK: పాకిస్తాన్కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లు... -
Hockey Mens Junior World Cup 2021: కెనడాపై భారత్ విజృంభణ..
భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచ కప్లో ఫ్రాన్స్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి భారత జూనియర్ హాకీ జట్టు తేరుకుంది. 24 గంటల వ్యవధిలో జరిగిన మరో మ్యాచ్లో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగి ఘన విజయంతో టోర్నీలో బోణీ కొట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో భారత్ 13–1 గోల్స్ తేడాతో కెనడాను చిత్తు చేసింది. భారత్ ఆటగాళ్లలో సంజయ్ (17, 32, 59వ నిమిషాల్లో), అరైజీత్ సింగ్ (40, 50, 51వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్ సాధించారు. ఉత్తమ్ సింగ్ (16, 47వ నిమిషాల్లో), శర్దానంద్ (35, 53వ నిమిషాల్లో)లు రెండు గోల్స్ చొప్పున చేయ గా... కెప్టెన్ వివేక్ సాగర్ ప్రసాద్ (8వ నిమిషంలో), మణీందర్ సింగ్ (27వ నిమిషం లో), అభిషేక్ లాక్రా (55వ నిమిషంలో) తలా ఓ గోల్ చేసి భారత్కు తిరుగులేని విజయాన్ని అందించారు. కెనడా తరఫున నమోదైన ఏకైక గోల్ (30వ నిమిషంలో)ను క్రిస్టోఫర్ చేశాడు. చదవండి: James Neesham: 'అన్నిసార్లు టీమిండియానే గెలుస్తుంది.. నాకేదో అనుమానంగా ఉంది' -
తొలి పోరులో ఫ్రాన్స్ చేతిలో భారత్ పరాజయం..
భువనేశ్వర్: ప్రతిష్టాత్మక జూనియర్ హాకీ ప్రపంచ కప్ మొదటి పోరులో భారత్ తడబడింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాతో టోర్నీలో అడుగుపెట్టిన భారత జూనియర్ జట్టు... ఫ్రాన్స్తో జరిగిన మ్యాచ్లో స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. బుధవారం గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత్ 4–5 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ చేతిలో ఓడింది. భారత్ తరఫున సంజయ్ మూడు గోల్స్ (15, 57, 58వ నిమిషాల్లో) చేయగా... ఉత్తమ్ సింగ్ ఒక గోల్ (10వ నిమిషంలో) సాధించాడు. ఫ్రాన్స్ ప్లేయర్ క్లెమెంట్ టిమోతీ మూడు గోల్స్ (1, 23, 32వ నిమిషాల్లో), బెంజమిన్ (7వ నిమిషంలో), కొరెంటిన్ (48వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. రెండు నిమిషాల్లో రెండు గోల్స్ చేసినా... మ్యాచ్ తొలి నిమిషంలోనే భారత రక్షణ శ్రేణిని ఛేదించిన ఫ్రాన్స్ ఆటగాడు టిమోతీ ఫీల్డ్ గోల్ సాధించాడు. మరో ఆరు నిమిషాల తర్వాత బెంజమిన్ మరో ఫీల్డ్ గోల్ చేసి ఫ్రాన్స్కు 2–0 ఆధిక్యాన్నిచ్చాడు. ఫ్రాన్స్ అటాకింగ్ నుంచి తేరుకున్న భారత్ వెంట వెంటనే రెండు గోల్స్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. ఆ వెంటనే ఫ్రాన్స్ మరో మూడు గోల్స్ చేసి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఆట ఆఖరి నిమిషాల్లో వేగం పెంచిన భారత్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ప్రత్యర్థి గోల్ పోస్ట్పై పదే పదే దాడులు చేసింది. ఈ క్రమంలో భారత్ రెండు నిమిషాల్లో రెండు గోల్స్ చేసి మ్యాచ్ను ‘డ్రా’గా ముగించేలా కనిపించింది. 57, 58వ నిమిషాల్లో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా గోల్స్గా మలిచిన సంజయ్ ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 5–4కు తగ్గించాడు. అనంతరం మరో గోల్ సాధించడంలో విఫలమైన భారత్ ఓటమిని ఆహ్వానించింది. మ్యాచ్లో భారత్కు మొత్తం ఏడు పెనాల్టీ కార్నర్స్ లభించగా వాటిలో మూడింటిని మాత్ర మే గోల్స్గా మలిచి మూల్యం చెల్లించుకుంది. చదవండి: WI Vs SL: పరాజయం దిశగా విండీస్... విజయానికి నాలుగు వికెట్ల దూరంలో శ్రీలంక.. -
CM Jagan: నవంబర్ 9న విశాఖకు సీఎం జగన్
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 9న విశాఖ రానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో 9న ఉదయం 11.50 గంటలకు విశాఖ చేరుకుంటారు. మధ్యాహ్నం 12:05కు హెలికాప్టర్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరై..అక్కడ నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు విశాఖ చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్టులో మధ్యాహ్నం 2.50 గంటలనుంచి 3.30 వరకు సీఎం ప్రోగ్రాం రిజర్వ్లో ఉంచారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో బయలుదేరి భువనేశ్వర్ వెళతారు. చదవండి: (మరవలేని మహా యజ్ఞం.. ప్రజా సంకల్పం) -
Diwali: దీపావళి రెండు గంటలే.. హైకోర్టు కీలక ఆదేశాలు
భువనేశ్వర్: దీపావళి సంబరాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవలం రెండు గంటలు మాత్రమే దీపావళి జరుపుకోవాలని సూచించింది. దీంతో రాత్రి 8 నుంచి 10 గంటల వరకే టపాసులు పేల్చేందుకు అనుమతి ఇవ్వనున్నారు. కరోనా విజృంభణకు తావులేకుండా వేడుకల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని గతంలో సుప్రీంకోర్టు సూచించింది. బేరియమ్ సాల్ట్స్తో తయారైన బాణసంచా వినియోగాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు అక్టోబరు 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పండగ నిర్వహణపై సోమవారం తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు కోవిడ్–19 వ్యాప్తి కట్టడి దృష్ట్యా సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) జారీచేసిన మార్గదర్శకాల పరిధిలో రాష్ట్రంలో బాణసంచా క్రయ విక్రయాలు, వినియోగానికి సంబంధించి నిర్దిష్టమైన మార్గదర్శకాలను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ ఎస్ఆర్సీని కోరింది. దీనికోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కటక్–భువనేశ్వర్ జంట నగరాల పోలీస్ కమిషనరేట్తో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది. బాణసంచా క్రయ విక్రయాల అనుమతి అభ్యర్థనతో అఖిల ఒడిశా ఫైర్వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పురస్కరించుకుని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(పెసో) ఆమోదించిన హరిత బాణసంచా క్రయవిక్రయాలు, వినియోగానికి ధర్మాసనం అనుమతించడం విశేషం. చదవండి: (నా చేతులతో ఎత్తుకుని ఆడించా.. ఈ బాధలు ఎవరికీ రాకూడదు: శివ రాజ్కుమార్) -
ఒడిశాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ..
భువనేశ్వర్: ఒడిశాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. నబరంగ్ పూర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ మజీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. కాగా, ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన అవకాశాలకు.. ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల పట్ల కొంత అసహనంతో ఉన్నారని అన్నారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి తాను పార్టీని విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రదీప్ మజీ.. 2009లో నబరంగ్పూర్ లోక్సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014, 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఒడిశా యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రదీప్ మజీ రాజీనామాపై జేపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బహినిపాటి మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా ప్రదీప్ మజీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారు బయటకు వెళ్లిపోవడం పార్టీకి మంచిదన్నారు. కాగా, లక్ష్మిపూర్ మాజీ ఎమ్మెల్యే కైలాష్ కులేశికా కాంగ్రెస్ పార్టీకి గత బుధవారం రాజీనామా చేసి బీజీడీలో చేరారు. ఈ క్రమంలో ప్రస్తుతం .. ప్రదీప్ మజీ కూడా పార్టీని వీడటం ప్రాధాన్యత సంతరించుకుంది. మజ్హి కూడా అధికార బీజేడీలో చేరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: ‘అక్టోబర్ 21 దేశ చరిత్రలో ఓ మైలురాయి’ -
అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి
భువనేశ్వర్/బొలంగీరు: బొలంగీరు జిల్లా భీమబొయి వైద్య బోధన ఆస్పత్రి విద్యార్థిని నిరుపొమ నొందొ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన సంచలనం రేపింది. థర్డ్ ఇయర్ చదువుతున్న నిరుపొమ బుధవారం రాత్రి 11.40 గంటల వరకు తన సోదరితో చాట్ చేసింది. ఆ తర్వాత కళాశాల హాస్టల్ గదిలో మృతురాలిగా కనిపించడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని, రోదించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అయితే ఇది హత్యా... ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: (హైదరాబాద్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు) -
ఒడిశా పోలీసుల అత్యుత్సాహం
మందస: ఒడిశా అధికారులు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏ మాత్రం సంబంధంలేని అంగన్వాడీ కార్యకర్త భర్తను అరెస్టు చేశారు. అతన్ని విడుదల చేయాలని ఆంధ్రాలోని గిరిజన సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సరిహద్దు పంచాయతీల సర్పంచ్లు, ప్రజాసంఘాలు అధికారులను ఆశ్రయించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం అంగన్వాడీ కేంద్రం వివాదం ముదురుతోంది. ఆంధ్రా భూభాగంలో నిర్మించిన కేంద్రాన్ని తొలగించాలని ఒడిశా అధికారులు ఇప్పటి వరకూ బెదిరిస్తూ వచ్చారు. తాజాగా అరెస్టుల పర్వానికి తెరతీశారు. మాణిక్యపట్నం అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి భర్త గురునాథం సాబకోట సచివాలయం వద్ద ఉండగా, ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గారబంద పోలీసులు శనివారం బలవంతంగా తీసుకెళ్లారు. చదవండి: పెచ్చు మీరుతున్న ఒడిశా ఆగడాలు విషయం తెలుసుకున్న మందస, సాబకోట, చీపి సర్పంచ్లు చెరుకుపల్లి యల్లమ్మలక్ష్మణమూర్తి, సవర సంధ్యారాము, సవర లక్ష్మీప్రియచిరంజీవి, మాజీ సర్పంచ్ మద్దిల రామారావు, గిరిజన నాయకులు ధర్మారావు, సవర నీలకంఠం, సవర ప్రధాన, సవర బాలయ్య, గురునాథ్, సీఐటీయు నాయకుడు ఆర్.దిలీప్కుమార్ తహసీల్దార్ బడే పాపారావు, ఎస్ఐ కోట వెంకటేశ్లకు కలిసి వినతిపత్రాలను అందజేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన గురునాథాన్ని విడిపించాలని, ఒడిశా అధికారులు, పోలీసుల వేధింపుల నుంచి అంగన్వాడీ కార్యకర్తను రక్షించాలని విన్నవించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న మాణిక్యపట్నం, చీపి పంచాయతీలోని కొండమేర భూసమస్యలను పరిష్కరించాలని కోరారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి అక్రమ అరెస్టు, భూసమస్యలను ఫోన్ ద్వారా వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి, ఒడిశా జిల్లా అధికారులతో మాట్లాడినట్టు సమాచారం. కాగా అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేశ్ మాణిక్యపట్నం వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అథ్లెట్ ద్యుతి చంద్ ఫిర్యాదు.. ‘ఫోకస్ ప్లస్’ ఎడిటర్ అరెస్టు -
అథ్లెట్ ద్యుతి చంద్ ఫిర్యాదు.. ‘ఫోకస్ ప్లస్’ ఎడిటర్ అరెస్టు
భువనేశ్వర్: ఫోకస్ ప్లస్ వెబ్ చానల్ ఎడిటర్ సుధాంశుశేఖర్ రౌత్ అరెస్ట్ అయ్యారు. ప్రముఖ స్ప్రింటరు ద్యుతి చంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. సదరు మీడియా ప్రతినిధి తనకు వ్యతిరేకంగా అవమానకరమైన ప్రసారాలు చేసి, మానసిక వేదనకు గురిచేసినట్లు నగరంలోని మహిళా పోలీస్టేషన్లో ద్యుతి చంద్ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పరువునష్టం దావా దాఖలు చేయగా, విచారణలో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాదాస్పద చానల్ కార్యాలయం నుంచి కంప్యూటర్ ఇతర సామాగ్రిని జప్తు చేశారు. చదవండి: Tokyo Paralympics: చెలరేగుతున్న భారత షట్లర్లు.. వరుసగా రెండో స్వర్ణం సొంతం టోక్యో ఒలింపిక్స్లో ఆడుతుండగా, ద్యుతి చంద్ కుటుంబ వ్యవహారాలపై అసభ్యకర ప్రసారాలు చేస్తానని, ఎడిటర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పాలని, లేకపోతే వీటిని ప్రసారం చేస్తానని పదేపదే బెదిరించడంతో మానసిక స్థైర్యం కోల్పోయి ఒలింపిక్స్లో తాను ఓడిపోయానని ద్యుతి చాంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ చర్యలకు వ్యతిరేకంగా దాదాపు రూ.5 కోట్ల వరకు పరువు నష్టం దావా దాఖలు చేసినట్లు సమాచారం. బెయిలు నిరాకరణ.. స్ప్రింటరు ద్యుతి చంద్ని బెదిరించిన కేసులో అరెస్టయిన ఎడిటర్ సుధాంశు శేఖర్ రౌత్కి స్థానిక సబ్–డివిజినల్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ (ఎస్డీజేఎమ్) కోర్టు బెయిలు నిరాకరించింది. ప్రస్తుతం సుధాంశుతో పాటు ఆయన అనుచరుడు స్మృతి రంజన్ బెహరాకి కూడా న్యాయ స్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సుధాంశు విచారణకు 7 రోజుల రిమాండ్కు పోలీస్ వర్గాలు అభ్యర్థించగా, కోర్టు ఒక్కరోజు రిమాండ్కు మాత్రమే అనుమతించడం విశేషం. చదవండి: Jeanette Zacarias Zapata: బాక్సింగ్ రింగ్లో విషాదం.. 18 ఏళ్ల టీనేజ్ బాక్సర్ మృతి -
సారా రక్కసిపై గ్రామస్తుల ఉక్కుపాదం: పోలీస్స్టేషన్ ముట్టడి
జయపురం: సారా తయారీ, విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని జయపురం జిల్లా కొట్పాడ్ పంచాయతీకి చెందిన మహిళలు అదే పంచాయతీలోని పోలీస్స్టేషన్ని శుక్రవారం ముట్టడించారు. అంతకుముందు వీరంతా అబ్కారీ కార్యాలయానికి వెళ్లి, ఆందోళన చేసేందుకు ప్రయత్రించగా అక్కడ కార్యాలయానికి తాళం వేసి ఉంది. దీంతో మళ్లీ వారంతా అక్కడి నుంచి పోలీస్స్టేషన్కి చేరుకుని, నిరసన చేపట్టారు. చదవండి: Elephant Water Pumping Video: ఈ ఏనుగు చాలా స్మార్ట్! తమ ప్రాంతాల్లో జోరుగా విదేశీ మద్యం, సారా ప్యాకెట్ల విక్రయాలు సాగుతున్నాయని, దీంతో తమ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ పంచాయతీలోని సారా దుకాణాలను బంద్ చేయకపోతే రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రతీ గ్రామంలో సారా విక్రయాలు కొనసాగడంతో విద్యార్థులు కూడా తాగుడుకి బానిసలవుతున్నారని, తద్వారా వారి బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. దీనిపై స్పందించిన కొట్పాడ్ పోలీస్ అధికారి సారా విక్రయాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన నిరసనకారులు ఇంటిబాట పట్టారు. కలెక్టర్కి సర్పంచ్ల వినతిపత్రం.. కొరాపుట్: బంధుగాం, నారాయణ పట్నం సమితుల్లో సారా బట్టీలు నిర్మించొద్దని 13 గ్రామ పంచాయతీల సర్పంచ్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయమై వీరంతా శుక్రవారం కలెక్టరేట్కి చేరుకుని, కలెక్టర్ పేరిట రాసిన వినతిపత్రాన్ని అక్కడి ఓ అధికారికి అందజేశారు. ప్రభుత్వం ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసే సారాబట్టీలతో యువత, ఇంటి పెద్దలు తాగుడుకి బానిసవుతున్నారని, దీంతో ఇంట్లో వారి మధ్య సఖ్యత కొరవడుతోందన్నారు. దీంతో పాటు గ్రామాల్లో తాగుబోతుల గొడవలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాల్లో సారాబట్టీల నిర్వహణ వద్దని కోరారు. చదవండి: అప్పటికి మూడో వేవ్ ముగుస్తుంది: సుప్రీంకోర్టు -
పెచ్చు మీరుతున్న ఒడిశా ఆగడాలు
మందస: ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించిన భూభాగంలో ఒడిశా అధికారుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, రైతుల జిరాయితీ భూముల్లో దౌర్జన్యాలు చేస్తున్న ఒడిశా అధికారులు మరో అడుగు ముందుకు వేసి, ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న సంస్థలను కూడా బెదిరిస్తున్నారు. పోలీసు కేసులు పెడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సాబకోట పంచాయతీలోని సరిహద్దు ప్రాంతానికి ఆనించి ఒడిశా భూభాగం ఉంది. ఎప్పటి నుంచో సరిహద్దు వివాదాలతో ఆంధ్రా గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఒడిశా అధికారులు, పోలీసులు గిరిజనులను బంధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒడిశా అధికారులతో పాటు పోలీసుల నుంచి వేధింపులకు గురవుతున్న గిరిజనులు ఇప్పుడు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. చదవండి: ఇన్ఫార్మర్ నెపంతో హత్య సాబకోట పంచాయతీ మాణిక్యపట్నంలో సుమారు 65 కుటుంబాలున్నాయి. వీరికి మినీ అంగన్వాడీ కేంద్రం ఉంది. భవనం లేకపోవడంతో 2012వ సంవత్సరంలో గిరిజనులు రేకులషెడ్ను ఆంధ్రా భూభాగంలో నిర్మించారు. ప్రస్తుతం మాణిక్యపట్నం మినీ అంగన్వాడీ భవనాన్ని తొలగించాలని ఒడిశా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒడిశా తహసీల్దార్ బుధవారం సిబ్బందితో వచ్చి అంగన్వాడీ కార్యకర్త సవర లక్ష్మిని బెదిరించి, పోలీసు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె హుటాహుటిన సమస్యను మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకువచ్చారు. ఒడిశా అధికారుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. మంత్రి సీదిరి సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఒడిశా అధికారులు, పోలీసుల నుంచి తరచూ బెదిరింపులు, హెచ్చరికలు ఎదుర్కొంటున్నామని, ఉన్నతాధికారులు స్పందించి రక్షించాలని సర్పంచ్ సవర సంధ్యారాము కోరారు. చదవండి: ఒడిశా దుశ్చర్యపై రాజన్నదొర అసహనం -
ఇన్ఫార్మర్ నెపంతో హత్య
రాయగడ: పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గ్రామ రక్షకుని మావోయిస్టులు హత్య చేసిన ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో మనిగుడ సమితి టికరపడ గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడు సంతోష్ దండసేన(27)గా పోలీసులు గుర్తించారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపన వివరాల ప్రకారం... సాయుధలైన మావోయిస్టులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో దండసేన ఇంటికి వెళ్లి, అతనిని బయటకు తీసుకు వెళ్లారు. ఊరికి కొంతదూరంలో అతనిని హత్య చేసి, మృతదేహం వద్ద ఒక పోస్టర్ను విడిచిపెట్టి వెళ్లారు. గ్రామ రక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న దండసేన గత కొన్నాళ్లుగా పోలీసులకు తమ సమాచారాన్ని చేరవేస్తున్నాడని అందులో పేర్కొన్నారు. చదవండి: మహాప్రభో అని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలే.. చివరికి గ్రామానికి చెందిన మరికొంత మంది యువకులను కూడా పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరించాలని ప్రలోభ పెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ మారకపోవడంతో హత్య చేయాల్సి వచ్చిందని వంశధార–గుముసుర–నాగావళి డివిజన్ కమిటీ పోస్టర్లో వివరించింది. ఎవరైనా ఈ తరహా వ్యవహారాలకు పాల్పడితే ఇదే దుస్థితి తప్పదని హెచ్చరించారు. బుధవారం ఉదయం విషయం తెలుసుకున్న మునిగుడ పోలీసులు.. టికరపొడ గ్రామానికి సమీపంలో మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టర్ను స్వాధీనం చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రోడ్డు లేని ఊరు.. దారేది బాబు..! -
మావోయిస్టుల కరపత్రాల కలకలం
జయపురం: ఒడిశాలోని నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితిలో మావోయిస్టులు విడుదల చేసిన కొన్ని వందలాది కరపత్రాలు మంగళవారం కనిపించాయి. ప్రధానంగా బీడీఓ కార్యాలయం వద్ద హిందీ భాషలోని కరపత్రంలో ఝోరిగాం సమితి దగ్గరున్న తేల్ నదిపై ప్రతిపాదిత డ్యామ్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మావోయిస్టులు పేర్కొన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను నిరసిస్తూ ఆందోళనన చేపడతామన్నారు. ముఖ్యంగా నవరంగపూర్ ఎంపీ రమేశ్ చంద్ర మఝి, ఝోరిగాం ఎమ్మెల్యే ప్రకాష్ చంద్ర మఝిల ప్రజా వ్యతిరేక విధానాలను దళం ఖండిస్తోందన్నారు. చదవండి: స్థానిక ఎన్నికలు.. తేలని పంచాయితీ! అలాగే విద్యుత్ సరఫరాలో టాటా కంపెనీ కూడా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ విషయాల్లో మార్పు రాకపోతే బాగోదని హెచ్చరించారు. గతంలో ఇదే ప్రాంతంలో ఉదంతి మావోయిస్ట్ డివిజన్ పేరిట పోస్టర్లు, కరపత్రాలతో మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కనిపించిన మావోయిస్టుల కరపత్రాలు పోలీసులకు సవాల్గా మారింది. ఈ క్రమంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మావోయిస్టుల పట్టుతప్పుతోంది... -
ఎట్టకేలకు పదో తరగతి పాసైన ఎమ్మెల్యే
కొరాపుట్: ఒడిశాలోని గంజాం జిల్లా సురడా నియెజకవర్గ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వయ్ ఎట్టకేలకు పదో తరగతి పాస్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి ఫలితాలను మంగళవారం ప్రకటించింది. అందులో స్వయ్ 500 మార్కులకు గాను 340 మార్కులతో బి గ్రేడ్ సాధించారు. పెయింటింగ్లో అత్యధికంగా 85 మార్కులు, ఇంగ్లిష్లో అల్పంగా 44 మార్కులు వచ్చాయి. పూర్ణచంద్ర స్వయ్ సురడా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఒడిశా స్టేట్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరై ఎట్టకేలకు ఉత్తీర్ణత సాధించారు. చదవండి: పంజాబ్ కాంగ్రెస్లో మళ్లీ సంక్షోభం.. సీఎం అమరీందర్పై తిరుగుబాటు -
రోడ్డు లేని ఊరు.. దారేది బాబు..!
మల్కన్గిరి: ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో గిరిజనులకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. ఎన్నో దశాబ్దాల నుంచి చాలా ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో అక్కడి వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో కొండలు, గుట్టలు మధ్య కాలినడకన ప్రయాణించాల్సిన దుస్థితి. కనీసం అంబులెన్స్ వచ్చేందుకు కూడా వీలుండేలా రహదారి సౌకర్యం లేకపోవడంతో జిల్లాలోని చిత్రకొండ సమితి, కటాఫ్ ఏరియలోని కునిగూడ గ్రామ గర్భిణిని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు గ్రామస్తులు అష్టకష్టాలు పడ్డారు. చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్ వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన జిమ్మ ఖిలో నిండు గర్భిణి. మంగళవారం ఉదయం ఈమెకి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆశ కార్యకర్త సహాయంతో అంబులెన్స్కి ఫోన్ చేశారు. అయితే గ్రామానికి రోడ్డు వసతి లేకపోవడంతో అక్కడి వరకు రాలేమని, గ్రామం నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని పక్కా రోడ్డు వరకు గర్భిణిని తీసుకువస్తే ఆస్పత్రికి తీసుకువెళ్లవచ్చని సిబ్బంది సూచించారు. దీంతో వేరే దారి లేకపోవడంతో గర్భిణి భర్త బోందు ఖిలో, కొంతమంది గ్రామస్తులు కలిసి, గర్భిణిని మంచంపై ఉంచి, అంబులెన్స్ దగ్గరకు మోసుకుని వెళ్లారు. అక్కడి నుంచి చిత్రకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స అందజేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొంచె ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం అని.. ఇటువంటి తరచూ జరుగుతున్నా అధికారులు, నేతలు స్పందించకపోవడం చాలా దారుణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: సుకుమా అడవుల్లో ఎన్కౌంటర్ ఇద్దరు మావోయిస్టులు మృతి -
అన్నదాతల ఆందోళన.. ఫర్నీచర్ ధ్వంసం
రాయగడ: ఒడిశాలోని రాయగడ జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. అయితే సకాలంలో డిమాండ్కు సరిపడా ఎరువులను రైతులకు సరఫరా చేయడంలో యంత్రాంగం విఫలమైంది. దీంతో ఎరువుల కోసం నవరంగపూర్, రాయగడ జిల్లాల రైతులు హాహాకారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. రాయగడ జిల్లా కొలనార సమితిలోని బొడిఖిల్లాపొదోరొ, తెరువలి, ఖెదాపడ, డుమురిగుడ, కార్తీకగుడ, కిల్లగుడ, గడ్డి శెశిఖల్, దొందులి పంచాయతీలకు చెందిన రైతులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. చదవండి: మైనర్ బాలిక కిడ్నాప్.. నోటిలో గుడ్డలు కుక్కి .. వ్యవసాయం పనులు ప్రారంభించామని, సకాలంలో రావాల్సిన ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మరో వారంలో అందకపోతే పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించాలని కోరుతూ కలెక్టర్ సరోజ్కుమార్ మిశ్రాకు వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేకపోవంతో ఏడీఎంఓ సోమనాథ్ ప్రధాన్కు దాఖలు చేశౠరు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారి దుస్సాసన్ ప్రహరాజ్ను రైతులంతా చుట్టుముట్టారు. దీనిపై స్పందించిన ఆయన... ఎరువుల కొరత ఉన్న ప్రాంతాలకు వారం రోజుల్లో సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఎరువుల కోసం ఏకరవు.. జయపురం: నవరంగపూర్ జిల్లా ఝోరిగాం గొడౌన్కు యూరియా చేరిందని తెలియగానే వందలాది మంది రైతులు పోటెత్తారు. సుమారు 2వేల మంది అక్కడికి చేరుకోగా.. ప్రతి ఒక్కరికీ రెండు బస్తాల చెప్పున ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. అయితే కేవలం 1600 బస్తాలు మాత్రం అందుబాటులో ఉండటంతో అధికారులు చేతులెత్తేశారు. దీంతో భగ్గుమన్న రైతులు.. గోదాంను చుట్టుముట్టారు. కార్యలయంలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఉమ్మరకోట్ ఎస్డీపీఓ దినేష్ చంద్రానాయక్, ఎస్ఐ నట్వర నందొ, ఝోరిగాం సమితి వ్యవసాయశాఖ అధికారి సునీత సింగ్, తహసీల్దార్ హృషికేష్ గోండ్ ఘటనా స్థలానికి చేరుకొని, రైతులకు నచ్చచెప్పారు. చివరకు ఒక్కో బస్తా చెప్పున అందించడంతో వారంతా శాంతించారు. చదవండి: స్థానిక ఎన్నికలు.. తేలని పంచాయితీ! -
స్థానిక ఎన్నికలు.. తేలని పంచాయితీ!
