Presidential election
-
వలసలకు ఇక బ్రేకే!
అగ్రరాజ్యాధిపతిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈసారి ఆయన ఎలాంటి విధానాలు అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు తీసుకొనే నిర్ణయాలు, చేపట్టే చర్యలు ప్రపంచమంతటా ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. ట్రంప్ రెండో దఫా పాలనపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది కాలంగా ట్రంప్ చేసిన ప్రసంగాలు, వచ్చిన ప్రకటనలను బట్టి కొన్ని కీలకమైన అంశాల్లో ఆయన వైఖరి ఎలా ఉండబోతోందో కొంతవరకు అంచనా వేయొచ్చు. అదేమిటో చూద్దాం.. వలసలపై కఠిన వైఖరే అమెరికాలోకి వలసల పట్ల ట్రంప్ మొదటి నుంచీ వ్యతిరేకమే. 2016లో ఆయన ‘గోడ కట్టండి’అని పిలుపునిచ్చారు. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించారు. అమెరికా అక్రమంగా నివసిస్తున్న వారిని బయటకు తరిమేయడానికి నేషనల్ గార్డు, పోలీసు దళాలను బలోపేతంపై దృష్టి పెట్టారు. అక్రమంగా వలస వచ్చిన వారికి, చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి ఇకపై ట్రంప్ రూపంలో కష్టాలు తప్పకపోవచ్చు. అమెరికా గడ్డపై జన్మిస్తే అమెరికా పౌరసత్వం ఇచ్చే విధానాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మార్చాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి వలసలకు ట్రంప్ వ్యతిరేకమే. మొత్తంమీద ఇకపైన చట్టబద్ధంగా కూడా ఎక్కువ మందిని అమెరికాలోకి అనుమతించకపోవచ్చు. విదేశీయులు అమెరికా కలను వాయిదా వేసుకోవాల్సి రావొచ్చు. గర్భస్రావాలపై మహిళలకు హక్కులు తొలి దఫాలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మహిళల పునరుత్పత్తి హక్కులను ట్రంప్ వ్యతిరేంచారు. గర్భాన్ని తొలగించుకొనేందుకు మహిళలకు ఉన్న హక్కును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు తమ వల్లే సాధ్యమైందని ట్రంప్ చెప్పారు. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పునరుత్పత్తి హక్కుల కోసం మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ వారికి మద్దతు పలికారు. అయితే, ఈసారి ట్రంప్ మహిళల గర్భస్రావ హక్కుల విషయంలో జోక్యం చేసుకోకపోవచ్చు. అంటే మహిళలకు స్వేచ్ఛనిచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్జెండర్లకు రక్షణ లింగమారి్పడి చేయించుకున్నవారిపై ట్రంప్కు సానుభూతి ఉంది. లెస్పియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, ఇంటర్సెక్స్ వర్గాలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి పట్ల సమాజం దృక్పథం మారాలని ఎన్నోసార్లు చెప్పారు. ట్రంప్ పాలనలపై వృద్ధులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారికి సామాజిక భద్రత, వైద్య సంరక్షణ కల్పిస్తామంటూ ట్రంప్ హామీ ఇచ్చారు. -
US Election 2024: స్వర్ణయుగం తెస్తా
వాషింగ్టన్: రెండోసారి పరిపాలన మొదలెట్టాక అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచాక బుధవారం ఫ్లోరిడా రాష్ట్రంలోని వెస్ట్ పామ్ బీచ్ ప్రాంతంలోని పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో కుటుంబసమేతంగా ‘ఎలక్షన్ నైట్ వాచ్ పార్టీ ’వేదిక మీదకు వచ్చిన ట్రంప్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా సైతం పోడియం మీదకు వచ్చారు. ట్రంప్ సతీమణి మెలానియా, కుమారులు, కోడళ్లు, మనవరాళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు సైతం వేదిక మీదకొచ్చారు. చిరస్మరణీయ విజయం తర్వాత జాతినుద్దేశిస్తూ వందలాది మంది మద్దతుదారుల సమక్షంలో ట్రంప్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దేశం మునుపెన్నడూ చూడని విజయం ‘‘అమెరికాలో ఇలాంటి విజయాన్ని మునుపెన్నడూ ఎవరూ చూడలేదు. అత్యంత శక్తివంతమైన ప్రజాతీర్పు ఇది. అమెరికా చరిత్రలో అతిగొప్ప రాజకీయ ఉద్యమం ఇది. మా పార్టీ గెలుపుతో అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం రాబోతోంది. అమెరికాను మళ్లీ అత్యంత గొప్ప దేశంగా మలిచేందుకు ఈ గెలుపు మాకు సదవకాశం ఇచి్చంది. పాత గాయాలను మాన్పి దేశాన్ని మళ్లీ సరికొత్త శిఖరాలకు చేరుస్తాం. మళ్లీ మేం పార్లమెంట్పై పట్టుసాధించాం. హోరాహోరీ పోరు జరిగిన కీలక జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ లాంటి రాష్ట్రాల్లోనూ విజయం సాధించాం. అన్ని వర్గాల సమూహశక్తిగా అతిపెద్ద విస్తృతమైన ఏకీకృత కూటమిగా నిలబడ్డాం. ఇలా అమెరికా చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, వృద్ధులు, మహిళలు, పురుషులు అంతా రిపబ్లికన్ పారీ్టకే పట్టం కట్టారు. కార్మిక, కార్మికేతర సంఘాలు, ఆఫ్రికన్–అమెరికన్, హిస్పానియన్–అమెరికన్, ఆసియన్–అమెరికన్, అర్బన్–అమెరికన్, ముస్లిం అమెరికన్ ఇలా అందరూ మనకే మద్దతు పలికారు. ఇది నిజంగా ఎంతో సుందరమైన ఘటన. భిన్న నేపథ్యాలున్న వర్గాలు మనతో కలిసి నడిచాయి. అందరి ఆశ ఒక్కటే. పటిష్ట సరిహద్దులు కావాలి. దేశం మరింత సురక్షితంగా, భద్రంగా ఉండాలి. చక్కటి విద్య అందాలి. ఎవరి మీదకు దండెత్తకపోయినా మనకు అజేయ సైన్యం కావాలి. గత నాలుగేళ్లలో మనం ఎలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అయినాసరే ఐసిస్ను ఓడించాం. నేనొస్తే యుద్ధమేఘాలు కమ్ముకుంటాయని డెమొక్రాట్లు ఆరోపించారు. నిజానికి నేనొస్తే యుద్ధాలు ఆగిపోతాయి. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు దక్కిన అద్భుత విజయమిది. మరోమారు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకుని నాకు అసాధారణ గౌరవం ఇచ్చిన నా అమెరికన్ ప్రజలకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నా ’’అని అన్నారు. సరిహద్దులను పటిష్టం చేస్తా ‘‘ప్రస్తుతం దేశం చాలా కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తక్షణ సాయం అవసరం. దేశ గాయాలను మేం మాన్పుతాం. దేశ సరిహద్దుల వద్ద కాపలాను మరింత పటిష్టం చేస్తాం. అదొక్కటేకాదు దేశం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతాం. ప్రతి ఒక్క పౌరుడికి నేనొక్కటే చెబుతున్నా. మీ కోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తా. ప్రతి రోజూ పోరాడతా. మనం, మన పిల్లలు కోరుకునే స్వేచ్ఛాయుత, అత్యంత సురక్షితమైన, సుసంపన్నమైన అమెరికా కోసం నా తుదిశ్వాసదాకా కృషిచేస్తా. అమెరికాకు మళ్లీ స్వర్ణయుగాన్ని తెస్తా. ఈ మహాయజ్ఞంతో నాతోపాటు పాలుపంచుకోవాలనుకునే ప్రతి ఒక్క పౌరుడికీ ఇదే నా స్వాగతం’’అని అన్నారు. బంగరు భవితకు బాటలు వేద్దాం ‘‘మనందరం కలిసి సమష్టిగా అమెరికా ఉజ్జల భవితను లిఖిద్దాం. కలిసి కష్టపడి మన తర్వాత తరాలకు చక్కటి భవిష్యత్తును అందిద్దాం. ఎన్నికల వేళ 900 ర్యాలీలు నిర్వహించుకున్నాం. విస్తృతంగా పర్యటించి ప్రజలకు చేరువకావడం వల్లే ఇప్పుడు విజయ తీరాలకు చేరగలిగాం. ఇప్పుడు దేశం కోసం అత్యంత ముఖ్యమైన పనులను మొదలెడదాం. అత్యంత మెరుగైన అమెరికాను నిర్మిద్దాం’’అని అన్నారు. ఎన్నికల బహిరంగసభలో భవనం పైనుంచి ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో స్వల్ప గాయంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం, గోల్ఫ్ క్లబ్ వద్ద మరో సాయుధుడి అరెస్ట్ ఘటనలను ట్రంప్గుర్తుచేసుకున్నారు. ‘‘గొప్ప కార్యం మీతో చేయించాలనే మిమ్మల్ని దేవు డు కాపాడాడు అని చాలా మంది నాతో చెప్పారు’’అని ట్రంప్ అన్నారు. ‘‘దేశాన్ని కాపాడి మళ్లీ గ్రేట్గా మార్చేందుకే దేవుడు నాకీ అవకాశం ఇచ్చాడనుకుంటా. ఈ మిషన్ను మనం పూర్తిచేద్దాం. ఈ పని పూర్తి చేయడం అంత సులభమేం కాదు. శక్తినంతా కూడదీసుకుని దేశభక్తి, పోరాటపటిమ, స్ఫూర్తితో ఈ ఘనకార్యాన్ని సంపూర్ణం చేద్దాం. ఇది ఉత్కృష్టమైన బా ధ్యత. ఇంతటి ఉదాత్తమైన పని ప్రపంచంలోనే లేదు. తొలిసారి అధ్యక్షుడిగా పాలించినప్పుడూ ఒక్కటే ల క్ష్యంగా పెట్టుకున్నా. ఇచి్చన హామీలను నెరవేర్చాల ని. ఇప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానాలను తూ.చా. తప్పకుండా అమలుచేస్తా. ‘మేక్ అమెరికా.. గ్రేట్ ఎగేన్’ను సాకారం చేసేందుకు దేశం నలుమూలల నుంచి నడుంబిగించి కదలండి. ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. మనందరం ప్రయతి్నంచబోతున్నాం. సాధించబోతున్నాం’’అని ట్రంప్ అన్నారు. ఎలాన్ మస్క్ పై ప్రశంసలు ప్రసంగిస్తూ ట్రంప్ ప్రపంచ కుబేరుడు, ఎన్నికల్లో తన కోసం కోట్లు ఖర్చుచేసిన వ్యాపారదిగ్గజం ఎలాన్ మస్్కను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘ఇక్కడో తార(స్టార్) ఉద్భవించింది. అదెవరంటే మన ఎలాన్ మస్్క. ఆయనో అద్భుతమైన వ్యక్తి. ప్రజలు ప్రకృతి వైపరీతాల్లో చిక్కుకుపోయినప్పుడు మస్్కకు చెందిన స్టార్లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ వ్యవస్థ ప్రజలకు ఎంతో సాయపడింది. నార్త్కరోలినాలో హెలెన్ హరికేన్ వేళ స్టార్లింక్ ఎంతో సాయపడింది. అందుకే ఆయన్ను నేను ఇష్టపడతా. అసాధ్యాలను సుసాధ్యం చేశారు. స్పేస్ఎక్స్ వారి స్టార్íÙప్ కార్యక్రమంలో భాగంగా అత్యంత భారీ రాకెట్ బూస్టర్ను పునరి్వనియోగ నిమిత్తం మళ్లీ పసిపాపలాగా లాంచ్ప్యాడ్పై అద్భుతంగా ఒడిసిపట్టారు. మస్్కకు మాత్రమే ఇది సాధ్యం. ఆ ఘటన చూసి నేను భవిష్యత్తరం సినిమా అనుకున్నా. ఇంతటి ఘనత సాధించిన మస్క్ లాంటి మేధావులను మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఇలాంటి వాళ్లు ప్రపంచంలో కొందరే ఉన్నారు’’అని ట్రంప్ అన్నారు. జేడీ వాన్స్ను పొగిడిన ట్రంప్ కాబోయే ఉపాధ్యక్షుడు ఇతనే అంటూ జేడీ వాన్స్ను ట్రంప్ సభకు పరిచయం చేశారు. ‘‘ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ సరైన వ్యక్తి. ఆయన భార్య ఉషా సైతం అద్భుతమైన మహిళ. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావం చూపడంలో జేడీ వాన్స్కు ఎవరూ సాటిరారు. రిపబ్లికన్ పార్టీని విమర్శించే, ఆగర్భ శత్రువులుగా తయారైన కొన్ని మీడియా కార్యాలయాలకు చర్చకు వెళ్తారా? అని నేను అడిగితే వెంటనే ఓకే అనేస్తారు. సీఎన్ఎన్కు వెళ్లాలా?, ఎంఎస్ఎన్బీసీకి వెళ్లాలా? అని నన్నే ఎదురుప్రశ్నిస్తారు. ముక్కుసూటిగా దూసుకుపోయే, వైరివర్గాన్ని చిత్తుచేసే నేత’’ అంటూ వాన్స్ను ట్రంప్ ఆకాశానికెత్తేశారు. శక్తివంతంగా తిరిగొచ్చారు: వాన్స్ ‘‘మళ్లీ గెలిచి అత్యంత శక్తివంతంగా తిరిగొచి్చన అతికొద్ది మంది నేతల్లో ఒకరిగా ట్రంప్ నిలిచారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ పునరాగమనం ద్వారా ట్రంప్ సారథ్యంలో మేం దేశ ఆర్థిక ప్రగతి రథాన్ని ఉరకలు పెట్టిస్తాం. నాపై నమ్మకం ఉంచి ఉపాధ్యక్ష పదవికి నన్ను ఎంపిక చేసిన ట్రంప్కు కృతజ్ఞతలు’’అని జేడీ వాన్స్ అన్నారు. -
గెలుపు తర్వాత ట్రంప్ సంతోష క్షణాలు.. ప్రసంగం (ఫొటోలు)
-
హారిస్-ట్రంప్ హోరాహోరీ.. అదే జరిగితే..
