
భారత్ కలలను నిజం చేయడానికి ప్రయత్నిస్తా
ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగు వారికి గర్వకారణమన్నారు. రాష్ట్రపతిగా 125 కోట్ల మంది ప్రజలకు సేవ చేసేందుకు తనకు మద్దతివ్వాలని కోవింద్ కోరారు. ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ రాష్ట్రపతిగా మంచి మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తున్నామని వెంకయ్య పేర్కొన్నారు. కోవింద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి అభ్యంతరం ఏమైనా ఉందా? అని అడిగారని, తాను సంపూర్ణ మద్దతిస్తానని చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కోవింద్కు 70 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి స్థితిలో మరొకరు గెలిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
ఏపీ మూడేళ్ల పసిబిడ్డ అని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయని, కోవింద్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి రామ్నాథ్ కోవింద్ పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశం అనంతరం కోవింద్కు చంద్రబాబు అల్పాహార విందు ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన రామ్నాథ్కు గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుతోపాటు బీజేపీ నేతలు స్వాగతం పలికారు.