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికల కాలపరిమితి ముగిసి, నేటికి మూడేళ్లు పూర్తయింది. అయినా ఎన్నికల నిర్వహణకు సర్కారు ఏమాత్రం ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించి, తీరాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడం..ఈ క్రమంలో ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుండడం నుంచి ఈ ‘పంచాయితీ’ నడుస్తోంది. అయితే కొన్నిరోజుల క్రితం ఓబీసీల ఓటు బ్యాంకు సమకూర్చుకునేందుకు ఎన్నికల్లో వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అధికార బీజేడీ ప్రకటన జారీ చేసింది. చదవండి: వైరల్ వీడియో: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం..! ఇప్పుడు మళ్లీ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలు జరిగిన రోజునే ఫలితాలు ఇవ్వకుండా ఫలితాల కోసం ఓ ప్రత్యేక రోజుని కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే ఇదివరకు ఏ పంచాయతీలో జరిగే ఎన్నికల ఫలితాలు.. ఎన్నికలు జరిగిన రోజునే ప్రకటించేవారు. ఇప్పుడు అలా కాకుండా సమితిలోని మొత్తం పంచాయతీల బ్యాలెట్ బాక్సులను సమితి కేంద్రానికి తరలించి, లెక్కించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ రెండు మార్పుల పట్ల ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి. ఇదంతా ఓట్లను తారుమారు చేసి, గెలిచేందుకే నవీన్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేస్తోందని విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేలకు పైబడి పంచాయతీలు ఉండగా, 314 సమితులు ఉన్నాయి. 15 రోజుల్లో అభ్యంతరాలు.. పంచాయతీ ఎన్నికల్లో ఇదివరకున్న బూత్ స్థాయి ఓట్ల లెక్కింపునకు తెరపడుతుంది. సమితి ప్రధాన కార్యాలయంలో కేంద్రీకృత విధానంలో ఈసారి ఓట్లను లెక్కిస్తారు. సమితి వ్యాప్తంగా అంచెలంచెలుగా పోలింగ్ పూర్తయిన తర్వాత అన్ని బూత్లలో పోలైన ఓట్లను ఒకేసారి లెక్కపెడతారు. ఈ నేపథ్యంలో ఒడిశా గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు–1965 సంస్కరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు జారీ చేసింది. వీటి పట్ల సలహాలు, సూచనలు, అభ్యంతరాలను 15 రోజుల్లోగా దాఖలు చేయాలని అభ్యర్థించింది. ఈ ప్రక్రియ తర్వాత ఒడిశా గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు–2021 అమలు చేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చదవండి: ఓరి భగవంతుడా .. కష్టాలు గట్టెక్కాయని అనుకునేలోపే.. -
మందిరాలు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్.. భక్తులు ఆధార్ కార్డుతో పాటు..
రాయగడ: కోవిడ్ కారణంగా మార్చి నెలలో మూసివేసిన మందిరాలు, ధార్మిక సంస్థలను తెరిచేందుకు రాయగడ జిల్లా యంత్రాంగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కలెక్టర్ సరోజ్కుమార్ మిశ్రా అధ్యక్షతన బుధవారం ధార్మిక సంస్థల ప్రతినిధులు, మందిర కమిటీలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో నిబంధనలు పాటిస్తూ ఆలయాలు తెరిచేందుకు ధార్మిక సంస్థలకు అనుమతిచ్చారు. మజ్జిగౌరీ మందిరానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయ ట్రస్టీలు కోవిడ్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. భక్తులు ఆధార్ కార్డుతో పాటు కోవిడ్ టీకా వేసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. లేనివారికి మందిరంలో ప్రవేశాలకు అనుమతించొద్దని సూచించారు. మందిర ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా మందిర సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. కనీసం ఒక డోస్ టీకా వేసుకున్న అర్చకులు, పూజారులు మాత్రమే పూజా కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లాలోని పలు ఆలయాలు, మసీదులు, చర్చిలకు చెందిన ప్రతిని«ధులు పాల్గొన్నారు. అనుమతిస్తే శుక్రవారం నుంచే.. జిల్లా అధికారులు అనుమతిస్తే శుక్రవారం నుంచే మజ్జిగౌరి మందిరం తెరిచేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని మందిరం ట్రస్టీ రాయిసింగి బిడిక అన్నారు. ఇప్పటికే భక్తుల దర్శనాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. నిబంధనల మేరకు భక్తులకు ప్రవేశం భువనేశ్వర్: ఈ నెల 23 నుంచి నగరంలోని అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, ధార్మిక కేంద్రాలు తెరచుకోనున్నాయి. కోవిడ్ నిబంధనలు మేరకు భక్తులను అనుమతించనున్నారు. ఈ మేరకు ఆయల కమిటీలు, ధార్మిక సంస్థల నిర్వాహకులకు నగరపాలక సంస్థ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. భక్తులకు గర్భగుడి ప్రవేశానికి అనుమతి లేదు. ఫలపుష్పాదులు, దూపధీప నైవేధ్యాలు ఆలయం లోనికి అనుమతించరు. భక్తులు, ఆయల సిబ్బంది తప్పనిసరిగా మాస్క్లు ధరించాలి. కనీసం 6 అడుగుల భౌతికదూరం పాటించాలి. ఒక విడతలో 25 మంది వ్యక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. అర్చుకులు, సేవాయత్లకు రెండు టీకా డోసులతో పాటు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి. స్థానిక లింగరాజ దేవస్థానంలో దర్శనాలపై ధర్మకర్త మండలి తుది నిర్ణయం తీసుకోనుంది. -
వంతెన నిర్మాణం చేపట్టండి.. ఏడు గ్రామాల ప్రజల విజ్ఞప్తి
మల్కన్గిరి: ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో కనిమెల సమితి, చింతాలవడా గ్రామపంచాయితీలోని చింతాలవాడ వంతెన నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ పదయమాడి అధికారులను కోరారు. ఏడేళ్లుగా ఇక్కడి సగం విరిగిపోయిన వంతెన మీదుగా ప్రమాదకరమైన ప్రయాణాలు సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల సమయంలో వంతెన విరిగిపోయిన భాగాలు నీటిలో ఎక్కడున్నాయో తెలియకపోవడంతో ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారని వాపోయారు. ఇదే మార్గం గుండా సిందిగుఢ, కోపలకొండ, పేడకొండ, పులిమెట్ల, తటిగుఢ, ఎంవీ–13, గుముక, మందపల్లి గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని వివరించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి, వంతెన పునర్నిర్మాణానికి సహకరించాలని ఆమె కోరారు. -
మరదలి వివాహేతర సంబంధం.. తమ్ముడి ఆత్మహత్య.. ప్రతీకారంతో..
మల్కన్గిరి: ఒడిశాలోని మల్కన్గిరి సమితి, ఎంవీ–19 గ్రామంలో బాలుడు అంకిత్ మండాల్(5) శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. ఇదే గ్రామానికి చెందిన వికాస్ రోయి అనే వ్యక్తి బాలుడిని చంపినట్లు పోలీసుల విచారణలో తేలగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా కనిపించకపోయేసరికి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల బాలుడి ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలో వికాస్ రోయి ఇంటి ముందు అంకిత్ చెవుల ముక్కలు కనిపించాయి. దీంతో అతడి ఇంట్లోకి వెళ్లి చూడగా, బాలుడి మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యులు ఇది చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించగా అసలు విషయం బయటపడింది. బాలుడి తండ్రి హరదోన్ మండాల్ అతడి బంధువుల అమ్మాయితో తన తమ్ముడి వివాహం జరిపించాడని, అయితే ఆ అమ్మాయి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని వికాస్ తెలిపాడు. ఇది తట్టుకోలేని తన తమ్ముడు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి ప్రతీకారంగానే హరదోన్ మండల్ కొడుకుని తాను హత్య చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి బాలుడి మృతదేహాన్ని తరలించినట్లు ఐఐసీ అధికారి రామ్ప్రసాద్ నాగ్ తెలిపారు. -
85,000 లీటర్ల లిక్కర్ లెక్క.. తిక్క కుదిర్చిన పోలీసులు..!
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్లో 85,000పైగా లీటర్ల దేశీయ మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం... బాలసోర్ జిల్లా ప్రధాన కార్యాలయం శివార్లలో ఉన్న పురుషా బాలసోర్ ప్రాంతంలో భారీగా దేశీయ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రతి మూడు ఇళ్లలో ఒకరు మద్యం తయారీలో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. దీనివల్ల కోవిడ్ లాక్డౌన్ సమయంలో నేరాల రేట్లు గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. దీనిపై సమాచారం మేరకు ఒడిశాలోని బాలసోర్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి ఆపరేషన్ నిర్వహించి, అనేక అక్రమ దేశీయ మద్యం తయారీ విభాగాలపై మంగళవారం దాడి చేశారన్నారు. చెరువుల లోపల దాచిన మద్యం గ్యాలన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై బాలసోర్ ఎస్పీ సుధాన్షు మిశ్రా మాట్లాడుతూ, " మేము 70,000 లీటర్ల పులియబెట్టిన మద్యం పానకాన్ని ధ్వంసం చేశాం. దేశీయ మద్యం తయారీలో ముడిసరుకుగా ఉపయోగించే 'మహువా, మొలాసిస్, మద్యం తయారీ పాత్రలతో పాటు 12,000 లీటర్ల తయారుచేసిన మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని.’’ తెలిపారు. మరో ఘటనలో బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 12 మంది మరణించారు. ఈ మరణాలకు సంబంధించి కనీసం 16 మందిని అరెస్టు చేశారు. -
చిన్నచూపు చూపడంతో.. వనం నుంచి జనంలోకి..
మల్కన్గిరి/కొరాపుట్: మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొని, పలు ఎదురుకాల్పుల ఘటనల్లో ప్రత్యక్షంగా భాగస్వామ్యమైన ముగ్గురు మావోయిస్టులు ఆదివారం బాహ్య సమాజంలోకి అడుగుపెట్టారు. వీరంతా ఒడిశా డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) అభయ్ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు ఆయన మల్కన్గిరి, కొరాపుట్ జిల్లాల్లో పర్యటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్కన్గిరి జిల్లా కలిమెట సమితి ఎంవీ 79 పోలీస్ స్టేషన్ పరిధిలోని టిగాల్ పంచాయతీ తామాన్పల్లి గ్రామానికి చెందిన రమే పోడియామి అలియాస్ సబితకు చిన్నతనం నుంచే మావోయిస్టు కర్యకలాపాల పట్ల ఆశక్తి ఉండేది. 2000లో కలిమెల దళంలో చేరి, అప్పటి సభ్యులు రామన్న, లోకనాథ్ వద్ద శిక్షణ పొందింది. పలు సందర్భాల్లో పోలీసులతో ఎదురు కాల్పులు, ఇన్ఫార్మర్ నెపంతో హత్యలు, సెల్టవర్ల పేల్చివేత కార్యకలాపాల్లో పాల్గొంది. కొద్దిరోజులు చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్లో, సుకుమ జిల్లా కిష్టరామ్ ప్రాంతంలో పనిచేసింది. అయితే... దళంలో రక్షణ లేకపోవడం, కరోనాతో దళ సభ్యులు చనిపోతున్నా తనను వైద్యం కోసం బయటకు వెళ్లేందుకు అనుమతించక పోవడంతో విసుగు చెందానని ఆమె చెప్పుకొచ్చింది. ఒడిశా ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని, తన స్వగ్రామం కూడా ఎంతో అభివృద్ధి చెందిందని.. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా లొంగిపోతున్నట్లు స్పష్టంచేసింది. ఆర్కేకు రక్షణగా.. కొరాపుట్ జిల్లాలో పర్యటించిన డీజీపీ.. ముందుగా భువనేశ్వర్ నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్లో సునాబెడాలోని హిందూస్థాన్ ఎరోనాటిక్ లిమిటెడ్(హాల్) వద్ద దిగారు. ఎస్ఓజీ 3వ బెటాలియన్లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన బొయిపరిగుడ మావోయిస్ట్ ఏరియా కమిటీ సభ్యురాలు తులసా హుయికా డీజీపీ ఎదుట లొంగిపోయారు. నారాయణపట్న సమితిలోని పిల్బోర్ గ్రామానికి చెందిన ఆమె.. 13 ఏళ్ల వయస్సులో 2012లో జననాట్య మండలికి ఆకర్షితురాలై దళంలో చేరింది. మిలటరీ శిక్షణలో భాగంగా 303 రైఫిల్ శిక్షణ పొంది, 2015లో అగ్రనేత ఆర్కేకి రక్షణగా పనిచేసింది. ఆంధ్ర, ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పలు విధ్వంసకర ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొంది. కాగా తులసాను డీజీపీ సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు అందుతాయని హామీ ఇచ్చారు. అలాగే ఈ ప్రాంతంలో బీఎస్ఎఫ్, ఎస్ఓజీ సేవలను కొనియాడారు. గత రెండేళ్లలో కొరాపుట్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారని కొనియాడారు. కార్యక్రమంలో ఇంటిలిజెన్స్ డైరెక్టర్ లళిత్దాస్, ఐజీ ఆపరేషన్స్ అమితాబ్ ఠాకుర్, బీఎస్ఎఫ్ ఐజీ మధుసూదన్ శర్మ, ఐజీ హెడ్క్వార్టర్ దేవదత్త సింగ్, జిల్లా పీస్పీ వరుణ్ గుంటుపల్లి, బీఎస్ఎఫ్ కమాండెంట్ సర్జన్సింగ్ తన్వర్, తదితరులు పాల్గొన్నారు. చిన్నచూపు చూపడంతో.. రాయిధర్ సొంత గ్రామం మత్తిలి సమితి కర్తన్పల్లి దల్దోలి గ్రామం. ఊరిలో మావోయిస్టులు పర్యటించిన సమయంలో చేసిన విప్లవ గీతాలపై ఆకర్షణతో దళంలో చేరాడు. మత్తిలి సమితిలో ఎదురు కాల్పులు, రోడ్డు పనులు జరిపే వాహనాలు దహనం చేయడం, జావాన్లను టార్గెట్ చేసి మందుపాతర అమర్చడం వంటివాటిలో కీలకపాత్ర వహించాడు. అయితే దళంలో చిన్నచూపు చూడటంతో జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు వివరించాడు. ఈ సందర్భంగా డీజీపీ అభయ్ మాట్లాడుతూ... మావోయిస్టులకు రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు త్వరితగతిన అందేవిధంగా చర్యలు తీసుకొంటామన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అడవిలో ఉంటే అనారోగ్యంపాలై, ఇబ్బందులు తప్పవని, లొంగిపోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మల్కన్గిరి ఎస్పీ ప్రహ్లాద్ స్వొంయిమిన్నా, బీఎస్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
కాలి బూడిదైన ఇళ్లు.. రోడ్డున పడ్డ కుటుంబాలు
ఒడిశా: జయపురం సబ్ డివిజన్ పరిధి బొయిపరిగుడ సమితి మహుళి పంచాయతీ, తొలా గ్రామంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో కొమంత చలానకు చెందిన పూరిళ్లు కాలి బూడిదయ్యింది. ఉదయం 9 గంటల సమయంలో కోమంత చెరువుకు వెళ్లాడని, ఆ సమయంలో హఠాత్తుగా ఇంటికి నిప్పు అంటుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. మంటలను అదుపు చేసుందుకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇంట్లోని 7 బస్తాల ధాన్యం, బస్తా చోల్లు, రూ.22 వేల నగదు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం వల్ల బాధితుడు సర్వం కోల్పోయి, కుటుంబంతో సహా రోడ్డున పడ్డారు. విషయం తెలుసుకున్న మహుళి మాజీ సర్పంచ్ ధనసాయి పూజారి, నర్సింగ హరిజన్, కుశమఝి, హరిహర హరిజన్ బాధిత కుటుంబానికి బస్తా బియ్యం అందజేశారు. రెవెన్యూ అధికారులు బినోద్ బెహర, కైళిశ బిశ్వాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వం తరపున సాయం అందిస్తామన్నారు. షార్డ్ సర్క్యూట్తో.. మల్కన్గిరి: జిల్లాలోని బలిమెల సమితి 1వ వార్డ్లోని మాధన్ బజాంగ్ ఇంట్లో షార్డ్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అంతా ఇంట్లోనే ఉండగా.. భయంతో బయటకు పరుగులు తీశారు. ఇంతలో ఒక్క ఉదుటన ఎగసిన మంటలు.. ఇంటి మొత్తం వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసే సమయానికి నష్టం జరిగిపోయింది. ఉన్న ఇల్లు కాలిపోవడతంతో మాధన్ పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులతో సహా రోడ్డున పడ్డారు. -
విదేశీ మద్యం అమ్మకంపై వివాదం.. రివాల్వర్తో యువకుడి హల్చల్!
జయపురం: విదేశీ మద్యాన్ని అధికధరకు అమ్మడంపై తలెత్తిన వివాదంలో ఒక యువకుడి నుంచి పిస్టల్ను స్వాధీనపరచుకున్నట్లు జయపురం సబ్డివిజనల్ పోలీసు అధికారి అరూప్ అభిషేక్ బెహర తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. బొయిపరిగుడ వాసి ఉమాశంకర గౌడను అరెస్టు చేసినట్లు బెహర వెల్లడించారు. బొయిపరిగుడలో ప్రభుత్వ లైసెన్స్తో విదేశీ మద్యం దుకాణం ఉందని, 12వ తేదీన నిందితుడు ఉమాశంకర గౌఢతో పాటు అతని సహచరుడు అసమత్ఖాన్ ఉరఫ్ పప్పు విదేశీ మద్యం దుకాణానికి వెళ్లి ఒక మద్యం బాటిల్ అడిగినట్లు తెలిపారు. బాటిల్ ధర రూ.200 కాగా, సేల్స్మాన్ రూ.220 చెప్పాడని వాగ్వాదానికి దిగారు. దీంతో ఉమాశంకర్ రివాల్వర్ తీసుకొని సేల్స్మాన్ రామప్రసాద్ సాహు గురిపెట్టి చంపుతామని బెదిరించాడని వెల్లడించారు. రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ఉమాశంకర్ను అదుపులోకి తీసుకున్నట్లు బెహర వెల్లడించారు. అతనితో పాటు వచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. -
సెల్ ఫోన్లో గేమ్స్ ఆడొద్దని మందలించడంతో..
జామి: సెల్ ఫోన్లో ఆటలాడొద్దని తండ్రి మందలించాడని కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జామిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జామి మంగలవీధికి చెందిన లగుడు సింహాచలంనాయుడు(14) విద్యార్థి స్థానిక జెడ్పీ ఉన్నతపాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సెల్ఫోన్లో ఆటలాడొద్దని తండ్రి కృష్ణ మందలించి పొలం పనులకు వెళ్లాడు. దీంతో సింహాచలంనాయుడు ఇంటివద్ద ఉన్న పురుగుల మందు తాగాడు. నోటిలో నుంచి నురగలు రావడంతో తల్లి కేకలు వేసి భర్తకు సమాచారం అందించింది. విద్యారి్థని స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఘటనపై జామి ఏఎస్సై గోపి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఇరువర్గాల మధ్య కొట్లాట.. ఇద్దరి మృతి మరో..
కొరాపుట్: జిల్లాలోని దశమంతపూర్ సమితిలో ఉన్న దంబాగుడ గ్రామపంచాయతీ, హతిముండా గ్రామంలో రెండు వర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ధనపతి జాని(35), సహదేవ్ జాని(45) ఉండగా, గాయాలపాలైన వారిలో ధనేశ్వర్ జాని, సేనాపతి జాని, దిబా పొరిజ, రొజు జాని, మనోహర్ జాని, అంగరా జాని, చెండియా జాని ఉన్నారు. అయితే క్షతగాత్రుల్లో సేనాపతి జాని, ధనేశ్వర్ జానిల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యసేవల కోసం కొరాపుట్ సహిద్ లక్ష్మణ్ నాయక్ హాస్పిటల్కి తరలించారు. కాగా, విషయం తెలుసుకున్న కొరాపుట్ డీఎస్పీ నిరంజన్ బెహరా గ్రామానికి చేరుకుని, గొడవకు గల కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పాతకక్షల కారణంగా కొట్టుకున్నట్లు కొంతమంది.. ఆస్తి తగాదాలని మరికొంతమంది.. ఇరువర్గాల్లో ఓ వర్గం వారు చేతబడి చేస్తున్నారన్న కారణంతో ఘర్షణకు దిగినట్లు మరికొంతమంది చెప్పారు. ప్రస్తుతం ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా బలగాలను మోహరింపజేసినట్లు సమాచారం. ఇంతవరకు ఈ దుర్ఘటనకు సంబంధించి, నిందితులుగా పేర్కొంటూ ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదని, పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాతే చర్యలు చేపడతామని ఐఐసీ అధికారి బిజయ్రాజ్ మజ్జి తెలిపారు. -
పూరీలో మాత్రమే జగన్నాథ రథయాత్ర
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్రను ఒడిశాలోని పూరీలో మినహా రాష్ట్రాంలోని మిగిలిన ప్రాంతాల్లో చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. కరోనా విజృంభణతో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఈ సందర్భంలో అనుమతులివ్వలేమని తెలిపింది. పూరీ మినహా ఇతరప్రాంతాల్లో రథయాత్రలను అనుమతించేది లేదని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని హైకోర్టు సమర్ధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ‘నాకూ జగన్నాథ రథయాత్రను చూసేందుకు పూరీ వెళ్లాలనే ఉంది. కానీ మనమేమీ నిపుణులం కాము. ఈ విషయంలో ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఛాన్సు తీసుకోలేము. కావాలంటే యాత్రను టీవీలో చూడొచ్చు. వచ్చే దఫా భగవంతుడు అనుగ్రహిస్తాడని నమ్ముతున్నాం’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఈనెల 12న పూరీ సహా పలు ప్రాంతాల్లో వార్షిక రథయాత్ర జరగాల్సి ఉంది. -
ఇద్దరు డ్రైవర్లు.. బతుకుబండి ఆగనివ్వం
ఇల్లు నడవడం ముఖ్యం. పిల్లలకు అన్నం పెట్టడం ముఖ్యం. ఇల్లు నడిపించే శక్తి మగవాడికి మాత్రమే ఉండదు. స్త్రీకి కూడా రెండు చేతులు ఉంటాయి. ఒడిస్సాలో ఒక ప్రయివేటు టీచర్కు ఉద్యోగం పోయింది కరోనా వల్ల. చెత్త ఎత్తి పోసి వాహనానికి డ్రైవర్గా మారింది. ముంబైలో ఒక ఇల్లాలిని భర్త వదిలేసి పోయాడు. మూడో చక్రాల ఆటోను నాలుగు రోడ్ల మీద తిప్పుతోంది. ఓడిపోవద్దు అంటున్నారు వీళ్లు. గెలిచి బతుకును పరిగెత్తించండి అంటున్నారు. ఉపాధులు తారుమారు అవుతున్న కరోనా రోజుల్లో వీరే స్ఫూర్తి. కాలం కష్టకాలంగా ఉన్నప్పుడు భుజాల్లో శక్తి ఊరుతుంది. లోపలి శక్తి బయటకు వస్తుంది. మనుగడ కోసం మొండి ధైర్యం ఏర్పడుతుంది. నిజమే. ఇప్పుడు కరోనా కాలంలో కుటుంబాన్ని కాపాడుకోవడమే అన్నింటి కన్నా ముఖ్యమైన కర్తవ్యం. భర్త తన శక్తి మేరకు భార్య తన శక్తి మేరకు గత పదిహేను నెలలుగా కాపాడుకుంటూనే వస్తున్నారు. అయితే కొన్ని చోట్ల సవాళ్లు ఎదురవుతాయి. ఆ సమయంలో స్త్రీలు ఆ సవాళ్లకు సమాధానంగా నిలుస్తున్నారు. భువనేశ్వర్ (ఒడిశా)కు చెందిన స్మృతిరేఖ ఇందుకు ఉదాహరణ. 29 ఏళ్ల ఈ స్కూల్ టీచర్ ఇప్పుడు చెత్త ఎత్తే వాహనం డ్రైవర్గా మారింది. ప్రతి పనీ గౌరవనీయమైనదే స్మృతిరేఖ పొలిటికల్ సైన్స్లో డిగ్రీ చేసింది. పెళ్లయ్యాక తను నివసించే పతారబండ స్లమ్స్లో ప్రైమరీ టీచర్గా పని చేసేది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త చిన్న ప్రయివేటు ఉద్యోగి. ఉన్నంత లో బాగానే జీవితం గడుస్తూ ఉంటే హటాత్తుగా కరోనా... ఆ వెంటనే స్మృతిరేఖకు కష్టాలు వచ్చిపడ్డాయి. స్కూలు మూతపడింది. ఆ సంపాదనకు తోడు ఇంట్లో ట్యూషన్లు చెప్పేది. ట్యూషన్కు కూడా పిల్లలు రావడం మానేశారు. ఆ కొసరు కూడా పోయింది. భర్తకు సగం జీవితం ఇవ్వడం మొదలెట్టారు. పులి మీద పుట్రలా తండ్రి మరణించడం.. తమ్ముళ్లు చిన్నవాళ్లు కావడం వల్ల పుట్టింటి బరువు కూడా నెత్తి మీద పడింది. ‘ఏం చేయాలి ఇప్పుడు. నెత్తి కొట్టుకుంటే లాభం లేదని ధైర్యంగా చెత్త లారీ ఎక్కా’ అంటుంది స్మృతి రేఖ. 2019లో ఒక స్వచ్ఛంద సంస్థ మురికివాడల్లోని స్త్రీలకు డ్రైవింగ్ నేర్పడం ఆమెకు లాభించింది. భువనేశ్వర్ కార్పొరేషన్ చెత్త సేకరణ బృందాలలో స్త్రీలకు అవకాశం ఇవ్వాలనుకోవడంతో స్మృతి రేఖకు డ్రైవర్ ఉద్యోగం దొరికింది. అ..ఆలు దిద్దించిన చేతులతో చెత్తలారీ స్టీరింగ్ పట్టుకోవడానికి ఆమె నామోషీ ఫీల్ కాలేదు. ‘అన్నం పెట్టే ఏ పనైనా గౌరవనీయమైనదే’ అంటుంది. ‘నా డ్యూటీ పొద్దున 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ వుంటుంది. నాలుగైదు ప్రాంతాల్లో తడి చెత్తను వేరుగా పొడి చెత్తను వేరుగా సేకరించాలి. దానిని వేరు వేరు ప్రాంతాలలో పారబోయాలి’ అని చెప్పింది స్మృతి రేఖ. ఆమెకు ఒరిస్సా వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. జగమొండి షిరీన్ ముంబైలో ఈకాలంలో ఆటో డ్రైవర్ షిరీన్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానికి కారణం ఆమె తెల్లటి బట్టల్లో, చలువ కళ్లద్దాల్లో, ఏ మాత్రం బెరుకు లేకుండా, న్యూనత లేకుండా దర్జాగా ఆటో నడపడమే. ఆ ఆటో నడిపి ఆమె తన ముగ్గురు పిల్లలను సాక్కుంటోంది. ‘నన్ను అందరూ దబంగ్ లేడీ’ అంటారామె. దబంగ్ అంటే మొండి ఘటం అని అర్థం. షిరీన్ జీవితమే ఆమెను జగమొండి చేసింది. ఇద్దరు కూతుళ్లు పుట్టాక తల్లిని భర్త విడిచిపెట్టి పోయాడు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ భర్త రాచిరంపాన పెడితే ఆత్మహత్య చేసుకుంది. కన్నతండ్రి తిరిగి వచ్చి హడావిడిగా ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేస్తే పెద్ద కూతురును అత్తామామలు విషం పెట్టి చంపారు. షిరీన్ భర్త ముగ్గురు పిల్లలు పుట్టాక పారిపోయాడు. ‘ఇంకొకరైతే ఏమయ్యేవారో కాని నేను మాత్రం అస్సలు వెరవలేదు’ అంటుంది షిరీన్. ఆమె కొన్నాళ్లు చిన్న బిర్యానీ పాయింట్ పెట్టింది. నడవలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే భర్త ఆటో నడిపేవాడు కాబట్టి ఆటో నడపడం మేలనుకుంది. లోన్ తీసుకుని ఆటో ఎక్కింది. అయితే ఆమె అందరిలా బీద ఆటో డ్రైవర్ లా కనిపించాలనుకోలేదు. చక్కటి బట్టల్లో మంచిగా తయారయ్యి హుందాగా ఆటో నడపాలనుకుంది. మొదట సాటి మగ ఆటోడ్రైవర్లు ఆమెను అటకాయించారు. ‘నిన్ను చూసి అందరూ సవారీ ఎక్కుతారు. నువ్వు రాకు’ అన్నారు. ఆమెను అడ్డగించడానికి చూశారు. కాని పులిలా వారిని ఎదిరించి ఆటోను ముందుకు దూకించింది. ‘మనం అస్సలు తగ్గొద్దు’ అంటుంది షిరీన్. బాలీవుడ్ తారలు ఆమె గురించి విని ఆమెను పిలిచి ప్రశంసించడం జరుగుతూ ఉంటుంది. డ్రైవర్ వృత్తి అనేది బాధ్యతతో కూడుకున్నది. పురుషులు ఎంత బాగా ఈ డ్యూటీ చేసినా బద్దకం, తాగుడు, నిర్బాధ్యత వంటి లోపాలు కొందరిలో ఉంటాయి. స్త్రీలు ఈ విషయంలో ఎంతో బాధ్యతతో పనిచేసి ఇవాళ దేశంలో చాలా చోట్ల డ్రైవర్లుగా రాణిస్తున్నారు. కరోనా ఇలాంటి వారి విషయంలో చిన్న బ్రేకు వేయగలిగింది కాని స్టాప్బోర్డ్ పెట్టలేకపోయింది.ప్రస్తుత కాలంలో వీరిని చూసి మరెందరో తమ జీవితాల స్టీరింగ్ను మరింత దృఢంగా పట్టుకునే అవకాశం ఉంది. – సాక్షి ఫ్యామిలీ -
ఈ చిలగడ దుంపలతో కేన్సర్, షుగర్ దూరం!