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలు సర్వే నివేదికలు.. ఈసారి ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ పోటీ తప్పదని వెల్లడించిన విషయం తెలిసిందే. ఓటింగ్ సరళి పరిశీలిస్తే కూడా ట్రంప్-హారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్, హారిస్ ఇద్దరిలో ఎవరికీ మెజారిటీ వస్తుంది? గెలుపెవరిదో చెప్పటం కష్టంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు రాని పక్షంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్పై పడుతుంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశమవుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26, అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షుడవుతారు.అయితే.. చివరిసారిగా రెండు శతాబ్దాల కింద, అంటే 1800లో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. అధ్యక్ష బరిలోకి దిగిన థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రతినిధుల సభ ఓటింగ్ జరపగా.. జెఫర్సన్ విజేతగా నిలిచారు. 2020లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్లో 66 శాతమే మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే.. అమెరికాలో 24 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లున్నారు. కానీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మాత్రం 16.14 కోట్ల మందే. ఇది 2020 కంటే కూడా తక్కువ. 2020లో 16.8 కోట్ల మంది నమోదైన ఓటర్లుండగా వారిలో ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసింది 15.9 కోట్ల మంది మాత్రమే. ఈసారి ప్రచార సరళి ఆధారంగా పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తెలుస్తోంది. -
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ప్రహేళిక
డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలు, వ్యక్తిత్వం, విధానాలు, వీటన్నిటితో కూడిన గందర గోళం పట్ల అమెరికన్లు ఎలా స్పందిస్తారు అనేది 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అతి పెద్ద చిక్కుప్రశ్న. ట్రంప్ పతనం నుంచి ఉత్థానం చెందారు. అలాగని ఆయన ప్రజాదరణకు తీవ్రమైన పరిమి తులున్నాయి. ప్రధానంగా 4 అంశాల్లో ట్రంప్ వైఖరిని పరిశీలించాలి.1. ట్రంప్ నిలకడతనం: కొద్ది నెలల కాలంలోనే ఆయన రెండుసార్లు మరణానికి చేరువగా వెళ్లివచ్చారు. ప్రజారంగంలో బలంగా ఉండటానికి అవసరమైన స్పష్టమైన భౌతిక ధైర్యం ఆయనకు ఉంది. 2015లో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి నప్పటినుంచీ రాజకీయ ప్రత్యర్థులు, అమెరికా రాజకీయ పండి తులు కనీసం ఎనిమిది సార్లు ట్రంప్ రాజకీయ సంస్మరణను ఖాయం చేసేశారు. రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ 2016లో గెలు స్తారని ఎవరూ అనుకోలేదు. హిల్లరీ క్లింటన్ను అధ్యక్ష రేసులో ఓడించగలరని అసలు అనుకోలేదు. ఆయన అభ్యర్థిత్వానికి రష్యా మద్దతు విషయంలో సాగిన దర్యాప్తు నుండి బయట పడతారనీ ఎవరూ అనుకోలేదు. కోవిడ్ మహమ్మారిపై ఆయన అశాస్త్రీయ నిర్వహణను అమెరికన్లు క్షమిస్తారని కొద్దిమందే భావించారు.2020 ఎన్నికల ఫలితాల చట్టబద్ధతను అంగీకరించడానికి నిరాకరించిన తర్వాత, యునైటెడ్ స్టేట్స్ కాపిటల్పై దాడికి ఒక గుంపును పంపిన తర్వాత కూడా ట్రంప్ ఆధిపత్యం చలాయించే ఆటగాడిగా ఉంటారని ఎవరూ భావించలేదు. రిపబ్లికన్లు సెనే ట్ను కోల్పోయిన తర్వాత, 2022 మధ్యంతర ఎన్నికలలో హౌస్ను గెలవ లేకపోయిన తర్వాత అందరూ ట్రంప్ పనయిపోయిందని వ్యాఖ్యా నించారు. పైగా ఆయన నేరారోపణ కేసుల నుండి బయట పడతారని ఎవరూ నమ్మలేదు. కానీ ట్రంప్ ప్రతిసారీ విమర్శకుల అంచనాలను తారుమారు చేశారు. మరింత ప్రజాదరణ పొందారు. రిపబ్లికన్ పార్టీని నియంత్రిస్తున్నారు. 2. ట్రంప్ ప్రజాదరణకు పరిమితులు: 2016 నవంబర్లో ఆయన అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత, ఆయన నాయకత్వంలో పాల్గొన్న అన్ని ఎన్నికలనూ రిపబ్లికన్ పార్టీ ఓడిపోయింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రిపబ్లికన్లు హౌజ్ను కోల్పోయిన 2018 మధ్యంతర ఎన్నికలు ఇందులో ఉన్నాయి. 2021 జనవరిలో జార్జియా సెనేట్ ఎన్నికల్లో ఓటమి కూడా ఇందులో భాగం. అంతెందుకు, ట్రంప్ స్వయంగా ఓడిపోయిన 2020 అధ్యక్ష ఎన్నికలు కూడా దీంట్లో ఉన్నాయి. ఆయన ఆధ్వర్యంలో రిపబ్లికన్ పార్టీ స్థిరంగా ఓడిపోయింది. విస్తృతమైన ఓటర్లలో దాని ఆకర్షణ తగ్గింది.3. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో జాత్యహంకారం: ‘మేక్ అమె రికా గ్రేట్ ఎగైన్’ అని ట్రంప్ చేసే ప్రచారం ‘మేక్ అమెరికా వైట్ ఎగైన్’ అని స్పష్టమైపోయింది. ఆయన వ్యాఖ్యానాలు పక్షపాతాన్ని, ద్వేషాన్ని, భయాన్ని కలిగించేలా ఉన్నాయి. ఒహయో పట్టణంలోని అక్రమ హైతియన్ వలసదారులు పెంపుడు జంతువులను తింటు న్నారని ట్రంప్, జేడీ వాన్ ్స (రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి) నిరా ధారమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి పట్టణంలోని వలసదారులు ఎవరూ చట్టవిరుద్ధంగా ఉండటం లేదు. వాళ్లెవరూ పెంపుడు జంతువులను తినడమూ లేదు. ఇక ట్రంప్ గట్టి మద్దతుదారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లారా లూమర్ 9/11 స్మారక స్థూపం వద్దకు ట్రంప్తో పాటు విమానంలో వెళ్లి, డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భారతీయ మూలాలపై జాత్యహంకార దాడిని ప్రారంభించారు. ట్రంప్ స్వయంగా హారిస్పై జాత్య హంకార వ్యాఖ్యలను ప్రయోగించారు. ట్రంప్ గెలుపును వేడుకగా జరుపుకొనే భారత మితవాద శక్తులు దీనిని గుర్తుంచుకోవాలి.4. ట్రంప్ విదేశాంగ విధానం: డెమొక్రాట్లు, పాత రిపబ్లికన్లకంటే కూడా సంకుచిత భావన కలిగిన అమెరికా గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. నిజానికి, ట్రంప్ తన మొదటి హయాంలో ‘అబ్రహం ఒప్పందాల’కు మధ్యవర్తిత్వం వహించారు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా వైఖరిని పెంచారు. ఇరాన్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలను ఆమోదించారు. ఉత్తర కొరియాతో చర్చలు జరిపారు. ఇవన్నీ ఆయన ప్రపంచవ్యాప్త వ్యవహారాలు జరపగలరని సూచించాయి. కానీ అంతర్జాతీయ వ్యవస్థలో ప్రబలమైన ప్లేయ ర్గా ఉన్న అమెరికా ఆర్థిక, సైనిక బాధ్యతలను ట్రంప్ అసహ్యించుకుంటారు. దానితో వచ్చే ప్రయోజనాలను ఆయన చూడలేరు లేదా ఈ ప్రయోజనాలు లేవని నటిస్తారు. ప్రపంచీకరణ వల్ల, ప్రపంచంలో అమెరికా పాత్ర వల్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పో యారనీ, అసమానతలు పెరిగాయనీ వాదిస్తారు.ట్రంప్కు జనాదరణ ఉందనేది నిజం. అదే సమయంలో ఆయన ఆధిపత్యం కొనసాగడం లేదన్నదీ నిజమే. ఎన్నికల ఫలితా లను కచ్చితంగా అంచనా వేయడం ఎందుకు కష్టమో దీన్నిబట్టి అర్థమవుతోంది. గుర్తింపు ఆధారిత రాజకీయాలను ఆయన మిత వాదం నుండి స్వీకరించారు. పాత వామపక్షీయుల ఉదారవాద ఆర్థిక శాస్త్రం, విదేశాంగ విధాన విమర్శలనూ స్వీకరించారు.ట్రంప్ను సైద్ధాంతికంగా ఒక వర్గంలోకి చేర్చడం ఎందుకు కష్టమో ఇది వివరిస్తుంది. అమెరికన్లు ఆయన వ్యక్తిత్వాన్ని, విధాన మిశ్ర మాన్ని, దానితో వచ్చే గందరగోళాన్ని ఇష్టపడతారా లేదా అనేది 2024 ఎన్నికలకు సంబంధించిన ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయింది.ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
USA Presidential Elections 2024: ట్రంప్ నోట ఓటమి మాట
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో ఓడితే ఇంకెప్పుడూ పోటీ చేయబోనని రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ చేతిలో ఓడితే మళ్లీ పోటీ చేస్తారా అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఈ మేరకు బదులిచ్చారు. అయితే విజయం తనదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ తన ఓటమి గురించి మాట్లాడటం గత నాలుగు రోజుల్లో ఇది రెండోసారి. తాను ఓడటమంటూ జరిగితే యూదు ఓటర్ల వల్లేనని గురువారం ఆయన వ్యాఖ్యానించారు. ‘‘అమెరికాలోని యూదుల్లో 60 శాతం శత్రువుకు మద్దతిస్తున్నారు. ఆ కారణంగా నేనోడితే ఇజ్రాయెల్ ఉనికిలోనే ఉండదు’’అంటూ హెచ్చరించారు. 78 ఏళ్ల ట్రంప్ గత మూడు ఎన్నికల నుంచి వరుసగా పోటీ చేస్తున్నారు. అమెరికా చట్టాల ప్రకారం అధ్యక్షునిగా రెండుసార్లకు మించి పని చేయడానికి వీల్లేదు. కనుక ఈసారి ట్రంప్ గెలిస్తే 2028లో పోటీ చేయలేరు. -
ఎన్నికల్లో ఓడిపోతే.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గనుక ఓడిపోతే.. ఇక జీవితంలో మరోసారి బరిలో నిలవనని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారాయన.‘‘ఈసారి అధ్యక్ష ఎన్నికలో గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తా. ఈసారి ఓడిపోయే ప్రసక్తే ఉండదని అనుకుంటున్నా. ఎందుకంటే అమెరికన్లలో డెమోక్రట్లపై అంతలా వ్యతిరేకత పెరిగిపోయింది. ఒకవేళ ఓటమి పరిస్థితే ఎదురైతే మాత్రం.. ఇక శాశ్వతంగా పోటీకి దూరమవుతా. ఇంకోసారి పోటీ చేయను’’ అని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడి కోసం జరిగిన 2016 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేశారు ట్రంప్. ప్రత్యర్థి హిలరీ క్లింటన్పై ఘన విజయం సాధించి.. 2017 నుంచి 2021 (జనవరి) మధ్య అధ్యక్షుడిగా పని చేశారు. 2021 ఎన్నికల్లో బైడెన్పై మరోసారి పోటీ చేస్తానని 2020లోనే ట్రంప్ ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.ఇదీ చదవండి: ట్రంప్ అంతలా ద్వేషించినా.. ఆమె లాభపడింది!ముచ్చటగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో నిలబడతానని.. 2022 నవంబర్ నుంచే చెబుతూ వస్తున్నారు. ఈ ఏడాది ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాగా.. నాటకీయ పరిణామాల అనంతరం బైడెన్ వైదొలగడంతో కమలా హారిస్ తెర మీదకు వచ్చారు. నవంబర్ 5న 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ట్రంప్కు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి గట్టి పోటీ ఎదురు కావొచ్చని సర్వేలు చెబుతున్నాయి. కీలక రాష్ట్రాల్లోనూ కమలదే పైచేయి కొనసాగుతోందని నివేదికలు ఇస్తున్నాయి. తొలి డిబేట్లో బైడెన్పై నెగ్గిన ట్రంప్.. రెండో డిబేట్లో కమలా హారిస్పై మాత్రం ఆయన తడబడ్డారు. దీంతో మూడో(ఆఖరి)డిబేట్కు దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 23వ తేదీన మూడో డిబేట్ జరగాల్సి ఉంది. ఇప్పటికే తాను డిబేట్కు రెడీ అంటూ కమల ప్రకటించారు. ఈ సవాల్ను ట్రంప్ అంగీకరిస్తారో? లేదో? అనే ఆసక్తి నెలకొంది. -
కమలా హారీస్కు పుతిన్ మద్దతు.. ట్విస్ట్ ఇచ్చిన లావ్రోవ్
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాల ఫోకస్ ఉంది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే చర్చ కూడా నడుస్తోంది. ఎన్నికల్లో పలు దేశాలు నేతలు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే అంశం కూడా ఎన్నికల్లో కీలక కానుంది. ఇక, కమలా హారీస్కే తమ మద్దతు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ క్లారిటీ ఇచ్చారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలపై లావ్రోవ్ తాజాగా స్పందిస్తూ.. ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్కు మద్దతు ఉంటుందని పుతిన్ సరదాగా మాత్రమే అన్నారు. పుతిన్ అప్పుడప్పుడు జోక్స్ వేస్తుంటారు. అందులో భాగంగానే ఇలా మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మా జోక్యం ఏమీ ఉండదు. ఇంతకుముందు, ఇప్పుడు.. ఎన్నికల్లో జోక్యం చేసుకోము. మా వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు అంటూ కామెంట్స్ చేశారు. BREAKING: Russian Foreign Minister Sergei Lavrov said in an interview with Sky News Arabia that Putin was JOKING when he said he wanted Kamala Harris to win the election in November.— Amanda Liyang (@esraa28305334) September 22, 2024ఇదిలా ఉండగా.. కొద్దిరోజులు క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్.. అమెరికా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కమలాతో పనిచేయడం సులువని తనదైన శైలిలో మాట్లాడారు. అయితే, హారీస్ ఎంపికలో జో బైడెన్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. ఏదేమైనా.. ఆ దేశ అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని అక్కడివారే నిర్ణయిస్తారని ముగించారు.అనంతరం, పుతిన్ వ్యాఖ్యలపై వైట్హౌస్ వర్గాలు స్పందించాయి. పుతిన్ కామెంట్స్కు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కౌంటరిచ్చారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని నిర్ణయించేది కేవలం స్థానికులే. మా అధ్యక్ష ఎన్నికలపై పుతిన్ మాట్లాడటం ఆపేస్తే మంచింది. ఈ ఎన్నికల్లో మీ జోక్యాన్ని ఎవరూ కోరుకోవడం లేదు. భవిష్యత్లో కూడా ఎన్నికల గురించి మాట్లాడకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బైడెన్తో చర్చలు ఫలించాయి: ప్రధాని మోదీ -
ట్రంప్ సమాచారాన్ని దొంగిలించి.. బైడెన్ టీంకు ఆఫర్?
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి సంబంధించిన కీలకమైన విషయాలను అమెరికా ఇంటెలిజెన్స్, లా ఎన్పోర్స్మెంట్ ఏజెన్సీలు వెల్లడించాయి. డొనాల్డ్ ట్రంప్నకు చెందిన ప్రచార, వ్యక్తిగత సమాచారాన్ని ఇరానియన్ సైబర్అటాకర్లు దొంగిలించాలరని పేర్కొన్నాయి. ఆ సమాచారాన్ని అధ్యక్షుడు జో బైడెన్కు సిబ్బందికి ఇవ్వడానికి ఆఫర్ చేసినట్లు తెలిపాయి.‘‘అధ్యక్షుడు జో బైడెన్ ప్రచార సిబ్బందికి ఇరానియన్ సైబర్ అటాకర్లు గుర్తు తెలియని ఈ మెయిల్స్ పంపించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించి దొంగిలించిన ప్రచార, వ్యక్తిగత విషయాలను పంపించారు. ట్రంప్ ప్రచారానికి సంబంధించి దొంగిలించిన సమాచారాన్ని యూఎస్ మీడియా సంస్థలతో పంచుకోవడానికి కూడా ప్రయత్నించారు. అయితే ఏ మీడియా సంస్థలకు ఇవ్వాలనుకున్నారో విషయంపై స్పష్టత లేదు’ అని ఇంటెలిజెన్స్, లా ఎన్పోర్స్మెంట్ ఏజెన్సీలు వెల్లడించాయి.ఇరానియన్ సైబర్ అటాకర్ల మెయిల్స్కు బైడెన్ ప్రచార బృందం స్పందించలేదని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఇరాన్ ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తోందని ఆగస్టులో పలు ఎజెన్సీలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. రష్యా, ఇరాన్, చైనాలు అమెరికా సమాజంలో విభేదాలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని అగ్రరాజ్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆరోపణలు చేశాయి. ఇక.. జో బైడెన్ అధ్యక్ష బరి నుంచి వైదొలిగి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు.చదవండి: ట్రంప్పై హత్యాయత్నం!.. మస్క్ అనుమానం -