ఔషధ విలువలు కలిగిన రెండు సరికొత్త చిలగడ దుంప వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. ఊదా రంగులో ఉండే సరికొత్త చిలగడదుంప (పర్పుల్ స్వీట్ పొటాటో– భూకృష్ణ ) కేన్సర్ను, షుగర్ను అరికట్టే ప్రత్యేకత కలిగి ఉంది. నారింజ రంగులో ఉండే చిలగడ దుంప (ఆరెంజ్ స్వీట్ పొటాటో–భూసోనా) లో కంటి చూపును మెరుగుపరిచే బీటా కెరొటిన్ పుష్కలంగా ఉంది. భువనేశ్వర్ (ఒడిశా)లోని కేంద్రీయ దుంప పంటల పరిశోధనా స్థానం(సిటిసిఆర్ఐ) శాస్త్రవేత్తలు ఏడేళ్లు పరిశోధన చేసి ఈ వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఊదా రంగులో ఉండే 100 గ్రాముల చిలగడ దుంపలో 90–100 గ్రాముల మేరకు ఆంథోశ్యానిన్ వర్ణద్రవ్యం ఉంటుంది. కేన్సర్ను అరికట్టే, రక్తంలో చక్కెర నిల్వలను తగ్గించే లక్షణం కలిగిన యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయని సిటిసిఆర్ఐ అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. ఎం. నెడుంజెళియన్ చెప్పారు. 100 గ్రాముల నారింజ ‘భూసోనా’ చిలగడ దుంపలో 14 ఎంజిల బీటా–కెరొటిన్ ఉందని, క్యారట్కు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడొచ్చన్నారు. అమెరికా, మెక్సికో ప్రాంతాల నుంచి తెప్పించిన రకాలను స్థానిక వాతావరణానికి అనుగుణంగా అభివృద్ధి చేసి, తాము 2 రెండు విశిష్ట వంగడాలను రూపొందించామన్నారు. సాగు విధానం వీటి సాగు కాలం 100–120 రోజులు. ఎర్ర, దుబ్బ నేలలు అనుకూలం. ఈ దుంప పంటలు మంచి దిగుబడి ఇవ్వాలంటే సగటు ఉష్ణోగ్రతలు 24–25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. దుంప పెరిగే కాలంలో రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉంటే మేలు. ఖరీఫ్లో వర్షాధారంగా సముద్ర మట్టానికి 400 మీటర్లకన్నా ఎత్తు ఉండే అరకు, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వంగడాలను ఎర్ర, దుబ్బ నేలల్లో సాగు చేయవచ్చు. జూలై 15 వరకు మొక్కలు నాటుకోవచ్చు. హెక్టారుకు 12–15 టన్నుల దిగుబడి వస్తుంది. రబీలో మైదాన ప్రాంతాల్లోని ఎర్ర, దుబ్బ నేలల్లో సెప్టెంబర్– అక్టోబర్లలో ఈ మొక్కలు నాటుకోవచ్చు. పంట పూర్తయ్యాక తీగ ముక్కలను సేకరించి నర్సరీ పెంచుకోవచ్చు. దుంప ముక్కలతోనూ మొక్కలను పెంచుకొని నాటుకోవచ్చన్నారు డా. నెడుంజెళియన్. మొక్కలు ఇస్తాం ఖరీఫ్లో సాగుకు భూకృష్ణ, భూసోన రకాల చిలగడదుంప మొక్కలు భువనేశ్వర్లోని సిటిసిఆర్ఐలో అందుబాటులో ఉన్నాయి. మొక్కలను కొరియర్ ద్వారా పంపటం సాధ్యం కాదు. రైతులు స్వయంగా వచ్చి తీసుకెళ్లాలి. జూలై 15 లోగా నాటుకోవచ్చని డా. నెడుంజెళియన్ చెప్పారు. రబీలో సాగు కోసం అక్టోబర్లో మొక్కలు / విత్తన దుంపలు ఇస్తామని, సాగు పద్ధతులనూ తెలుగులోనే వివరంగా చెబుతామన్నారు. ఊదా, నారింజ రంగుల్లోని చిలగడదుంపలకు విదేశాల్లో గిరాకీ ఉంది. మన దేశంలోనూ ఆదరణ పెరుగుతోందని డా. నెడుంజెళియన్ (79784 88514) ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. భువనేశ్వర్లోని సిటిసిఆర్ఐ అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. నెడుంజెళియన్ mnedun@gmail.com -
ఎయిమ్స్, భువనేశ్వర్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
భువనేశ్వర్లోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 90 ► విభాగాలు: అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ తదితరాలు. ► అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/ఎండీఎస్/డీఎం/ఎంసీహెచ్/డీఎన్బీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: సూచించిన పోస్టులకు దరఖాస్తులు మూడు రెట్లు ఎక్కువగా వస్తే రాతపరీక్ష నిర్వహిస్తారు. లేదంటే కేవలం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ లేదా కేవలం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.06.2021 ► వెబ్సైట్: https://aiimsbhubaneswar.nic.in ఐఎంఎంటీ, భువనేశ్వర్లో 14 ఖాళీలు భువనేశ్వర్లోని సీఎస్ఐఆర్–ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(ఐఎంఎంటీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 14 ► పోస్టుల వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జి)–07, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఫైనాన్స్–అకౌంట్స్)–02, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్–పీ)–03, జూనియర్ స్టెనోగ్రాఫర్–02. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జి): వయసు: 27 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.19,900–63,200 చెల్లిస్తారు. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్–అకౌంట్స్): వయసు: 27 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.19,900–63,200 చెల్లిస్తారు. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్–పీ): వయసు: 27ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.19,900–63,200 చెల్లిస్తారు. ► జూనియర్ స్టెనోగ్రాఫర్: వయసు: 27ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.25,500–81,100 చెల్లిస్తారు. ► అర్హత: ఇంటర్మీడియట్(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ టైపింగ్లో ప్రొఫిషియన్సీ(ఇంగ్లిష్లో నిమిషానికి 35 పదాలు) ఉండాలి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.06.2021 ► వెబ్సైట్: http://www.immt.res.in -
ప్రేమికుడి బాబా వేషం.. గడ్డం లాగడంతో..
భువనేశ్వర్: ప్రియురాలి బాగోగులు తెలుసుకునేందుకు బాబా వేషం ధరించాడు ఓ ప్రేమికుడు. చివరి దశలో వ్యూహం బెడిసి కొట్టింది. స్థానికులకు పట్టుబడి చావు దెబ్బలు తిన్నాడు ప్రియుడు. జాజ్పూర్ రోడ్ ఫెర్రో క్రోమ్ గేటు కాలనీలో శనివారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. బాబా వేషంలో వీధిలో తిరుగాడుతున్న ప్రేమికుడిని పిల్లల దొంగగా భావించిన స్థానికులు పట్టుకుని నిలదీయడంతో అసలు కథ బట్టబయలైంది. ఈ వేషగాడు అంగుల్లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రేమించాడు. విద్యార్థిని కుటుంబ సభ్యులు వీరి ప్రేమని నిరాకరించారు. దీంతో ప్రియురాలి ఇంట్లో తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు ఆమెతో ముఖాముఖి భేటీ కావాలనుకున్నాడు. తక్షణమే వేషం మార్చి బాబాగా తయారయ్యాడు. ప్రియురాలి ఇంటి పరిసరాల్లో తిరుగాడుతున్న అతన్నిపై అనుమానంతో స్థానికులు పట్టుకుని నిలదీశారు. మొదట తాను హిమాలయాల నుంచి వచ్చినట్లు బుకాయించాడు. అతడి సమాధానాలతో ఏకీభవించని స్థానికులు సందేహంతో గడ్డం లాగడంతో బండారం బట్టబయలైంది. దొంగ బాబాను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. -
అసెంబ్లీ సాక్షిగా తల్లి మెడపై కత్తి పెట్టి..
-
తుపాను : గులాబీ రంగులో ఆకాశం
అతి తీవ్ర రూపం దాల్చిన తుపాను ‘ఉంపన్’ పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పెను విధ్వంసం సృష్టించింది. గంటకు సుమారు 190 కిమీల వేగంతో వీచిన పెనుగాలులు, భారీ వర్షాల కారణంగా బలహీనమైన ఇళ్లు నేలమట్టం కాగా.. పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ సైతం ధ్వంసమైంది. సూపర్ సైక్లోన్ ధాటికి పశ్చిమ బెంగాల్లో 12 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. అయితే ఉంపన్ తీవ్రత నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు జాగ్రత్తల చర్యల కారణంగా.. ప్రాణనష్టం తగ్గినా.. ఆస్తినష్టం భారీగానే సంభవించింది. (బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం) ఈ నేపథ్యంలో తుపాన్ ధాటికి అల్లాడిన ఒడిశా కాస్త తేరుకుందంటూ స్థానికులు ట్విటర్లో ఫొటోలు షేర్ చేస్తున్నారు. ‘‘ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. వాటిని తట్టుకుని నిలుస్తుందనడానికి నా పట్టణం మరోసారి మంచి ఉదాహరణగా నిలిచింది. తుఫాన్ ఉంఫన్ శాశ్వతంగా వెళ్లిపోయింది. భువనేశ్వర్ పరిసరాల్లో ఆకాశం ఇలా’’అని గులాబీ రంగులో ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబించే ఆకాశం ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తుఫాన్ బాధితులకు సంఘీభావం తెలుపుతూ.. వారు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. My city is an example that we bloom with grace no matter how stormy the times be. 🙂 The evening sky! ❤#Bhubaneswar #Amphan @BBSRBuzz pic.twitter.com/uFq5xAqSuj — Naimisha (@SpeakNaimisha) May 20, 2020 -
5 కేసులు: 48 గంటల పాటు షట్డౌన్!
భువనేశ్వర్: మహమ్మారి కరోనా వైరస్పై పోరాటం ఉధృతం చేసే క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ అమలు అవుతున్న తరుణంలో... రాజధాని భువనేశ్శర్ సహా భద్రక్ పట్టణంలో 48 గంటల పాటు షట్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి ఏకే త్రిపాఠి మీడియాకు వెల్లడించారు. అదే విధంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లాక్డౌన్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిత్యావసరాల అమ్మకాలు జరిపే షాపుల కార్యాకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగబోదని తెలిపారు. అయితే రాజధానిలో వీటిని కూడా మూసివేస్తామని.. కేవలం ఎంపిక చేసిన మెడికల్ స్టోర్ల సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.(కరోనా: రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు) ఈ మేరకు స్థానిక పాలనా యంత్రాంగం ఆదేశాల ప్రకారం షాపు నిర్వాహకులు నడుచుకోవాలని ఆదేశించారు. కాగా ఒడిశాలో ఇప్పటివరకు ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. అందులో నలుగురు బాధితులు భువనేశ్వర్, భద్రక్ పట్టణానికి చెందినవారే గమనార్హం. ఈ నేపథ్యంలో ఏకే త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘ భువనేశ్వర్, భద్రక్ జిల్లా కేంద్రంలో 48 గంటల పాటు అనగా ఆదివారం రాత్రి ఎనిమిది గంటల దాకా షట్డౌన్ విధించనున్నాం. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. మిగతా ప్రాంతాల్లో లాక్డౌన్ సైతం యథావిధిగా కొనసాగుతుంది’’అని పేర్కొన్నారు. ఇక షట్డౌన్ కారణంగా ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని డీజీపీ అభయ్ భరోసా ఇచ్చారు. అయితే ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.(కరోనా నుంచి బయటపడతాం: రావత్) -
భార్య హత్య కేసులో రిటైర్డ్ కల్నల్కు యావజ్జీవం
సాక్షి, న్యూఢిల్లీ : భార్యను అత్యంత కిరాతకంగా చంపిన కేసులో లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) సోమనాథ్ ఫరీదాకు భువనేశ్వర్ స్ధానిక కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 24 మంది సాక్షులను విచారించి, సైంటిఫిక్ బృందం అందించిన ఆధారాలను పరిశీలించిన మీదట న్యాయస్ధానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2013లో ఓ కుటుంబ వివాదం ఘర్షణకు దారితీయడంతో రిటైర్డ్ సైనికాధికారి ఫరీదా (78) తన భార్య ఉషశ్రీ సమాల్ (61)ను స్టీల్ టార్చ్తో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని 300 ముక్కలుగా కోసి దానికి కెమికల్ను మిక్స్ చేసి స్టీల్, గ్లాస్ టిఫిన్ బాక్సుల్లో భద్రపరిచాడు. కాగా తన తల్లితో తాను మాట్లాడలేకపోతున్నానని ఈ దంపతుల కుమార్తె భువనేశ్వర్లో ఉండే తన మామగారికి చెప్పడంతో విషయం వెలుగుచూసింది. ఆమె మామను సైతం అధికారి తన ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సైనికాధికారి ఇంట్లోనే పలు చోట్ల ఆమె శరీర భాగాలను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితుడు జర్పద జైలులో ఉన్నాడు. తనకు శిక్ష తగ్గించాలని ఫరీదా చేసిన అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. -
ఏపీ పోలీసులకు అరుదైన గౌరవం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ఐదు అరుదైన అవార్డులను పోలీసు శాఖ సొంతం చేసుకుంది. భువనేశ్వర్ లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన టెక్నాలజీ అవార్డ్స్ లో ఈ అరుదైన గౌరవం దక్కింది. 2020లో సాంకేతిక పరంగా వివిధ అంశాల్లో చూపిన ప్రతిభకు ఏపీ పోలీసు శాఖకు ఐదు బహుమతులు లభించాయి. భువనేశ్వర్ ఐటీ శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డులను ఏపీ పోలీసులు అందుకున్నారు. ఏపీలో విజయవంతంగా పోలీసు వీక్లీ ఆఫ్ విధానం అమలు, దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ ట్రాకర్, ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం, బెస్ట్ ఎలక్ట్రోల్ ప్రాక్టీస్ -ఎస్సీ / ఎస్టీ యాక్ట్ మానిటరింగ్ డ్యాష్ బోర్డు విధానం లో మొత్తం ఐదు అవార్డులు లభించాయి. -
భారీ పొగమంచు, తప్పిన ఘోర రైలు ప్రమాదం
భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. భారీ పొగమంచు కారణంగా ముంబై-భువనేశ్వర్ లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టిటి) ప్రమాదానికి గురైంది. కటక్లోని సలాగావ్ -నెర్గుండి రైల్వే స్టేషన్ మధ్య గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో పట్టాలు తప్పి ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి జేపీ మిశ్రా తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కటక్లోని ఎస్సీబీ మెడికల్ ఆస్పత్రికి తరలించామన్నారు. సంబంధిత రైల్వే, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలంలో సహాయకార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రభు త్రిపాఠి అనే ప్రయాణీకుడు ట్విటర్లో సమాచారం అందించారు. ఎల్టిటి ఎక్స్ప్రెస్ ప్రయాణీకులకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్లైన్ నంబర్- (0764) 1072 లేదా (0674), 1072 కు కాల్ చేయవచ్చని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు సూచించారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల నెదుర్కొన్నారు. @DRMKhurdaroad SOS Please send help to rescue passengers from train 12897,Coach B1 passengers — Prabhu Tripathy (@prabhu_tripathy) January 16, 2020 -
మళ్లీ ఒడిశాలోనే 2023 ప్రపంచ కప్ హాకీ
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్కు మళ్లీ తామే ఆతిథ్యమిస్తామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. 2023లో జరిగే పురుషుల ప్రపంచకప్ పోటీలను భువనేశ్వర్, రూర్కేలా నగరాల్లో నిర్వహిస్తామని బుధవారం ఆయన వెల్లడించారు. గతేడాది కూడా హాకీ మెగా ఈవెంట్కు భువనేశ్వరే ఆతిథ్యమిచ్చింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వరుసగా రెండోసారి కూడా భారత్కే నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. 2023లో జనవరి 13 నుంచి 29 వరకు హాకీ పోటీలు జరుగుతాయి. బుధవారం కళింగ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ‘మేం 2018 ప్రపంచకప్ హాకీని నిర్వహించాం. అలాగే వచ్చే మెగా ఈవెంట్కు ఆతిథ్యమిస్తాం’ అని ప్రకటించారు. ఈ సమావేశంలో ఎఫ్ఐహెచ్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా, హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. -
ఆ రెస్టారెంట్లో...చంపా, చమేలి
-
ఆ రెస్టారెంట్లో...చంపా, చమేలి
నేటి కాలంలో ప్రతీ పనికి టెక్నాలజీ సాయాన్ని కోరుకుంటున్నారు. మనుషులు చేయాల్సిన పనులను రోబోలతో చేయిస్తున్నారు. ఈ క్రమంలో రెస్టారెంట్లలోనూ రోబో సేవల వినియోగం నానాటికీ పెరుగుతోంది. అయితే ఇది అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ నెమ్మదిగా ఇండియాకు విస్తరిస్తోంది. తాజాగా మొదటి రోబోటిక్ రెస్టారెంట్ ఒడిశాలోని భువనేశ్వర్లో బుధవారం ప్రారంభమైంది. కాగా ఉత్తర భారతదేశంలోనే మొదటి రోబోటిక్ హోటల్ కావటం విశేషం. భువనేశ్వర్లోని చంద్రశేఖర్పూర్ ప్రాంతంలో ప్రారంభమైన ‘రోబో చెఫ్’ రెస్టారెంట్లో మనుషులతోపాటు రెండు రోబోలు తిరుగాడుతూ ఉంటాయి. చంపా, చమేలి అనే రోబోలు కస్టమర్లకు ఆహారాన్ని సర్వ్ చేసి, అనంతరం ‘మీరు సంతోషంగా ఉన్నారా’ అని వారి అభిప్రాయాల్ని అడిగి తెలుసుకుంటాయి. భారత్లోనూ ఇలాంటి రెస్టారెంట్లు ఉన్నప్పటికీ ఈ రోబో చెఫ్ రెస్టారెంట్కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పనిచేసే రోబోలకు ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు ఇవ్వాల్సిన పనిలేదు. వాటంతటవే కదులుతాయి. కస్టమర్లు ఇచ్చే ఆర్డర్లను నేరుగా సర్వ్ చేస్తాయి. పైగా ఈ రెండు రోబోలు మేడ్ ఇన్ ఇండియా స్ఫూర్తితో భారత్లోనే తయారవటం విశేషం.రెస్టారెంట్ యజమాని జీత్ బాసా అమెరికా వెళ్లినప్పుడు అక్కడి రెస్టారెంట్లలో విరివిగా రోబోల వినియోగాన్నిచూశాడు. పైగా ఆయన సివిల్ ఇంజనీర్ కావటంతో ఆలోచనకు అతని అనుభవం తోడైంది. దీంతో రూ.5.5 లక్షల ఖర్చుతో రోబోలను తయారు చేశాడు. జీత్ బాసా మాట్లాడుతూ ఈ రోబోలు స్లామ్ (సిమల్టేనియస్ లోకలైజేషన్ అండ్ మ్యాపింగ్) టెక్నాలజీతో పనిచేస్తాయన్నారు. వీటిలో 17 రకాల సెన్సార్లు ఉంటాయని, వాటి సహాయంతో ప్రకృతిని, వేడిని, పొగ, మనుషులను గుర్తుపడతాయన్నారు. అంతేకాక మనుషులను పలకరిస్తూ, వారికి స్వాగతం కూడా తెలుపుతాయని పేర్కొన్నారు. ఇక వాటికి ఆర్డర్లను స్వీకరించే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి కస్టమర్లకు సర్వ్ చేయడం వరకే పరిమితం చేశాడు. వీటిని ఒక్కసారి రీచార్జ్ చేస్తే ఎనిమిది గంటలపాటు నిరంతరాయంగా పని చేస్తాయి. 20 కిలోల బరువును కూడా సునాయాసంగా ఎత్తగలుగుతాయి. వీటిని చార్జ్ చేయటానికి కూడా తేలికే. కేవలం అరగంటలో ఫుల్ చార్జ్ అవుతాయి. -
చితిపై నుంచి లేచాడు!
భువనేశ్వర్: శాశ్వతంగా కన్నుమూశాడని భావించి, శ్మశానవాటికకు తరలించి చితికి నిప్పుపెట్టే సమయంలో ఆ వ్యక్తి హఠాత్తుగా కళ్లు తెరిచాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా కోలుకుంటున్నాడు. ఒడిశాలోని గంజాం జిల్లా సొరొడా సమితిలో ఉన్న హరిపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. గ్రామానికి చెందిన మేకల కాపరి సీమాంచల్ మల్లిక్ శనివారం మేకలను మేపునకు తోలుకెళ్లాడు. సాయంత్రం మేకలు ఇళ్లకు చేరినా సీమాంచల్ మాత్రం రాలేదు. గాలించిన బంధువులు, గ్రామస్తులు అపస్మారకస్థితిలో ఉన్న అతడిని ఆదివారం కనుగొన్నారు. మల్లిక్ మరణించినట్లు భావించి అంత్యక్రియలకు శ్మశానవాటికకు తరలించారు. చితికి నిప్పుపెట్టే సమయంలో.. చుట్టిన వస్త్రాన్ని తొలగిస్తుండగా ఊపిరి ఆడుతున్నట్లు గమనించారు. అంతలోనే కళ్లు తెరిచిన మల్లిక్ను చూసి అతడు మరణించలేదని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సతో అతడు కోలుకుంటున్నాడు. 4 రోజులుగా జ్వరం.. నాలుగు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడిన తాను తగ్గినట్లు అనిపించడంతో శనివారం మేకలు తోలుకెళ్లినట్లు మల్లిక్ తెలిపారు. మధ్యాహ్నానికి మళ్లీ జ్వరం వచ్చి పడిపోయినట్లు చెప్పారు. తిరిగి మెలకువ వచ్చేసరికి చితిమీద ఉన్నట్లు పేర్కొన్నారు. -
ఒడిశా విశ్వ కవి సమ్మేళనం
ప్రతి ఏటా నిర్వహించే విశ్వ కవి సమ్మేళనం, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు, కళింగ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 39వ సమ్మేళనాన్ని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ వేదికగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. 82 దేశాల నుంచి 1,300 మంది కవులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. యునెస్కో అనుబంధంగా ప్రపంచ సాంస్కృతిక మరియు కళల సంస్థలో భాగమైన ఈ విశ్వ కవుల వేదిక (గిఇ్క) 1969లో ప్రారంభమైంది. మనదేశంలో జరుగుతున్న మూడో విశ్వ కవి సమ్మేళనం ఇది. తమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశం కలగడం తనకు గర్వకారణమని సామాజిక వేత్త, లోక్సభ సభ్యులు ప్రొఫెసర్ అచ్యుతా సామంత తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. గత ఏడాది చైనాలో నిర్వహించిన సమ్మేళనంలోకన్నా ఎక్కువ మంది ప్రతినిధులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కవిత్వం, ప్రపంచ శాంతి దిశగా మానవీయ తత్వపు లక్ష్యాల దిశగా కొనసాగగలదని వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పొయెట్రీ అధ్యక్షుడు డాక్టర్ మారస్ యంగ్ ఆశించారు. గతంలో రెండు ఉత్సవాలను భారతదేశంలో ఎంతో ఘనంగా నిర్వహించారని ఆయన గుర్తు చేసుకున్నారు. నాటి సభలకు దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారనీ, కలామ్ రెండు పుస్తకాలను తాను చైనీస్లోకి అనువాదం చేయగా అవి ఎంతో పాఠకాదరణ పొందాయనీ అన్నారు. వేదిక ఉపాధ్యక్షులు, అర్జెంటీనా కవి ప్రొఫెసర్ ఎర్నెస్టో కహాన్, కవులంతా మానవత్వాన్ని ఆపేక్షించే విశ్వ కుటుంబమని కొనియాడారు. ఈ సభలో ప్రసిద్ధ రచయిత రస్కిన్ బాండ్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. సమ్మేళనం మొదటి రోజు ఆఫ్రికా, ఫ్రాన్స్, మంగోలియా, జపాన్, చైనా తదితర దేశాల యువ కవులు తమ కవితలను సొంత భాషలోనూ, ఇంగ్లిష్ అనువాదాలనూ వినిపించడం సభలో ఉత్సాహాన్ని నింపింది. సమ్మేళనం రెండో రోజు జరిగిన ప్రారంభ కార్యక్రమంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక సభ్యుల చేతుల మీదుగా తెలంగాణకు చెందిన ప్రముఖ కవి సిద్ధార్థ ఆంగ్ల కవితా సంపుటి జాస్మిన్ వాటర్ (మల్లెల తీర్థం) ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కరుణ ప్రధానంగా సాగిన ఈ సంపుటి ప్రపంచ పాఠకులను ఆకట్టుకోగలదని మారస్ యంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ భావావేశాన్ని తెలుగులో పట్టినంత ఉద్వేగంగా ఆ అంతస్సారాన్ని ఇంగ్లిష్లోకి కూడా తర్జుమా చేయడంలోనూ సిద్ధార్థ కృతకృత్యులయ్యారు. ఈ కవితా సంపుటిని విశ్వవేదిక మీద ఆవిష్కరించేలా కృషి చేసిన బ్లూజే ప్రింట్స్ నిర్వాహకులు, పాత్రికేయులు, డాక్యుమెంటరీ డైరెక్టర్ రాజా రమేశ్ అభినందనీయులు. -
కవిత్వం పాఠ్యాంశంలో భాగం కావాలి
భువనేశ్వర్: సామాజిక పరివర్తనకు కవిత శక్తివంతమైన సాధనమని, దీనిని పాఠ్యాంశంలో భాగంగా చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు. ప్రగతికి శాంతియుత వాతావరణం అవసరం. శాంతి, సంతోషం, సోదరభావం, సామరస్యాన్ని సాధించడంలో కవిత్వం ఒక శక్తివంతమైన మాధ్యమమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆదివారం భువనేశ్వర్లో 39వ అంతర్జాతీయ కవి సమ్మేళనం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కవితా పఠనాన్ని పాఠ్యాంశాల్లో తప్పనిసరి అంశంగా చేయాలని పాఠశాల యాజమాన్యాలను కోరుతున్నాను. అలాగే, సాహిత్యం, కళలు, సామాజిక శాస్త్రాలకు ప్రోత్సాహం ఇవ్వాలని వర్సిటీలను కోరుతున్నా. దేశానికి వైద్యులు, ఇంజినీర్లు, సైంటిస్టులు ఎంత ముఖ్యమో కవులు, రచయితలు, కళాకారులు, గాయకులు కూడా అంతే అవసరం’ అని పేర్కొన్నారు. ‘కవిత్వం శాంతిని ప్రోత్సహించాలి, సార్వత్రిక సోదరభావం, సామాజిక సామరస్యం, సహనాన్ని పెంపొందించడానికి ప్రజలను ప్రేరేపించాలి. కవిత్వం సామాజిక పరివర్తన ప్రక్రియను వేగవంతం చేసే శక్తివంతమైన ప్రేరకంగా ఉపయోగపడుతుంది’ అని అన్నారు. వికాసశీల, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి కళలు, సంస్కృతిని ప్రోత్సహించడం కీలకమన్నారు. భారతీయ సంస్కృతి మాదిరిగానే కవిత్వం కూడా ఎంతో ప్రాచీనమైందన్నారు. మహాభారతం, రామాయణం వంటి గొప్ప ఇతిహాసాలు ఇప్పటివరకు వచ్చిన కవిత్వాల్లో ఉత్తమ ఉదాహరణలని, కాళిదాసు, మీరాబాయి, తులసీదాస్ వంటి వారు తమ కవిత్వంతో తరాలుగా అందరినీ అలరిస్తున్నారన్నారు. -
విమానంలోనే తుది శ్వాస విడిచిన ప్రయాణికుడు
న్యూఢిల్లీ : విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురై తుది శ్వాస విడవడం విషాదాన్ని నింపింది. చెన్నై నుంచి కోల్కతా వెళ్లడానికి స్పైస్ జెట్ విమానంలో ప్రయాణిస్తుండగా అశోక్ కుమార్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. 48 ఏళ్ల అశోక్ కుమార్ కోల్కతా వెళుతుండగా శ్వాస కోస బారిన పడి మరణించాడు. వివరాల్లోకి వెళితే... అశోక్ కుమార్ శర్మ అనే వ్యక్తి కోల్కతా వెళ్లడానికి చెన్నైలో స్పైస్ జెట్ ఫ్లైట్ ఎస్జీ -623 బోయింగ్ విమానంలో బయలుదేరాడు. కాగా చెన్నై నుంచి బయలుదేరిన కాసేపటికే శ్వాస సమస్యతో బాధపడుతున్నట్లు శర్మ తెలపడంతో వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి విమానాన్ని భువనేశ్వరకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే మెడికల్ రూమ్కు తీసుకెళ్లినట్లు విమానాశ్రయం డైరెక్టర్ ఎస్ సి హోటా పేర్కొన్నారు. అనంతరం పైలట్ సూచనతో అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్లో అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు. వైద్యులు అశోక్శర్మను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. కాగా, పోస్టుమార్టం నిర్వహించేందుకు అశోక్ మృతదేహాన్ని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించారు. -
మళ్లీ టీచర్గానే పుట్టాలి
గురుబ్రహ్మ.. గురువిష్ణు.. గురుదేవో మహేశ్వరః త్రిమూర్తుల అంశతో వెలిగే జ్ఞానజ్వాల గురువు. లోకంలో ప్రతిఫలించే ఈ వెలుగంతా గురువుల నుంచి ప్రజ్వరిల్లుతున్నదే. అక్షరాల్ని దిద్దించడమే కాదు, జీవితాన్ని కూడా పక్కన ఉండి శ్రద్ధగా దిద్దుతారు గురువులు. అలాంటి ఒక గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్. అలాంటి వెలుగుల వర్ణాలే ఆయన దిద్దివెళ్లిన విలువలు. నేడు ఆయన జన్మదినం. ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా.. మట్టిలోంచి ఒక గాయనిని మొలకెత్తించిన ‘గురుకోటి’, విశ్వాంతరాళాలపై చిన్నారులకు ఆసక్తి కలిగిస్తున్న ‘గురుకృష్ట’, అత్యుత్తమమైన ఒక టీచర్ని మలిచిన ‘గురుభువనేశ్వర’.. ఈ ముగ్గురు గురువుల, వారి వల్ల కాంతులీనుతున్న మూడు దివ్వెల వెలుగు కిరణాలివి. ‘ఓ సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక’– కాళోజీ కొటేషన్ లైబ్రరీలో ఒక వైపు గోడ మీద ఉంది. మరోవైపు ‘టు డే ఏ రీడర్, టుమారో ఏ లీడర్’ అని ఉంది. అది హైదరాబాద్ నగర శివారులో జీడిమెట్ల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూలు. మరొక గోడకు ఉన్న ఫొటోలు తోలుబొమ్మలాటల్లో ఎన్ని రకాలున్నాయో చెప్తున్నాయి. మరో వైపు రకరకాల సంగీత వాయిద్యాలను పలికిస్తున్న వాద్యకారుల ఫొటోలు. బయటి ప్రపంచాన్ని బడి నాలుగు గోడల మధ్య ఉండగానే తెలియచేసే ప్రయత్నం అది. ఇక లైబ్రరీలో ఆరు రౌండ్ టేబుళ్లు, వాటి మీద కథల పుస్తకాలున్నాయి. బీరువాల్లో చక్కగా అమర్చిన మరెన్నో పుస్తకాలు... ఆ బీరువాలకు తాళాలు లేవు. ఈ లైబ్రరీని నిర్వహిస్తున్నది ఆ స్కూలు పిల్లలే. పిల్లలు తమకు కావల్సిన పుస్తకం తీసుకుని, ఓసారి టీచరుకు చూపించి, వాళ్లే రిజిస్టర్లో రాసి ఆ పుస్తకాన్ని ఇంటికి పట్టుకెళ్తారు. చదివి తెచ్చిన తర్వాత బీరువాలో పెట్టి రిజిస్టర్లో తేదీని నమోదు చేస్తారు. ఇక్కడ ఇలా ఉంటే, స్కూలు భవనానికి పక్కనే ఉన్న గదిలో మధ్యాహ్న భోజన పథకంలో వండిన భోజనాన్ని హెడ్ మాస్టర్ పరీక్షిస్తున్నారు. ‘‘ఇంత బిరుసుగా ఉంటే పిల్లలు తినేదెలా? మళ్లీ వండమ్మా’’ అని చెప్పి బయటికొచ్చి ‘‘అన్నం ఉడుకుతోంది. ఓ పది నిమిషాలు ఆగండర్రా’’ అని పిల్లలకు చెప్పి తన గదిలోకి వెళ్లిపోయారు. టీచర్లు బాధ్యతగా ఉండడం వల్లనే, అది పిల్లలకు కూడా అలవడింది. ‘‘మా స్కూల్లో ప్రతిదీ ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది. టీచర్లందరం ఇంతటి అంకితభావంతోనే పనిచేస్తాం’’ అన్నారు ఆ స్కూల్ ఇంగ్లిష్ టీచర్ ఆశారాణి. ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జాతీయస్థాయి అవార్డుకు ఎంపికయ్యారామె. టీచర్స్ డే సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఆశారాణిది శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలం, సీతాపురం గ్రామం. తండ్రి అప్పారావు మిలటరీ ఉద్యోగి, తల్లి సరస్వతి గృహిణి. ముగ్గురమ్మాయిల్లో ఆశారాణి పెద్దమ్మాయి. తండ్రి ఉద్యోగరీత్యా జమ్మూ–కశ్మీర్లో ఉండడంతో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం టెక్కలిలో అమ్మమ్మగారింట్లోనే పూర్తయింది. తండ్రికి బెంగళూరు ట్రాన్స్ఫర్ కావడంతో కుటుంబం బెంగళూరుకు మారింది. అక్కడ తెలుగు మీడియం ఉన్న ప్రభుత్వ పాఠశాలను వెతికి మరీ చేర్పించారాయన. ఆ సంగతులను సాక్షితో పంచుకున్నారు ఆశారాణి. ‘‘మొదటగా మా నాన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన ఫ్రెండ్స్ నీకు మూడు ‘మైనస్’లు అని ఆటపట్టిస్తున్నా, ఆయన మాత్రం తనకు అబ్బాయిలు లేరని ఏనాడూ అసంతృప్తి చెందలేదు. పైగా తన ట్రాన్స్ఫర్లు మా చదువులకు ఇబ్బంది కలిగించకుండా, తెలుగు మీడియం ఉండే విధంగా చూసుకున్నారు. బెంగళూరు తర్వాత ఉద్యోగం పోర్ట్బ్లెయిర్ (అండమాన్ నికోబార్ దీవుల రాజధాని)లో. నాకు ప్లస్ టు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. మిలటరీ క్వార్టర్స్లో పెరగడంతో తమిళ, కన్నడ, మలయాళీ, ఉత్తరాది భాషలన్నింటితోనూ పరిచయం ఉండేది. పైగా పెద్ద వాగుడుకాయని కూడా. అలాంటిది కాలేజ్కొచ్చిన తర్వాత గొంతు పెగిలేది కాదు. ఇంగ్లిష్ భయంతో క్లాస్ ఎగ్గొట్టాను ప్లస్ టులో మంచి ర్యాంక్ రావడంతో భువనేశ్వర్లోని రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సీటు వచ్చింది. అది బిఏ, బిఈడీ కలిసిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు. పూర్తిగా ఇంగ్లిష్ మీడియం. అర్థం చేసుకోగలిగినా సరే, ధైర్యంగా మాట్లాడలేకపోయేదాన్ని. టీచింగ్ క్లాసులంటే చచ్చేంత భయం వేసేది. కడుపు నొప్పి అని ఒకరోజు, తలనొప్పి అని ఒకరోజు క్లాసులు ఎగ్గొట్టాను కూడా. అలాంటిది నేను ఇంగ్లిష్ టీచర్నయ్యానంటే మా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఏడిపిస్తుంటారు. ఆర్మీ స్కూల్లో తొలి ఉద్యోగం నాన్న రిటైరైన తర్వాత మా కుటుంబం హైదరాబాద్కొచ్చింది. నేను ఉస్మానియాలో ఎం.ఎ హిస్టరీలో చేరాను. పీజీ పూర్తయ్యాక ఆర్మీ స్కూల్కి ఇంటర్వ్యూకెళ్లడం ఒక పాఠమే అయింది. ఉద్యోగం వచ్చింది కానీ సెకండ్ క్లాస్ టీచర్గా. నాకు బీఎడ్ ఉంది, పీజీ ఉంది, పెద్దక్లాసు ఇవ్వడానికి అన్ని అర్హతలూ ఉన్నాయి. అయితే ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడలేకపోవడం వల్లనే అలా జరిగింది. అయితే అక్కడి పిల్లలతో మాట్లాడి, మాట్లాడి నాకు ఇంగ్లిష్ వచ్చేసింది. తర్వాత 1994లో డిఎస్సి రాసి సెలెక్ట్ అయ్యాను. శంకర్పల్లి మండలంలోని సంకేపల్లిలో పోస్టింగ్. ఐదు తరగతులున్న పాఠశాలకు ఇద్దరే టీచర్లం. తర్వాత రెండేళ్లకు మోఖిలాలోని అప్పర్ ప్రైమరీ స్కూల్కి బదిలీ. అక్కడ పెద్ద క్లాస్లకు ఇంగ్లిష్ చెప్పగలిగిన లాంగ్వేజ్ స్కిల్ ఉన్న వాళ్లలో నేనే బెటర్ అయ్యాను. అలా నా ప్రమేయం లేకుండా ఇంగ్లిష్ టీచర్నయ్యాను. యూనిసెఫ్ ప్రోగ్రామ్లో భాగంగా న్యూయార్క్ నుంచి డాక్టర్ కెరోల్ బెలోమీ మా స్కూలుకి వచ్చారు. ఆమెతో ఇంటరాక్ట్ అయ్యి, ట్రాన్స్లేటర్గా వ్యవహరించడం ఊహించని అవకాశం. ఆ టాస్క్ని విజయవంతంగా చేయగలిగినా సరే... ఎందుకో అసంతృప్తిగా అనిపించేది. దాంతో ఇంగ్లిష్లో ఎం.ఎ చేశాను. ఇంగ్లిష్ ఎం.ఏ ఎన్నో అవకాశాలను నా ముందుకు తెచ్చింది’’ అన్నారు ఆశారాణి. పిల్లలకు ఎల్లలు ఉండకూడదు 2017లో కాలిఫోర్నియాలో ‘టీచింగ్ ఎక్స్లెన్స్ అండ్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్’లో పాల్గొన్నారు ఆశారాణి. ఆరు వారాల పాటు అక్కడి స్కూల్స్ని విజిట్ చేయడం, మన విద్యావిధానంలోకి తీసుకోగలిగిన మంచి విధానాలను గుర్తించడం, మన దేశ కల్చర్ గురించి అక్కడి పిల్లలకు తెలియచేయడం ఆ ప్రోగ్రామ్ ఉద్దేశం. మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్లో ప్రొజెక్టర్ ఉండదని తెలుసుకున్న కాలిఫోర్నియా పిల్లలు వాళ్ల దగ్గర అదనంగా ఉన్న ప్రొజెక్టర్ని మనకు బహూకరించారు. ఆశారాణికి ఆ ప్రోగ్రామ్కు హాజరైన ఇరవై దేశాల టీచర్లతో పరిచయం అయింది. ఆ టీచర్ల సహకారంతో కజకిస్తాన్, నేపాల్ దేశాల పిల్లలను స్కైప్లో నేరేడ్మెంట్ స్కూల్ పిల్లలకు పరిచయం చేశారు. ‘‘భాష, ప్రాంతం, దేశం అనే ఎల్లలు లేకుండా పిల్లలు యూనివర్సల్గా పెరగాలి. జ్ఞానం ఎక్కడ ఉన్నా సరే ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి పిల్లలే వారధులు కాగలగాలి’’ అన్నారామె. ఆ కాలేజే నడిపించింది ఇంగ్లిష్ టీచర్గా కుత్బుల్లాపూర్, శంకరపల్లిలోని ప్రొద్దుటూరుతోపాటు ఈ స్కూల్లో (జీడిమెట్ల స్కూలు) ఐదేళ్లు చేశాను. 2009 నుంచి 2018 వరకు నేరేడ్మెట్ స్కూల్లో పని చేసి మళ్లీ ఇక్కడికి వచ్చాను. అప్పుడు నా దగ్గర చదువుకున్న పిల్లలు పెద్దయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నేను వచ్చానని తెలిసి స్కూలుకి వచ్చి పలకరిస్తుంటారు. ఒకసారి పనిచేసిన స్కూల్కి మళ్లీ వస్తే స్వీట్ మెమొరీ అవుతుందని వచ్చిన తర్వాతే తెలిసింది. వృత్తికి అంకితమై పోయి, పిల్లలతో మమేకం అవడాన్ని భువనేశ్వర్ కాలేజ్ నేర్పించింది. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో టీచర్లలో ఎక్కువ మంది ఆ కాలేజ్ వాళ్లే ఉంటారు. నేను జూనియర్ లెక్చరర్గా వెళ్లకుండా గవర్నమెంట్ స్కూలు పిల్లలకు చదువు చెప్పాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్నది కూడా మా కాలేజ్ నేర్పించిన సామాజిక బాధ్యతే. మా స్కూళ్లలో చాలామంది పిల్లలకు... తల్లిదండ్రులు హయ్యర్ స్టడీస్ గురించి గైడెన్స్ ఇవ్వగలిగిన స్థితిలో ఉండరు. దాంతో ఆ బాధ్యత కూడా మేమే తీసుకోవాలి. టీచర్ బాధ్యత పిల్లలకు చదువు చెప్పడంతో పూర్తి కాదు, మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి వాళ్ల మీద ప్రభావం చూపించాలి. అందుకే నేను ఉపాధ్యాయ వృత్తిని అంతగా ఆరాధిస్తాను.– ఆశారాణి, ఉత్తమ ఉపాధ్యాయిని ఆశారాణికి ఉపాధ్యాయినిగా ఇరవై నాలుగేళ్లు నిండాయి. పిల్లలకు పాఠాలతోపాటు పదిహేడేళ్లు టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చారామె. 1997లో ఢిల్లీలోని సీసీఆర్టీలో తోలు బొమ్మలతో పాఠాలు చెప్పడంలో శిక్షణ పొందిన ఆశారాణి ప్రైమరీ స్కూలు పిల్లలకు బొమ్మలతో పాఠాలు చెప్పేవారు. ‘‘అంకితభావంతో పని చేస్తే ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి. టీచర్కి ప్రొఫెషన్ మీదున్న నిబద్ధత పిల్లల ఫలితాల్లో కనిపిస్తుంది. పాఠాలు చెప్పేసి ఉద్యోగం అయిపోయిందనుకోకుండా ఇన్నేసి బాధ్యతలను తలకెత్తుకోవడానికి నేను సింగిల్ కావడం కూడా ఒక కారణం కావచ్చు’’ అన్నారామె నవ్వుతూ.– వాకా మంజులారెడ్డిఫొటోలు: దత్తు గుంటుపల్లి -
ఆటో డ్రైవర్కు రూ. 47,500 జరిమానా
భువనేశ్వర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 నిబంధనలు పాటించని వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ చట్టం ప్రకారం వాహనదారులకు విధించే జరిమానాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమంది కొత్త చట్టం ప్రకారం విధించిన జరిమానాలు చూసి షాక్ తిన్నారు. ఆర్టీవో అధికారులు తాజాగా ఓ ఆటో డ్రైవర్కు రూ. 47,500 జరిమానా విధించారు. ఈ ఘటన ఒడిశా భువనేశ్వర్లో బుధవారం చోటుచేసుకుంది. సరైన పత్రాలు లేకపోవడం, తాగి వాహనం నడపడం, లైసెన్స్ సక్రమంగా లేకపోవడంతో అధికారులు అతనికి భారీ మొత్తంలో జరిమానా విధించారు. బుధవారం నగరంలో వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు మోటార్ వాహన చట్టం నిబంధనలు అతిక్రమించినందుకు ఆటో డ్రైవర్ హరిబంధు కన్హార్కు రూ. 47,500 జరిమానా విధించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త చట్టం ప్రకారం ఈ జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై హరిబంధు మాట్లాడుతూ, తాను ఇంత మొత్తం జరిమానా చెల్లించే పరిస్థితి లేదని తెలిపారు. కావాలంటే అధికారులు తన వాహనాన్ని సీజ్ చేయాలని, లేకుంటే తనను జైలుకు పంపాలని కోరారు. ఇంటి వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్కు విధించిన జరిమానా వివరాలు సాధారణ జరిమానా - రూ. 500 డ్రైవింగ్ లైసెన్స్ సరిగా లేనందుకు - రూ. 5,000 పర్మిట్ లేకుండా వాహనం నడిపినందుకు - రూ. 10,000 మద్యం సేవించి వాహనం నడిపినందుకు - రూ. 10,000 పొల్యూషన్ సర్టిఫికేట్ లేనందుకు - రూ. 10,000 వాహనం నడిపేందుకు వేరే వ్యక్తిని అనుమతించినందుకు - రూ. 5,000 ఆటో రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ లేనందుకు - రూ. 5,000 ఇన్సూరెన్స్ లేనందుకు - రూ. 2,000 -
అరుదైన ‘ఫ్లైయింగ్ స్నేక్’ స్వాధీనం.. యువకుడిపై కేసు
భువనేశ్వర్ : అరుదైన రకానికి చెందిన పామును ఓ యువకుడి వద్ద నుంచి అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిని అడవిలో విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భువనేశ్వర్కు చెందిన ఓ యువకుడు అరుదుగా కనిపించే ఫ్లైయింగ్ స్నేక్ను పట్టుకున్నాడు. దానిని ప్రజల ముందు ప్రదర్శిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు మంగళవారం అతడి నుంచి పామును స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సదరు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ చట్టం ప్రకారం వన్యప్రాణులను కలిగి ఉండటం, వాటితో వ్యాపారం చేయడం నేరమని, ఇందుకుగానూ జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాగా సాధారణంగా ఫ్లైయింగ్ స్నేక్ ఆగ్నేయ ఆసియాలో ఎక్కువగా జీవిస్తాయి. ఇవి విషపూరితమైనవి అయినప్పటికీ దాని వల్ల మనిషి ప్రాణానికి ఎటువంటి ప్రమాదము ఉండదు. బల్లులు, కప్పలు, చిన్న చిన్న పక్షులను తిని బతుకుతాయి. -
ఆర్టికల్ 370 రద్దు; కాంగ్రెస్కు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ విప్ భువనేశ్వర్ కలిత రాజీనామా చేశారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యంగా ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సైతం ఆర్టికల్ 370 ఏదో ఒకరోజు రద్దవుతుందని అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం పార్టీ సిద్ధాంతాలను మర్చిపోయిందని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీలందరికీ విప్ జారీ చేయాలని తనను ఆదేశించారని, ఈ విప్ దేశ మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుందన్న ఉద్దేశంతో విప్ జారీ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. భువనేశ్వర్ కలిత అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారం వ్యవధిలో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయడం గమనార్హం. ట్రిపుల్ తలాక్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి సంజయ్ సింగ్ జూలై 30న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆర్టికల్ 35ఏ కూడా రద్దైందా?) -
వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో కె.రాజేంద్రప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలునెంబరు (02784) సికింద్రాబాద్–భువనేశ్వర్ ప్రత్యేక రైలు జూలై 3, 6, 10, 13, 17, 20, 24, 27, 31, ఆగస్ట్ 3, 7, 10, 14, 17, 21, 24,28, 31, సెప్టెంబర్ 4, 7, 11, 14, 18, 21, 25, 28వ తేదీల్లో మధ్యాహ్నం 12.30గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.30గంటలకు భువనేశ్వర్ చేరుతుందన్నారు. రైలునెంబరు (02783) భువనేశ్వర్ –సికింద్రాబాద్ ప్రత్యేకరైలు జూలై 4, 7, 11, 14, 18, 21, 25, 28, ఆగస్ట్ 1, 4, 8, 11, 15, 18, 22, 25, 29 సెప్టెంబర్ 1, 5, 8, 12, 15, 19, 22, 26, 29వ తేదీల్లో సాయంత్రం 6గంటలకు భువనేశ్వర్లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందన్నారు. రైలునెంబరు (07016) కాచిగూడ–విశాఖపట్నం ప్రత్యేక రైలు జూలై 2, 9, 16, 23, 30 ఆగస్ట్ 6, 13, 20, 27 సెప్టెంబర్ 3, 10, 17, 24వ తేదీల్లో సాయంత్రం 6.45గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.50గంటలకు విశాఖపట్నం చేరుతుంది. రైలునెంబరు(07479) విశాఖపట్నం–తిరుపతి ప్రత్యేక రైలు జూలై 3, 10, 17, 24, 31 ఆగస్ట్ 7, 14, 21, 28 సెప్టెంబర్ 4, 11, 18, 25వ తేదీల్లో రాత్రి 7.05గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.25కు తిరుపతి చేరుతుందన్నారు. రైలునెంబరు(07146) తిరుపతి–కాచిగూడ ప్రత్యేక రైలు జూలై 4, 11, 18, 25, ఆగస్ట్1, 8, 15, 22, 29, సెప్టెంబర్ 5, 12, 19, 26వ తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు కాచిగూడ చేరుతుందన్నారు. -
‘ఉదయం 11.02 గంటలకు ‘ఫొని’ పుట్టింది’
భువనేశ్వర్ : ఉపద్రవం గుప్పిట్లో చిక్కుకుని ప్రజలంతా అల్లాడుతున్న సమయాన.. మరో ప్రాణి క్షేమంగా ఈ భూమ్మీదకు వస్తే గట్టి పిండమే అంటాం. అంతేకాక ఆ చిన్నారికి ఉపద్రవాన్ని ప్రతిబింబించే పేరే పెడతారు. ఇలాంటి సంఘటనే ఒకటి భువనేశ్వర్లో చోటు చేసుకంది. ఒకవైపు బంగాళాఖాతం తీర రాష్ట్రాలు ‘ఫొని’ తుపాను సృష్టిస్తోన్న బీభత్సంతో వణికిపోతుంటే.. దానికి ఏమాత్రం జడవకుండా.. క్షేమంగా భూమ్మీదకు వచ్చిన ఓ చిన్నారి పాపకు ‘ఫొని’ అనే పేరు పెట్టారు తల్లిదండ్రులు. వివరాలు.. ఓ 32 ఏళ్ల మహిళ భువనేశ్వర్లోని రైల్వే కోచ్ రిపేర్ వర్క్షాప్లో విధులు నిర్వహిస్తుంది. ప్రస్తుతం నెలలు నిండిన ఆ మహిళ శుక్రవారం ఉదయం రైల్వే ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఓ వైపు ఒడిషా అంతా ఫొని ఎఫెక్ట్తో విలవిల్లాడుతూంటే.. ఈ చిట్లి తల్లి మాత్రం వెచ్చగా తల్లి పొత్తిళ్లలో సేదతీరుతుంది. ఇంతటి ఉపద్రవంలో కూడా క్షేమంగా భూమ్మీదకు వచ్చిన చిన్నారికి ఆమె తల్లితండ్రులు ‘ఫొని’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ‘ఫొని’ తుపాను ఒడిశాలో బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, గాలుల ధాటికి 6గురు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 80-125 కి.మీ. వేగంగా పెనుగాలులు, అతి భారీ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు ధ్వంసమైపోయాయి. చాలా చోట్ల విద్యుత్ సంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో ఒడిశాలో హై అలర్ట్ ప్రకటించారు. -
‘ఉత్కళ’లో ఉత్కంఠ
ప్రతిష్టాత్మక భువనేశ్వర్ లోక్సభ స్థానంలో ఈసారి ఆసక్తికరమైన పోటీ జరగబోతోంది. ఇద్దరు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మధ్య రసవత్తర పోరుకు ఈ ఎన్నికలు తెరతీశాయి. ముంబై మాజీ పోలీసు కమిషనర్ అరూప్ పట్నాయక్ బిజూ జనతాదళ్ నుంచీ, బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి అపరాజితా సారంగి పోటీ పడుతున్నారు. ప్రధాన పోటీ బీజేడీ, బీజేపీ మధ్యనే కొనసాగనుందని విశ్లేషకుల అంచనా. అపరాజిత ఈ నియోజకవర్గంలో మూడు నెలల నుంచి ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేడీ లక్షా తొంభై వేల ఓట్ల మెజారిటీతో గెలవడంతో, అపరాజితకు క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం చేయక తప్పని పరిస్థితి తెచ్చిపెట్టింది. మిత్రపక్షాల ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ ఈ స్థానాన్ని సీపీఎం సీనియర్ నాయకుడు జనార్దన్ పాఠికి కేటాయించింది. అయితే పోరు మాత్రం అపరాజిత – అరూప్ పట్నాయక్ మధ్యనే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎవరీ అపరాజిత? భువనేశ్వర్లో బీజేడీ అభ్యర్థి ఐపీఎస్ అధికారి అరూప్ పట్నాయక్తో ఢీకొనబోతోన్న బీజేపీ అభ్యర్థి అపరాజిత 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా పనిచేస్తుండగా బీజేపీలో చేరేందుకు గత నవంబర్లో తన పదవికి రాజీనామా చేశారు. అయితే బీజేపీలో చేరినప్పటి నుంచి భువనేశ్వర్లో బీజేపీ అంటేనే అపరాజిత అనే స్థాయికి చేరింది. భువనేశ్వర్లో వివిధ ప్రాంతాల్లో పలు హోదాల్లో పనిచేసిన అపరాజిత జనంలో బాగా పేరున్న వ్యక్తి. రాజకీయవేత్తల కంటే కూడా భవనేశ్వర్లోని ప్రతి ప్రాంతం ఆమెకు సుపరిచితం. దీనితో పాటు అక్కడి ప్రజల సమస్యలపైన కూడా ఆమెకు పట్టుండడంతో ఆమె పాలనానుభవం ఆమెకు కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నింటికీ మించి మూడు నెలల క్రితం నుంచే సారంగి భువనేశ్వర్లోని మురికివాడల్లోకి వెళ్లి ప్రచారం చేశారు. భువనేశ్వర్లోని ప్రతి తలుపూ తడుతున్నారు. అరూప్ పట్నాయక్ లోతెంత? నాలుగుసార్లు లోక్సభ సభ్యుడిగా ఉన్న ప్రసన్న కుమార్ పాటసాని స్థానంలో బీజేడీ అరూప్ పట్నాయక్ను తీసుకొచ్చింది. ముంబై మాజీ పోలీసు కమిషనర్గానూ, ఒరిస్సాలో వివిధ స్థాయిల్లో పనిచేసిన 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అరూప్ పట్నాయక్, బీజేపీ అభ్యర్థి అపరాజితకు గట్టిపోటీ ఇస్తారని భావించడం వల్లనే బీజేడీ ఒక అనుభవజ్ఞుడైన లోక్సభ సభ్యుడిని పక్కన పెట్టిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదేవిధంగా పాలకపక్షంపై వ్యతిరేకత ప్రభావం పడకుండా ఉండేందుకు కూడా అరూప్ పట్నాయక్ను బీజేడీ తెరపైకి తెచ్చింది. అరూప్ పట్నాయక్ రిటైర్ అయిన మూడేళ్ల అనంతరం గత ఏడాది బిజూ జనతాదళ్ లో చేరారు.ఇటు బీజేపీ, అటు బీజేడీ సభ్యులిద్దరూ భువనేశ్వర్కు సుపరిచితులే కావడం, ఇద్దరికీ పాలనానుభవం ఉండడం, ఇద్దరూ ప్రజలతో సంబంధం ఉన్న వృత్తుల్లో ఉండడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది. -
రెండు కిలోమీటర్ల పొడవైన రైలు
-
ఫోటోగ్రాఫర్ని కాపాడేందుకు ముందుకొచ్చిన రాహుల్ గాంధీ
-
భువనేశ్వర్ చేరుకున్న కేసీఆర్
భువనేశ్వర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం భువనేశ్వర్ చేరుకున్నారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో కేసీఆర్కు ఘన స్వాగతం లభించింది. మరికాసేపట్లో ఆయన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇరువురు నాయకులు చర్చించనున్నారు. ఈ రోజు రాత్రి కేసీఆర్ నవీన్ పట్నాయక్ అధికార నివాసంలో కేసీఆర్ బస చేయనున్నారు. సోమవారం ఒడిశాలోని కోణార్క్, పూరీ దేవాలయాలను కేసీఆర్ సందర్శించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం కేసీఆర్ కోల్కతా వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖ చేరుకున్న కేసీఆర్ దంపతులు.. నేరుగా శారదాపీఠానికి బయలుదేరారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. సీఎం హోదాలో తొలిసారి విశాఖపట్నం వచ్చిన కేసీఆర్.. శారదా పీఠాన్ని సందర్శించి.. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతితో అర్ధగంట పాటు భేటీ అయిన కేసీఆర్ తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు. -
‘నైతిక హక్కు కోల్పోయా.. అందుకే రాజీనామా’
భువనేశ్వర్ : అత్యాచార బాధితురాలికి న్యాయం చేయలేకపోతున్నాననే ఆవేదనతో తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కోరాపుట్ ఎమ్మెల్యే కృష్ణ చంద్ర సాగరియా ప్రకటించారు. బాధితురాలికి న్యాయం చేయలేని తనకు ఎమ్మెల్యేగా కొనసాగే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘నిరుపేద దళిత అమ్మాయికి అన్యాయం జరిగింది. ఓ నిండు ప్రాణం బలైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా నేనేమీ చేయలేకపోయాను. అంటే ప్రజాప్రతినిధిగా ఉండే నైతిక హక్కు కోల్పోయాను అందుకే ఈ రాజీనామా’ అంటూ ఈ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. కాగా గతేడాది అక్టోబరు 10న కోరాపుట్లోని కుండలి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పొట్టంగి పోలీసు స్టేషను పరిధిలో నలుగురు వ్యక్తులు ఆమెపై అకృత్యానికి పాల్పడ్డారు. తనకు న్యాయం చేయాలని, నిందితులను అరెస్టు చేయాలంటూ బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవపోవడంతో.. జనవరి 22న ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. రెడ్ ఫ్లాగ్ కేసుగా ప్రాచుర్యం పొందిన కేసులో ఇంతవరకు ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయకపోవడం గమనార్హం. -
డ్యాన్స్తో ట్రాఫిక్ కంట్రోల్
-
డ్యాన్స్ చేస్తూ.. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాడు
భువనేశ్వర్ : ట్రాఫిక్ కంట్రోల్ చేయడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే. వాహనదారులను అదుపు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు పడే బాధ అంత ఇంత కాదు. ఒక్కోసారి వారి సూచనలు పట్టించుకోకుండా వాహనదారులు దొడ్డిదారిన వెళ్తునే ఉంటారు. వారిని అదుపు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు నానా కష్టాలు పడుతుంటారు. కానీ ఈ ట్రాఫిక్ పోలీస్కి మాత్రం అలాంటి కష్టాలు లేవు. డ్యాన్స్తో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాడు. పేరు ప్రతాప్ చంద్ర ఖండ్వాల్. భువనేశ్వర్లో విధులు నిర్వహిస్తున్నారు.అదిరిపోయే స్టెప్పులేసి ట్రాఫిక్ను మేనేజ్ చేస్తాడు. గతంలొ హొంగార్డుగా విధులు నిర్వహించిన ప్రతాప్ ఇటీవలే ట్రాఫిక్ పోలీసుగా నియమితులయ్యారు. అయితే ట్రాఫిక్ పోలీసు విధులు నిర్వహించడం ప్రతాప్కి కొత్త కావడంతో.. మనోడి ఆజ్ఞను వాహనదారులెవరూ పట్టించుకోలేదట. దీంతో చిరాకు చెందిన ప్రతాప్ కొంచెం ఢిపెరెంట్గా ఆలోచించాడు. వాహనదారులను అదుపు చేయడం కోసం రోడ్డు మీదే డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో వాహనదారులు మనోడి డాన్స్కు ఫిదా అయిపోయి వాహనాలను ఆపుతున్నారు. అలా ట్రాఫిక్ కంట్రోల్ అవుతుండటంతో ఇక డాన్స్తోనే ట్రాఫిక్ను కంట్రోల్ చేయడం ప్రారంభించాడు. కాగా ప్రతాప్ డాన్స్ చేస్తూ ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తుండగా ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. మనోడి డ్యాన్స్ మీరు కూడా చూడండి.. -
టీచర్ మెడలో చెప్పుల దండ వేసి..