ట్రంప్కు భారీ మెజార్టీ.. కమలాకు ట్విస్ట్ ఇచ్చిన కీలక యూనియన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక, అమెరికా పలు యూనియన్ల ఓట్ల కీలకంగా మారనున్నాయి. కొన్ని యూనియన్ల సభ్యులు డొనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, అమెరికాలో ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్ టీమ్స్టర్స్ యూనియన్కు సంబంధించిన ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారానున్నాయి. ఈ యూనియల్లో దాదాపు 1.3 మిలియన్ల సభ్యులు ఉన్నారు. ఈ యూనియన్లో ట్రక్ డ్రైవర్లు, ఎయిర్లైన్స్ పైలట్స్, జూకీపర్ల వరకు అనేక ఇతర కార్మికులు కూడా ఉన్నారు. ఇక, యూనియన్కు సంబంధించి బుధవారం ఎలక్ట్రానిక్ పోల్ను విడుదల చేశారు. ఈ పోల్స్లో ఎక్కువ మంది డొనాల్డ్ ట్రంప్వైపే మొగ్గుచూపారు.యూనియన్ సభ్యుల జాతీయ ఎలక్ట్రానిక్ పోల్ ప్రకారం.. ట్రంప్కు 59.6 శాతం ఓట్లు రాగా, కమలా హారీస్కు మాత్రం కేవలం 34 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో, కమలాపై ట్రంప్ పైచేయి సాధించారు. ఇక, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకోకముందు ఆయనకు మద్దుతుగా 44 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, యూనియన్లో మెజార్టీ ఓటర్లు ట్రంప్కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఓట్లు అభ్యర్థులు ఇద్దరికీ యూనియన్ కీలకంగా మారనుంది. అయితే, 2000 సంవత్సరం నుంచి ఈ యూనియన్ సభ్యులు డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇక, ఈ ఎన్నికల్లో మాత్రం రిపబ్లిక్ పార్టీ అభ్యర్థికి సపోర్టు ఇస్తూ పోల్స్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.ఇప్పటి వరకు యూనియన్ మద్దతు ఇలా..1984లో ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్కు1988లో వైస్ ప్రెసిడెంట్ జార్జ్ హెచ్డబ్ల్యు బుష్తో సహా రిపబ్లికన్లను ఆమోదించారు.1996 తర్వాత యూనియన్ ఆమోదం పొందకపోవడం ఇదే మొదటిసారి.2000 నుండి ప్రతి డెమోక్రాటిక్ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నారు. ఇది కూడా చదవండి: Israel Hezbollah War: పేజర్లో 3 గ్రాముల పేలుడు పదార్థం! -
యుద్ధానికి ముగింపు పలకాలి
ఫిలడెల్ఫియా: గాజా స్ట్రిప్లో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్ ఇకనైనా మారణహోమం ఆపాలని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ సాయుధుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందమే గాజా్రస్టిప్ సమస్యకు అసలైన పరిష్కారమని ఆమె అభిప్రాయపడ్డారు. గాజాలోని ప్రతి ఒక్కరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కాల్పుల విరమణకు ఇరు పక్షాలు ముందుకు రావాలని ఆమె అభిలషించారు. ఫిలడెలి్ఫయాలో జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ (ఎన్ఏబీజే)సమావేశంలో కమల పాల్గొని ప్రసంగించారు. దాదాపు 45 నిమిషాలపాటు పలు అంశాలపై ఆమె మాట్లాడారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో బదులిచ్చారు. హైతీలు ఇంటి పెంపుడు జంతువులను తింటున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను, వలసదారులను సామూహిక బహిష్కరణ చేస్తామని ట్రంప్ ఇచి్చన హామీని హారిస్ తప్పుబట్టారు. ‘ట్రంప్ ద్వేషపూరిత వ్యాఖ్యలు హానికరం. ఇలాంటి వాటిని సహించకూడదు’అని అన్నారు. ఆర్థిక అంశాలపైనా ఆమె విస్తృతంగా మాట్లాడారు. ‘‘అమెరికన్లను ప్రభావితం చేసే పెద్ద సమస్యలలో సరిపడా గృహాలు లేకపోవడం కూడా ఒకటి. నేనుఅధ్యక్షురాలిగా ఎన్నికైతే గృహాల నిర్మాణానికి ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తా. చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ను 6,000 డాలర్లకు విస్తరిస్తాం. దీంతో అమెరికన్లు తమ ఆదాయంలో ఏడు శాతం కంటే ఎక్కువ మొత్తాలను పిల్లల సంరక్షణకు చెల్లించాల్సిన అవసరం లేదు’’అని కమల వ్యాఖ్యానించారు. కమలకు నల్లజాతీయుల బాసట 2020 అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతీయుల్లో ఏకంగా 92 శాతం మంది అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్కు మద్దతు పలికారు. రిపబ్లికన్ పార్టీ తరఫున నాటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు కేవలం 8 శాతం మంది నల్లజాతీయులే మద్దతు పలికారు. ఈ సారిసైతం అదే సరళి కనిపిస్తోంది ఎన్ఏఏసీపీ సర్వే తేలి్చంది. ఇటీవల విడుదలైన ఎన్ఏఏసీపీ సర్వే ప్రకారం 63 శాతం మంది నల్లజాతి ఓటర్లు కమలా హారిస్కు మద్దతు పలికారు. గతంతో పోలిస్తే డెమొక్రటిక్ పార్టీ నుంచి నల్లజాతీయులు కాస్తంత దూరం జరిగారని చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటికీ నల్లజాతీయుల మెజారిటీ మద్దతు కమలకే దక్కడం విశేషం. ఈసారీ పోటీలో నిలిచిన ట్రంప్కు కేవలం 13 శాతం మంది నల్లజాతీయులు మద్దతుగా నిలబడినట్లు సర్వే వెల్లడించింది. పెన్సిల్వేనియా, జార్జియా వంటి రాష్ట్రాల్లో నల్లజాతీయుల మద్దతు నిర్ణయాత్మకంగా ఉంటుంది. పెన్సిల్వేనియా అత్యంత కీలకమైన రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యం ఎన్ఏబీజేకు ఉందని చెబుతారు. దీంతో వీరిని ఎలాగైనా తమ వైపునకు తిప్పుకోవాలని కమలా హారిస్, ట్రంప్ ఇద్దరూ చెమటోడుస్తున్నారు. అయితే గతంలో ట్రంప్ చేసిన జాత్యాహంకార వ్యాఖ్యల కారణంగా ఇప్పటికీ నల్లజాతీయుల మద్దతు కూడగట్టడం ఆయనకు సంక్లిష్టంగా తయారైంది. జార్జియాలో మూడు వంతుల మంది నల్లజాతీయులే కావడంతో ఇక్కడా వారి ఓటు నిర్ణయాత్మకంగా మారింది. -
స్పెయిన్కు పరారైన... వెనిజులా విపక్ష నేత
వెనిజులాలో నికొలస్ మదురో నియంత పాలనకు ముగింపు ఖాయమని ఆశించిన ఆ దేశ ప్రజలకు మరింత నిరాశ కలిగించే పరిణామమిది. అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల సంయుక్త అభ్యరి్థగా మదురోతో తలపడ్డ ఎడ్మండో గొంజాలెజ్ తాజాగా దేశం వీడి స్పెయిన్లో ఆశ్రయం పొందారు. జూలైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వాస్తవ విజేత గొంజాలెజేనని విపక్షాలతోపాటు పలు విదేశీ ప్రభుత్వాలు కూడా పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గొంజాలెజ్కు ఆశ్రయం కలి్పంచేందుకు స్పెయిన్ అంగీకరించిందని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రొడ్రిగెజ్ ప్రకటించారు. దీనిపై గొంజాలెజ్ గానీ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో గానీ స్పందించలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మచాడోపై మదురో ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో ఆఖరి దశలో గొంజాలెజ్ రంగంలోకి దిగడం తెలిసిందే. అయితే, వెనిజులా వీడాలన్నది గొంజాలెజ్ నిర్ణయం మాత్రమేనని, తాము పంపిన ఎయిర్ఫోర్స్ విమానంలో తమ దేశం చేరుకున్నారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆయన వినతి మేరకే ఆశ్రయం కలి్పంచామని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ చెప్పారు. ‘వెనిజులా ప్రజల హక్కుల కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. గొంజాలెజ్ వెనిజులా హీరో. ఆయన భద్రత బాధ్యతను స్పెయిన్ తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. వెనిజులాకు రావడానికి కొద్ది రోజుల ముందే రాజధాని కారకాస్లోని తమ రాయబార కార్యాలయంలో గొంజాలెజ్ తలదాచుకున్నారని వెల్లడించారు. ఓటరు జాబితాను ఫోర్జరీ చేశారంటూ వచి్చన ఆరోపణలపై విచారణకు రావాలంటూ మూడు పర్యాయాలు సమన్లు పంపినా హాజరు కాలేదని దేశ అటార్నీ జనరల్ గొంజాలెజ్పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఆయన స్పెయిన్ రాయబార కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచి్చంది. మడురో నిరంకుశ విధానాలతో ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు స్పెయిన్లో ఆశ్రయం పొందారు. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 45 వేల మంది వెనిజులా నుంచి స్పెయిన్కు వలస వెళ్లారు. 2022 గణాంకాల ప్రకారం వెనిజులా వాసులు కనీసం 2.12 లక్షల మంది స్పెయిన్లో ఉంటున్నారు. – కారకాస్ -
Nostradamus: కమలా హారిస్దే విజయం
నవంబర్లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం సాధిస్తారని అమెరికా ఎన్నికల నోస్ట్రడామస్గా పేరొందిన చరిత్రకారుడు అలాన్ లిచ్మన్ జోస్యం చెప్పారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అలాన్ దాదాపు ఖచ్చితంగా ఊహించి చెప్పడం విశేషం. అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ని్రష్కమిస్తే వాళ్ల పార్టీ గెలుపు కష్టమేనన్న ఆయన.. ఇప్పుడు హారిస్ వచ్చాక తప్పక విజయం సాధిస్తారని చెప్పడం హాట్ టాపిక్గా మారింది. డెమొక్రాట్లు అప్పగించిన కీలక బాధ్యతను స్వీకరించిన కమలా హారిస్ అంతే ధీమాతో దూసుకెళ్తూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ను ఓడించేందుకు రెడీ అయ్యారని అలాన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఫలితం ఏమిటన్నది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి బయటకు వచ్చి ఓటు వేయండి’’అని తాజాగా న్యూయార్క్ టైమ్స్కు ఇచి్చన 7 నిమిషాల వీడియో ఇంటర్వ్యూలో చెప్పారు. 1984 నుంచి విశ్లేషణలు 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్మాన్ ‘గెలుపునకు 13 సూత్రాలు’అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనావేస్తానని చెప్పారు. 2016లో ట్రంప్ గెలుస్తాడని, 2020లో బైడెన్ గెలుస్తాడని చెప్పిన మాటలు నిజం కావడం విశేషం. 2000లో అల్గోర్పై జార్జి డబ్ల్యూ బుష్ విజయం సాధించడం మినహా మిగిలిన ఫలితాలన్నీ ఆయన చెప్పినట్లుగా రావడం గమనార్హం. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని ప్రధాన ఒపీనియన్ పోల్స్ చెప్పగా.. లిచ్మన్ మాత్రం ట్రంప్ తిరుగులేని విజయం సాధిస్తారని అంచనా వేశారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉండగా అభిశంసనకు గురవుతారని చెప్పారు. అలాన్ చెప్పినట్లే ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు గురయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గెలిపిస్తే టిక్టాక్ను కాపాడుతా: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే చైనాకు చెందిన సోషల్ మీడియా వేదిక ‘టిక్టాక్’ను కాపాడుతానని అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో టిక్టాక్కు తాను రక్షకుడిని అవుతానని ఉద్ఘాటించారు. టిక్టాక్ కావాలని కోరుకునేవారంతా అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. అమెరికాలో తన ప్రత్యర్థి వర్గం టిక్టాక్ను మూసివేయడానికి కుట్ర పన్నుతోందని పరోక్షంగా అధ్యక్షుడు జో బైడెన్పై ఆరోపణలు గుప్పించారు. టిక్టాక్ను అమెరికా కంపెనీకి విక్రయిండానికి దాని మాతృ సంస్థపై ఒత్తిడి పెంచేలా లేదా అమెరికాలో టిక్టాక్ను నిషేధించేలా జో బైడెన్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో ఓ బిల్లుపై సంతకం చేసింది. నిజానికి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020లో టిక్టాక్పై నిషేధం విధించడం గమనార్హం. -
కమలా హారిస్కు ఒక్క నెలలో రూ.3,030 కోట్ల విరాళాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు ప్రజల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఆగస్టు నెలలో ఆమెకు 30 లక్షల మంది దాతల నుంచి 361 మిలియన్ డాలర్ల(రూ.3,030 కోట్లు) విరాళాలు లభించాయి. ఈ విషయం కమలా హారిస్ ప్రచార బృందం శుక్రవారం వెల్లడించింది. తన ప్రత్యరి్థ, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే రెండు రెట్లకుపైగా ఎక్కువ విరాళాలు కమలా హారిస్ అందుకోవడం విశేషం. ట్రంప్కు గత నెలలో కేవలం 130 మిలియన్ డాలర్లు (రూ.1,091 కోట్లు) విరాళంగా లభించాయి. ఆగస్టు నెలాఖరు నాటికి కమలా హారిస్ చేతిలో 404 మిలియన్ డాలర్ల నిధులున్నాయి. ట్రంప్ వద్ద కేవలం 295 మిలియన్ డాలర్లు ఉన్నాయి. -
దూసుకుపోతున్న కమల.. ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఆసక్తికర పోటీ నడుస్తోంది. ప్రచారంలో కమలా హారీస్ దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు ట్రంప్పై కమల పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆగస్టులో ట్రంప్నకు వచ్చిన విరాళాల కంటే హారిస్ రెట్టింపు విరాళాలు సేకరించడం విశేషం.కాగా, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక, తాజాగా ఆగస్టులో ట్రంప్నకు వచ్చిన విరాళాల కంటే హారిస్ రెట్టింపు విరాళాలు సేకరించడం గమనార్హం. ఇందులో భాగంగా కమలా హారీస్ ఆగస్టులో 30లక్షల మంది దాతల నుంచి 36.1కోట్ల డాలర్ల విరాళాలను సేకరించారు. ఇదే ఊపులో సెప్టెంబర్లో న్యూయార్క్, అట్లాంటా, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు హారిస్ బృందం ఏర్పాట్లు చేస్తోంది.మరోవైపు.. ట్రంప్ మాత్రం కమలా హారీస్తో పోల్చుకుంటే కొంత వెనుకంజలో ఉన్నారు. ట్రంప్ ఆగస్టులో కేవలం 13కోట్ల డాలర్లను మాత్రమే సేకరించినట్లు ఆయన బృందం వెల్లడించింది. ఈ క్రమంలో ట్రంప్ కంటే కమలకు.. దాదాపు మూడు రెట్లు ఎక్కువ విరాళాలు వచ్చాయి. ఇక, డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కమలా హారీస్ పూర్తి స్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టారు. నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. -
‘ట్రంప్’ అనే పేజీని తిప్పేందుకు అమెరికన్లు సిద్ధం: కమలా హారీస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్.. మాజీ అధ్యక్షుడుపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రాజకీయ చరిత్ర అనే పుస్తకంలో ట్రంప్ అనే పేజీని తిరగేసేందుకు అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.ఇక, తాజాగా కమలా హారీస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా ప్రజలు కొత్త చరిత్ర తిరగరాసేందుకు సిద్ధమయ్యారు. అమెరికా రాజకీయ చరిత్ర అనే పుస్తకంలో ట్రంప్ పేజీని తిరగేసేందుకు ప్రజలు రెడీగా ఉన్నారు. ట్రంప్ మాటలను నమ్మడానికి అమెరికన్లు సిద్ధంగా లేరు. ప్రజలు కొత్త మార్గం కోసం సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దురదృష్టవశాత్తూ గత దశాబ్దంలో మన దేశాన్ని విభజించడం గురించి ఎజెండాను ముందుకు తెచ్చే వ్యక్తిని మాజీ అధ్యక్షుడి(ట్రంప్)గా కలిగి ఉన్నాము. ఇకపై అలాంటి తప్పు జరగదని భావిస్తున్నాను. ట్రంప్.. అమెరికా అభివృద్ధిలో పలువురి పాత్ర, వారి కృషిని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇవ్వన్నీ ప్రజల మనస్సుల్లో ఉన్నాయి.ఇదే సమయంలో మరో సంచలన ప్రకటన చేశారు. తాను అధికారంలోకి వస్తే కేబినెట్లోకి రిపబ్లికన్ను తీసుకుంటానని ప్రకటించారు. ఇక, గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని ఆమె ఆకాంక్షించారు. మిత్ర దేశమైన ఇజ్రాయెల్ విషయంలో అధ్యక్షుడు బైడెన్ విధానాలనే తాను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. Vice President Harris: I think that people are ready for a New Way Forward. Sadly, in the last decade, we have had in the former president, someone who has been pushing an agenda that is about diminishing the character and the strength of who we are as Americans and dividing our… pic.twitter.com/r78F4cC2ys— Kamala HQ (@KamalaHQ) August 30, 2024ఇదే అమెరికా అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. మొదటగా, మధ్యతరగతికి మద్దతు ఇవ్వడానికి, వారిని బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నా అత్యంత ప్రాధాన్యతలలో ఇది ఒకటి. నేను అమెరికా ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆశయాలను నెరవేర్చడమే మా లక్ష్యం. సరిహద్దుల్లో అక్రమ వలసలపై కఠినంగా ఉండేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. అక్రమ వలసలను అసలు అంగీకరించేది లేదు. పన్నుల విషయంలో కూడా కొన్ని విధివిధానాలను రూపొందించడం జరిగింది. దాని ప్రకారం ముందుకు సాగుతాం. శిలాజ ఇంధనాలు అధికంగా ఉండే పెన్సిల్వేనియాలో వివాదాన్ని పరిష్కరించాలని స్పష్టమైన లక్ష్యంతో ఉన్నాం అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఎన్నికల సందర్బంగా అమెరికన్లను ఆకట్టుకునేందుకు ట్రంప్ వరాలు ఇస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే మహిళలకు ఉచిత ఐవీఎఫ్ చికిత్సను అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. లేనిపక్షంలో బీమా కంపెనీలు తప్పనిసరిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే, దీన్ని ఎలా అమలు చేయనున్నారు? నిధులను ఎలా సమకూరుస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. -
సమస్యల నడుమ సారథ్య పోరు..
ద్వీప దేశం శ్రీలంక రెండేళ్ల క్రితం కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అన్నం ముద్దకు, నీటి చుక్కకూ దిక్కులేని పరిస్థితి దాపురించడంతో జనం కన్నెర్రజేశారు. ప్రభుత్వంపై మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఎటు చూసినా మొన్నటి బంగ్లాదేశ్ తరహా దృశ్యాలే కని్పంచాయి. దాంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స పదవి వీడి పారిపోయారు. నెలల పాటు సాగిన అనిశ్చితి తర్వాత అన్ని పారీ్టల అంగీకారంతో పగ్గాలు చేపట్టిన రణిల్ విక్రమసింఘె పలు సంస్కరణలకు తెర తీశారు. అయినా దేశం ఆర్థిక ఇక్కట్ల నుంచి ఇప్పుటికీ బయట పడలేదు. నానా సమస్యల నడుమే సెపె్టంబర్ 21న అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది...బరిలో 39 మంది అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. 39 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరిలో మాజీ ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సెకాతో పాటు ఇద్దరు బౌద్ధ సన్యాసులూ ఉండటం విశేషం! అయితే ప్రధాన పోటీ మాత్రం అధ్యక్షుడు రణిల్, శక్తిమంతమైన రాజపక్స కుటుంబ వారసుడు నమల్, విపక్ష నేత సజిత్ ప్రేమదాస మధ్యే కేంద్రీకృతమైంది. మిగతా వారిలో చాలామంది వీళ్ల డమ్మీలేనని చెబుతున్నారు. ఈ ముగ్గురిలోనూ ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టమైన మొగ్గు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో తొలి దశలో ఫలితం తేలడం అనుమానమేనని భావిస్తున్నారు.రణిల్ విక్రమ సింఘె ప్రస్తుత అధ్యక్షుడు. పూర్వాశ్రమంలో పేరుమోసిన లాయర్. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ప్రధానిగా చేసిన రాజకీయ దిగ్గజం. ఆయన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ)కి పార్లమెంటులో ఉన్నది ఒక్క స్థానమే. అయినా అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు 2022 జూలైలో అధ్యక్షుడయ్యారు. దేశాన్ని సంక్షోభం నుంచి కాస్త ఒడ్డున పడేయగలిగారు. కానీ 225 మంది ఎంపీలున్న రాజపక్సల శ్రీలంక పొడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) మద్దతుకు బదులుగా ఆ పార్టీ నేతల అవినీతికి కొమ్ము కాస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగారు. ఎస్ఎల్పీపీ సొంత అభ్యర్థిని బరిలో దింపడం పెద్ద ప్రతికూలాంశం. పైగా రణిల్ పారీ్టకి క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. దీనికి తోడు విపక్ష నేత సజిత్ ప్రేమదాస నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. తాజాగా 92 మంది ఎంపీలు మద్దతు ప్రకటించడం 75 ఏళ్ల రణిల్కు ఊరటనిచ్చే అంశం.సజిత్ ప్రేమ దాస మాజీ అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కుమారుడు. విపక్ష నేత. 2019లో రణిల్ పార్టీ నుంచి విడిపోయి సమగి జన బలవేగయ (ఎస్జేబీ) పేరిట వేరుకుంపటి పెట్టుకున్నారు. వామపక్ష భావజాలమున్న 57 ఏళ్ల సజిత్కు యువతలో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. అవినీతినే ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. దానిపై ఉక్కుపాదం మోపుతానన్న హామీతో జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. జనంపై పన్నుల భారాన్ని తక్షణం తగ్గించాల్సిందేనన్న సజిత్ డిమాండ్కు భారీ స్పందన లభిస్తోంది. దీనికితోడు శ్రీలంక ముస్లిం కాంగ్రెస్, డెమొక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ వంటి పారీ్టలతో పాటు చిన్న గ్రూపుల మద్దతుతో ఆయన నానాటికీ బలపడుతున్నారు. పలు తమిళ సంఘాల దన్ను సజిత్కు మరింతగా కలిసిరానుంది.నమల్ రాజపక్స మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు. 38 ఏళ్ల నమల్ శక్తిమంతమైన రాజపక్స రాజకీయ కుటుంబం నుంచి యువతరం వారసునిగా బరిలో దిగారు. అధ్యక్ష పోరులో తనకే మద్దతివ్వాలన్న రణిల్ విజ్ఞప్తిపై ఎస్ఎల్పీపీ రోజుల తరబడి మల్లగుల్లాలు పడింది. చివరికి సొంతగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి రణిల్ సర్కారుకు మద్దతు ఉపసంహరించింది. అనూహ్యంగా నమల్ను బరిలో దించింది. ఆయన చిన్నాన్న గొటబయ రాజపక్సపై రెండేళ్ల క్రితం వెల్లువెత్తిన జనాగ్రహం ఇంకా తాజాగానే ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించం నమల్ ముందున్న అతిపెద్ద సవాలు. దీనికి తోడు ఎస్ఎల్పీపీకి 225 మంది ఎంపీలున్నా వారిలో పలువురు క్రమంగా రణిల్ వైపు మొగ్గుతున్నారు. మిగతా వారిలోనూ చాలామంది పార్టీ ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు.అనూర కుమార దిస్స నాయకె నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) సంకీర్ణం తరఫున బరిలో ఉన్నారు. పార్లమెంటులో కేవలం 3 సీట్లే ఉన్నా సుపరిపాలన హామీతో ఆకట్టుకుంటున్నారు. జనతా విముక్తి పెరమున (జేవీపీ) వంటి పార్టీల దన్ను కలిసొచ్చే అంశం. ఇక అంతర్యుద్ధ సమయంలో హీరోగా నిలిచిన ఫీల్డ్ మార్షల్ ఫోన్సెకా తనకు మద్దతుగా నిలిచే పారీ్టల కోసం చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కమల పౌరసత్వంపై కొత్త ట్విస్ట్.. అమెరికాలో చర్చ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అమెరికాలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుతున్న వేళ అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ అనర్హురాలంటూ సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. దీంతో, ఈసారి అధ్యక్ష ఎన్నికల మరింత రసవత్తరంగా మారింది.కాగా, యూఎస్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రిపబ్లికన్ అసెంబ్లీస్ (ఎన్ఎఫ్ఆర్ఏ) అనే సంస్థ కమలా హారిస్ అనర్హురాలంటూ సరికొత్త వాదనను ప్రచారంలో పెట్టింది. ‘సహజ పౌరసత్వం’ ఉన్నవాళ్లు మాత్రమే అధ్యక్ష పదవికి అర్హులని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందన్నది దాని వాదన. ‘అమెరికా పౌరసత్వం ఉన్న దంపతులకు ఈ గడ్డపై పుట్టినవాళ్లను మాత్రమే సహజ పౌరులుగా రాజ్యంగం నిర్వచిస్తోంది. 1857 నాటి ప్రఖ్యాత డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ఫర్ కేసులో అమెరికా సుప్రీంకోర్టు తీర్పు కూడా దీన్ని ధృవీకరిస్తోంది. ఈ నిర్వచనం ప్రకారం హారిస్తో పాటు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటివాళ్లు కూడా అధ్యక్ష పదవికి అనర్హులే’ అని ఎన్ఎఫ్ఆర్ఏ చెప్పుకొచ్చింది. ఈ కీలక మౌలిక ప్రాతిపదికను తుంగలో తొక్కుతూ డెమోక్రటిక్ పార్టీ హారిస్కు అధ్యక్ష అభ్యర్థిత్వం కట్టబెట్టిందని ఆరోపించింది.మరోవైపు.. న్యాయ నిపుణులు మాత్రం ఎన్ఎఫ్ఆర్ఏ వాదనను కొట్టిపారేస్తున్నారు. ‘ఇది రాజ్యాంగానికి వక్రభాష్యమే. పైగా ఎన్ఎఫ్ఆర్ఏ ఉటంకిస్తున్న డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ఫర్ తీర్పు అమెరికా సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత చెత్త తీర్పుగా నిలిచిపోయింది. తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వముందా, లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఈ గడ్డపై పుట్టే వారంతా దేశ పౌరులేనని ఆ తర్వాత సుప్రీంకోర్టు పలు తీర్పునిచ్చింది. ఎన్ఎఫ్ఆర్ఏ వాదనను వర్తింపజేయాల్సి వస్తే బ్రిటిష్ మూలాలున్న తొలినాళ్ల అధ్యక్షులు జార్జి వాషింగ్టన్, జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, జేమ్స్ మాడిసన్ కూడా ఆ పదవికి అనర్హులే’’అని వారంటున్నారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు మద్దతు పలికిన ఎన్ఎఫ్ఆర్ఏ హారిస్పై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హారిస్ తల్లి భారత్కు, తండ్రి జమైకాకు చెందిన వారన్నది తెలిసిందే.ఏమిటా తీర్పు? డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ఫర్ కేసు 1857 నాటిది. అప్పట్లో అమెరికాలో పలు రాష్ట్రాల్లో బానిసత్వానికి చట్టబద్ధత ఉండేది. తనను స్వేచ్ఛా జీవిగా ప్రకటించాలంటూ డ్రెడ్ స్కాట్ అనే ఆఫ్రికన్ అమెరికన్ బానిస సుప్రీంకోర్టుకెక్కాడు. అందుకు కోర్టు నిరాకరించింది. పైగా ‘ఆఫ్రికన్ అమెరికన్లు దేశ పౌరులే కాదు. కనుక వారికి సుప్రీంకోర్టుకెక్కే అర్హతే లేదు’’అని కోర్టు పేర్కొంది. పైగా దేశ అత్యున్నత చట్టసభ అయిన కాంగ్రెస్కు బానిసత్వాన్ని నిషేధించే అధికారం లేదంటూ తీర్పు వెలువరించింది. దాంతో అమెరికాలో బానిసత్వ రగడ తీవ్రతరమై అంతర్యుద్ధానికి దారితీసింది. ఆ తీర్పును పక్కన పెడుతూ అమెరికా రాజ్యాంగానికి 13, 14వ సవరణలు తీసుకొచ్చారు. బానిసత్వాన్ని రద్దు చేయడమే గాక జాతి భేదాలతో నిమిత్తం లేకుండా అమెరికాలో పుట్టిన వాళ్లంతా దేశ పౌరులేనంటూ చట్టం చేశారు. -
ట్రంప్కు భారీ షాక్, సొంత పార్టీలోనే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న డొనాల్డ్ ట్రంప్కు సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ నుంచి భారీ షాక్ తగిలింది. సుమారు 200 మంది రిపబ్లికన్లు, ఉపాధ్యక్షురాలు.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కు మద్దతు ఇస్తూ లేఖ రాశారు. వీళ్లంతా.. గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో ఆయనకు అనుకూలంగా పనిచేసినవాళ్లే కావడం గమనార్హం. ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం.. అయితే ఇలా సొంత పార్టీ మద్దతు దారులే ట్రంప్ను వ్యతిరేకించడం ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జార్జ్ డబ్ల్యు బుష్తో పాటు ఆయన మద్దతు దారులు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.తాజాగా మరోసారి ట్రంప్కు వ్యతిరేకంగా తీర్మానించారు. కమలా హారిస్కు మద్దతిస్తూ జార్జ్ డబ్ల్యూ బుష్ మద్దతు దారులు, రిపబ్లికన్ పార్టీ నేతలు రాసిన బహిరంగ లేఖలో..ట్రంప్ తిరిగి రెండోసారి ఎన్నుకుంటే దేశానికి విపత్తు అని తోటి రిపబ్లికన్లను హెచ్చరించారు. నిజమే, ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే ప్రజాస్వామ్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తారు ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు’అని లేఖలో పేర్కొన్నారుఅంతేకాదు రాష్ట్రాలను బలోపేతం చేసేందుకు జార్జ్ హెచ్డబ్ల్యు బుష్ మద్దతుదాలందరం ఒక్కటవుతాం. ఈ ఏడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ ఓట్లు వేస్తున్నామని లేఖలో తెలిపారు. కమలా హారిస్తో మాకు విధానపరమైన విభేదాలు ఉన్నాయని అంగీకరిస్తూనే.. ఆమెకు ప్రత్యామ్నాయంగా, ఆ స్థాయిలో దేశానికి సేవ చేసే నేతలు లేరని స్పష్టం చేస్తున్నారు రిపబ్లికన్ పార్టీ నేతలు. -
ట్రంప్కు కెన్నెడీ జూనియర్ మద్దతు
ఫీనిక్స్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎఫ్.కెన్నెడీ కుటుంబీకుడొకరు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ప్రకటించారు. స్వతంత్ర అభ్యరి్థగా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన శుక్రవారం వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకుని, భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను బలపరిచాక డెమొక్రటిక్ పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుండగా, ట్రంప్ ప్రచారంలో వెనుకబడ్డారు. పలు కీలక రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయం కూడా హారిస్కు అనుకూలంగా మారింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్నకు రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ మద్దతు ప్రకటించడం రిపబ్లికన్ పారీ్టలో కొత్త ఉత్సాహం నింపినట్లయింది. ఇటీవలి వరకు ట్రంప్ విధానాలను ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. అనుచరగణాన్ని ఆయన పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ట్రంప్ కూడా..అధ్యక్ష రేసులో అత్యంత తీవ్ర వామపక్ష భావాలు కలిగిన వ్యక్తిగా రాబర్ట్ ఎఫ్.కెన్నడీని విమర్శించారు. తాజాగా తన నిర్ణయాన్ని సమరి్ధంచుకుంటూ రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ.. ‘ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం భవిష్యత్తు తరాలపై జరుగుతున్న యుద్ధం..దీనిని వెంటనే ఆపాలి. అందుకే ట్రంప్కు మద్దతిస్తున్నా’అని ప్రకటించారు. రాబర్ట్ నిర్ణయాన్ని కెన్నడీ కుటుంబంలోని ఐదుగురు ప్రముఖులు తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్కు మద్దతివ్వడం ‘విషాద గాథకు విషాదాంతం’వంటిదని రాబ ర్ట్ సోదరి కెర్రీ కెన్నెడీ వ్యాఖ్యానించారు. ‘హారిస్, వాల్జ్లపై మాకు విశ్వాసం ఉంది. ట్రంప్ను సమర్థించాలనే మా సోదరుడు రాబర్ట్ నిర్ణయం మా నాన్నకు, మా కుటుంబం అత్యంత ప్రియమైనవిగా భావించే విలువలకు ద్రోహం చేసినట్లే’అని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు దివంగత జాన్ ఎఫ్.కెన్నడీ సోదరుడు, దివంగత అటార్నీ జనరల్, సెనేటర్ రాబర్ట్ కెన్నడీ కుమారుడే రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్. -
లంకలో ఎన్నికల సందడి
చాన్నాళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. వచ్చే నెల 21న జరగబోతున్న ఎన్నికల్లో 39 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. శ్రీలంక దివాలా తీసి ఎంతటి విపత్కర పరిస్థితులో చిక్కుకున్నదో అందరికీ తెలుసు. 2022లో అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై ప్రజానీకం దాడి చేయటంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబ పరివారం దేశం విడిచి పరారయ్యారు. అంతకు మూడేళ్ల ముందు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గొటబయ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానిగా ఆయన సోదరుడు మహిందా రాజపక్స తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈమధ్య బంగ్లాదేశ్లో అచ్చం ఇలాంటి ఘటనలే జరిగి ప్రధాని షేక్ హసీనాకు పదవీభ్రష్టత్వం తప్పలేదు. రెండేళ్లనాటి శ్రీలంక పరిణామాలు చూశాకైనా ఆమె జాగ్రత్తగా అడుగులు వేసివుంటే ఇలా జరిగేది కాదు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్నవారు తమ గతాన్ని మాత్రమే కాదు... బంగ్లాదేశ్ వర్తమానాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సివుంటుంది. ఏవో సాకులు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే సంస్కృతి శ్రీలంకలో ఏనాటి నుంచో కొనసాగు తోంది. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ప్రధానిగా ఉన్నప్పుడు 2017లో ప్రొవిన్షియల్ కౌన్సిళ్ల ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటికి ఏడేళ్ల నుంచి ఇదే వరస. చిత్రమేమంటే 2022లో అంతగా జనాగ్రహం చవిచూశాక కూడా దేశంలో ఎన్నాళ్ల నుంచో మూలనపడివున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిధులు లేవన్న కారణంతో విక్రమసింఘే వాయిదా వేశారు. నిజానికి అధ్యక్ష ఎన్నికలు సైతం ఈ మాదిరే ‘వాయిదా’ తోవన పోతాయని చాలామంది అనుకున్నారు. వెంటనే ఎన్నికలు జరపాలంటూ వివిధ వర్గాలనుంచి నిరుడు డిమాండ్ వచ్చింది. కానీ దేశం ఇంకా ఆర్థికంగా కోలుకోలేదన్న కారణాన్ని చూపి వాయిదా వేశారు. మొత్తానికి ఎన్నికల కోలాహలం మొదలైంది.రెండున్నర దశాబ్దాల తర్వాత మొదటిసారిగా రాజపక్స కుటుంబం హవా లేకుండా ఎన్నికలు జరగబోతున్నాయి. తన కుటుంబం కోల్పోయిన పరువు ప్రతిష్ఠలను పునరుద్ధరించటమే ధ్యేయంగా మాజీ ప్రధాని మహిందా రాజపక్స తనయుడు 38యేళ్ల నామల్ రాజపక్స శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ) తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అయిదు దశాబ్దాలు యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ) నాయకుడిగావున్నా స్వతంత్రుడిగా నిలబడ్డారు. గతంలో యూఎన్పీని చీల్చి సమగి జన బల వేగయ (ఎస్జేబీ) పార్టీని స్థాపించి ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సజిత్ ప్రేమదాస కూడా అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్నారు. అయితే ఇతరుల కన్నా వామపక్ష అనుకూల నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ (ఎన్పీపీ) అధినేత అనూర కుమార దిస్సానాయకే విజయావకాశాలు ఎక్కువని లంకలో ప్రధాన సర్వే సంస్థ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ పాలసీ (ఐహెచ్పీ) చెబుతోంది. అదే నిజమైతే దేశ రాజకీయాలు కొత్త మలుపు తిరగటం ఖాయం. మొదటి నుంచీ ఎస్ఎల్పీపీ, యూఎన్ పీలే ప్రధాన పక్షాలుగా పోటీపడుతున్నాయి. కానీ 2020 పార్లమెంటు ఎన్నికలకు ముందు సజిత్ ప్రేమదాస నిష్క్రమించాక ఆ పార్టీ దయనీయ స్థితిలో పడిపోయింది. ఆ ఎన్నికల్లో యూఎన్పీకి దక్కింది కేవలం ఒక్క స్థానం మాత్రమే. దశాబ్దాలుగా అనుసరించిన విధానాల వల్ల దేశం ఆర్థికంగా చాలా గడ్డు స్థితిలో పడిందన్నది వాస్తవం. ముఖ్యంగా రాజపక్స సోదరుల హయాంలో తమిళ టైగర్లను అణిచేయటానికి సాయం చేసిన దగ్గర్నుంచి చైనా పలుకుబడి విస్తరించింది. ఆ తర్వాత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించే నెపంతో అది భారీయెత్తున అప్పులిచ్చింది. క్రికెట్ స్టేడియం, విమానాశ్రయం, హంబన్తోటా నౌకాశ్రయం వంటివన్నీ చైనా నిర్మాణరంగ నిపుణుల నేతృత్వంలో కళ్లు చెదిరే రీతిలో నిర్మించారు. కానీ వీటి బకాయిలు తీర్చడానికొచ్చేసరికి అంతా తారుమారైంది. చివరకు హంబన్తోటాలో అనుకున్న రీతిలో కార్యకలాపాలు పుంజుకోకపోవటంతో దాన్ని చైనాకే 99 యేళ్ల లీజుకు ఇవ్వాల్సివచ్చింది. దేశాన్ని చైనాకు తాకట్టు పెడుతున్నారని విపక్షాలు చేసిన ఆరోపణలన్నీ రాజపక్స సోదరులు తీసుకొచ్చిన మెజారిటీవాదం, దేశభద్రత వగైరా అంశాలతో కొట్టుకు పోయాయి. కానీ మూడేళ్లకే ప్రజలకు తత్వం బోధపడి తిరుగుబాటు చేశారు. 2022లో దేశం దివాలా తీశాక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) దాదాపు 300 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. అయితే ఆర్థిక రంగంలో పెనుమార్పులు తీసుకురావాలన్న షరతు విధించింది. వ్యవస్థాగత సర్దు బాట్ల పేరుతో ఆ ప్రక్రియ ప్రస్తుతం అమలవుతోంది కూడా. కనుక ఎన్నికల అనంతరం విజేత ఎవ రైనా ఈ ప్రక్రియను కొనసాగించాల్సిందే. ప్రస్తుత అభ్యర్థుల్లో ఎన్పీపీ అధినేత అనూర కుమార దిస్సానాయకే ఒక్కరే అవినీతి మరక అంటని నేత. కావడానికి వామపక్ష అనుకూల సంస్థే అయినా సింహళ జాతీయవాదాన్ని ప్రవచించే జనతా విముక్తి పెరుమున రాజకీయ విభాగమే ఎన్పీపీ. ఒకపక్క తన పూర్వపు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూసే చైనా... మొదటి నుంచీ లంకకు అన్ని విధాలా తోడ్పడుతున్న భారత్ ఈ ఎన్నికల సరళిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాలో భారత్ అనుకూల నేత హసీనా పదవి కోల్పోయారు. ఇదే అదనుగా లంకలో మళ్లీ తన హవా కొనసాగించాలని చైనా చూస్తోంది. అయితే చైనా వల్లే అప్పుల ఊబిలో కూరుకుని నిండా మునిగిన లంకలో అదంత సులభం కాదు. ఏదేమైనా జనామోదంతో ఏర్పడే ప్రభుత్వం వల్లే శ్రీలంక ప్రస్తుత కష్టాలు తీరతాయి. -