-
కోచింగ్ సెంటర్కు రావడం లేదని..
భువనేశ్వర్: విద్య వ్యాపారంగా మారిందనడానికి ఒడిషాలో ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. తన కోచింగ్ సెంటర్లో చదువుచెప్పే టీచర్ మరో ఇన్స్టిట్యూట్లోకి మారడాన్ని జీర్ణించుకోలేని ఓ ప్రబుద్ధుడు అత్యంత అనాగరిక చర్యకు పాల్పడ్డాడు. సదరు టీచర్ మెడలో చెప్పుల దండ వేసి ఘోర అవమానం చేశాడు. ఈ ఘటన నయాగర్ జిల్లాలో మంగళవారం జరిగింది. వివరాలు.. తపన్ మహాపాత్రకు చెందిన సత్యసాయి కోచింగ్ సెంటర్లో మయాధర్ మహాపాత్ర అనే వ్యక్తి ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా తపన్ జీతం సరిగా చెల్లించడం లేదు. దాంతో మయాధర్ ఇటీవల మరో కోచింగ్ సెంటర్లో జాబ్లో చేరాడు. మయాధర్ వెళ్లిపోవడంతో తన కోచింగ్ సెంటర్ సరిగా నడవడం లేదని తపన్ అతనిపై పగ పెంచుకున్నాడు. మంగళవారం విధులకు బయల్దేరిన మయాధర్ను తపన్ మరో ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. అతనిపై దాడికి దిగారు. చెట్టుకు కట్టేసి చెప్పుల దండవేసి అవమానించారు. విషయం బయటపెడితే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అయితే, ఈ వ్యవహారాన్నంత ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. తనకు ఘోర అవమానం చేసిన తపన్, మరో ఇద్దరిపై మయాధర్ ఫిర్యాదు చేశాడని జిల్లా ఎస్పీ ఆశిష్సింగ్ వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టామని ఎస్పీ తెలిపారు. -
‘మీరట్ కత్తెర’ పదునెక్కింది!
భువనేశ్వర్ ఆరంభంలోనే కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని కుప్పకూల్చగలడు... చివర్లో బౌలింగ్కు వచ్చి హిట్టింగ్ చేస్తున్న బ్యాట్స్మెన్ను పెవిలియన్ పంపి మ్యాచ్ను గెలిపించగలడు... మధ్య ఓవర్లలో మ్యాచ్పై పట్టు పోతుందేమో అనిపించినప్పుడు వచ్చి నేనున్నానంటూ వికెట్ తీసి ఆటను మలుపు తిప్పగలడు... ఇక మన ఆట ముగిసిపోయిందని అనిపించినప్పుడు క్రీజ్లోకి వచ్చి బ్యాట్స్మన్లా బాధ్యతగా ఆడగలడు... దక్షిణాఫ్రికా పర్యటనలో అతను చేయలేని పని ఏదైనా ఉందా? కేప్టౌన్లో తొలి టెస్టు తొలి రోజు నుంచి జొహన్నెస్బర్గ్లో తొలి టి20 వరకు భువీ ముద్ర బలంగా కనిపించింది. ఎంత గొప్పగా ఆడినా దిక్కులు పిక్కటిల్లే సంబరాలు ఉండవు. మ్యాచ్ మ్యాచ్కూ జుట్టు రంగు మార్చుకునే కొత్త వేషాలు కనిపించవు. దేశంలో కత్తెరలకు కేరాఫ్ అడ్రస్ మీరట్ నగరం నుంచి వచ్చిన ఈ స్టార్ మూడు ఫార్మాట్లలో కేవలం తన ఆటతోనే అంతటా తానై కనిపించాడు. సాక్షి క్రీడా విభాగం:దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిన తొలి టెస్టులో మన జట్టు తరఫున చెప్పుకోదగ్గ విశేషం ఏదైనా ఉందీ అంటే అది భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన మాత్రమే. తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి సఫారీల స్కోరును 12/3కు పరిమితం చేసిన అతను అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత రెండు ఇన్నింగ్స్లలో కీలక పరుగులు కూడా చేశాడు. కానీ ఇలాంటి ఆట తర్వాత కూడా అతడిని రెండో టెస్టు నుంచి దూరంగా ఉంచారు. కారణమేదైనా ఈ తప్పుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మూడో టెస్టులో భువీని మళ్లీ తీసుకోగా... తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మరోసారి పదునైన బౌలింగ్తో పాటు రెండు ఇన్నింగ్స్లలో పట్టుదలగా ఆడిన చేసి పరుగులే జట్టును గెలిపించి అతడిని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిపాయి. ఆ తర్వాత వన్డేల్లోనూ చక్కటి ఆటతీరు ప్రదర్శించిన భువనేశ్వర్... తాజాగా టి20 మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మూడు ఫార్మాట్లలో తన విలువేంటో చూపించాడు. మొత్తంగా అటు కోహ్లి తర్వాత ఇటు భువీనే దక్షిణాఫ్రికా పర్యటనను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాడు. బంతి రంగు మారిందంతే... భువనేశ్వర్ పరిమిత ఓవర్ల బౌలర్ మాత్రమే అన్నట్లుగా ఇటీవలి వరకు అతనికి గుర్తింపు కొనసాగింది. కెరీర్ ఆరంభంలో పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకొని రాణించే, పెద్దగా వైవిధ్యమేమీ చూపకుండా కచ్చితత్వంతో బంతులు విసిరే బౌలర్గానే కనిపించాడు. టి20ల్లో పరిస్థితులు బాగుంటే ఆరంభంలో ఒక్క స్పెల్లోనే అతనితో నాలుగు ఓవర్లు వేయించేసి కెప్టెన్ పని ముగించేవారు. కానీ కొన్నాళ్లుగా బౌలింగ్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు అతను ఒకే తరహాలో లేదా స్వింగ్ను మాత్రమే నమ్ముకొని బంతులు వేసే బౌలర్ కాదు. పిచ్పై తేమ తగ్గిపోయిన తర్వాత కూడా అతను ప్రభావవంతంగా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు అతని బౌలింగ్లో వేగం 120–130 కిలో మీటర్ల మధ్యలోనే ఉండింది. ఇప్పుడు 140 కిమీ కూడా దాటుతోంది. పైగా వేగాన్ని అందుకునే ప్రయత్నంలో గతి తప్పడం లేదు. అద్భుతంగా మలుచుకున్న ఫిట్నెస్ కూడా అందుకు కారణం. దాని వల్లే మైదానంలో ఫీల్డింగ్లో కూడా చాలా చురుగ్గా మారిపోయాడు. తాజాగా దక్షిణాఫ్రికాలో అతని ప్రదర్శన చూస్తే ఇక అతను ఏమాత్రం ఒకే తరహా శైలి బౌలర్ మాత్రం కాదని అర్థమైపోయింది. సఫారీ గడ్డపై జోరుగా... భువనేశ్వర్ టెస్టు కెరీర్లో 2014 ఇంగ్లండ్ సిరీస్లో 19 వికెట్లతో చెలరేగడం అత్యుత్తమ దశ. అయితే ఆ తర్వాత కూడా టెస్టుల్లో అతనిపై పెద్దగా నమ్మకం ఉంచలేదు. కానీ ఈ పర్యటనలో అతను అన్ని విధాలా దానిని తప్పని నిరూపించాడు. తొలి రోజు సఫారీ ఓపెనర్లతో పాటు ఆమ్లా వికెట్ తీసిన తీరు అతను ఈ సిరీస్ కోసం ఎలా సన్నద్ధమయ్యాడో చూపించింది. ఆ తర్వాత డి కాక్ వికెట్ కూడా పడగొట్టాడు. అయితే వికెట్లు తీసిన తీరుకంటే భువీ బౌలింగ్ను ఎదుర్కోవడంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా తడబడటం అతని సత్తాకు నిదర్శనం. జొహన్నెస్బర్గ్ టెస్టు గెలుపులో నిస్సందేహంగా భువీదే ప్రధాన పాత్ర. తొలి ఇన్నింగ్స్లో చకచకా చేసిన 30 పరుగులు, అనూహ్యమైన బౌన్స్తో బ్యాట్స్మెన్కు ప్రమాదకరంగా మారిన పిచ్పై రెండో ఇన్నింగ్స్లో చేసిన 33 పరుగులు మ్యాచ్ స్వరూపాన్ని మార్చాయి. తొలి ఇన్నింగ్స్లో మళ్లీ ఎల్గర్, మార్క్రమ్లతో పాటు డివిలియర్స్ను అద్భుత బంతితో బౌల్డ్ చేసి భువీ ఈ మ్యాచ్ చేయిదాటిపోకుండా చూశాడు. ఈ కష్టాన్ని గుర్తించే కాబోలు ఆరో వన్డేకు ముందు ‘నిజంగా విశ్రాంతి ఇవ్వాల్సిందంటే భువనేశ్వర్కే’ అంటూ కెప్టెన్ కోహ్లి వ్యాఖ్యానించాడు. వాస్తవానికి ఆల్రౌండర్ అంటూ హార్దిక్ పాండ్యాపై అందరి గురి నిలిచింది కానీ భారత జట్టుకు సంబంధించి ఇప్పుడు అసలైన ఆల్రౌండర్ భువనేశ్వరే. తొలి టి20 మొదటి స్పెల్లో 3 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన భువీ, తన చివరి ఓవర్లో మరో 3 వికెట్లతో మ్యాచ్ను గెలిపించడం విశేషం. కొత్త అస్త్రంతో... ఆటపై బ్యాటింగ్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఈ రోజుల్లో బౌలర్లు ప్రతీ సారి భిన్నంగా ప్రయత్నించాల్సి ఉంటోంది. అదే క్రమంలో భువనేశ్వర్ ‘నకుల్ బాల్’ను ప్రత్యేకంగా సాధన చేశాడు. టి20 మ్యాచ్లో అతను దానిని సమర్థంగా ఉపయోగించాడు. ఇందులో సఫలం అయ్యేందుకు దాదాపు ఏడాదిగా శ్రమిస్తున్నట్లు భువనేశ్వర్ చెప్పాడు. నకుల్ బాల్ అనేది బేస్బాల్ క్రీడ నుంచి వచ్చింది. పేరులో నకుల్స్ (వేలి మెటికలు) ఉన్నా అవేమీ ఉపయోగించరు. వేలి గోళ్లతో పట్టు బిగించి ఆ తర్వాత బంతిని వదులుతారు. బంతిని సంధించే సమయంలో సాధారణ బంతిలాగే వేగాన్ని కొనసాగిస్తే బ్యాట్స్మెన్ దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే బౌలర్ కూడా దీనిని నియంత్రణలో ఉంచుకోవాలంటే తీవ్ర సాధన అవసరం. గతంలో జహీర్ ఖాన్ నకుల్ బాల్తో కొంత సఫలం కాగా, సునీల్ నరైన్ బాగా వాడాడు. అయితే టాంపరింగ్ ఆరోపణలతో యాక్షన్ను మార్చుకున్న తర్వాత నరైన్ దీనికి దూరమయ్యాడు. -
భారత బౌలింగ్ చూసి పారిపోవాలనిపించింది.!
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో తాము అనుకున్నదాని కంటే 30 పరుగులు అదనంగా ఇచ్చామని పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. ఆట ముగిసిన అనంతరం అతడు మాట్లాడుతూ... ఓవర్కు 4 పరుగుల రన్రేట్ అనేది టెస్టుల్లో ఎక్కువేనని పేర్కొన్నాడు. రెండో ఇన్నింగ్స్లో అలా జరగకుండా చూడాల్సి ఉందన్నాడు. ‘అయిదు వికెట్ల ప్రదర్శన మిస్ అయినందుకు బాధపడటం లేదు. క్యాచ్లు చేజారకుండా చూసుకోవాలి. ప్రత్యర్థి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యపర్చలేదు. మేం టాస్ నెగ్గితే బౌలింగే తీసుకునేవారం’ అని వివరించాడు. మరో వైపు దక్షిణాఫ్రికా కోచ్ తొలి రోజు ఆట గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ‘12 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో అసలు తర్వాతి పరుగులు ఎలా వస్తాయో అర్థం కాలేదు. ఉబెర్ క్యాబ్ తీసుకొని ఇక్కడినుంచి పారిపోవాలని అనిపించింది. అయితే మా చేతుల్లో ఆ సమయంలో సెల్ ఫోన్ లేకపోవడం వల్ల అలా చేయలేకపోయాను’ అని అన్నాడు. -
భువనేశ్వర్ చేరిన జట్లు
సాక్షి, భువనేశ్వర్: మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో పాల్గొనేందుకు భారత్, శ్రీలంక జట్లు సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకున్నాయి. కటక్లోని బరాబటి స్టేడియంలో బుధవారం మ్యాచ్ జరుగుతుంది. రెండు జట్లు విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడకు వచ్చాయి. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరికి ఘన స్వాగతం లభించింది. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య విమానాశ్రయం నుంచి బస చేసేందుకు హోటళ్లకు తరలించారు. మంగళవారం రెండు జట్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు శ్రీలంక... మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారత్ సాధన చేస్తాయి. టాప్–5లో రోహిత్ దుబాయ్: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో అద్భుత ద్విశతకంతో చెలరేగిన భారత తాత్కాలిక కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్–5లో చోటు దక్కించుకున్నాడు. తొలిసారిగా 800 ప్లస్ పాయింట్ల జాబితాలోకి చేరిన రోహిత్ తాజాగా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో ర్యాంకును అందుకున్నాడు. 2016 ఫిబ్రవరిలో తన కెరీర్లోనే అత్యుత్తమంగా మూడో ర్యాంకులో ఉన్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఒక స్థానం ఎగబాకి 14వ ర్యాంక్లో నిలిచాడు. 876 పాయింట్లతో కోహ్లి, 872 పాయింట్లతో డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) తొలి రెండు స్థానాల్లోనే కొనసాగుతున్నారు. -
గూగుల్ కన్నా గురువే మిన్న
సాక్షి, భువనేశ్వర్ : సామాజంలో పరివర్తన తీసుకురావండలో గురువుది అద్వితీయమై పాత్రని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ విషయంలో గూగుల్ లేదా మరో సెర్చ్ ఇంజిన్ ఎన్నటికీ గురువుకు పోటీకాలేవని ఆయన స్పష్టం చేశారు. తల్లి, మాతృభూమి, మాతృభాష, గురువు అనే ఈ నలుగురు వ్యక్తి జీవిత రేఖను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. భువనేశ్వర్లోని కేఐఐటీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆధునిక కాలంలో గూగుల్ ముఖ్యమైనదే.. కానీ గురువును కాదనేంత స్థాయిలో మాత్రం కాదని వెంకయ్యనాయుడు విద్యార్థులకు చెప్పారు. ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్, జర్మనీ వంటి భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు.. కానీ మాతృభాషను కాపాడుకోవాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆవేదన, ప్రేమ, బాధ వంటి భావాలను మాతృభాషలో స్పష్టం చేసినట్లుగా ఇతర భాషల్లో వ్యక్తం చేయలేమని ఆయన అన్నారు. -
100వ మ్యాచులో 50వ గెలుపు..
న్యూజిలాండ్ చేతిలో తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి భారత్ తగిన రీతిలో స్పందించింది. ఈ సారి ప్రత్యర్థి వ్యూహాలను ముందే అంచనా వేసి అందుకు తగిన రీతిలో సిద్ధమైన టీమిండియా ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వలేదు. టాస్ కోల్పోయినా కూడా సాధికారిక బౌలింగ్తో ముందు ప్రత్యర్థిని కట్టడి చేసి ఆపై అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ అద్భుత ఆరంభానికి బుమ్రా అండగానిలవగా... ఆ తర్వాత మిగతా బౌలర్లూ అదే పట్టునుకొనసాగించడంతో కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.అనంతరం మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు భారత్ను గెలుపు దిశగా నడిపించాయి. గత మ్యాచ్లో కివీస్ విజయంలాగే ఆరు వికెట్ల తేడాతో నెగ్గి కోహ్లి సేన దీటైన జవాబిచ్చింది. పుణే: వన్డే సిరీస్ చేజారిపోకుండా భారత జట్టు కీలక మ్యాచ్లో సత్తా చాటింది. సమష్టితత్వంతో విజయాన్ని అందుకొని సిరీస్ను 1–1తో సమం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. నికోల్స్ (62 బంతుల్లో 42; 3 ఫోర్లు), గ్రాండ్హోమ్ (40 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భువనేశ్వర్ 3 వికెట్లు పడగొట్టగా... చహల్, బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 46 ఓవర్లలో 4 వికెట్లకు 232 పరుగులు చేసింది. ధావన్ (84 బంతుల్లో 68; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (92 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే ఆదివారం కాన్పూర్లో జరుగుతుంది. పేసర్ల జోరు... న్యూజిలాండ్ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో భారత ప్రధాన పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలదే కీలక పాత్ర. తమకు అనుకూలించిన వికెట్పై వీరిద్దరు 20 ఓవర్లలో 83 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లు గప్టిల్ (11), మున్రో (10)లను భువీ పెవిలియన్ బాట పట్టించగా... బుమ్రా బంతికి విలియమ్సన్ (3) వికెట్ల ముందు దొరికిపోవడంతో కివీస్ స్కోరు 27/3కి చేరింది. ఈ దశలో తొలి వన్డే హీరోలు టేలర్ (21), లాథమ్ (62 బంతుల్లో 38; 2 ఫోర్లు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే పాండ్యా ఈ భాగస్వామ్యాన్ని తొందరగానే విడగొట్టాడు. గత మ్యాచ్లో స్వీప్ షాట్లతో భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న లాథమ్ మరోసారి అలాంటి ప్రయత్నమే చేసినా పెద్దగా సఫలం కాలేకపోయాడు. లాథమ్, నికోల్స్ కలిసి ఐదో వికెట్కు నెలకొల్పిన 60 పరుగుల భాగస్వామ్యమే ఆ జట్టుకు అత్యధికం. చివరకు అక్షర్ బౌలింగ్లో స్వీప్కే ప్రయత్నించి లాథమ్ బౌల్డ్ కావడంతో ఈ జోడీ విడిపోయింది. ఇలాంటి స్థితిలో నికోల్స్, గ్రాండ్హోమ్ మళ్లీ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిలబెట్టారు. వీరిద్దరు కాస్త వేగంగా ఆడి 47 పరుగులు జత చేశారు. చివర్లో సాన్ట్నర్ (38 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), సౌతీ (22 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించడంతో కివీస్ స్కోరు 200 పరుగులు దాటగలిగింది. ఈ మ్యాచ్లో కుల్దీప్ స్థానంలో భారత్ అక్షర్ పటేల్ను తీసుకోగా... కివీస్ జట్టులో మార్పులేమీ చేయలేదు. కీలక భాగస్వామ్యాలు... కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే రోహిత్ శర్మ (7) వికెట్ కోల్పోయింది. అయితే ధావన్, కోహ్లి (29 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎలాంటి ఇబ్బంది లేకుండా చకచకా పరుగులు తీస్తూ ఇన్నింగ్స్ను నడిపించారు. గత మ్యాచ్లో భారత్ను కట్టడి చేసిన కివీస్ ప్రధాన పేసర్ బౌల్ట్ ఈ సారి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. 25, 46 వ్యక్తిగత స్కోరు వద్ద ధావన్కు అదృష్టం కలిసొచ్చింది. రెండు సార్లు వికెట్ కీపర్ క్యాచ్ కోసం రివ్యూ కోరగా... ఈ రెండు సార్లు కూడా ధావన్ నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్కు 57 పరుగులు జోడించిన తర్వాత చక్కటి బంతితో కోహ్లిని గ్రాండ్హోమ్ పెవిలియన్ పంపించాడు. గత మ్యాచ్కు భిన్నంగా ఈ సారి నాలుగో స్థానంలో దినేశ్ కార్తీక్ బరిలోకి దిగాడు. 2015 వన్డే ప్రపంచ కప్ తర్వాత భారత జట్టు అత్యధికంగా 11 మంది వేర్వేరు ఆటగాళ్లను నాలుగో స్థానంలో ఆడించడం విశేషం! 63 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న శిఖర్, కొద్దిసేపటికే వెనుదిరిగాడు. వీరిద్దరు మూడో వికెట్కు 66 పరుగులు జత చేశారు. అనంతరం హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) కార్తీక్కు అండగా నిలిచాడు. 76 బంతుల్లో కార్తీక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కివీస్ బౌలింగ్లో పదును లేకపోవడంతో భారత్ అలవోకగా విజయం దిశగా సాగింది. చివర్లో ధోని (18 నాటౌట్)తో కలిసి కార్తీక్ మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించాడు. ►100 భారత్, న్యూజిలాండ్ మధ్య ఇది 100వ వన్డే మ్యాచ్. వీటిలో భారత్ 50 గెలిచి 44 ఓడింది. 1 మ్యాచ్ ‘టై’గా ముగియగా, మరో 5 మ్యాచ్లలో ఫలితం తేలలేదు. -
చాకుతో కోసి.. ఆపై గొంతును..!