కమలతో డిబేట్.. ట్రంప్ ‘తులసి’ వ్యూహం!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు, ఇండో అమెరికన్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 10న జరిగే డిబేట్పై ఇప్పటికే కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమలా హారిస్పై పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ట్రంప్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష డిబేట్కు సన్నద్దం కోసం మాజీ డెమోక్రటిక్ నేత తులసి గబ్బర్డ్ సాయం తీసుకుంటున్నారని న్యూయార్ టైమ్స్ కథనం వెల్లడించింది. ట్రంప్ తన ప్రైవేట్ క్లబ్ హోమ్ మార్-ఎ-లాగోలో డిబేట్ కోసం ప్రాక్టిస్ మొదలు పెట్టారు. అయితే ఈ ప్రాక్టిస్ సెషన్లో తులసి గబ్బర్డ్ చేరినట్లు పేర్కొంది. అయితే తులసి గబ్బర్డ్ డిబేట్ ప్రాక్టిసులో పాల్గొన్నట్లు ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ధృవీకరించినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ‘‘ మొదటి డిబేట్లో ప్రెసిడెంట్ జో బిడెన్పై ట్రంప్ పైచేయి సాధించారు. దీంతో చరిత్రలో అత్యుత్తమ డిబేటర్లలో ట్రంప్ ఒకరిగా నిరూపించబడ్డారు. మామూలుగా అయితే ట్రంప్కు డిబేట్ ప్రిపరేషన్ అవసరం లేదు. కానీ, 2020లో జరిగిన డిబేట్ స్టేజ్లో కమలా హారిస్ను తులసి గబ్బర్డ్ విజయవంతంగా ఓడించారు. అందుకే అటువంటి పాలసీ అడ్వైజర్లు, ప్రభావవంతమైన కమ్యూనికేటర్ల సాయం తీసుకోవటం జరుగుతోంది’’ అని ట్రంప్ ప్రతినిధి తెలిపారు.2019లో డెమోక్రటిక్ ప్రైమరీ ఎంపిక సమయంలో హారిస్తో డిబేట్ చేస్తున్నప్పుడు తులసి ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. హారీస్ విధానాలకు వ్యతిరేకంగా తులసి గబ్బార్డ్ తీవ్రంగా దాడి చేశారు. ఇదే కారణంతో గబ్బర్డ్ని ఎంపిక చేశారనే చర్చ కూడా సాగుతోంది. ఇక.. 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత తులసి డెమోక్రటిక్ పార్టీ నుంచి వైదొలిగారు. అప్పటి నుంచి ట్రంప్ మద్దతుతో సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. గత కొన్ని ఏళ్లుగా ట్రంప్తో తులసి స్నేహంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. -
ఎన్నికల ప్రచారంలో ట్విస్ట్: కమలా హారీస్ కాదు.. ఓన్లీ ‘కమల’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇప్పటికే పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎన్నికల్లో ఓటర్లు ఆకర్షించేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ కొత్త ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పేరులోని ‘కమల’ అనే పదాలను మాత్రమే వాడుతున్నారు. ‘కమల’ అనే పిలవాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. కాగా, ఎన్నికల సమయంలో ఓటర్లతో మంచి సంబంధాన్ని పెంపొందించడానికి ప్రచారంలో ఆమె మొదటి పేరు ‘కమలా’ను స్వీకరించారు. మాజీ అధ్యక్షడు బరాక్ ఒబామా, పలువురు నేతల సూచనల మేరకు కమలా హారీస్ తన పేరును ‘కమల’గా మార్చుకుని ముందుకు సాగుతున్నారు. ఇక, డెమోక్రటిక్ మద్దతుదారులు కూడా ఆమెను కమలా.. కమలా అని నినాదాలు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు కమలా అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. కమలా అంటే ఆమె తల్లి పెట్టిన సాంస్కృతిక మరియు జాతి పేరు. ఇదిలా ఉండగా.. కమలా హారీస్ను డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఆమోదించిన 48 గంటల్లో పార్టీ ప్రచార సోషల్ మీడియాను 'బిడెన్ హెచ్క్యూ' నుండి 'కమలా హెచ్క్యూ'కి త్వరగా రీబ్రాండ్ చేసింది. 'హారీస్' నుండి 'కమల'కి మారడం ద్వారా తన ప్రచారంలో ఓటర్లకు దగ్గర కావడానికి ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమె పలుమారు కమలా అని సంబోంధించడంతో ఈజీగా ఆ పేరు ప్రజల్లోకి వెళ్తుందనే కారణంగానే ఇలా ఫిక్స్ చేసినట్టు సమాచారం. -
అమెరికా పోరు.. పెద్దన్న ఎవరు?
-
‘కమల’ వికాసం సాధ్యమే: లిచ్మాన్
వాషింగ్టన్: గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను దాదాపు ఖచి్చతంగా ఊహించి చెప్పిన అలాన్ లిచ్మాన్ మరోమారు తన విశ్లేషణను వెల్లడించారు. తాజా ఎన్నికల ప్రచార సరళి, అమెరికా ఓటర్ల మనోభావాలను లెక్కలోకి తీసుకుంటే డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నెగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే వచ్చే నెలలో డెమొక్రటిక్ కన్వెన్షన్ తర్వాతే తన తుది అంచనాలను వెల్లడిస్తానని ఆయన స్పష్టంచేశారు. 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్మాన్ 1981 ఏడాదిలో ‘గెలుపునకు 13 సూత్రాలు’ అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనా వేస్తానని ఆయన చెప్పారు. 2016లో ట్రంప్, 2020లో బైడెన్ గెలుస్తారన్న జోస్యాలు నిజమవడంతో 2024లో గెలుపుపై ఏం చెప్పబోతున్నారోనని ఆసక్తి నెలకొంది. -
Venezuela presidential election: వెనిజులాలో... మళ్లీ పాత కథే!
కారకాస్: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించిందే జరిగింది. అధ్యక్షుడు నికొలస్ మదురో వరుసగా మూడోసారి విజయం సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం (సీఎన్ఈ) ప్రకటించింది. ఆదివారం జరిగిన దేశవ్యాప్త పోలింగ్ అనంతరం రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టారు. 80 శాతం ఓట్లను లెక్కించేసరికి మదురోకు విజయానికి అవసరమైన 51 శాతం ఓట్లు లభించినట్టు సీఎన్ఈ చీఫ్ ఎల్విస్ అమోరోసో అర్ధరాత్రి అనంతరం ప్రకటన విడుదల చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్కు 44 శాతం ఓట్లొచ్చినట్టు వెల్లడించారు. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపును ప్రహసనప్రాయంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి మంటగలిపారని విపక్ష నేత మరియా కొరీనా మచాడో దుమ్మెత్తిపోశారు. ‘‘మదురోను ఓడించేందుకు జనమంతా వెల్లువలా కదిలొచ్చి గొంజాలెజ్కు ఓటేశారు. ఆయన కనీసం మూడింట రెండొంతుల ఓట్లతో ఘనవిజయం సాధించారు. మా బూత్లవారీ విశ్లేషణలో కూడా అదే తేలింది. ఓటింగ్ సరళిని చూసిన మీదట ఓటమి ఖాయమని మదురోకు అర్థమైపోయింది. ఫలితాలను తారుమారు చేసేందుకు పథకం ప్రకారం విపక్ష కూటమి పర్యవేక్షకులను పోలింగ్ బూత్ల నుంచి తరిమేశారు. అనంతరం మదురో చేతిలో కీలుబొమ్మ అయిన సీఎన్ఈ చీఫ్ ఫలితాలను ఆయనకు అనుకూలంగా వక్రీకరించారు’’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల పోలింగ్ బూత్లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎన్ఈ మాత్రం అందుకు సుముఖంగా లేదు. దీనికితోడు పోలింగ్ ముగిశాక ఫలితాల వెల్లడిని నిర్ధారిత సమయం కంటే ఏకంగా ఆరు గంటలపాటు ఆలస్యం చేశారు. ఫలితాలను మదురోకు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేశారని విపక్ష కూటమి దుయ్యబట్టింది. ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తామని ప్రకటించింది. మదురో మాత్రం విదేశీ శక్తులతో కలిసి కొందరు కుట్ర పన్ని ఈవీఎంలను హాక్ చేసేందుకు ప్రయతి్నంచారంటూ విపక్షాలపై ప్రత్యారోపణలకు దిగారు. శాంతిభద్రతలకు భంగం కలిగించజూస్తే ఏం చేయాలో పోలీసులు, సైన్యం చూసుకుంటాయని హెచ్చరించారు. వెనిజులాలో పాతికేళ్లుగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ పాలనకు తెర దిచేందుకు విపక్షాలన్నీ మచాడో సారథ్యంలో ఒక్కతాటిపైకి వచ్చి పోటీ చేశాయి.ఫలితాలపై దేశాల పెదవి విరుపు వెనిజులా ఎన్నికల ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవని అమెరికా, చిలీ,ఉరుగ్వేతో పాటు చాలా దేశాలు పేర్కొన్నాయి. అవి ప్రజల మనోగతాన్ని, ఓటింగ్ సరళిని ప్రతిఫలించడం లేదని స్పష్టం చేశాయి. చిలీ అధ్యక్షుడు గేబ్రియెల్ బోరిక్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో పాటు బ్రిటన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. -
అమెరికా పీఠం ఎవరిది ?
-
Weekly roundup: కమలా హారీస్ సరికొత్త రికార్డు.. 36 ఏళ్ల తర్వాత..
ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూపు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. అనూహ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుంచి వైదొలగటంతో.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తెరమీదకు వచ్చారు. ఎట్టకేలకు ఆమె అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా ఖరారు అయ్యారు. వారం రోజుల నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నిక పోరులో చోటుచేసుకున్న కీలక పరిణామాలు ఇవే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష బరి నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గత ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ‘ఎక్స్’లో ఒక లేఖను పోస్ట్ చేశారు. దేశ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కోసమే ఈ తీసుకున్నట్లు తేల్చి చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన బైడెన్ అనూహ్యంగా వైదొలగటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్తో గత నెలలో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా వయసు కారణంగా మతిమరుపు సమస్యను ఎదుర్కొన్నారు. దీంతో ఎన్నికల పోటీ నుంచి బైడెన్ తప్పుకోవాలని సొంత పార్టీ నేతలే ఒత్తిడి పెంచారు. అందుకే ఆయన ఎన్నికల పోటీ నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఇక.. ఆయన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె అసాధారణ భాగస్వామి అని ప్రశంసలు కురిపించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ మహిళ కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారాయన. అదేవిధంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంట్ను ఓడించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలగడంతో నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరవుతారు అనే ఆసక్తి నెలకొంది. ఉపాధ్యక్షురాలు కమలా వైపు మొగ్గు కనపడుతున్నా.. పార్టీ నిబంధనావళి ప్రకారం ఓపెన్ కన్వెన్షన్ (ఎవరైనా పోటీ పడవచ్చు) జరుగుతుంది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోవడానికి రాష్ట్రాల వారీగా నిర్వహించిన బైడెన్ తిరుగులేని మెజార్టీ కూడగట్టుకున్నారు. 4000పై చిలుకు డెలిగేట్లలో 3900 మంది డెలిగేట్లను బైడెన్ గెలుచుకున్నారు. నిబంధనల ప్రకారం ఆగస్టులో అధ్యక్ష అభ్యర్థిని ఖరారు చేయడానికి జరిగే జాతీయ కన్వెన్షన్ వీరందరూ బైడెన్కు అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం బైడెన్ స్వయంగా వైదొలిగారు కాబట్టి.. డెమోక్రాటిక్ టికెట్ కోసం పార్టీ సభ్యులెవరైనా పోటీపడవచ్చు. దీన్నే ఓపెన్ కన్వెన్షన్ అంటారు. కమలా హారిస్కు అవకాశాలు మెరుగ్గా ఉన్నా.. డెమోక్రాటిక్ పార్టీ ముఖ్యనేతలైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసన్, మిసిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్లు ఆమెకు ప్రధాన పోటీదారాలుగా ఉంటారని భావిస్తున్నారు. నామినేషన్ జాబితాలో పేరు లేనప్పటికీ డెలిగేట్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే వీలు కూడా ఉంది. నాలుగువేల పైచిలుకు డెలిడేట్లు ఆగస్టులో తమ తదుపరి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. తొలి రౌండ్ ఫలితాలు తేలకపోతే 700 మంది సూపర్ డెలిగేట్లను ఓటు వేయడానికి అనుమతిస్తారు. డెమోక్రాటిక్ నామినీ ఎన్నికయ్యే వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో ముమ్మర లాబీయింగ్, తెరవెనక మంత్రాంగాలు జరగటం ఖాయం.డెమోక్రాటిక్ పార్టీ టికెట్ కోసం కమలాకు గట్టి పోటీదారులుగా మారుతారని భావించిన పలు పలు రాష్ట్రాల గవర్నర్లు తమ మద్దతు ఉపాధ్యక్షురాలికేనని బాహాటంగా ప్రకటించారు. ఇక పార్టీలోని సహచరులకు కమలా ఆదివారమే 100 పైగా ఫోన్ కాల్స్ చేసి మద్దతు కూడా గట్టునే పనిలో నిమగ్నమయ్యారు. భారతీయ అమెరికన్, ఆఫ్రికా అమెరికన్ చట్ట సభ్యులు, బైడెన్ అనుచరులు కమలకు మద్దతుగా ముమ్మర లాబీయింగ్ మొదలుపెట్టారు. వివిధ రంగాలలోని మహిళలు కూడా ఆమెకు మద్దతు ప్రకటించారు. బైడెన్ ప్రచార బృందం కూడా సోషల్ మీడియాలో తమ అకౌంట్ల పేర్లను హారిస్ పేరు మీదకు మార్చేసింది. ప్రచార టీంలో 1000 మంది ఉద్యోగులు ఆమె కోసం పని చేయడానికి సిద్ధం అయ్యారు. గట్టి పోటీదారులు అయిన పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసన్ ఆదివారమే ఆమెకు మద్దతు తెలిపారు.కీలక నేతల మద్దతు...ప్రతినిధుల సభ మాజీ స్పీకర్, డెమోక్రాటిక్ పార్టీలో కీలక నాయకురాలు నాన్సీ పెలోసి కూడా సోమవారం కమలకు మద్దతు ప్రకటించారు. శ్రామిక కుటుంబాల కోసం శ్రమించే సునిశిత మేథోశక్తి గల రాజకీయ నాయకురాలు అని కమలను అభివర్ణించారు. అమెరికాలో అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు, హయత్ గ్రూప్ వారసుడు, ఇల్లినాయీ గవర్నర్ జేబి ఫ్రిట్జ్కర్, రెండు సార్లు కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ అభ్యర్థిత్వ రేసులో ఉంటారని భావించినా వారిద్దరూ కమలకే జై కొట్టారు. మిసిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్లు కూడా అదే బాటలో నడిచారు. మేరీ ల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ కూడా హారిస్కే మద్దతు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ మద్దతు కూడా కమలకు లభించింది. కమలకు ఉదారంగా విరాళాలు ఇవ్వాలని సోమవారం హిల్లరీ పిలుపునిచ్చారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు లభిస్తే ఇక కమలకు తిరుగు ఉండదు. కమల్ ప్రత్యర్థులుగా ప్రస్తుతానికి రాయ్ కూపర్ (67) , అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ పేర్లు వినిపించాయి.అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1976 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు కమలా హారిస్కు మద్దతు తెలిపారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా పేరు అనధికారికంగా ఖరారు కావడంతో ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఆమె ఎవరిని ఎన్నుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం మొదటిసారి రోజంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బైడెన్ బృందంతో ఆమె సమావేశమయ్యారు. అదే బృందంతో కలిసి పని చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 106 రోజులే ఉండటంతో, గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.మరోవైపు.. కరోనా బారినపడి ఐసోలేషన్ లో ఉన్న జో బైడెన్ ఫోన్లో సమావేశంలో పాల్గొన్నారు. కమలా హారిస్ను గెలిపించడానికి కృషి చేయాలని డెమోక్రాట్లకు విజ్ఞప్తి చేశారు. తాను కోలుకోగానే ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు.ప్రస్తుతానికి హారిస్ కు 40 మందికి పైగా డెమోక్రాటిక్ సెనేటర్లు, దాదాపు వంద మంది హౌస్ సభ్యుల మద్దతు ఉంది. అంతే కాదు కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్, కాంగ్రెషనల్ హిస్పానిక్ కాకస్, కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్ తో పాటు సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ అనే రెండు కీలక సంఘాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. ఇక ఉపాధ్యక్ష రేసులో కెంటకీ గవర్నర్ ఆండీ బేషీర్, యూఎస్ ట్రాన్స్ పోర్టేషన్ సెక్రటరీ పీట్ బుట్టిగీగ్, నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్, అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్ కర్, మిషిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ ఉండొచ్చని భావిస్తున్నారు.రికార్డ్ స్థాయిలో విరాళాలు...కమల హారిస్ ప్రచారం మొదలుపెట్టిన తొలి రోజే పార్టీని విరాళాలు వెల్లువెత్తాయి. 24 గంటల్లో 81 మిలియన్ డాలర్లు వచ్చాయి. అందులో 60 శాతం మొదటిసారి ఇచ్చారు. అధ్యక్ష అభ్యర్థిగా ఒక రోజులోనే ఇంత మొత్తం విరాళంగా రావడం డెమోక్రాట్ల చరిత్రలో తొలిసారి.ట్రంప్పై విమర్శలు.. ట్రంప్ లాంటి అవినీతిపరులను, ద్రోహులను ఎన్నికల్లో ఓడించడమే తన ధ్యేయం అని కమలా హారిస్ అన్నారు. ఆమె మంగళవారం విస్కాన్సిస్ రాష్ట్రంలో డెమోక్రాటిక్ పార్టీ సమావేశంలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. అభ్యర్థిత్వానికి సరిపడ మద్దతు కూడగట్టుకున్న తర్వాత కమలా మాట్లాడినా మొదటి సమావేశం ఇది. గతంలో కాలిఫోర్నియా ప్రాసిక్యూటర్ గా పని చేశానని, తన రికార్డు ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు. ట్రంప్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మహిళలను వేధించిన దుర్మార్గులను, అమాయకపు ప్రజలను దగా చేసిన మోసగాళ్లను, సొంత లాభం కోసం నిబంధనలను అతిక్రమించిన దుష్టులను ఎన్నికలలో ఓడించాలని పిలుపునిచ్చారు. కాగా తొలుత బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రజలను నుంచి వచ్చిన విరాళాలను కమల కు బదిలీ చేయడం ఆపాలని ట్రంప్ బృందం కోరింది. ఈ మేరకు ఫెడరల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.సర్వేల్లో కమలదే పైచేయి...అధ్యక్ష రేసులో జో బైడెన్ పై ఆధిపత్యం ప్రదర్శించిన ట్రంప్ కు కమలా వచ్చి రాగానే కళ్లెం వేశారు. మానసిక చురుకుదనం, సవాళ్లను ఎదుర్కొనే సత్తా విషయంలో ట్రంప్ కంటే హారిస్ కే అమెరికన్లు జై కొట్టడం విశేషం. ఈ విషయమై రాయిటర్స్/ ఇప్సోస్ చేసినా తాజా సర్వేలో 56 శాతం మంది హారిస్ ఓటు వేయగా, ట్రంప్ కు 49 శాతమే ఓట్లు దక్కాయి. పలు సర్వేలల్లో కూడా కమలా దూసుకుపోతున్నారు.కమలా హారిస్కు భారీ అడ్వాంటేజ్ఇటు తల్లి నుంచి ఆసియా, అటు తండ్రి నుంచి నల్లజాతి మూలాలుండటం హారిస్కు భారీ అడ్వాంటేజ్గా మారుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో ప్రబల శక్తులుగా ఉన్న ఈ రెండు వర్గాల ఓట్లూ ఆమెకే పడటం ఖాయమంటున్నారు. ఆగస్టు 19–21 తేదీల మధ్య జరిగే డెమొక్రాట్ల జాతీయ సదస్సులో హారిస్ అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర పడటం లాంఛనమే. అదే ఊపులో ట్రంప్ను ఓడిస్తే 248 ఏళ్ల అమెరికా చరిత్రలో తొలి అధ్యక్షురాలిగా, ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా మూలాలున్న నేతగా, నల్ల జాతి మహిళగా... ఇలా ఆ దేశ చరిత్రలోనే అరుదైన పలు రికార్డులను హారిస్ సొంతం చేసుకోనున్నారు. అంతేకాదు, ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ఐదో అమెరికన్గా కూడా నిలుస్తారు. 150 ఏళ్ల విరామం తర్వాత జార్జ్బుష్.. 1836లో ఉపాధ్యక్షుడు మార్టిన్ వాన్ బురెన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత మళ్లీ ఉపాధ్యక్షుడు నేరుగా అధ్యక్షుడు కావడానికి ఏకంగా 150 ఏళ్లు పట్టింది! 1988లో నాటి ఉపాధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ.బుష్ అధ్యక్షుడు అయ్యారు. చివరగా ఆ ఘనత సాధించిన నేత ఆయనే. 1988 తర్వాత తొలిసారిగా ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ నేరుగా ప్రెసిడెంట్ అయిన తొలి నేతగా రికార్డు సొంతం చేసుకునే దిశగా కమలా హారిస్ వడివడిగా దూసుకెళ్తున్నారు. అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షులుగా ఉంటూ నేరుగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి గెలిచిన నేతలు నలుగురు. వారు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, మార్టిన్ వాన్ బురెన్, జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్. ఎనిమిది మంది ఉపాధ్యక్షులు అప్పటి అధ్యక్షుల మృతి కారణంగా ఆ పదవిని చేపట్టారు. వారు జాన్ టైలర్, మిలార్డ్ ఫిల్మోర్, ఆండ్రూ జాన్సన్, చెస్టర్ ఆర్థర్, థియోడర్ రూజ్ వెల్ట్, కాల్విన్ కూలిడ్జ్, హారీ ట్రూమాన్, లిండన్ జాన్సన్. గెరాల్డ్ ఫోర్డ్ మాత్రం ఉపాధ్యక్షునిగా ఉంటూ, నాటి అధ్యక్షుడు రాజీనామా చేయడంతో ఆ పదవి చేపట్టారు. ఇద్దరు ఉపాధ్యక్షులు మాజీలయ్యాక, అంటే పదవీకాలం ముగిసిన కొన్నాళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. వారిలో ఒకరు రిచర్డ్ నిక్సన్ కాగా రెండోవారు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్. హారీ ట్రూమన్, చెస్టర్ ఆర్థర్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే అధ్యక్షులయ్యారు! థామస్ హెండ్రిక్స్, విలియం కింగ్ ఉపాధ్యక్షులు అయిన ఏడాదిలోపే మరణించారు. జార్జ్ క్లింటన్, జాన్ కాల్హన్ వరుసగా రెండుసార్లు ఉపాధ్యక్షులుగా వేర్వేరు అధ్యక్షుల హయాంలో పని చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒమాబా మద్దతు ప్రకటించారు. నా స్నేహితురాలు హారీస్ అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నామని, ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో నా స్నేహితురాలు యూనైటెడ్ స్టేట్స్కు అధ్బుతమైన అధ్యక్షురాలిగా అవుతుంది. రెండు రోజుల క్రితం కమలా హ్యారిస్కు మేము ఫోన్ చేశాం. మిచెల్, నేను ఆమెతో మాట్లాడాం. తనకు మా పూర్తి మద్దతు ఉందని ఆమెకు చెప్పాము. ఈ క్లిష్టమైన సమయంలో నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఆమె గెలుపొందేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం. నీ పట్ల మాకు గర్వంగా ఉంది. నువ్వు చరిత్ర సృష్టిస్తామని తెలుసు’అని అని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు.అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(59) అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఖరారు అయ్యారు. ఈ విషయాన్ని శనివారం ఆమె స్వయంగా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు తెలిపారామె. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ‘ఎక్స్’ ఖాతాలో ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె తమ అభ్యర్థి అని డెమోక్రటిక్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.కమలా హారిస్ నేపథ్యం.. కమలా హారిస్ పూర్తి పేరు.. కమలాదేవి హారిస్. ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి. తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైవాసి. పైచదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. కమల తండ్రి డొనాల్డ్ హ్యారిస్. జమైకాకు చెందిన ఆయన అర్థశాస్త్ర ప్రొఫెసర్. అమెరికాలో జన్మించిన కమల.. తల్లి భారతీయురాలు కాబట్టి భారతీయ అమెరికన్, తండ్రి ఆఫ్రికన్ కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు కమల. క్యాలిఫోర్నియా యూనివర్సిటీ పరిధిలోని హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టరేట్ అందుకొన్నారు.అటార్నీ జనరల్గా..హోవార్డ్లో చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకురాలిగా పోటీ చేశారామె. చదువు పూర్తి చేసిన తర్వాత క్యాలిఫోర్నియాలోని అలమెడా కౌంటీకి డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పని చేశారు. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో కెరీర్ క్రిమినల్ యూనిట్లో మేనేజింగ్ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై శాన్ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ జనరల్గా రెండు పర్యాయాలు ఎన్నికై సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు కమల. 2003లో ఆ పదవి చేపట్టిన కమల 2011 వరకు అందులోనే కొనసాగారు. ఆపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా ఎన్నికయ్యారు.సెనేటర్ నుంచి తక్కువ టైంలో.. 2017లో క్యాలిఫోర్నియా సెనేటర్గా కీలక బాధ్యతలు చేపట్టారు. తద్వారా కరోల్ మోస్లే తర్వాత ‘అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’లో అడుగుపెట్టిన తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2020లో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. కమలా హారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ కూడా ఆమే. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పదవికే గురిపెట్టారు. డెమోక్రటిక్ పార్టీ ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తే.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(78)తో ఆమె పోటీ పడనున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా గెలిస్తే.. అగ్ర రాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. -
USA Presidential Elections 2024: డెమొక్రటిక్ అభ్యర్థిగా కమల
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేయబోతున్నట్లు దాదాపు తేలిపోయింది. డెమొక్రటిక్ పార్టీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే అధికారిక పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. తమ అభ్యర్థిగా కమలా హారిస్ పేరును డెమొక్రటిక్ పార్టీ తరఫున అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకు పారీ్టలో కమలా హారిస్ మినహా ఇతరులెవరూ అభ్యర్థిత్వం కోసం పోటీపడలేదు. డెమొక్రటిక్ నేషనల్ కమిటీ నిబంధనల ప్రకారం ఆగస్టు 1న పార్టీ ప్రతినిధులు వర్చువల్ సమావేశంలో తమ నామినీని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్టీలో ఇతరులు పోటీ పడకపోతే కమలా హారిస్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం లాంఛనమే. అలాగే ఆగస్టు 7లోగా ఆమె తమ ఉపాధ్యక్ష అభ్యర్థిని(రన్నింగ్ మేట్) ఎంపిక చేసుకోవాల్సి ఉంది. షికాగోలో ఆగస్టు 19 నుంచి 22 వరకు డెమొక్రటిక్ జాతీయ సదస్సు జరుగుతుంది. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై విజయం తనదేనని కమలా హారిస్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసం పొందడానికి, ప్రతి ఓటునూ సంపాదించడానికి కష్టపడి పని చేస్తానని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రచారం సాగిస్తానని, వారి మద్దతుతో రాబోయే ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తానని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు జో బైడెన్ గత ఆదివారం ప్రకటించిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ తెరపైకి వచి్చంది. ఆమె ప్రచారం కూడా ప్రారంభించారు. ఇప్పటికే 40కిపైగా రాష్ట్రాల డెమొక్రటిక్ ప్రతినిధులు ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ట్రంప్కు సమఉజ్జీగా... న్యూయార్క్ టైమ్స్ పోల్ వెల్లడి జో బైడెన్ నిష్క్రమణలో అర్ధాంతరంగా అమెరికా అధ్యక్ష రేసులోకి వచి్చనప్పటికీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనూహ్యంగా పుంజుకుంటున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో సమానంగా కమల ప్రజామోదాన్ని పొందుతున్నారని న్యూయార్క్ టైమ్స్– సియానా కాలేజ్ తాజా పోల్ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న అమెరికా ఓటర్లలో 48 శాతం మంది ట్రంప్ వైపు మొగ్గగా, 47 శాతం మంది కమలా హారిస్కు మద్దతు తెలిపారు. ఇదే న్యూయార్క్ టైమ్స్ పత్రిక జూలై మొదటివారంలో నిర్వహించిన సర్వేలో బైడెన్పై ట్రంప్ ఏకంగా ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించారు. దీన్ని హారిస్ ఒక పాయింటుకు తగ్గించడం గమనార్హం. రిజిస్టర్డ్ ఓటర్లలో ట్రంప్కు 48 శాతం, హారిస్కు 46 శాతం మద్దతు లభించింది. సొంత పారీ్టల్లో సమాన మద్దతు రిపబ్లికన్లలో ట్రంప్ను 93 శాతం మంది బలపరుస్తుండగా, కమలా హారిస్కు సైతం డెమొక్రాట్లలో 93 శాతం మద్దతు లభించడం విశేషం. శ్వేతజాతియేతర, యువ ఓటర్లలో బైడెన్కు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇప్పుడు హారిస్కు ఈ వర్గాల మద్దతు లభిస్తోందని సర్వే తెలిపింది. లాటిన్ అమెరికా మూలాలున్న ఓటర్లు, 30 ఏళ్ల లోపు ఓటర్లలో హారిస్కు 60 శాతం మద్దతు లభించింది. -
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్
వాష్టింగన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(59) అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఖరారు అయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు తెలిపారామె. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఎక్స్ ఖాతాలో ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె తమ అభ్యర్థి అని డెమోక్రటిక్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. Today, I signed the forms officially declaring my candidacy for President of the United States.I will work hard to earn every vote.And in November, our people-powered campaign will win. pic.twitter.com/nIZLnt9oN7— Kamala Harris (@KamalaHarris) July 27, 2024అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ పేరును డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమె మద్దతు కూడగట్టుకుంటున్నారు.నేపథ్యం.. కమలా హారిస్ పూర్తి పేరు.. కమలాదేవి హారిస్. ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి. తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైవాసి. పైచదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. కమల తండ్రి డొనాల్డ్ హ్యారిస్. జమైకాకు చెందిన ఆయన అర్థశాస్త్ర ప్రొఫెసర్. అమెరికాలో జన్మించిన కమల.. తల్లి భారతీయురాలు కాబట్టి భారతీయ అమెరికన్, తండ్రి ఆఫ్రికన్ కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు కమల. క్యాలిఫోర్నియా యూనివర్సిటీ పరిధిలోని హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టరేట్ అందుకొన్నారు. అటార్నీ జనరల్గా..హోవార్డ్లో చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకురాలిగా పోటీ చేశారామె. చదువు పూర్తి చేసిన తర్వాత క్యాలిఫోర్నియాలోని అలమెడా కౌంటీకి డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పని చేశారు. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో కెరీర్ క్రిమినల్ యూనిట్లో మేనేజింగ్ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై శాన్ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ జనరల్గా రెండు పర్యాయాలు ఎన్నికై సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు కమల. 2003లో ఆ పదవి చేపట్టిన కమల 2011 వరకు అందులోనే కొనసాగారు. ఆపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా ఎన్నికయ్యారు. సెనేటర్ నుంచి తక్కువ టైంలో.. 2017లో క్యాలిఫోర్నియా సెనేటర్గా కీలక బాధ్యతలు చేపట్టారు. తద్వారా కరోల్ మోస్లే తర్వాత ‘అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’లో అడుగుపెట్టిన తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2020లో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. కమలా హారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ కూడా ఆమే. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పదవికే గురిపెట్టారు. డెమోక్రటిక్ పార్టీ ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తే.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(78)తో ఆమె పోటీ పడనున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా గెలిస్తే.. అగ్ర రాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. -
‘‘మేముండగా నువ్వు పిల్లలు లేనిదానివెలా’’: జేడీ వ్యాన్స్కు ఇచ్చిపడేసిన ‘ఎల్లా’
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో కమలా హారిస్ దూసుకుపోతున్నారు. మరోవైపు అమెరికా సెనేటర్, రిపబ్లిక్ ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న జేడీ వ్యాన్స్ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా దుమారం రేగుతోంది. దీనిపై కమలా భర్త మొదటి భార్య కూతురు ఎల్లా ఎమ్హాఫ్ ఘాటుగా స్పందించారు. అంతేకాదు ఎల్లా తల్లికూడా కమలకు మద్దతుగా నిలిచారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్పై చైల్డ్లెస్ క్యాట్ అంటూ గతంలో జేడీ వ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కమల భర్త మొదటి భార్య కెర్స్టిన్ ఎమ్హాఫ్ కమలకు మద్దతుగా నిలిచారు. గత పదేళ్లుగా తన పిల్లలైన కోల్, ఎల్లా ఎమ్హాఫ్కు ఆమె తల్లిగా ప్రేమించారని, తమ కుటుంబానికి ఆమె ఎంతో అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తగవంటూ ఆమె మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కమలా సవతి కుమార్తె (డగ్లస్ ఎమ్హాఫ్ ,కెర్స్టిన్ ఎమ్హాఫ్) ఇన్స్టాలో కౌంటర్ ఇచ్చారు. నేను, కోల్ (ఎల్లా సోదరుడు) ఉండగా నువ్వు పిల్లలు లేని దానివి ఎలా అవుతావంటూ కమలపై తన ప్రేమను చాటుకున్నారు. తద్వారా జేడీ వ్యాన్స్కు సమాధానం చెప్పారు.2021లో జేడీ వ్యాన్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పిల్లలు లేనివారు పాలించేందుకు తగరంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పిల్లలు లేని స్త్రీల జీవితం దయనీయం. అలాంటి వారు దేశాన్ని కూడా దయనీయంగా మార్చాలనుకుంటారు. కమల లాంటి పిల్లలు లేని వ్యక్తుల చేతిలో అధికారాన్ని పెట్టడంలో అర్థం లేదంటూ వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ కూడా తీవ్రంగా ఖండించారు.కాగా కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్హాఫ్ మొదటి భార్య కెర్స్టిన్ ఎమ్హాఫ్. ఈ దంపతులు పిల్లలే కోల్, ఎల్లా ఎమ్హాఫ్. వీరు కమలా హారిస్ను మోమలా అని ప్రేమగా పిలుచుకుంటారు. ఎల్లా మోడల్, ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తోంది. అల్లికలద్వారా మంచి కళాఖండాలను తయారు చేయడంలో ఆమె దిట్ట. -
కమలా హారీస్పై నమ్మకముంది: బైడెన్ సతీమణి జిల్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష రేసులోకి ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ రావడంతో సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికల్లో కమలా హారీస్ విజయం సాధిస్తుందనే నమ్మకంతో డెమోక్రాట్స్ ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్.. కమలా హారీస్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెపై నమ్మకం ఉంచాల్సిన సమయం వచ్చిందంటూ జిల్ బైడెన్ చెప్పుకొచ్చారు.కాగా, అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్ బైడెన్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జిల్ బైడెన్..‘మమ్మల్ని విశ్వసించిన వారికి నా కృతజ్ఞతలు. మీరు ఇన్ని రోజులు జో బైడెన్పై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మాపై మీ అభిమానం ఎల్లప్పుడూ నా హృదయంలో నిండి ఉంటుంది. ఇప్పుడు కమలా హారీస్పై ఆ నమ్మకాన్ని ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆమెపై నాకు నమ్మకముంది’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇక, తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని జో బైడెన్ చెప్పుకొచ్చారు. తాజాగా జో బైడెన్ మాట్లాడుతూ.. ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామాన్ని పరిరక్షించటం కంటే పదవులు ముఖ్యం కాదు. కొత్త తరానికి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నా. అమెరికాను ఏకం చేయటంలో ఇదే ఉత్తమైన మార్గం. యువ గళం వినిపించడానికి ఇదే సరైన సమయం అని అన్నారు. అలాగే, అమెరికా ప్రజలకు అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవమని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఏకం కావాలి. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీని ఏకం చేయాల్సిన అవసరం ఉంది అంటూ కామెంట్స్ చేశారు. -
ట్రంప్ Vs హారీస్.. ఎన్నికల సర్వే పోల్స్లో బిగ్ ట్విస్ట్!