భువనేశ్వర్: మహిళా ఫార్మసిస్టు అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనలో ప్రమేయమున్న ప్రధాన నిందితుని పోలీసులు అరెస్టు చేశారు. సుమారు వారం రోజుల కిందట ఓ మహిళా ఫార్మసిస్టు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. స్థానిక ఇన్ఫో సిటీ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం అనుమానాస్పద మృతిని హత్యగా జంట నగరాల పోలీసు కమిషనర్ బహిరంగపరిచారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసులో ప్రద్యుమ్న ఫరిడా (36)అనే వ్యక్తిని ప్రధాన నిందితునిగా పేర్కొన్నారు. నిందితుని మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని కోర్టుకు తరలించినట్లు పోలీసు కమిషనర్ వై.బి. ఖురానియా తెలిపారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం మహిళా ఫార్మసిస్టు హసీనా దాస్(19), ప్రద్యుమ్న ఫరిడా మధ్య ప్రేమ వ్యవహారం సాగింది. లోగడ స్థానిక కళింగ ఆస్పత్రిలో సిబ్బందిగా పని చేస్తున్నప్పుడు వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. హసీనా దాస్ జగత్సింగ్పూర్ జిల్లా ఎరసమా నుంచి వచ్చింది. ప్రద్యుమ్న మయూర్భంజ్ జిల్లా వాసి. నెల రోజుల కిందట హసీనా దాస్ కళింగ ఆస్పత్రిలో ఉద్యోగం వీడి స్థానిక అపోలో డయాగ్నొగ్నస్టిక్ సెంటర్లో చేరింది. ప్రద్యుమ్న ఫరిడా కూడా ఇక్కడ ఉద్యోగం వీడి కటక్లోని ఓ నర్సింగ్ హోమ్లో చేరాడు. ఇంతలో ప్రద్యుమ్న ఫరిడాకు వివాహమైందని హసీనాకు తెలిసింది. దీంతో ఆయనతో సంబంధాలకు తెరదించేందుకు ఆమె నిర్ణయించుకుని ఫోన్ చేస్తే మాట్లాడకుండా హసీనా నిరాకరించింది. ఈ వ్యవహారంతో తన ప్రియురాలు వేరొకరితో సంబంధాల్ని బలపరచుకుని తనను నిర్లక్ష్యం చేస్తోందనే అనుమానంతో ప్రద్యుమ్న దాడికి సిద్ధమయ్యాడు. చాకుతో కోసి.. గొంతు అదిమి నగరంలో ఆమె ఉంటున్న కానన్ విహార్లోని ఇంటికి గత నెల 25వ తేదీన వెళ్లాడు. దసరా సెలవులు కావడంతో ఇరుగు పొరుగు వారంతా వేరే ప్రాంతాలకు వెళ్లడం, హసీనా దాస్తో ఉంటున్న మిత్రురాలు కూడా ఊరికి వెళ్లడం ప్రద్యుమ్నకు కలిసివచ్చింది. ఏకాంతంలో హసీనాతో జరిగిన వాగ్యుద్ధం తీవ్ర పరిణామాలకు దారితీసింది. అదుపుతప్పిన ప్రద్యుమ్న వంట గదిలో ఉన్న చాకు తీసుకుని హసీనా గొంతు కోశాడు. ఆమె గిలగిలా కొట్టుకుంటూ కేకలు వేసే తరుణంలో నోరు మెదపకుండా తలగడతో గొంతు అదిమి ప్రాణాల్ని బలిగొన్నాడు. హసీనా మృతదేహానికి పోస్ట్మార్టం అనంతరం నివేదిక ఆధారంగా ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నివేదికలో గొంతు కోత, అదిమివేత ఛాయల్ని గుర్తించారు. -
భువీంద్రజాలం
►భారత్ను గెలిపించిన భువనేశ్వర్, ధోని ►ఆరు వికెట్లు తీసిన లంక బౌలర్ ధనంజయ భారత్ ముందున్న లక్ష్యం 231... రోహిత్, ధావన్ జోరుగా ఆడి తొలి వికెట్కు 109 పరుగులు జోడించారు. ఇక మ్యాచ్ మళ్లీ ఏకపక్షం అనుకున్న దశలో లంక స్పిన్నర్ అఖిల ధనంజయ మాయకు బ్యాటింగ్ ఆర్డర్ ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలింది. 22 పరుగుల వ్యవధిలో ఏకంగా 7 వికెట్లు కూలాయి. జట్టు ఓటమి దిశగా పయనిస్తున్న సమయంలో ధోని, భువీ భాగస్వామ్యం అద్భుత విజయాన్ని అందించింది. ధోని ఎప్పటిలాగే తనదైన శైలిలో ప్రశాంతంగా ఆడగా... భువనేశ్వర్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్తో సత్తా చాటాడు. 100 పరుగుల అభేద్య భాగస్వామ్యం టీమిండియాకు ఎప్పటికీ గుర్తుంచుకునే విజయాన్ని అందించింది. కాండీ: ఓటమి ఖాయమే అనుకున్న స్థాయి నుంచి సీనియర్ బ్యాట్స్మన్ ఎంఎస్ ధోని (68 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్) అనుభవానికి తోడు భువనేశ్వర్ (80 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) విలువైన అర్ధసెంచరీతో భారత జట్టు గట్టెక్కింది. ఈ జోడీ రికార్డు భాగస్వామ్యంతో గురువారం జరిగిన రెండో వన్డేలో డక్వర్త్ లూయిస్ పద్ధతిన భారత్ మూడు వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లంక 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 236 పరుగులు చేసింది. సిరివర్ధన (58 బంతుల్లో 58; 2 ఫోర్లు, 1 సిక్స్), కపుగెడెర (61 బంతుల్లో 40; 2 ఫోర్లు) మాత్రమే రాణించారు. బుమ్రాకు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ వర్షం కురవడంతో రెండు గంటలపాటు మ్యాచ్కు అంతరాయం కలిగింది. దీంతో 47 ఓవర్లలో లక్ష్యాన్ని 231 పరుగులకు కుదించారు. రోహిత్ (45 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ధావన్ (50 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. ధనంజయకు ఆరు వికెట్లు దక్కాయి. ఆదుకున్న సిరివర్ధన లంక ఇన్నింగ్స్లో ఓపెనర్ డిక్వెల్లా క్రీజులో ఉన్న కాసేపు వేగంగా ఆడాడు. అయితే మిడ్ వికెట్లో ధావన్ పట్టిన క్యాచ్తో అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్కు 41 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే వరుస ఓవర్లలో గుణతిలక (37 బంతుల్లో 19; 2 ఫోర్లు), కెప్టెన్ తరంగ (9) అవుట్ కావడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత కుశాల్ (19), మాథ్యూస్ (41 బంతుల్లో 20;2 ఫోర్లు) రూపంలో 121 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లంక ఇన్నింగ్స్ను సిరివర్ధన, కపుగెడెర ఆదుకున్నారు. సిరివర్ధన 49 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని బుమ్రా విడదీశాడు. శుభారంభం అదుర్స్.. స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్కు రోహిత్, ధావన్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా లంక గడ్డపై ఆడిన చివరి పది వన్డేల్లో మొత్తం 37 పరుగులే చేసిన రోహిత్ ప్రారంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. రెండో బంతినే ఫోర్గా మలిచిన అతను తొమ్మిదో ఓవర్ లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 43 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా అటు ధావన్ కూడా చెత్త బంతులను బౌండరీ దాటించడంతో 15 ఓవర్లలోనే జట్టు స్కోరు 102 పరుగులకు చేరింది. 16వ ఓవర్ నుంచి స్పిన్నర్ ధనంజయ చేసిన మాయతో భారత శిబిరం కుదేలైంది. మొదట రోహిత్ను ఎల్బీగా అవుట్ చేయడంతో తొలి వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. సిరివర్ధన వేసిన ఆ మరుసటి ఓవర్లోనే మాథ్యూస్ తీసుకున్న అద్భుత డైవింగ్ క్యాచ్తో ధావన్ అవుటయ్యాడు. ఇక 18వ ఓవర్లో ధనంజయ భారత్కు గట్టి షాకే ఇచ్చాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం రాహుల్ (4), జాదవ్ (1)లను కోహ్లి (4)ముందుగా పంపించాడు. కానీ ధనంజయ ఐదు బంతుల వ్యవధిలోనే తన గూగ్లీ బంతులతో ఈ ముగ్గురినీ బౌల్డ్ చేయడంతో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇంతటితో ఆగకుండా తన మరుసటి రెండు ఓవర్లలో పాండ్యా (0), అక్షర్ (6)ల పనిపట్టాడు. ఈ ఇబ్బందికర పరిస్థితిలో క్రీజులో ఉన్న ధోనికి భువనేశ్వర్ అండగా నిలిచాడు. దాదాపు 23 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఈ జోడి మొదట వికెట్ పడకుండా ఆచితూచి ఆడినా చివర్లో జోరు కనబరిచింది. ముఖ్యంగా భువీ.. ధోనికన్నా వేగంగా ఆడుతూ 77 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివరికంటా నిలిచిన వీరు జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ► 1 ఎనిమిదో వికెట్కు భారత్ తరఫున అత్యధిక భాగస్వామ్యం (100) నెలకొల్పిన ధోని, భువనేశ్వర్ జోడి ► 99 వన్డేల్లో ఎంఎస్ ధోని చేసిన స్టంపింగ్ల సంఖ్య. సంగక్కరతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. -
వింత జంతువు విధ్వంసం
♦ నియాలిలో కుప్పలు తెప్పలుగా గొర్రెల మరణం ♦ నర మేక దాడి అని అపోహ! ♦ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్న అటవీ సంరక్షక విభాగం భువనేశ్వర్: కటక్ జిల్లా నియాలి ప్రాంతంలో గత కొద్ది రోజులుగా గొర్రెలు కుప్పలు తెప్పలుగా మరణిస్తున్నాయి. ఆకస్మిక రోగ సంక్రమణ కాదు. అస్పష్టమైన దాడితో ఈ జీవులు అకారణంగా మరణిస్తున్నట్టు గ్రామంలో తీవ్ర భయాందోళనల చోటు చేసుకున్నాయి. శాలలో కట్టి ఉంచిన గొర్రెలపై ఈ దాడులు జరుగుతున్నాయి. గొర్రెల్ని చీల్చి చెండాడి చంపేస్తున్నట్టు వాస్తవ దృశ్యాలు రుజువు చేస్తున్నాయి. అయితే ఇదంతా మానవ కృత్యమా? అదృశ్య శక్తి దాడులా? క్షుద్ర శక్తుల ప్రయోగమా? కక్షదార్ల కుట్రా? ఇలా పలు సందేహాలతో నియాలి గ్రామస్తులు తల్లడిల్లుతున్నారు. విష ప్రయోగం అయితే కానే కాదని స్పష్టం అయిపోయింది. సోషల్ వైరల్ ఈ పరిస్థితుల్లో అద్భుత రూపం దాల్చిన జీవి గొర్రెల్ని హతమార్చుతుందనే సోషల్ మీడియా వైరల్ బలం పుంజుకుంది. మేక పోతు రూపంతో ముఖం మినహా శరీరం అంతా మానవ ఆకృతి కలిగి(నర మేక) ఉన్నట్టు ఈ ప్రసారం దుమారం రేపింది. ఈ ప్రసారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర పశు సంవర్థక విభాగం మంత్రి డాక్టర్ దామోదర్ రౌత్ తెలిపారు. ఇదంతా దుమ్ములగొండి దాడి అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దాడి చోటు చేసుకున్న శాల పరిసరాల్లో కొన్ని అంతు చిక్కని పాద ముద్రల్ని గుర్తించారు. దాడులకు గురైన శాలల్ని పరిశీలించారు. ఏదో జంతువు ఈ చర్యకు పాల్పడుతున్నట్లు ఈ ఛాయలు స్పష్టం చేస్తున్నాయి. దాడుల్లో కొన్ని గొర్రెలు అదృష్టవశాత్తు స్వల్పంగా గాయపడి ప్రాణాలతో బయటపడుతున్నాయి. వీటిపై మిగిలిన ఆనవాళ్ల ప్రకారం గుర్తు తెలియని జంతువు బలంగా కరిచి గాయపరిచినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదో జంతువు మాత్రమే దాడులకు పాల్పడుతున్నట్టు విజ్ఞుల అభిప్రాయం. అదేమిటో స్పష్టం కావలసి ఉంది. సీసీటీవీ కెమెరాలతో నిగ్గు తేల్చుతాం: చీఫ్ కంజర్వేటరు నియాలి ప్రాంతంలో గొర్రెలపై దాడులకు సంబంధించి బలపడిన అపోహల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాల్సి ఉంది. అభూత కల్పనతో పేరుకుపోయిన భయాందోళనల్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని అటవీ సంరక్షక విభాగం ప్రధాన అధికారి పీసీసీఎఫ్ ఎస్.ఎస్.శ్రీవాస్తవ తెలిపారు. ఈ దాడుల నిగ్గు తేల్చేందుకు ప్రభావిత ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల్ని అమర్చేందుకు నిర్ణయించినట్టు మంగళవారం ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో 5 చోట్ల సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు. భయాందోళన కలిగిస్తున్న జంతువుని గుడా రం నుంచి బయటకు రప్పించేందుకు బాణసంచ కా ల్చి దుమారం రేపుతారు. అంతకు ముందే పరిసర ప్రా ంతాల్లో వల పన్ని జంతువు పని పడతామని ఆయన వివరించారు. పరిస్థితులపై నిఘా వేసేందుకు అటవీ సంరక్షణ విభాగం 3 ప్రత్యేక స్క్వాడ్ల్ని నియమించింది. గొర్రెల శాలల్లో రాత్రి పూట దీపాలు వెలిగించేందుకు సంబంధీకులకు సలహా జారీ చేశారు. మృత గొర్రెల దేహ నమూనాల్ని పశువుల రోగాలు, పరిశోధన సంస్థ సేకరించి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తుంది. గ్రామస్తుల గాలింపు పరిసర అటవీ ప్రాంతాల నుంచి, జనావాసం నుంచి ఏదో జంతువు తరలి వచ్చి గొర్రెలపై దాడికి పాల్పడుతుందనే భావనతో నియాలి గ్రామస్తులు గాలింపు ప్రారంభించారు. రాత్రి పూట పరిసర బొనొసాహి గ్రామం ప్రాంతంలో రాత్రంతా చీకటిలో నిఘా వేశారు. అంతు చిక్కని జంతువు దాడుల్లో 2, 3 రోజుల్లో 150 పెంపుడు గొర్రెలు మరణించాయి. ప్రభుత్వ యంత్రాంగం ఈ మేరకు పెదవి కదపకుండా చోద్యం చూస్తుంది. ఇదే వైఖరి కొనసాగితే ఈ పరిణామం ఎలా దారి తీస్తాయోననే భయాందోళనలు విస్తరిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం నిర్మాణాత్మక కార్యాచరణతో తక్షణమే ముందుకు రావాలని బాధిత గ్రామస్తులు అభ్యర్థిస్తున్నారు. -
ఆమె ధైర్యశాలి
బస్సులో కండక్టర్ అసభ్య ప్రవర్తన చెంప ఛెళ్లుమనిపించిన యువతి భువనేశ్వర్: బస్సులో ప్రయాణిస్తున్న తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్ చెంప ఛెళ్లుమనిపించింది ఓ యువతి. ఈ సంఘటన జంట నగరాల్లో చోటుచేసుకుంది. ఈ విచారకర సంఘటనను ఆమె సోషల్ మీడియా ఫేస్బుక్లో సోమవారం ప్రసారం చేసింది. సోషల్ మీడియా ప్రసారాన్ని పరిగణనలోకి తీసుకుని స్థానిక పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనివార్యమని జంట నగరాల పోలీస్కమిషనరు వై. బి. ఖురానియా పేర్కొన్నారు. తక్షణమే ఈ వ్యవహారంలో చర్యలు చేపట్టి నిందితుల వ్యవహారం తేలుస్తామని ఆయన అభయం ఇచ్చారు. రాష్ట్రంలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడం వరుసగా ఇది రెండోసారి కావడంతో ఆందోళన పెరుగుతోంది. కటక్ మహా నగరంలో పని ముగించుకుని భువనేశ్వర్కు తిరిగి వస్తుండగా బస్సులో కండక్టర్ యువతిపట్ల అభ్యంతరకరంగా వ్యవహరించాడు. తిరుగు ప్రయాణం కోసం ఎంత సేపు నిరీక్షించినా ఖాళీ బస్సు తారసపడనందున ఆమె రద్దీగా ఉన్న బస్సులో వెనుదిరిగేందుకు నిర్ణయించుకుంది. నిలబడేందుకు వీలు లేని పరిస్థితుల్లో బస్సు కిటకిటలాడుతోంది. ఒక్కొక్కర్ని సర్దుతున్నట్లు వ్యవహరిస్తూ బస్సులో ఇతర యువతులు, మహిళా ప్రయాణికులను అభ్యంతరకరంగా తాకుతున్న పరిస్థితుల్ని బాధిత యువతి పసి గట్టింది. ఇంతలో అదే పరిస్థితి తనకు తారసపడడంతో ఆమె తక్షణమే స్పందించి సదరు కండక్టర్ను చెంప ఛెళ్లుమనిపించినట్లు ఫేస్బుక్లో ప్రసారం చేసింది. ఈ విచారకర సంఘటన ఈ నెల 18వ తేదీన జరిగినట్లు ఫేస్బుక్ ప్రసారంలో ఆమె పేర్కొంది. ఈ ప్రసారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇటీవల కేంద్రపడ నుంచి వస్తున్న బస్సులో వస్తున్న మహిళా పాత్రికేయురాలితో బస్సులో తోటి ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించిన సందర్భంగా కూడా ఇటువంటి దుమారమే చెలరేగింది. -
‘రైజ్’ కాలేకపోయింది..!
►అవకాశాలు చేజార్చుకున్న హైదరాబాద్ ►హైలైట్గా నిలిచిన వ్యక్తిగత ప్రదర్శనలు ►కీలక పాత్ర పోషించిన వార్నర్, భువనేశ్వర్, రషీద్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన జట్టు... హిట్టర్లకు కొదవలేని బ్యాటింగ్ లైనప్... డెత్ ఓవర్లలోనూ కట్టడి చేసే బౌలింగ్ దళం... ఇలా ఎలా చూసినా ఆల్రౌండ్ నైపుణ్యం పుష్కలంగా ఉన్న జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. కానీ ఎలిమినేట్ అయ్యింది...ఈ సీజన్లో నిలకడ చూపించినా కీలక మ్యాచ్లో నిరాశజనక ప్రదర్శన రైజర్స్ మరో టైటిల్ అవకాశాలను దూరం చేసింది. టాప్–2లో నిలిచే సత్తా, సామర్థ్యం ఉన్నా... కొన్ని మ్యాచ్ల ఫలితాలే దెబ్బతీశాయి. టైటిల్ వేటకు టాటా చెప్పించాయి. అయితే ఒకసారి విజేతగా నిలవడంతో పాటు మరో రెండు సార్లు ప్లే ఆఫ్ దశకు చేరుకోవడంతో సన్ యాజమాన్యం సంతృప్తికరంగానే ఐపీఎల్ ప్రస్థానాన్ని ముగించిందని చెప్పవచ్చు. ఎలిమినేటర్ పోరులో కొంత వరకు వర్షం సన్రైజర్స్ అవకాశాలను దెబ్బ తీసింది. అయితే 20 ఓవర్ల మ్యాచ్ జరిగినా కచ్చితంగా గెలిచేదని చెప్పలేం. అయితే చేసిన స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటే, ప్రత్యర్థి జట్టు ప్రదర్శనను పరిశీలిస్తే... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో చేయగలిగిన స్కోరును మాత్రం హైదరాబాద్ చేయలేదనేది అంగీకరించాల్సిన సత్యం. గత సీజన్లోనూ మూడో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ పోరాటంతోనే ఫైనల్ చేరిన జట్టు... చివరకు టైటిల్ సాధించే క్రమంలో బెంగళూరులాంటి జట్టుపై ఇదే మైదానంలో ఎంత స్కోరు చేసిందో అందరికీ తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం ప్రత్యర్థి జట్టును అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైంది. రైజర్స్ వ్యూహాలు బాగానే ఉన్నా కొన్ని తప్పులు వెంటాడాయి. ఎలిమినేటర్ మ్యాచ్లో పక్కా ప్రణాళికేదీ కనిపించలేదు. వర్షం కురిసిన మైదానం మందకొడిగా ఉంటే భారీ షాట్లకు వెళ్లకుండా గ్రౌండ్ షాట్లకే పరిమితమ్యారు. ఓపెనర్ శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్లకు బ్యాట్ ఝుళిపించే సత్తా ఉన్నా... వారు విఫలం కావడం నిరాశపరిచింది. పరుగులు, వికెట్లలో ‘రైజింగ్’ లీగ్ మొత్తం మీద జట్టును బ్యాటింగ్లో నడిపించిన నాయకుడు వార్నరే. ఇతనికి ఓపెనింగ్లోనూ, బ్యాటింగ్ ఆర్డర్లోనూ అండగా నిలిచింది శిఖర్ ధావన్. కెప్టెన్ 641 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎలిమినేటర్ ముందు వరకు ఆ తర్వాతి స్థానంలో ధావన్ (479 పరుగులు) ఉన్నాడు. (తాజాగా గంభీర్ 486 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు). హైదరాబాద్ విజయాల్లో సింహభాగం భాగస్వామ్యం ఓపెనర్లదే. అయితే మిగతా బ్యాట్స్మెన్ ఆ బాధ్యతను పంచుకోలేకపోయారు. 12 మ్యాచ్లాడిన యువరాజ్ (252 పరుగులు) ప్రదర్శన తీసికట్టుగానే ఉంది. ఏడే మ్యాచ్లాడిన విలియమ్సన్ (256) అతనికంటే చాలా మెరుగ్గా ఆడాడు. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అయిన నమన్ ఓజా నిరూపించుకునే ప్రదర్శన ఒక్కటీ లేదు. ఇక బౌలింగ్లోనూ సన్రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ (26 వికెట్లు)దే అగ్రస్థానం. రషీద్ ఖాన్ (17), సిద్ధార్థ్ కౌల్ (16) టాప్–10లో ఉన్నారు. కోట్లు వెచ్చించిన అఫ్ఘాన్ స్పిన్న ర్ రషీద్ నిలకడగా రాణించాడు. లోకల్ హీరో సిరాజ్ కూడా సత్తా చాటుకున్నాడు. 6 మ్యాచ్లాడిన సిరాజ్ 10 వికెట్లతో ఫర్వాలేదని పించాడు. బౌలింగ్ పరంగా వేలెత్తిచూపలేని ప్రదర్శన రైజర్స్ది. ఎలిమినేటర్లో బ్యాటింగ్ వైఫల్యంతో చేష్టలుడిగినా... బౌలర్లు మాత్రం ఆ 6 ఓవర్లలో తమ శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. టాప్–2లో నిలిచివుంటే: లీగ్ మొత్తాన్ని గమనిస్తే హైదరాబాద్ ప్రదర్శన బాగానే ఉంది. ఆడిన 13 మ్యాచ్ల్లో 8 గెలిచింది. (బెంగళూరుతో మ్యాచ్ రద్దయింది). ఇదేమంత చెత్త ప్రదర్శన కాకపోయినా... కోల్కతాతో ఈడెన్లో, పుణేతో ఉప్పల్లో గెలవాల్సిన రెండు మ్యాచ్లు ఓడిపోవడం రైజర్స్ను టాప్–2కు దూరం చేసింది. తొలి రెండు స్థానాల్లో ఉంటే ఫైనల్ చేరేందుకు ఓడినా... మరో అవకాశముండేది. కోల్కతాతో జరిగిన పోరులో 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మిడిలార్డర్ వైఫల్యం దెబ్బతీసింది. చివర్లో బిపుల్ శర్మ ధాటిగా ఆడినా... నమన్ ఓజా బాధ్యతారాహిత్యం 17 పరుగుల పరాజయాన్నిచ్చింది. ఇక ఉప్పల్లో చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన దశలో హైదరాబాద్ ఒక్కపరుగైనా చేయలేక మూడు వికెట్లు కోల్పోయి ఓడటం తీవ్రంగా నిరాశపర్చింది. ఈ రెండు ఫలితాలు హైదరాబాద్ లీగ్ దశను మలుపుతిప్పాయి. ‘‘ఈ సీజన్లో బెంగళూరు పిచ్ చాలా స్లోగా ఉంది. 130 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే మ్యాచ్ 20 ఓవర్లు పూర్తిగా జరగకపోవడమే మా అవకాశాన్ని దెబ్బతీసింది. పూర్తి కోటా సాగితే మరో రెండు, మూడు వికెట్లు తీసి మేం గెలిచేదారిలో ఉండేవాళ్లం. కానీ దురదృష్టవశాత్తు ఆరు ఓవర్ల ఆటే మా కొంపముంచింది’’ – రైజర్స్ బౌలింగ్ కోచ్ మురళీధరన్ -
జాతీయ రహదారిపై ఏనుగుల హల్చల్
భువనేశ్వర్: జాతీయ రహదారిపై ఏనుగుల గుంపు హడలెత్తించింది. కటక్ అనుగుల్ 55వ నంబరు జాతీయ రహదారిపై కటక్ జిల్లా బల్లి బొవులొ ఛక్ వద్దకు సమీప అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు తరలివచ్చింది. గంటల తరబడి జాతీయ రహదారిపై తిరుగాడటంతో వాహనాల రవాణా స్తంభించిపోయింది. అటవీ అధికారులు రంగంలోకి దిగి ఏనుగుల గుంపును తరిమి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. గుంపులో 8 ఏనుగులు ఉన్నట్టు గుర్తించారు. అడవిలో వేడి తాళలేక జాతీయ రహదారి ఇరు వైపులా ఉన్న మామిడి చెట్ల ఛాయలో సేద తీరేందుకు రావడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు అధికారులు వివరించారు. -
బాహుబలి నామకరణం ఖరారు!