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులోకి ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ రాకతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా వెలువడిన ఎన్నికల పోల్స్ ట్రంప్పై కమలా హారీస్దే పైచేయి అని చెబుతున్నాయి. ఆమె గెలుపు ఖాయమంటూ నంబర్స్ రిలీజ్ చేస్తున్నాయి.కాగా.. తాజాగా నిర్వహించిన ఐపీఎస్ఓఎస్, నేషనల్ పోల్స్ ప్రకారం.. ట్రంప్ కంటే కమలా హారీస్ ముందంజలో ఉన్నారు. ఈ పోల్స్ ఫలితాల్లో కమలా హారీస్కు 44 శాతం ఓట్లు నమోదు కాగా, ట్రంప్కు మాత్రం 42 శాతం పోలయ్యాయి. దీంతో, రెండు శాతం ఓటింగ్లో కమలా ముందంజలో ఉన్నారు. ఇక, సర్వే సందర్భంగా సందర్భంగా ఓటర్లు మాట్లాడుతూ.. తమ మద్దతు కమలా హారీస్కే అంటున్నారు. ఆమె సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఈ విషయంలో ట్రంప్ కంటే ఆమెనే బెటర్ అంటూ కితాబిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్కు మాత్రం 22 శాతం ఓటు షేర్ రావడం గమనార్హం.ఇదిలా ఉండగా.. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైంది. అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1,976 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ఆమెకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో డెలావెర్లోని ప్రచార ప్రధాన కార్యాలయాన్ని హారిస్ సోమవారం సందర్శించారు. బైడెన్ ప్రచారం బృందంతో ఆమె సమావేశమయ్యారు. అదే బృందంతో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 106 రోజులే ఉన్నాయని, గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. తన రిపబ్లికన్ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్పై హారిస్ విరుచుకుపడ్డారు.ఆయన కుంభకోణాలను గుర్తు చేశారు. నేరాలను ఎత్తి చూపారు. మహిళలను వేధించిన మృగం, మోసగాడు, తన స్వార్థ ప్రయోజనాలకోసం నియమా లను ఉల్లంఘించిన వ్యక్తని విమర్శించారు. ‘ట్రంప్ ఏ రకమో నాకు తెలుసు’ అంటూ ఎద్దేవా హారిస్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో కలిసి పనిచేయడం తనకు దక్కిన ఒక గొప్ప గౌరవమన్నారు. -
ఎన్నికల్లో గెలుపు మనదే: కమలా హారీస్
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార డెమోక్రటికల్ పార్టీలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో అధికారం రిపబ్లిక్ పార్టీదే అని చెప్పుకొచ్చారు.కాగా, అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ పోటీ చేస్తే ప్రచారానికి నిధులు నిలిపివేస్తామని డెమోక్రటిక్ పార్టీ దాతలు బెదిరించడంతో కమలా హారీస్ రంగంలోకి దిగారు. తాజాగా ఆమె నిధుల సేకరణ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలా హారీస్.. పార్టీకి చెందిన దాతలను శాంతింపజేశారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ గెలవబోతుందన్నారు. బైడెన్ తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థి అమెరికా ప్రజలకు మొదటి స్థానం ఇస్తారో మాకు తెలుసు. మా అధ్యక్షుడు జో బైడెన్.. 2024 అధ్యక్ష రేసులో కొనసాగుతానని ప్రమాణం చేశారని ఆమె గుర్తు చేశారు. అలాగే, ఎక్కువ మంది చట్టసభ సభ్యులు మరోసారి అధ్యక్షుడిగా జో బైడెన్ను నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. తొమ్మిది మంది డెమోక్రాటిక్ చట్టసభ సభ్యులు బైడెన్ను ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. మరికొందరు డెమోక్రటిక్ పార్టీ నేతలు కూడా బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన కమలా హారీస్లో పోటీలో ఉండాలని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్కు పోటీగా కమలా హారీసే కరెక్ట్ పోటీదారు అంటూ పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇటీవల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటన తర్వాత యూఎస్ ప్రెసిడెంట్గా విజయం సాధించే అవకాశాలు ఎక్కువయ్యాయి. దీంతో, ట్రంపే గెలుస్తారనే చర్చ నడుస్తోంది. -
USA Presidential Elections 2024: బైడెన్ కంటే కమల బెటర్
వాషింగ్టన్: అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని బైడెన్పై ఒత్తిళ్లు తీవ్రమవుతున్న వేళ ఆయన కంటే కమలా హారిస్ మంచి అధ్యక్షురాలు అవుతారని మెజారిటీ డెమొక్రాట్లు భావిస్తున్నారు. ప్రతి 10 మంది డెమొక్రాటిక్ పార్టీ సభ్యుల్లో ఆరుగురు కమలా హారిస్ అగ్ర రాజ్యాధినేతగా రాణించగలరని అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఆమె సామర్థ్యంపై అపనమ్మకం వెలిబుచ్చగా, మరో ఇద్దరు ఎటూ చెప్పలేమని, తమకు అంతగా తెలియదని చెప్పుకొచ్చారు. ఏపీ–ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ ఆఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన పోల్లో డెమొక్రాట్లు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ట్రంప్తో జూన్ 27న జరిగిన తొలి అధ్యక్ష చర్చలో బైడెన్ తడబడటం, మతిమరపుతో పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ట్రంప్ను ఓడించాలంటే అది కమలకే సాధ్యమవుతుందని, బైడెన్ స్థానంలో ఆమె తమ అధ్యక్ష అభ్యర్థి కావాలని డెమొక్రాట్లు డిమాండ్లు వినిపిస్తున్నారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ.. బైడెన్తో ఫోన్లో మాట్లాడుతూ అధ్యక్ష అభ్యరి్థగా వైదొలగడమే పారీ్టకి మేలని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. బైడెన్ కొనసాగితే వైట్హౌస్ను కోల్పోవడమే కాకుండా ప్రతినిధుల సభ, సెనేట్లోనూ డెమొక్రాటిక్ పారీ్టకి ఎదురుదెబ్బ తగులుతుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. వైదొలగడం లేదు: ప్రచార సారథి జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడం లేదని ఆయన ప్రచారబృందం సారథి జెన్ ఒమాలీ డిల్లాన్ శుక్రవారం స్పష్టం చేశారు. అయితే బైడెన్కు మద్దతు తగ్గుతున్న విషయాన్ని అంగీకరించారు. ‘ఆయనకు 81 ఏళ్లనేది నిజమే.. కానీ ఆయన గెలవగలరని అమెరికా ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని పాదుకొల్పడానికి మేము చేయాల్సింది ఎంతో ఉంది’ అని డిల్లాన్ అన్నారు. బైడెన్ ఫిట్నెస్పై సందేహాలు ఉన్నప్పటికీ ఓటర్లు ట్రంప్కు ఓటు వేసేందుకు మొగ్గు చూపడం లేదని ఆమె పేర్కొన్నారు. -
బైడెన్ ఫ్యామిలీలో చర్చ.. అమెరికా అధ్యక్ష పోటీకి దూరం!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్న వేళ మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.కాగా, అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంపై ఆయన కుటుంబంలో కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. బైడెన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, బైడెన్ను ఇలా సడెన్గా అధ్యక్ష ఎన్నికల నుంచి సొంత పార్టీ నేతలే తప్పుకోమనడం సరైన పద్దతి కాదంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నట్టు ఎన్బీసీ న్యూస్ రాసుకొచ్చింది. అలాగే, తన రాజకీయ జీవితంలో బైడెన్ అమెరికన్లకు ఎంతో సేవ చేశారని వారు గుర్తు చేస్తున్నారు. ఇక, తాజాగా బైడెన్ కోవిడ్ బారినపడిన విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు పెరుగుతున్న వేళ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష రేసులో కొనసాగడంపై బైడెన్ పరిశీలిస్తున్నట్టు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వారాంతంలోపే దీనిపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు.. నవంబరులో జరిగే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్ అంగీకరించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అధ్యక్షుడి సన్నిహితులు వెల్లడించారు. సొంత పార్టీ నుంచి డిమాండ్లు వస్తున్న వేళ ఆయన రేసు నుంచి వైదొలిగే అవకాశాలున్నట్లు వారు చెప్పారు అని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.ఇక, ఇటీవల కొవిడ్ బారిన పడిన బైడెన్ ప్రస్తుతం డెలావర్లోని తన ఇంట్లో క్వారెంటైన్లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె పోటీ కోసం సన్నద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. -
బైడెన్కు కరోనా
మిల్వాకీ: ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్నాయి. ప్రత్యర్థి అసలే డొనాల్డ్ ట్రంప్. ఆదినుంచీ దూకుడుగా దూసుకెళ్తున్నారు. అది చాలదన్నట్టు హత్యా యత్నంతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. దాన్ని వీరోచితంగా ఎదుర్కొన్న తీరుతో మరింత ఫేవరెట్గా మారారు. అలాంటి ట్రంప్ను దీటుగా ఎదుర్కోవాల్సిన డెమొక్రాట్లు మాత్రం ఇంకా కాలూ చెయ్యీ కూడదీసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. వయోభారం, మతిమరుపుతో రోజుకో రకంగా తడబడుతున్న అధ్యక్షుడు జో బైడెన్ ఎలా చూసినా ట్రంప్కు పోటీ ఇవ్వలేరని దాదాపుగా తేలిపోయింది. అయినా పోటీ నుంచి తప్పుకునేందుకు, మరొకరికి చాన్సిచ్చేందుకు 81 ఏళ్ల బైడెన్ ససేమిరా అంటున్నారు. ఇవి చాలవన్నట్టు బైడెన్ తాజాగా కరోనా బారిన పడ్డారు! దాంతో కీలక దశలో ఎన్నికల ప్రచారానికి విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఈ వరుస పరిణామాలతో డెమొక్రాట్లు తల పట్టుకుంటున్నారు. పోటీకి ముందే ఓటమి ఖాయమయ్యేలా ఉందని వాపోతున్నారు. బైడెన్ను ఎలాగోలా బుజ్జగించి తప్పించేందుకు చివరి నిమిషం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లాస్వెగాస్లో ప్రచార ఈవెంట్లో మాట్లాడాల్సి ఉండగా బైడెన్కు కరోనా సోకినట్టు తేలింది. దాంతో డెలావెర్ నివాసంలో ఐసోలేషన్లో ఉన్నారు.ట్రంప్ను మీరు ఓడించలేరు: పెలోసీ బైడెన్ తప్పుకోవాలంటున్న డెమొక్రాట్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పార్టీ కీలక నేత, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల బైడెన్తో ఫోన్లో మాట్లాడినట్టు సీఎన్ఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. ట్రంప్ను ఓడించడం ఆయన వల్ల కాదని ఆమె స్పష్టం చేసినట్టు చెప్పుకొచి్చంది. ‘‘పోల్స్ కూడా మీరు గెలవలేరనే చెబుతున్నాయి. కనుక తప్పుకుంటే మంచిది. కాదని మొండికేస్తే మీరు ఓడటమే గాక ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల విజయావకాశాలను కూడా చేజేతులా నాశనం చేసిన వారవుతారు’’ అంటూ పెలోసీ కుండబద్దలు కొట్టారట. -
అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారీస్.. హింట్ ఇచ్చిన బైడెన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ వస్తున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్.. అధ్యక్ష పదవికి అర్హురాలు అంటూ బైడెన్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో, అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకుంటున్నారనే చర్చ మొదలైంది.కాగా, తాజాగా అధ్యక్షుడు జో బైడెన్ నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్స్(NAACP) అన్వాల్ కన్వేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. కమలా హారీస్ కేవలం గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదు. ఆమె అమెరికా ప్రెసిడెంట్ కూడా కావచ్చు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు విన్న డెమోక్రాట్స్ ఆనందం వ్యక్తం చపట్లు కొట్టారు. ఇక, బైడెన్ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ మొదలైంది. మరోవైపు.. అంతకుముందు కూడా కమలా హారీసే డెమోక్రటిక్ పార్టీకి భవిష్యత్ అని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇక, కొన్ని సందర్భాల్లో మాత్రం బైడెన్.. తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకునే ఛాన్స్ లేదని చెప్పిన విషయం తెలిసిందే. పోటీలో తానే ఉంటానని చెప్పుకొచ్చారు. ట్రంప్ను ఓడిస్తానని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్తో భేటీ సందర్భంగా బైడెన్ తేలిపోయాలి. దీంతో, బైడెన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమోక్రటిక్ పార్టీలోనే కొందురు నేతలు కామెంట్స్ చేశారు. బైడెన్ స్థానంలో కమలా హారీస్కు అవకాశం ఇవ్వాలని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. ఇక, పలు సర్వేల్లో ట్రంప్కు పోటీగా కమలా హారీస్ బెటర్ అనే ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. సీఎన్ఎన్ సర్వేల్లో కమలా హారీస్కు 45 శాతం ఓట్లు రాగా ట్రంప్కు మాత్రం 47 శాతం ఓటింగ్ వచ్చింది. -
ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి ఉషా‘పతి’
ఉషా చిలుకూరి వాన్స్.. తెలుగు పేరులా ఉంది కదా! అవును.. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కొత్తగా చర్చనీయాంశమైన పేరు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేమ్స్ డేవిడ్ వాన్స్ భార్య. కాలిఫోర్ని యాలో పుట్టి పెరిగిన ఆ తెలుగు ఆడబిడ్డ గురించి కొన్ని ముచ్చట్లు.. వాషింగ్టన్: సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనేటర్గా ఉన్న జేమ్స్ డేవిడ్ వా న్స్ (జేడీ వాన్స్)ను ప్రకటించారు. ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా ఉన్న జేడీ వాన్స్ తరువాత ఆయనకు అనుచరుడిగా మారిపో యారు. ట్రంప్పై హత్యాయ త్నం జరిగిన వెంటనే.. దీని వెనుక అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉండొచ్చని మొట్టమొదటగా ట్వీట్ చే సింది కూడా జేడీనే. సోమవారం జరిగిన కన్వెన్షన్లో అభర్థిత్వం ప్రకటించిన త రువా త ప్రసంగించిన ఆయన.. తన ప్రస్థానం వె నుక భార్య ఉషా చిలుకూరి వాన్స్ సహ కా రం ఎంతో ఉందన్నారు. చరిత్ర విద్యార్థిగా.. ఉషా తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందట ఏపీ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె 1986 జనవరి 6న కాలిఫోర్నియాలోని శాండియాగోలో జన్మించారు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన ఉషా.. యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. ఉష అక్కడి లా జర్నల్కు ఎగ్జిక్యూటివ్ డెవ లప్మెంట్ ఎడిటర్గా, యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్గా పనిచేశారు. కేంబ్రిడ్జిలో ఆమె లెఫ్ట్–వింగ్, లి బరల్ గ్రూప్స్తో కలిసి పనిచేశారు. 2014లో వామపక్ష డెమొక్రటిక్ పార్టీలో చేరిన ఉషా.. 2018లో రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకు న్నారు. 2015–2017 వరకు శాన్ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ డీసీలోని వివిధ సంస్థల్లో పని చేశారు. యేల్ వర్సిటీలో చదువుతుండగానే ఉషకు జేడీ వాన్స్ పరిచయం. ఇద్దరూ కలిసి పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఈ అనుబంధం ప్రేమగా మారి.. వారిద్దరూ 2014లో కెంటకీలో పెళ్లి చేసుకున్నారు. ఓ పక్క న్యాయ వాదిగా తన విధులు నిర్వహిస్తూనే భర్త రాజకీయ ప్రయాణంలో అండగా ఉన్నారు. జేడీ వాన్స్, ఉష దంపతులకు ఇద్దరు కొడుకులు వివాన్, వివేక్, కూతురు మిరాబెల్ ఉన్నారు. వారిని హిందూ, క్రిస్టియన్ రెండు మత విశ్వాసాలతో పిల్లలను పెంచుతున్నారు. -