భువనేశ్వర్ (బారంగ్): నగర శివార్లు బారంగ్ జంతు ప్రదర్శన శాల నందన్కానన్లో జన్మించిన పులిబిడ్డకు బాహుబలిగా నామకరణం చేయడం విశేషం. నందన్కానన్లో విజయ, మేఘ, స్నేహ అనే మూడు పులులు ప్రసవించిన 7 పులిపిల్లలకు బుధవారం నామకరణం చేశారు. సినీ రంగంలో సంచలనం సృష్టించిన బాహుబలి పేరును వీటిలో ఒక పిల్లకు పెట్టేందుకు అధికారులు నిర్ణయించారు. బాహుబలి నామకరణం ఖరారు చేయడం వెనక బలమైన ప్రజాభిప్రాయం ఉండడం మరో విశేషం. నందన్కానన్కు పలు ప్రాంతాల నుంచి విచ్చేసే పర్యాటకులను కొత్తగా జన్మించిన పులి పిల్లలకు పేర్లను ప్రతిపాదించాలని అధికారులు కోరారు. ఈ క్రమంలో పర్యాటకులు పేర్లను ప్రతిపాదించారు. ప్రజాభిప్రాయంలో అత్యధికంగా 52 శాతం మంది బాహుబలి పేరును ప్రతిపాదించారు. ప్రజాభిప్రాయానికి పట్టం గడుతూ ఒక పులిపిల్లకు బాహుబలి పేరును ఖరారు చేశారు. మిగిలిన 6 పులి పిల్లలకు కుందన్, సాహిల్, ఆద్యాశ, చిన్ను, విక్కి, మౌసుమిగా పేరు పెట్టారు. కొత్త పులి పిల్లల్ని అంచెలంచెలుగా పర్యాటకుల సందర్శన కోసం ఎంక్లోజర్లో బహిరంగపరుస్తారు. -
మనన్ కాదు... మనం నెగ్గాం
-
మనన్ కాదు... మనం నెగ్గాం
►సన్రైజర్స్ని గెలిపించిన భువనేశ్వర్ ►5 పరుగులతో ఓడిన పంజాబ్ ►మనన్ వోహ్రా విధ్వంసకర ప్రదర్శన వృథా ►రాణించిన వార్నర్ విజయానికి 6 ఓవర్లలో పంజాబ్ చేయాల్సిన పరుగులు 76... ఈ దశలో హైదరాబాద్ గెలుపు దాదాపు ఖాయమైంది. కానీ క్రీజ్లో ఉన్న మనన్ వోహ్రా మరోలా ఆలోచించాడు. మెరుపు బ్యాటింగ్తో ఒక్కసారిగా సీన్ మార్చేశాడు. తాను ఎదుర్కొన్న తర్వాతి 15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు రాబట్టాడు. చివర్లో 10 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన దశలో భువనేశ్వర్ అద్భుత బంతితో వోహ్రాను అవుట్ చేసి పంజాబ్ ఆశలను కూల్చాడు. భువీ బౌలింగ్తో ఊపిరి పీల్చుకున్న హైదరాబాద్ చివరకు ఐదు పరుగులతో గట్టెక్కింది. హైదరాబాద్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్మన్ మనన్ వోహ్రా (50 బంతుల్లో 95; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆ జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. సహచరుల అండ లేకపోయినా అంతా తానే అయి జట్టును విజయానికి చేరువగా తెచ్చినా... వోహ్రా ఓటమి పక్షానే నిలవాల్సి వచ్చింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ 5 పరుగుల తేడాతో పంజాబ్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. వార్నర్ (54 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత అర్ధసెంచరీ సాధించగా, నమన్ ఓజా (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం పంజాబ్ 19.4 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. మనన్ మినహా అంతా విఫలమయ్యారు. కేవలం 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ కుమార్ సన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాణించిన ఓజా... టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ ఆడిన జట్టులో హైదరాబాద్ మూడు మార్పులు చేసింది. నెహ్రా, బిపుల్ స్థానంలో సిద్ధార్థ్ కౌల్, బరీందర్ శరణ్లను తీసుకోగా... కటింగ్ స్థానంలో అఫ్ఘానిస్తాన్ క్రికెటర్ నబీకి తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. రైజర్స్ ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా ప్రారంభమైంది. 14వ బంతికి గానీ జట్టు తొలి బౌండరీ సాధించలేకపోయింది. ఇబ్బందిగా ఆడిన శిఖర్ ధావన్ (15 బంతుల్లో 15; 1 ఫోర్)ను మోహిత్ అవుట్ చేసి పంజాబ్కు తొలి వికెట్ అందించగా... పవర్ప్లేలో హైదరాబాద్ స్కోరు 29 పరుగులు మాత్రమే. ఆ తర్వాత అక్షర్ తొలి ఓవర్లోనే సన్ను దెబ్బ తీశాడు. హెన్రిక్స్ (9) స్టంపౌంట్ కాగా, యువరాజ్ (0) ఆడిన తొలి బంతికే వెనుదిరిగాడు. ఐపీఎల్లో యువీకి ఇదే తొలి ‘గోల్డెన్ డక్’ కావడం విశేషం. ఈ దశలో వార్నర్కు ఓజా అండగా నిలిచాడు. గత సీజన్ నుంచి ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకుండా విఫలమవుతూ వచ్చిన నమన్ ఎట్టకేలకు తన చోటు ప్రమాదంలో పడిన సమయంలో చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. వార్నర్, ఓజా నాలుగో వికెట్కు 37 బంతుల్లోనే 60 పరుగులు జోడించారు. ఓజా అవుటయ్యాక హుడా (12), నబీ (2) విఫలమైనా మరో ఎండ్లో వార్నర్ పట్టుదలగా ఆడాడు. వార్నర్ మరోసారి... బ్యాటింగ్కు పెద్దగా అనుకూలించని పిచ్పై వార్నర్ చక్కటి ఆటతో సన్ ఇన్నింగ్స్లో మరోసారి కీలకపాత్ర పోషించాడు. తాను ఆడిన 18వ బంతికి గానీ తొలి బౌండరీ కొట్టలేకపోయిన అతను, నిలదొక్కుకున్న తర్వాత ధాటిగా ఆడాడు. కరియప్ప బౌలింగ్లో రివర్స్లో ర్యాంప్ షాట్ ఆడి కొట్టిన సిక్సర్ హైలైట్గా నిలిచింది. ఐపీఎల్లో అతి నెమ్మదిగా 45 బంతుల్లో వార్నర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంజాబ్పై అతనికి ఇది వరుసగా ఐదో హాఫ్ సెంచరీ కావడం విశేషం. మోహిత్ వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను, చివరి ఓవర్లో మోర్గాన్ క్యాచ్ వదిలేయడంతో మరో సిక్స్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో వార్నర్ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం ఇది రెండోసారి మాత్రమే. ఛేదనలో తొలి బంతికే భువనేశ్వర్, ఆమ్లా (0)ను అవుట్ చేసి పంజాబ్కు షాక్ ఇచ్చాడు. భువీ తన తర్వాతి ఓవర్లో ప్రధాన బ్యాట్స్మన్మ్యాక్స్వెల్ (10)ను కూడా అవుట్ చేసి రైజర్స్ జట్టులో ఉత్సాహం పెంచాడు. అయితే మరో ఎండ్లో వోహ్రా దూకుడు ప్రదర్శించాడు. రషీద్ తొలి ఓవర్లో అతను రెండు ఫోర్లు, సిక్స్ బాదడంతో 19 పరుగులు వచ్చాయి. వీరిద్దరు మూడో వికెట్కు 32 బంతుల్లో 41 పరుగులు జోడించిన దశలో అప్ఘాన్ ద్వయం కింగ్స్ను దెబ్బ తీసింది. ముందుగా మోర్గాన్ (13)ను నబీ బౌల్డ్ చేయగా...తర్వాతి ఓవర్లోనే మిల్లర్ (1), సాహా (0)ల స్టంప్స్ను రషీద్ పడగొట్టాడు. అక్షర్ (7) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. కానీ చివర్లో వోహ్రా అదరగొట్టే బ్యాటింగ్ పంజాబ్ జట్టులో ఆశలు రేపినా... ఓటమి మాత్రం తప్పలేదు. -
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్ వేదికగా కొనసాగుతున్నాయి. నేటి నుంచి రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో పాటు కేంద్ర మంత్రులు, పదమూడు మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొంటారు. అయితే ఆరోగ్య కారణాల వల్ల కేంద్రవిదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరుకావడం లేదు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రధాని మోదీ భువనేశ్వర్ చేరుకుని.... సాయంత్రం 5 గంటలకు సమావేశంలో పాల్గొంటారని బీజేపీ నేతలు వెల్లడించారు. ప్రధానంగా రెండు విధానాలపై బీజేపీ కార్యవర్గం చర్చించనుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం....2019 సాధారణ ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని పార్టీ నేతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోబీజేపీ విజయంపైనే అధినాయకత్వం దృష్టి సారించినట్టు తెలిసింది. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మురళీధరరావు,నాగం జనార్దన్ రెడ్డి, పేరాల చంద్రశేఖరరావు తదితరులు జాతీయ కార్యవర్గ సమావేశాలు హాజరయ్యారు. -
నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
-
నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
భువనేశ్వర్: నేటి నుంచి రెండ్రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఒడిశా రాజధాని భువనేశ్వర్ సిద్ధమైంది.ప్రధాని మోదీ సహా పార్టీ ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు, 13 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొంటారని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఆరోగ్య కారణాల రీత్యా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరుకావడం లేదని తెలిపారు. పార్టీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, ఎంఎం జోషీలు సమావేశాల్లో పాల్గొంటారని చెప్పారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ భువనేశ్వర్ చేరుకుని, సాయంత్రం 5 గంటల సమయంలో ప్రాంగణానికి వస్తారని వెల్లడించారు. ఈ కార్యవర్గ భేటీలో రెండు విధానాలపై ప్రధానంగా చర్చ జరగనుందని, కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, 2019 సాధారణ ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని చెప్పారు. -
లింగరాజుకు పస్తులు
► నియోగుల మధ్య తలెత్తిన విభేదాలు ► స్వామికి అందని సేవలు భువనేశ్వర్: దైవానుగ్రహం కోసం భక్తులు ఉపవాసం చేయడం ఆనవాయితీ. నగరంలోని ఏకామ్ర క్షేత్రంలో కొలువుదీరిన లింగరాజు మహా ప్రభువు నిత్య నైవేద్యాలు అందక పస్తు ఉండాల్సిన పరిస్థితులు చోటుచేసుకోవడం నివ్వెరపరుస్తుంది. రెండు వర్గాల నియోగుల మధ్య విభేదాలతో ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం వారుణి మహా స్నానం సేవ పురస్కరించుకుని రెండు వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా స్వామికి నిర్వహించాలి్సన పల్లకి సేవకు అంతరాయం ఏర్పడింది. తదనంతరం నిర్వహించాలి్సన సేవాదులు నిరవధికంగా స్తంభించిపోయాయి. శనివారం సాయంత్రం నుంచి ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. బ్రాహ్మణ నియోగులు, బొడు నియోగుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దేవస్థానంలో సేవాదులకు సంబంధించి అధికార వర్గం స్పష్టమైన వేళల్ని జారీ చేయనందున ఇటువంటి దయనీయ పరిస్థితులు తలెత్తుతున్నాయి. నియోగుల మధ్య బిగుసుకుంటున్న వివాదం పరిష్కరించేందుకు లింగరాజ్ దేవస్థానం అధికార వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్టు కార్యనిర్వహణ అధికారి మనోరంజన్ పాణిగ్రాహి తెలిపారు. మహా వారుణి స్నాన సేవ నిర్వహించేందుకు పల్లకి సేవ ముందుగా చేయాల్సి ఉంటుంది. పల్లకి సేవకు బ్రాహ్మణ నియోగులు అడ్డు తగలడంతో వివాదం చోటుచేసుకున్నట్టు బొడు నియోగుల సంఘం కార్యదర్శి కమలాకాంత బొడు తెలిపారు. -
భువనేశ్వర్లో భిన్నమైన వివాహం
-
‘నేనూ పెళ్లికి పనికొస్తా.. తల్లినవుతా’
-
‘నేనూ పెళ్లికి పనికొస్తా.. తల్లినవుతా’
- వ్యక్తితో ట్రాన్స్జెండర్ వివాహం - వేడుకకు భారీగా తరలివచ్చిన జనం భువనేశ్వర్: నగర మేయర్, బంధుమిత్రులు ఆశీర్వదిస్తుండగా.. వేదమంత్రాలు సాక్షిగా.. మేఘన అనే ట్రాన్స్జెండర్ తనకు నచ్చిన వసుదేవ్ అనే వ్యక్తిని మనువాడింది. చట్టరీత్యా చెల్లుబాటు కానప్పటికీ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. దేశంలోనే అరుదైన ఈ సంఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్కు చెందిన వసుదేవ్కు ఇదివరకే ఓ మహిళతో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అతని భార్య చెప్పాపెట్టకుండా ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. పిల్లల్ని చూసుకుంటూ కాలం గడుపుతున్న వసుదేవ్కు ఫేస్బుక్ ద్వారా ట్రాన్స్జెండర్ మేఘన పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకున్నారు. మొదట అభ్యంతరం తెలిపినా, చివరికి ఇరు కుటుంబాలూ అంగీకారం తెలపడంతో శుక్రవారం ఘనంగా పెళ్లిచేసుకున్నారు. ‘సమాజంలో ట్రాన్స్జెండర్లను చిన్నచూపు చూస్తున్నారు. పెళ్లికి పనికిరామని, తల్లులం కాలేమని అసహ్యించుకుంటున్నారు. వాళ్లందరికీ ఈ పెళ్లి ద్వారా ఒకటే సమాధానం చెబుతున్నా.. నేనూ పెళ్లికి పనికొస్తా.. వాసుదేవ్ పిల్లలకు తల్లిని అవుతా’ అని పెళ్లికూతురు మేఘన మీడియాతో అన్నారు. తనను కోడలిగా స్వీకరించిన వరుడి కుటుంబానికి మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. భువనేశ్వర్ నగర మేయర్ అనంత నారాయణ్ సహా పలువురు ప్రముఖులు కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ అరుదైన పెళ్లి బరాత్లో పెద్ద సంఖ్యలో స్థానిక యువత డ్యాన్సులు చేశారు. ట్రాన్స్జెండర్లపై మూడేళ్ల కిందట కీలక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఓటరు నమోదు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపుకార్డుల్లో వారికి(ట్రాన్స్జెండర్లకు) ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఈ పెళ్లికి చట్టబద్ధత లేదని ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం పోరాడుతోన్న న్యాయవాది చెప్పారు. ట్రాన్స్జెండర్ల వివాహాలను చట్టబద్ధం అయ్యేలా మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. -
భువనేశ్వర్లో ఆకట్టుకున్న ఫ్యాషన్ షో
-
'ఎస్యూఎం'లో భారీ అగ్నిప్రమాదం
-
అగ్నిప్రమాదంలో చనిపోయింది 19మందే
భువనేశ్వర్ : ఎస్యూఎం ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 19మందే మృతి చెందినట్లు ఒడిశా ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో సోమవారం రాత్రి ఎస్యూఎం ఆస్పత్రిలో షార్ట్ స్కర్యూట్ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో 22మంది చనిపోయినట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా నిన్న ప్రకటించింది. అయితే ప్రమాద ఘటనలో 19మందే మరణించినట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. క్యాపిటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 14మంది చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ మరో అయిదుగురు అమ్రి ఆస్పత్రిలో మరణించినట్లు వెల్లడించాయి. గాయపడ్డ మరో 106మందికి చికిత్స కొనసాగుతున్నట్లు హెల్త్ సెక్రటరీ ఆర్తి అహుజా తెలిపారు. ఆర్తీ అహుజా మంగళవారం ఉదయం ఎస్యూఎం ఆస్పత్రిని సందర్శించి, దుర్ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 19 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయిందని, మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు వాహనాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. విచారణ నిమిత్తం ఇక ప్రమాదం సంభవించిన ఐసీయూతో పాటు ఎమర్జెన్సీ యూనిట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఒడివా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారణకు ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. క్షతగాత్రులకు ముఖ్యమంత్రి ఇవాళ పరామర్శించనున్నారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఆస్పత్రిలో మంటలు
24 మంది ఆహుతి 75 మందికి గాయాలు • ఒడిశాలోని భువనేశ్వర్ ఎస్యూఎంలో దుర్ఘటన • డయాలసిస్ వార్డులో షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం • ఐసీయూకు మంటలు అంటుకొని పలువురు మృతి • 500 మందిని రక్షించిన అధికారులు, స్థానికులు • మృతుల కుటుంబాలకు ప్రధాని తీవ్ర సంతాపం భువనేశ్వర్లో సోమవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. ఎస్యూఎం ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, 75 మంది గాయపడ్డారు. ఆస్పత్రి మొదటి అంతస్తులో ఉన్న డయాలసిస్ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఐసీయూకు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో సోమవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. ఎస్యూఎం ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 75 మంది గాయపడ్డారు. ఆస్పత్రి మొదటి అంతస్తులో ఉన్న డయాలసిస్ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా పక్కనే ఉన్న ఐసీయూకు వ్యాపించాయి. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న అనేక మంది తీవ్రంగా గాయపడగా వారిని నగరంలోని పలు ఆస్పత్రులకు తరలించారు. క్యాపిటల్ ఆస్పత్రికి తరలించిన వారిలో 14 మంది, కార్పొరేట్ ఆస్పత్రిలో 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కిటికీలు పగులగొట్టి బయటపడ్డ రోగులు మరోవైపు ఆస్పత్రిలోని ఇతర విభాగాలకు కూడా మంటలు వ్యాపించాయన్న పుకార్లతో రోగులు, వారి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది పరుగులు తీశారు. పలువురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆస్పత్రిలో చిక్కుకున్న 500 మందిని రక్షించారు. మంటల్ని అదుపు చేసేందుకు, సహాయక కార్యక్రమాల కోసం ఏడు అగ్నిమాపక బృందాలు శ్రమించాయని ఫైర్ సర్వీస్ డీజీ బినయ్ బెహెరా తెలిపారు. క్షతగాత్రుల్ని తరలించేందుకు పదుల సంఖ్యలో అంబులెన్స్ల్ని మోహరించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు రోగులు నాలుగు అంతస్తుల భవంతి అద్దాలు పగులగొట్టి బయటపడ్డారు. గాయపడ్డవారిలో పలువురు అమ్రి, అపోలో, కళింగ ఆస్పత్రులతో పాటు ఎస్సీబీ మెడికల్ కాలేజీ, కటక్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశం ఐసీయూలోని రోగుల్ని ఇతర ఆస్పత్రులకు తరలించామని ఎస్యుఎం ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బసంత పాటి చెప్పారు. ఈ సంఘటన పై జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, ఫైర్ సిబ్బందితో విచారణ సంఘం ఏర్పాటు చేశామని ఒడిశా వైద్య కార్యదర్శి ఆర్తి అహుజా తెలిపారు. ఆస్పత్రి యాజ మాన్యం తప్పుందని తేలితే చర్యలు తీసుకుంటామని వైద్య శాఖ మంత్రి అత్ను సబ్యసాచి నాయక్ చెప్పారు. మోదీ తీవ్ర విచారం ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో పలువురి మరణంతో తీవ్రంగా కలత చెందానని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. గాయపడ్డవారిని ఎయిమ్స్కు తరలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు సూచించారు. బాధితులకు అన్ని విధాలా సాయం చేయాలని మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఆదేశించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం -
ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
భువనేశ్వర్: ఒడిశాలో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్లోని ఎస్యూఎమ్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటనలో 22 మంది మృతి చెందారు. డయాలసిస్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలంటుకోవడంతో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో పాటు పలువురు సిబ్బంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని స్థానికంగా గల క్యాపిటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్యూఎమ్ ఆసుపత్రికి పట్టణంలో ప్రముఖ ఆసుపత్రిగా పేరుంది. -
మూడో టెస్టుకు భువీ దూరం
భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ వెన్నునొప్పి కారణంగా కివీస్తో జరిగే మూడో టెస్టుకు దూరమయ్యాడు. కోల్కతా టెస్టు సమయంలోనే తను ఇబ్బందిపడ్డాడని బీసీసీఐ తెలిపింది. భువనేశ్వర్ స్థానంలో ముంబై పేసర్ శార్దుల్ ఠాకూర్ జట్టుతో చేరాడు. ఇండోర్లో శనివారం నుంచి జరిగే ఈ టెస్టులో తమ కెప్టెన్ విలియమ్సన్ అందుబాటులో ఉంటాడని న్యూజిలాండ్ జట్టు వెల్లడించింది. -
భార్య, ఇద్దరు కూతుళ్ళను చంపి..
భువనేశ్వర్ః ఒడిషాలో దారుణం చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య గొడవలు ముగ్గురు ప్రాణాలను బలిగొంది. భార్యతో పాటు ఇద్దరు మైనర్ బాలికలను హత్యచేసి, నిందితుడు పోలీసులముందు సరెండర్ అయిన వైనం.. ఓడగాన్ పోలీస్ స్టేషన్ పరిథిలోని పేటపల్లి గ్రామంలో వెలుగు చూసింది. ఒడిషా నయాఘర్ జిల్లాకు చెందిన భగీరథీ నాయక్.. తన భార్యతోపాటు ఇద్దరు మైనర్ కూతుళ్ళను హత్యచేసి స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. భార్య ప్రతిమతో పాటు ఇద్దరు కుమార్తెలను నిందితుడు ఓ పాఠశాల ప్రాంగణంలో గొంతు నులిమి చంపినట్లు స్థానిక సరంకుల్ ఎస్డీపీవో టికె రెడ్డి తెలిపారు. హత్యల వెనుక కుటుంబ తగాదాలే కారణమని రెడ్డి పోలీసులకు వివరించారు. అయితే నాయక్ ప్రతిమలది ప్రేమ వివాహమని, పెద్ద కుమార్తె ప్రతిమకు ముందు వివాహంద్వారా పుట్టిన సంతానమని, మృతి చెందిన ఇద్దరు బాలికల్లో ఐదు నెలల బాలికకు నాయక్ సొంత తండ్రి అని పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. -
గతి తప్పిన గురువుకు విద్యార్ధినులు దేహసుద్ధి
-
ఎమ్మెల్యే పాత్ర ఎంత?
సోషల్ మీడియాలో ఫొటోల హల్చల్ మేనేజర్ కుటుంబ సభ్యులపై ఒత్తిళ్లు.. భువనేశ్వర్: ఉత్కళ రాష్ట్ర నిర్మాణంలో ప్రముఖ పాత్రధారిగా కీర్తినార్జించిన దివంగత మహారాజా కృష్ణచంద్ర గజపతి పరపతి నడి రోడ్డు మీద చర్చనీయాంశంగా మారింది. రాజ ప్రాసాదంలో గోపీనాథ్ గజపతి దయనీయ పరిస్థితిపట్ల పలు ప్రశ్నలు, సందేహాలు, చర్చోపచర్చలు వాడీవేడిగా సాగుతున్నాయి. గోపీనాథ్ గజపతి ఆరోగ్య సంరక్షణకు చెన్నై తరలించిన తరుణంలో ఆయన సంస్థానంలో పని చేసిన సిబ్బంది వర్గాలు అనుమానాస్పద మరణాలకు గురయ్యారు. ఈ మరణాల్ని ధృవీకరించడం రాష్ట్ర క్రైం శాఖకు పెను సవాలుగా నిలిచింది. ఆత్మహత్యా? హత్యా? ఈ అంశాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ధృవీకరించాల్సి ఉంది. ఘటన స్థలంలో లభించినట్లు చెబుతున్న లేఖలో పేర్కొన్నట్లు చెబుతున్న కొంత మంది ప్రముఖుల పేర్లు చర్చనీయాంశమయ్యాయి. ఈ వివాదంలో స్థానిక ఎమ్మెల్యే కె. సూర్యారావు ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో అక్కడక్కడ ఆనవాలుగా మిగిలిన రాజ కుటుంబాలు, సంస్థానాలపట్ల ప్రజాప్రతినిధుల వైఖరిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గోపీనాథ గజపతి, రాజవంశీకులతో ఉన్న సంబంధాల కన్నా సంస్థాన సిబ్బంది అనుమానాస్పద మృతి వెనుక ఎమ్మెల్యే అదృశ్య హస్తం ఉందనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఇవి ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న సిట్ ఇంత వరకు పర్లాకిమిడి నియోజకవర్గం ఎమ్మెల్యే కె. సూర్యారావు గురించి ప్రస్తావించలేదు. స్థానిక ప్రజా ప్రతినిధిగా ఉంటు ఎమ్మెల్యే రాజ పరివారం బంధువర్గంతో తరచూ సంప్రదింపులు జరిపారని స్థానికులు చెబుతున్నారు. చెన్నైలో ఉంటున్న పరలా రాజ వంశీకులతో ఆయన తరచు సంప్రదింపులు జరపడంతో రాకపోకలు చేసిన విషయాన్ని అంగీకరించిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ మేరకు పలు ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గోపీనాథ గజపతి రాజ నగరి బందీ అయ్యారనిఎమ్మెల్యే సూర్యా రావు ఆరోపించారు. గజపతి మహా రాజా పరపతి పరిరక్షణ ప్రజా ప్రతినిధిగా తన కర్తవ్యంగా భావిస్తున్నట్లు ప్రకటిస్తున్న హావ భావాలపట్ల స్థానికుల్లో పూర్తి విశ్వాసం వ్యక్తం కావడం లేదు. సంస్థాన్ మేనేజర్, కుటుంబ సభ్యుల మృతికి ఎమ్మెల్యే వర్గం ఒత్తిడి కారణమని మృతుల కుటుంబీకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెదవి కదపని రాజకీయ వర్గాలు చారిత్రాత్మక కృష్ణచంద్ర గజపతి సంస్థానంలో చెలరేగిన వివాదాల్లో స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లు వార్తలతో పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రజా ప్రతినిధిగా రాజ వంశీకులతో రాకపోకలు స్థాయి సంబంధాలు ఉన్నట్లు ఆయన పరోక్షంగా అంగీకరించారు. ఇంతలో గోపీనాథ గజపతి రాజ నగరి బందీగా దుర్బర జీవితం గడపడంపట్ల ఆయన తీవ్ర మనస్తాపాన్ని ప్రకటించారు. ఈ మనస్తాప పరిస్థితులు సంస్థానం సిబ్బంది మనుగడని వేలెత్తి చూపింది. చివరకు అనుమానస్పద మరణాలకు దారి తీసింది. ఇంత జరుగుతున్నా గజపతి జిల్లా నుంచి రాజకీయ ప్రతినిధులు, వర్గాలు పెదవి కదపకుండా చోద్యం చూస్తున్నాయి. ఈ సంఘటనపట్ల స్థానికులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. రాజ వంశీకుల రాక గురు వారం నుంచి ఆరంభమైంది. వీరి రాకతో ఈ ఉదంతం మరెన్నో మలుపులు తిరిగే అవకాశం ఉంది. గోపీనాథ్ గజపతి ఆరోగ్యవంతంగా నిలిస్తే కథ రక్తి కడుతుందని సర్వత్రా ఆశాభావం వ్యక్తం అవుతుంది. సంస్థానం న్యాయ సలహాదారుని పాత్ర కూడా క్రమంగా ప్రాధాన్యత కూడగట్టుకుంటుంది. సంస్థానం ఆస్తుల లావాదేవీలతో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఈ మేరకు లోగుట్టు న్యాయ సలహాదారుని దగ్గర ఉండడం తథ్యమనే భావన బలపడుతుంది. చెన్నై నుంచి ఆస్తుల కోసం న్యాయ స్థానాల్లో దీర్ఘకాలంగా పోరాడుతున్న వర్గాలు పర్లాకిమిడి గెడ్డపై కాలు పెడితే సంస్థానం అంతరంగిక వ్యవహారాలకు సంబంధించి బలమైన ఆధారాలు ప్రజా రాజ్యంలో వెలుగు చూస్తాయి. -
యువతి వీరంగం
రథయాత్ర సందర్భంగా రథాలపైకి ఎక్కి మూలవిరాట్లను స్పృశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.. మూలవిరాట్ల స్పర్శ వివాదాల మయం కావడంతో దీనిని పూర్తిగా నివారించాలని అధికారులు భావించారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు మూల విరాట్లను స్పృశించడాన్ని నిషేధించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విదేశంలో నివసిస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని జైలుపాలుచేశారు.. కానీ అంతకుముందు, తర్వాత యథేచ్ఛగా స్పృశించినా చర్యలు తీసుకోలేదు.. స్వామివారి సన్నిధిలో ఉండే సేవాయత్లే అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.. పూరీ/భువనేశ్వర్: మూల విరాట్ల స్పర్శ వివాదం రథయాత్రతో ముడిపడి ఉంది. సంప్రదాయబద్ధంగా రథయాత్ర ముగిసినా స్పర్శ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆది వారం నిర్వహించిన నీలాద్రి విజేతో ఈ యాత్రకు తెర పడింది. మూల విరాట్లు శ్రీ మందిరం రత్న వేదికకు సురక్షితంగా చేరాయి. రథాల పైకి వెళ్లడం, మూల విరాట్లుని స్పర్శించడం నిషేధించినట్లు శ్రీ మందిరం దేవస్థానం ప్రకటించింది. ఒడిశా హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఆదేశాల్ని జారీ చేయడం జరిగిందని స్పష్టం చేసింది. ఆంక్షల ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించింది. అధికారుల ఆదేశాలను సేవాయత్లు ఉల్లంఘించినా పట్టించుకోని యంత్రాంగం సామాన్యులను మాత్రం వేధిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది రథ యాత్ర తొలి ఘట్టం స్నాన పూర్ణిమ నుంచి మూల విరాట్లుని స్పర్శిస్తున్నట్లు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. సేవాయత్ల ప్రేరణతో పలువురు అనధికారిక వ్యక్తులు స్నాన మండపంపై మూల విరాట్లుని స్పర్శించినట్లు వచ్చిన ఆరోపణల్ని శ్రీమందిరం ప్రధాన పాలనాధికారి సీఏఓ పరోక్షంగా ఖండించి సేవాయత్లకు అండగా నిలిచి హై కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనలో సేవాయత్ వర్గాల్ని ప్రోత్సహించినట్లు నీలాద్రి విజే ఘట్టం రుజువు చేసింది. రథ యాత్రలో నీలాద్రి విజే చిట్ట చివరి ఘట్టం. రథాలపై నుంచి మూల విరాట్లుని వరుస క్రమంలో (గొట్టి పొహొండి) దించి శ్రీ మందిరం రత్న వేదికపై యథా తథంగా ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియకు కాసేపటి ముందుగానే సేవాయత్ వర్గాల కుటుంబీకులు పిల్లాపాపలతో రథాలపైకి వెళ్లి మూల విరాట్లను బాహాటంగా స్పర్శించారు. శ్రీ మందిరం ప్రధాన పాలనాధికారి సీఏఓ, జిల్లా కలెక్టరు, పోలీసు సూపరింటెండెంటు వంటి అతిరథ మహారథుల సమక్షంలో జరిగినా ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. అధికారుల మద్దతుతోనే? సేవాయత్ల ఆగడాలకు శ్రీ మందిరం దేవస్థానం అధికార యంత్రాంగం మద్దతుగా నిలుస్తుందని ఈ వ్యవహారం స్పష్టం చేసింది. గుండిచా మందిరం ఆవరణలో రథాలు ఉండగా సేవాయత్ కుటుంబీకులు రథంపైకి వెళ్లి మూల విరాట్లుని స్పర్శించిన సందర్భంలో దేవస్థానం అధికార యంత్రాంగం ఏమీ పట్టించుకోలేదు. మర్నాడు రథాలపైకి వెళ్లిన ప్రవాస భారతీయుడు (ఒడియావాసి)పై చట్టపరమైన ఉత్తర్వుల ఉల్లంఘన నేరం కింద అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో సేవాయత్ కుటుంబీకుల వ్యవహారంలో పెదవి కదపకపోవడం ఏమిటనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నీలాద్రి విజే ఉత్సవం జరుగుతుండగా సేవాయత్ కుటుంబీకులు రథాలపైకి వెళ్లడంతో గొట్టి పొహొండి తీవ్రంగా ప్రభావితం అయింది. నీలాద్రి విజే దాదాపు ఆది వారం రాత్రంతా జరిపించాల్సి వచ్చింది. తెల్లారితే సోమ వారం అనగా నీలాద్రి విజేని అతి కష్టం మీద ముగిించాల్సి రావడం విచారకరం. కలెక్టరు బదిలీకి సేవాయత్ల డిమాండు నీలాద్రి విజే ఉత్సవంలో బలభద్రుని రథం తాళ ధ్వజంపైకి సేవాయత్ తన కుమార్తెని తీసుకు వెళ్లి మూల విరాట్లుకు స్పర్శింపజేశారు. అశేష జన సమూహం సమక్షంలో ఈ తప్పిదానికి బాహాటంగా పాల్పడిన సేవాయత్ని అధికార యంత్రాంగం నిలదీయడంతో జిల్లా కలెక్టరుని ఇక్కడ నుంచి బదిలీ చేయాలని తక్షణమే ఆందోళనని ప్రేరేపించారు. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సాహు సమక్షంలో ఈ రగడ చోటుచేసుకుంది. అధికారులు, సేవాయత్ల మధ్య రగడం పుంజుకోవడంతో గొట్టి పొహొండి తంతు దాదాపు ముప్పావు గంట సేపు స్తంభించిపోయింది. సేవాయత్ వర్గాలతో మంత్రి అరుణ్ కుమార్ సాహు సంప్రదింపులు జరిపి నీలాద్రి విజే ఉత్సవాన్ని ముగింపజేశారు. పునరావృతం కాకుండా చర్యల్ని పటిష్టం చేయాలి: మహా రాజా మూల విరాట్లుని అనధికారిక వర్గాలు స్పర్శించడం అపచారం. ఈ విధానం నివారించాలని పూరీ గజపతి మహా రాజా దివ్య సింఘ్దేవ్ లోగడ ప్రతిపాదించారు. స్థానిక గోవర్ధన పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి ఆయనతో ఏకీభవించారు. వీరివురి అభిప్రాయంతో రాష్ట్ర హై కోర్టు కూడ ఏకీభవించి పూజలు, సేవాదులు నిర్వహించే యంత్రాంగం మినహా ఇతర వర్గాలు మూల విరాట్లుకు స్పర్శించరాదని హై కోర్టు తీర్మానించింది. ఈ తీర్మానం మేరకు ఈ ఏడాది రథాలపైకి వెళ్లిన, మూల విరాట్లుకు స్పర్శించిన చర్యలు చేపడతామని హెచ్చరించిన అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో విఫలం కావడంతో ర థయాత్ర వివాదంతంగా ముగిసింది. -
ఢిల్లీలో అదృశ్యం.. భువనేశ్వర్లో ఆత్మహత్య
కంపెనీ వేధింపులే కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణ పెందుర్రు(బంటుమిల్లి) : ఢిల్లీలో అదృశ్యమైన మండల పరిధిలోని పెందుర్రు గ్రామానికి చెందిన ప్రత్తి రవీం ద్రబాబు(35) వారం రోజుల అనంతరం ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో శవమై కనిపించాడు. బంటుమిల్లి, ఒరిస్సా పోలీసుల సహకారంతో కుటుంబసభ్యులు రవీంద్ర మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి బుధవారం అంత్యక్రియలు జరిపించారు. పోలీ సులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ప్రత్తి వీరబాబు కుమారుడు రవీంద్రబాబు పదేళ్లుగా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మూడేళ్ల కిందట త న సమీప బంధువు నెలకొల్పిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ డివిజన్కు డెరైక్టర్గా చేరాడు. ఈ క్రమంలో గత నెల 22వ తేదీన స్వగ్రామం వచ్చిన రవి కంపెనీ ప్రతినిధులు ఫోన్ చేశారంటూ హైదరాబాద్ వెళ్లాడు. ఆ తర్వాత ఢిల్లీ వెళుతున్నానని తల్లిదండ్రులకు ఫోన్చేసి చెప్పాడు. కంపెనీ ప్రతినిధులతో కలసి ఢిల్లీ వెళ్లాడు. దాదాపు 26వ తేదీ నుంచి కుటుంబసభ్యులకు అందుబాటులో లేడు. జూన్ ఒక టో తేదీన వీరబాబు తన కుమారుడు కనిపించడంలేదంటూ బంటుమిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభిం చారు. ఈనెల 2వ తేదీన భువనేశ్వర్ లాడ్జిలో దిగిన రవీంద్రబాబు రెండు రోజులు తలుపులు తీయకపోవడంతో అనుమానించి 4వ తేదీన అక్కడి న్యాయమూర్తి సమక్షంలో తలుపులు పగులకొట్టి చూడగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. రవీంద్రబాబు వద్ద ఉన్న అడ్రస్సు ఆధారంగా భువనేశ్వర్ పోలీసులు ఈనెల 5వ తేదీన బంటుమిల్లి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. బంటుమిల్లి పోలీసులు, కుటుంబసభ్యులు భువనేశ్వర్ బయలుదేరి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న ఆ రాష్ట్ర పోలీసులు రవీంద్ర మృతదేహాన్ని వారికి అప్పగించారు. స్వగ్రామానికి చేరుకోగానే మృతుడి భార్య రేణుక, తల్లి రాజ్యలక్ష్మి స్పృహ కోల్పోయారు. మృతుడికి మూడేళ్ల కిందట దగ్గర బంధువు కాత్యాయని రేణుకతో వివాహం కాగా రెండేళ్ల బాబు ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలే తన కుమారుడు ఆత్మహత్యకు ప్రేరేపించాయని మృతుడి తండ్రి వీరబాబు ఆరోపిస్తూ బుధవారం బంటుమిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధు లు డబ్బుల కోసం తమతో అగ్రిమెంట్లపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు. మానసిక వేదనకు గురిచేశారని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దర్యాప్తు జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
తీరంలో ‘సూర్యో’దయం
► సన్రైజర్స్ విజయాల హ్యాట్రిక్ 85 పరుగులతో ముంబై చిత్తు ► రాణించిన ధావన్, వార్నర్ చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు ‘సొంత మైదానం’ కాని సొంత మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ తన పట్టును ప్రదర్శించింది. గత ఏడాది ఇక్కడే హోం గ్రౌండ్గా మూడు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ జట్టు ఇప్పుడు ప్రత్యర్థి స్థానంలో తలపడింది. అయితే వేదిక మారినా ఆ జట్టు జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఈసారి విశాఖ తీరంలో ముంబైని తుక్కుగా ఓడించి లీగ్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ముందుగా వార్నర్, ధావన్ మెరుపులకు తోడు అద్భుత బౌలింగ్ రైజర్స్ను నిలబెట్టింది. ఒకరు కాదు ఇద్దరు కాదు...నలుగురు సన్రైజర్స్ బౌలర్లు తమ తొలి ఓవర్లోనే వికెట్ తీస్తే భారీ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అచేతనంగా మారిపోయింది. 26 బంతులు ఆడే సరికే ఐదుగురు ఆటగాళ్లు అవుట్ కాగా... లీగ్లో ఛేదన అంటే చెలరేగిపోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం మొదలు... పది ఓవర్ల లోపే ఏడు వికెట్లు కోల్పోయిన ముంబై జట్టు ఏమీ చేయలేక చేతులెత్తేసింది. సీజన్లో అతి తక్కువ స్కోరు నమోదు చేసిన రోహిత్ బృందం మూడు విజయాల తర్వాత ఓటమిని మూటగట్టుకుంది. సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుతమైన ప్రదర్శనతో ఆ జట్టు లీగ్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్లో రైజర్స్ 85 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (57 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయమైన బ్యాటింగ్కు తోడు వార్నర్ (33 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్), యువరాజ్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారం జట్టుకు భారీ స్కోరు అందించాయి. అనంతరం ముంబై 16.3 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. సన్ బలమైన బౌలింగ్ ముందు ముంబై బ్యాటింగ్ సమష్టిగా విఫలమైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆశిష్ నెహ్రా (3/15), ముస్తఫిజుర్ రహమాన్ (3/16) చెలరేగగా, బరీందర్కు 2 వికెట్లు దక్కాయి. సన్రైజర్స్ తమ తదుపరి మ్యాచ్లో మంగళవారం ఇదే మైదానంలో పుణేతో తలపడుతుంది. ఓపెనర్లు దూకుడు: ఫామ్లో ఉన్న ఓపెనర్లు వార్నర్, ధావన్ మరోసారి హైదరాబాద్కు అదిరే ఆరంభం ఇచ్చారు. ముందుగా వార్నర్ జోరు మొదలు పెట్టగా, ఆ తర్వాత ధావన్ లయ అందుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్గా మలచిన వార్నర్...హర్భజన్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది దూకుడు ప్రదర్శించాడు. మెక్లీనగన్ బౌలింగ్లో కూడా వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 51 పరుగులకు చేరింది. అయితే భజ్జీ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన వార్నర్, అదే ఊపులో అవుట్ కావడంతో 85 పరుగుల (59 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. విలియమ్సన్ (2) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో ధావన్, యువరాజ్ కలిసి జట్టును నడిపించారు. గత మ్యాచ్లో విఫలమైన యువరాజ్ తన 100వ ఐపీఎల్ మ్యాచ్లో చెలరేగాడు. పొలార్డ్ వేసిన ఓవర్లో యువీ వరుసగా ఫోర్, సిక్స్ కొట్టడంతో రైజర్స్ ఇన్నింగ్స్ వేగం పెరిగింది. మరోవైపు 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ధావన్, అనంతరం బుమ్రా వేసిన రెండు ఓవర్లలో కలిపి నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాది దూకుడు ప్రదర్శించాడు. చివరి ఓవర్ నాలు గో బంతికి యువీ హిట్ వికెట్గా వెనుదిరగ్గా, ఓవర్లో ఏడు పరుగులే వచ్చాయి. అయితే 15-19 మధ్య ఐదు ఓవర్లలో సన్రైజర్స్ 68 పరుగులు చేయడం జట్టు భారీ స్కోరుకు కారణమైంది. టపటపా...: భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ పూర్తిగా పట్టు తప్పింది. ఆ జట్టులో ఒక్క బ్యాట్స్మన్ కూడా కనీస స్థాయిలో పోరాడలేకపోయాడు. తొలి ఓవర్ చివరి బంతికి పార్థివ్ (0)ను అవుట్ చేసి భువనేశ్వర్ శుభారంభం ఇవ్వగా, నెహ్రా వేసిన రెండో ఓవర్ తొలి బంతినే రోహిత్ (5) వికెట్లపైకి ఆడుకున్నాడు. నెహ్రా తన రెండో ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. నాలుగో బంతికి రాయుడు (6) వెనుదిరగ్గా, ఆరో బంతిని బట్లర్ (2) నేరుగా కీపర్ చేతుల్లోకి పంపించాడు. భువీ, నెహ్రాలాగే తొలి ఓవర్లో వికెట్ పండగ చేసుకుంటూ బరీందర్ కూడా తన రెండో బంతికే కృనాల్ (11 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్)ను అవుట్ చేయడంతో ముంబై 30 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. బరీందర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి పొలార్డ్ (11) ఆదుకునే ప్రయత్నం చేసినా అతనూ వెంటనే అవుటయ్యాడు. ఈసారి నా వంతు అంటూ తొలి బంతికే హార్దిక్ (7)ను అవుట్ చేసిన ముస్తఫిజుర్, రెండో ఓవర్ తొలి బం తికి సౌతీ (3)ని వెనక్కి పంపడంతో ముంబై గెలు పు ఆశలు కోల్పోయింది. హర్భజన్ (21 నాటౌట్; 2 ఫోర్లు) కొద్దిసేపు పోరాడినా మరో 21 బంతులు ఉండగానే ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 48; ధావన్ (నాటౌట్) 82; విలియమ్సన్ (సి) రోహిత్ (బి) హర్భజన్ 2; యువరాజ్ (హిట్వికెట్) (బి) మెక్లీనగన్ 39; హెన్రిక్స్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 177 వికెట్ల పతనం: 1-85; 2-91; 3-176. బౌలింగ్: సౌతీ 4-0-35-0; మెక్లీనగన్ 4-0-38-1; హర్భజన్ 4-0-29-2; బుమ్రా 4-0-35-0; హార్దిక్ 1-0-10-0; పొలార్డ్ 2-0-23-0; కృనాల్ 1-0-5-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) నెహ్రా 5; పార్థివ్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; రాయుడు (సి) విలియమ్సన్ (బి) నెహ్రా 6; కృనాల్ (సి) ధావన్ (బి) బరీందర్ 17; బట్లర్ (సి) ఓజా (బి) నెహ్రా 2; పొలార్డ్ (సి) బరీందర్ (బి) హెన్రిక్స్ 11; హార్దిక్ (సి) ఓజా (బి) ముస్తఫిజుర్ 7; హర్భజన్ (నాటౌట్) 21; సౌతీ (సి) ఓజా (బి) ముస్తఫిజుర్ 3; మెక్లీనగన్ (సి) హెన్రిక్స్ (బి) ముస్తఫిజుర్ 8; బుమ్రా (సి) ఓజా (బి) బరీందర్ 6; ఎక్స్ట్రాలు 6; మొత్తం (16.3 ఓవర్లలో ఆలౌట్) 92. వికెట్ల పతనం: 1-5; 2-5; 3-28; 4-30; 5-30; 6-49; 7-50; 8-58; 9-78; 10-92. బౌలింగ్: భువనేశ్వర్ 3-0-23-1; నెహ్రా 3-0-15-3; బరీందర్ 3.3-0-18-2; హెన్రిక్స్ 4-0-18-1; ముస్తఫిజుర్ 3-0-16-3. -
రాంచీ రేస్ విజయం
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ నాలుగో సీజన్లో భాగంగా సోమవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ 3-2తో కళింగ లాన్సర్ను ఓడించింది. ఆరంభంలో జోరు కనబరిచిన కళింగ తొమ్మిదో నిమిషంలోనే ధరమ్వీర్ ఫీల్డ్ గోల్ చేయడంతో 2-0 ఆధిక్యం పొందింది. అయితే 10వ నిమిషంలోనే రాంచీ కెప్టెన్ ఆష్లే జాక్సన్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచాడు. ఆ తర్వాత మూడు క్వార్టర్ల వరకు తమ ఆధిక్యాన్ని కాపాడుకున్న కళింగకు 49వ నిమిషంలో రాంచీ రేస్ షాకిచ్చింది. ఆమిర్ ఖాన్ ఫీల్డ్ గోల్తో స్కోరు 3-2గా మారింది. అయితే 53వ నిమిషంలో స్కోరును సమం చేసే అవకాశం వచ్చినప్పటికీ కళింగ విఫలం చేసుకోవడంతో రాంచీ విజయం ఖరారైంది. -
భువనేశ్వర్ స్థానంలో రిషి ధావన్ కు చోటు
ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు జరిగింది. బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో ఆల్రౌండర్ రిషి ధావన్కు స్థానం లభించింది. గాయపడ్డ మరో బ్యాట్స్మన్ అజింక్య రహానే స్థానంలో ప్రత్యామ్నాయంగా గుర్కీరత్ సింగ్ జట్టుతోపాటు కొనసాగుతాడు. -
హైదరాబాద్ ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్
భువనేశ్వర్: హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్న ఓ విమానాన్ని సోమవారం భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి ఛాతినొప్పి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని చికిత్స నిమిత్తం భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. 30 నిమిషాల అనంతరం విమానం కోల్కతాకు బయల్దేరినట్టు విమానాశ్రయ అధికారులు చెప్పారు. అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని శశి మీనన్గా గుర్తించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. -
'పద్దతి మార్చుకోకుంటే తన్నులు తప్పవు'
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలలో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. శనివారం భువనేశ్వర్లో 'ఇంటర్నేషనల్ హిందూ మహాసంఘ' ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యేను సహచరులు కొట్టడంలో తప్పులేదన్నారు. పద్దతైనా మార్చుకోవాలి లేదా తన్నులైనా తినాలని తనదైన స్టైల్లో వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న నెపంతో ఇటీవల జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో స్వతంత్ర ఎమ్మెల్యే షేక్ అబ్థుల్ రషీద్పై బీజేపీ ఎమ్మెల్యేలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని రషీద్ చర్యలకు సహజ ప్రతిస్పందనగా సాక్షి అభివర్ణించాడు. జనం అభిష్టం మేరకు మాట్లాడనప్పుడు నాయకులకు తన్నులు తప్పవన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా ఏడాది పాలననే పూర్తి చేసుకుందని తెలిపిన సాక్షి. ఎన్డీఏ పాలనలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోందని పునరుద్ఘాటించారు. గతంలో అక్కడ రామమందిరం ఉందని.. ఎప్పటికీ ఉంటుందని ఆయన అన్నారు. -
ఫ్రెండ్లీ పోలీస్
-
డాన్సింగ్ ట్రాఫిక్ కానిస్టేబుల్
-
బ్యాడ్మింటన్ హుషారు...ఆటో షికారు!
కొలంబో : టెస్టు సిరీస్ను సమం చేసిన జోరులో ఉన్న భారత ఆటగాళ్లు తర్వాతి రోజును ఉత్సాహంగా గడిపారు. క్రికెటర్లు షట్లర్లుగా మారి సరదా తీర్చుకున్నారు. మంగళవారం కెప్టెన్ కోహ్లితో పాటు ఇషాంత్, భువనేశ్వర్, పుజారా సుదీర్ఘ సమయం బ్యాడ్మింటన్ ఆడారు. ఆ తర్వాత హర్భజన్, బిన్నీలతో కలిసి కోహ్లి ఆటోలో (అక్కడి భాషలో టుక్ టుక్) నగరం చుట్టొచ్చాడు. ఈ ఫోటోలను వీరు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. -
పట్టాలు తప్పిన మరో రైలు
భువనేశ్వర్: ఒడిశాలో సరుకు రవాణా చేసే ఓ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో కొన్ని రైళ్లను దారి మళ్లించారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హానీ జరగలేదు. రైల్వే అధికారుల సమాచారం మేరకు కటక్ జిల్లాలోని మార్థాపూర్ వద్ద గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో నారజ్ డెంకానల్ మార్గం మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భువనేశ్వర్-బోలంగిర్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్, శంబల్ పూర్- పూరి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్, అంగుల్-పూరి ప్యాసింజర్ రైళ్లను దారి మళ్లించారు. దాదాపు ఐదు గంటల ఆలస్యం అనంతరం తిరిగి సాధారణ సర్వీసులు ఈ మార్గంలో ప్రారంభించారు. -
మాజీ మావోయిస్టు ఆజాద్ దీక్ష విరమణ
అమందస: పెండింగు కేసుల విచారణ సత్వరమే పూర్తి చేస్తామని ఒడిశా అధికారులు భరోసా ఇవ్వడంతో భువనేశ్వర్లోని జార్పడ్ జైలులో నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మావోయిస్టు దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ దీక్ష విరమించారు. ఆయన తల్లి కాములమ్మ ఈ విషయం తెలిపారు. జైలులు ఉన్న ఆజాద్ కలిసి తిరిగి వచ్చిన ఆమె శనివారం స్వగ్రామమైన మందస మండలం నల్లబొడ్డులూరులో విలేకరులతో మాట్లాడారు. 2011 మే 18న లొంగిపోయిన కేశవరావును కొద్దిరోజుల వ్యవధిలోనే విచారణ పేరుతో ఒడిశా పోలీసులు తీసుకెళ్లి నిర్బంధించిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా ఈ నెల 23 నుంచి జార్పడ్ జైలులోనే ఆజాద్ నిరవధిక దీక్ష చేపట్టినట్లు కాములమ్మ ఇంతకుముందు వెల్లడించారు. దీనిపై పత్రికల్లో వార్తలు రావడంతో స్పందించిన ఒడిశా ప్రభుత్వం తనకు రమ్మని కబురు పంపడంతో ఈ నెల 27న జార్పడ్ జైలుకు వెళ్లానని ఆమె చెప్పారు. ఖర్దా జిల్లా కలెక్టర్ నిరంజన్ సాహు, అడిషనల్ డీజీ ప్రదీప్కపూర్లు కూడా జైలుకు వచ్చి తమతో మాట్లాడారని చెప్పారు. ఆజాద్పై ఉన్న కేసుల విచారణను సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అలాగే కొత్తగా కేసులు పెట్టకుండా చూస్తామని, పోలీసు వేధింపులు లేకుండా చూస్తామని తన కుమారుడికి భరోసా ఇవ్వడంతో ఈ నెల 27న అతనితో పాటు మరో ఆరుగురు దీక్ష విరమించారని కాములమ్మ వెల్లడించారు. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భరోసా ఇచ్చినందుకు కృతజ్ఙతలు తెలిపారు. -
'పృథ్వీ-2' ను విజయవంతంగా ప్రయోగించిన భారత్
భువనేశ్వర్: భారత్ అమ్ముల పొదిలో కొత్తగా మరో క్షిపణి వచ్చి చేరింది. భూ ఉపరితలం నుంచి గగన తలంలోకి అణ్వాయుధాలను సమర్ధవంతంగా తీసుకువెళ్లే పృథ్వీ-2 మిస్సైల్ ను శుక్రవారం భారత్ విజయవంతగా ప్రయోగించింది. ఒడిశాలోని మిలటరీ బేస్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు సీనియర్ రక్షణ అధికారి తెలిపారు. ఈ క్షిపణి 350 కి.మీ వరకూ లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలదని స్సష్టం చేశారు. భారత ఆర్మీ దళాలకు మిస్సైల్ ప్రయోగాలు రెగ్యులర్ శిక్షణలో ఒక భాగమని టెస్ట్ రేంజ్ డైరెక్టర్ ఎమ్.వీ.కే.వీ ప్రసాద్ తెలిపారు. -
భూ కుంభకోణం కేసులో 13 మంది అరెస్ట్
భువనేశ్వర్:నగర శివార్లో ఉన్న ప్రభుత్వ భూ కుంభకోణం కేసులో 13 మందిని అరెస్టు చేశారు. గతంలో ఒడిశా ప్రభుత్వం కొంతమందికి మంజూరు చేసిన భూమిని వ్యవసాయానికి ఉపయోగించకుండా వేరే వ్యక్తులకు అమ్మేయడంతో దీనిపై క్రైం బ్రాంచ్ విచారణ చేపట్టింది. 1969-1973 ప్రాంతంలో కొంతమందికి ప్రభుత్వ భూములను అప్పగించింది. అయితే ఆ భూములను వారు ఉపయోగించకపోవడంతో ఆ ఒప్పందాలను తాజాగా రద్దు చేసిన ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆగస్టు నెలలో క్రైం బ్రాంచ్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణ చేపట్టిన అధికారులు 13 మందిని అరెస్టు చేశారు. ఇందులో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 19 వ తేదీన కుద్రా జిల్లా కలెక్టర్ నివేదిక ప్రకారం ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. మరో కొంతమందిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. -
వైద్యుని ఇంట్లో మూడు హత్యలు
భువనేశ్వర్:ఓ వైద్యుని ఇంట్లో ముగ్గురు హత్య చేయబడ్డ ఘటన నగరంలోని ఖందగిరి విహార్ లో కలకలం సృష్టించింది. ఎముకల వైద్యునిగా పనిచేస్తున్న అతుల్యా చంద్రా మెహర్ ఇంట్లోకి ఓ దుండగుడు చాకచక్యంగా ప్రవేశించి అతనికి సంరక్షకునిగా ఉన్న కుటుంబంపై దాడి చేశాడు. ఈ ఘటనలో డాక్టర్ తో పాటు, మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. డాక్టర్ మెహ్రా ఇంటి క్రింది భాగంలో పనివాళ్లు ఉండే నివాసంలో ప్రశాంత్ బెహ్రాతో పాటు అతని భార్య, కుమారుడు ఉంటున్నారు. ఆ దుండగుడు ప్రశాంత్ భూషణ్ తో పాటు, భార్య, కుమారుడిపై దాడి చేశాడు. దీంతో తొలి అంతస్తులో ఉన్న మెహర్ క్రింది అంతస్తులో అలజడిని గ్రహించి అక్కడికి చేరుకున్నాడు. దీంతో ఆ అపరిచిత వ్యక్తి డాక్టర్ పై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో డాక్టర్ చంద్రా మోహర్ , ప్రశాంత్ బెహ్రా తో పాటు అతని కుమారుడు కూడా మృతి చెందాడు. కాగా, బెహ్రా భార్య ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమెను ఎస్సీబీ మెడికల్ కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పీపుల్స్ చాయిస్ అవార్డు రేసులో భువనేశ్వర్
దుబాయ్: భారత పేసర్ భువనేశ్వర్ ప్రతిష్టాత్మక పీపుల్స్ చాయిస్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. తనతో పాటు ఈ అవార్డు కోసం దక్షిణాఫ్రికా పేసర్ స్టెయిన్, ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక), మిచెల్ జాన్సన్ (ఆసీస్), చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్ మహిళా జట్టు కెప్టెన్) రేసులో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తమ ఓటింగ్ ద్వారా విజేతను ఎన్నుకోవచ్చు. అలాగే ఐసీసీ ఉత్తమ టెస్టు, వన్డే జట్లతో పాటు ఇతర ఐసీసీ అవార్డుల షార్ట్ లిస్ట్ జాబితాను నవంబర్ 4న వెల్లడించనున్నారు. -
రానురాను రాజు గుర్రం గాడిదయిందంట...