ట్రంప్ కొత్త ప్లాన్.. కమలా హారీస్ టార్గెట్గా సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జో బైడెన్ను టార్గెట్ చేశారు. ఇక, తాజాగా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్పై కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా ట్రంప్ మాట్లాడుతూ..‘ఓ విషమంలో జో బైడెన్ మెచ్చుకుంటున్నాను. కమలా హారీస్ను తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం అతడు జీవితంలో తీసుకొన్న అద్భుతమైన నిర్ణయం. అదే అతడికి బెస్ట్ ఇన్స్యూరెన్స్ పాలసీ కావచ్చు. అలాగే, కమలా హారీస్ను బైడెన్కు బీమా పాలసీగా అభివర్ణించారు. ఇదే సమయంలో ఆమెపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.బైడెన్ ప్రభుత్వంలో కమలా హ్యారిస్కు రెండు కీలక అంశాలు అప్పగించారు. ఒకటి బోర్డర్ సెక్యూరిటీ కాగా.. రెండోది ఉక్రెయిన్పై దాడి చేయకుండా రష్యాను భయపెట్టి ఆపడమని పేర్కొన్నారు. ఇక సరిహద్దు రక్షణ బాధ్యతలు చేపట్టాక ఆమె చేసిందేమీ లేదు. కనీసం బోర్డర్కు కూడా వెళ్లలేదని ట్రంప్ ఆరోపించారు. ఉక్రెయిన్పై దాడిని ఆపేందుకు ఆమెను ఐరోపాకు పంపించారని ట్రంప్ పేర్కొన్నారు. అది కూడా ఏమాత్రం ప్రయోజనాన్ని ఇవ్వలేదని సెటైర్లు వేశారు.ఇదిలా ఉండగా.. జూన్ 27వ తేదీన జరిగిన డిబెట్లో జోబైడెన్ ప్రదర్శనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా హారీస్ను పోటీ నిలపాలని పలువురు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అధ్యక్ష అభ్యర్థిత్వ మార్పిడిపై డెమోక్రటిక్ పార్టీలో చర్చ మొదలైన నేపథ్యంలో ట్రంప్.. కమలా హారీస్ను టార్గెట్ చేసి కామెంట్స్ చేయడం గమనార్హం. మరోవైపు.. బైడెన్కు ట్రంప్ సరికొత్త సవాల్ విసిరారు. సౌత్ ఫ్లోరిడాలోని డోరల్ కోర్సులో గోల్ప్ మ్యాచ్కు బైడెన్ రావాలని సూచించారు. తనతో కలిసి గోల్ప్ ఆడాలని సవాల్ చేశారు. ఒక వేళ ఈ గేమ్లో ట్రంప్ ఓడిపోతే బైడెన్ ఎంపిక చేసుకున్న స్వచ్ఛంద సంస్థకు ఒక మిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తానని ప్రతిపాదించారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై బెడైన్ ప్రతినిథి జేమ్స్ సింగర్ స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ తాను చేసిన మంచి పనులు ఏమీ లేక ఇలా కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవాలని చూస్తున్నారు. కానీ, బైడెన్ మాత్రం అమెరికా ప్రజల కోసమే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు అని అన్నారు. -
Iran election 2024: మతవాద పాలనకు ఎదురుదెబ్బ
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాదులదే పైచేయి అయింది. కరడుగట్టిన మతవాది సయీద్ జలిలిపై మితవాది, సంస్కరణాభిలాషి మసూద్ పెజెష్కియాన్ ఘనవిజయం సాధించారు. జూన్ 28న జరిగిన తొలి విడత ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థుల్లో ఎవరికీ మెజారిటీ రాలేదు. దాంతో విజేతను తేల్చేందుకు తొలి రెండు స్థానాల్లో నిలిచిన జలిలి, పెజెష్కియాన్ మధ్య శుక్రవారం తిరిగి ఎన్నిక అనివార్యమైంది. శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. పోలైన దాదాపు 3 కోట్ల ఓట్లలో పెజెష్కియాన్కు 1.64 కోట్లు వచ్చాయి. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అనుచరునిగా పేరుబడ్డ జలిలి 1.35 కోట్ల ఓట్లు మాత్రమే సాధించారు. దేశ తొమ్మిదో అధ్యక్షునిగా పెజెష్కియాన్ ఎన్నికైనట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్పై దశాబ్దాలుగా ఆధిపత్యం చలాయిస్తూ వస్తున్న మతవాద కూటమికి ఈ ఫలితాలు గట్టి షాకివ్వడమే గాక సంస్కరణవాదుల్లో జోష్ నింపాయి. నిజానికి ఈసారి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియనే బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ప్రజలు శుక్రవారం రాత్రి దాకా జరిగిన ఓటింగ్లో అనూహ్యంగా భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. దాంతో 53 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. తద్వారా ఖమేనీ ఏకపక్ష పోకడలపై ప్రజలు స్పష్టమైన వ్యతిరేకత వ్యక్తం చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఫలితాల వెల్లడి మొదలవుతూనే రాజధాని టెహ్రాన్, పశి్చమ ఇరాన్లోని పెజెష్కియాన్ సొంత నగరం తబ్రీజ్తో పాటు దేశవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు, అభిమానులు భారీగా వీధుల్లోకి వచ్చి డ్యాన్సుల సంబరాలు చేసుకున్నారు. దేశాన్ని కాపాడేందుకు ఓటర్లు భారీ సంఖ్యలో బూత్లకు తరలారంటూ నినాదాలు చేశారు. పెజెష్కియాన్ ఎన్నికల నినాదమైన ‘సేవ్ ఇరాన్’ సందేశాలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. దేశంలో మెజారిటీలపై మైనారిటీల పెత్తనానికి మొత్తానికి తెర పడ్డట్టేనంటూ సంస్కరణవాదులు సంబరపడుతున్నారు. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మేలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల ఫలితాలను ఖమేనీ లాంఛనంగా ఆమోదముద్ర వేశాక 30 రోజుల్లో పెజెష్కియాన్ బాధ్యతలు స్వీకరిస్తారు. నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు.పోలింగ్ శాతం పెరగడం వెనక... → నిజానికి ఏళ్లుగా తామెదుర్కొంటున్న పలు కీలక సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఇరానీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. → ఖమేనీ యంత్రాంగం తీరుకు నిరసనగా ఈసారి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను మూకుమ్మడిగా బహిష్కరించారు. దాంతో తొలి రౌండ్లో దేశ చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 40 శాతం పోలింగ్ నమోదైంది. → అత్యంత మితవాదిగా పేరొందిన పెజెష్కియాన్ అనూహ్యంగా తుది పోరులో బరిలో నిలవడంతో ఆయనకు మద్దతుగా వారంతా భారీ సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలారు. → పోలింగ్కు ముందు నుంచీ పెజెష్కియాన్ ప్రచార సరళికి, ‘సేవ్ ఇరాన్’ నినాదానికి దేశ యువత బాగా ఆకర్షితులయ్యారు. దాంతో ఆయన ర్యాలీలకు, సభలకు జనం పోటెత్తారు. → ఇస్లామిక్ పాలనకు తెర పడాల్సిందేనని యువతతో పాటు విద్యావంతులు కూడా తొలిసారిగా బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కరడుగట్టిన మతవాది అయిన జలిలి ఇరాన్ను ఎప్పటికీ ఏకం చేయలేరని మైకుల సాక్షిగా చెప్పుకొచ్చారు. → జలిలిని ఓడించడం ద్వారా నిరంకుశ మతవాద పాలనకు వ్యతిరేకంగా ఇరానీలు స్పష్టమైన తీర్పు వెలువరించారు. → ఖమేనీ మతవాద పాలన, హిజాబ్ను తప్పనిసరి వంటి కఠినతరమైన సామాజిక నిబంధనలు, ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను ఎత్తేసేలా అంతర్జాతీయ సమాజంతో చర్చలకు ముందుకు రాని పోకడలపైనా ప్రజలు తమ వ్యతిరేకతను ఓటు రూపంలో స్పష్టంగా వ్యక్తం చేశారంటున్నారు.హార్ట్ సర్జన్పై ఆశలెన్నో...! 69 ఏళ్ల పెజెష్కియాన్కు హార్ట్ సర్జన్గా దేశవ్యాప్తంగా అపారమైన పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆయన ఇరాక్–ఇరాన్ యుద్ధంలో పాల్గొన్న వార్ వెటరన్ కూడా. 16 ఏళ్లుగా పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా, నాలుగేళ్ల పాటు ఆరోగ్య మంత్రిగా కూడా చేశారు. ఆయన భార్య కారు ప్రమాదంలో చనిపోయారు. మళ్లీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ పేరెంట్గా పిల్లలను అన్నీ తానై పెంచారు. మతపరమైన మైనారిటీ అయిన అజెరీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం ఈ ఎన్నికల్లో పెజెష్కియాన్కు మరింత కలిసొచి్చంది. ప్రచారం పొడవునా కూతురిని వెంట ఉంచుకోవడం ద్వారా మహిళలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. దాంతో పార్టీలకు అతీతంగా ప్రజలు ఆయనకు భారీగా ఓటేశారు. సవాళ్ల స్వాగతం... లెక్కలేనన్ని సమస్యలు పెజెష్కియాన్కు స్వాగతం పలుకుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయంగా ఉంది. ఇరుగుపొరుగుతో సంబంధాలు దారుణంగా దిగజారాయి. యెమన్, లెబనాన్ గుండా ఇజ్రాయెల్పై సాయుధ పోరుకు ఇరాన్ అన్నివిధాలా సాయపడుతూ అంతర్జాతీయ సమాజం నుంచి మరింత ఆగ్రహం చవిచూస్తోంది. ఆ క్రమంలో గత ఫిబ్రవరిలో అమెరికాతో, అనంతరం ఏప్రిల్లో ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం ముంగిటి దాకా వెళ్లొచి్చంది. ఈ రుగ్మతలకు పెజెష్కియాన్ ఎలాంటి వైద్యం చేస్తారో చూడాలి. అయితే ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నట్టు ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. దేశ ప్రగతి కోసం ప్రత్యర్థులతో కూడా కలిసి పని చేస్తానని ఫలితాల అనంతరం ప్రకటించారు. ‘‘ఎన్నికలు ముగిశాయి. ఇది మనమంతా సహకరించుకుంటూ ముందుకు సాగాల్సిన సమయం. నేను మిమ్మల్ని ఏకాకులను చేయను. మీరూ నన్ను ఏకాకిని చేయొద్దు’’ అంటూ పిలుపునిచ్చారు. తద్వారా అందరినీ కలుపుకుని పోతానంటూ అతివాద వర్గానికి స్పష్టమైన సందేశమిచ్చారు. అదే సమయంలో, ‘ఇరాన్ ఇరానీలందరిదీ’ అంటూ పునరుద్ఘాటించడం ద్వారా ప్రజల సంక్షేమానికే ప్రథమ తాంబూలమని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరాన్కు సర్వం సహా చక్రవర్తి అయిన ఖమేనీతో అధ్యక్షునిగా ఆయన సంబంధాలు ఏ మేరకు సజావుగా సాగుతాయన్నది ఆసక్తికరం. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నా. దేశ ప్రగతి కోసం పెజెష్కియాన్కు మనమంతా దన్నుగా నిలవాల్సిన అవసరముంది.– ఫలితాల అనంతరం సయీద్ జలిలి – సాక్షి, నేషనల్ డెస్క్ -
Iran presidential election 2024: సంస్కరణవాదా ? అతివాదా?
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్తో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో నేడు రెండో దఫా ఎన్నికలకు ఓటర్లు సిద్ధమయ్యారు. జూన్ 28న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులందరినీ తిరస్కరిస్తూ, ఎవరికీ కీలక 50 శాతం ఓటింగ్ను ఓటర్లు కట్టబెట్టకపోవడంతో రన్ఆఫ్(రెండోసారి ఎన్నికలు)కు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. మతబోధకుడి పాలనను జనం ఎంతగా తిరస్కరిస్తున్నారనేది జూన్ 28నాటి అత్యల్ప ఓటింగ్ సరళి కళ్లకు కట్టింది. కునారిల్లిన ఆర్థికవ్యవస్థ, యువతలో అసహనం, మతఛాందసవాదం, ఉద్యమాలు, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్, అమెరికాలతో కయ్యంతో ఇంటాబయటా ఇబ్బందులు పడుతున్న దేశాన్ని ఎవరు ఏలుతారన్న విషయం నేటి ఎన్నికలతో తేలిపోనుంది. తొలి రౌండ్లో ఏం జరిగింది? మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీ మరణించడంతో అధ్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి. సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ ఆజ్ఞలు పాటిస్తూ దేశాధ్యక్షునిగా పాలించేందుకు ముగ్గురు అతివాద నేతలు, ఒక సంస్కరణవాది ఎన్నికల్లో పోటీకి ముందుకొచ్చారు. తొలి రౌండ్లో సంస్కరణవాది డాక్టర్ మసూద్ పెజెష్కియన్ అందరికంటే ఎక్కువగా 42.5 శాతం ఓట్లు సాధించారు. అతివాది సయీద్ జలిలి 38.6 శాతం ఓట్లు ఒడిసిపట్టారు. దేశంలో 6 కోట్ల మంది ఓటర్లుంటే కేవలం 2.5 కోట్ల మంది ఓటేశారు. దేశ చరిత్రలోనే అత్యల్పంగా 40 శాతం పోలింగ్ నమోదైంది. ఎవరికీ 50 శాతం ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు రెండోదశ పోలింగ్కు అర్హత సాధిస్తారు. ఈ లెక్కన మసూద్, జలిలి మాత్రమే ఈరోజు జరిగే ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పిడివాదుల్లో పొరపొచ్చాలు? అతివాద నేతల మధ్య అభిప్రాయభేదాలు పొడచూపాయి. అతివాదం నుంచి దేశాన్ని సంస్కరణల బాట పట్టిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడ్డారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సీనియర్ సభ్యుడు, అతివాది సర్దార్ మొహసీన్ రషీద్ తన మద్దతు మసూద్కే అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తొలి రౌండ్లో పోటీపడి ఓడిన గలీబాఫ్కు ప్రచారసారథ్యంవహించిన సమీ నజారీ తర్కరానీ సైతం మసూద్కే తన ఓటు అని ప్రకటించారు. మసూద్ గెలిస్తే? తొలి రౌండ్లో పోలింగ్ కేంద్రందాకా రాని 60 శాతం ఓటర్లపైనే ఈ ఇద్దరు అభ్యర్థులు దృష్టిసారించారు. తొలి రౌండ్లో సమీప అభ్యర్థి జలిలి కంటే 3.9 శాతం ఓట్లు ఎక్కువ సాధించడం ద్వారా జనాల్లో తనకు ప్రజాదరణ ఎక్కువ ఉందని మసూద్ పెజెష్కియన్ ఇప్పటికే నిరూపించుకున్నారు. కొన్ని అంశాల్లో మసూద్ను సమరి్థస్తున్నట్లు ఎన్నికలపర్వం మొదలవడానికి ముందు జలిలి కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మైనారిటీలు, యువత, మహిళల సమస్యలను ప్రచారం సందర్భంగా ప్రస్తావిస్తూ జనాన్ని మసూద్ తనవైపునకు తిప్పుకుంటున్నారు. మసూద్ గెలిచి దేశాధ్యక్షుడైతే నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో మరుగునపడిన 2015నాటి అమెరికా–ఇరాన్ అణుఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు కృషిచేయొచ్చు. పశి్చమదేశాలతో దోస్తీకి ప్రయతి్నంచవచ్చు. దీంతో ఆంక్షలు తొలగి, విదేశీ పెట్టుబడులు పెరిగి దేశారి్థకం బాగుపడే అవకాశముంది.జలిలి గెలిస్తే? సయీద్ జలిలి గెలిస్తే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. దేశాభివృద్ధి కోసం పశి్చమదేశాలపై ఆధారపడాల్సిన పనిలేదని సుప్రీంలీడర్ ఖమేనీ అన్న మాటలనే జలిలి వల్లెవేస్తున్నారు. ‘‘ అసలు ఇరాన్పై ఎందుకు ఆంక్షలు విధించాం? అని పశి్చమ దేశాలే బాధపడాలి. ఆంక్షలను సైతం మనం అవకాశంగా మలచుకోవాలి’ అన్న జలిలి మాటలు చూస్తుంటే ఈయన గెలిస్తే దేశంలో మతచాంధస పాలనను కొనసాగిస్తారని అర్థమవుతోంది.స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే మార్గముందా? దేశ కీలక అంతర్గత వ్యవహారాలు అన్నీ సుప్రీంలీడర్ ఖమేనీ కనుసన్నల్లో జరుగుతాయి. అలాంటపుడు అధ్యక్షుడిగా ఉండి కూడా మసూద్గానీ, జలిలిగానీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరా? అనేది భేతాళ ప్రశ్నగా మిగిలిపోనుందని రాజకీయ విశ్లేషకుల మాట. అయితే విదేశీవ్యవహారాల్లో అధ్యక్షుడు, మంత్రివర్గం నిర్ణయాలే ఎక్కువగా చెల్లుబాటు అవుతాయని తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాలతో శతృత్వం విషయం పక్కనబెడితే ఇతర పశి్చమ దేశాలతో మైత్రికి నూతన అధ్యక్షుడు ప్రయతి్నస్తే దేశంలో ప్రగతి సాధ్యమే. మసూద్ అధ్యక్షుడైతే ఈ మార్పుకు బాటలు పడొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ‘మార్పు’కు ఖమేనీ ఒప్పుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిగ్ డిబేట్లో బైడెన్ బేజారు!.. ‘నేనేం కుర్రాడిని కాదుగా’
వాషింగ్టన్: వాడీవేడిగా సాగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(81), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(78)ల చర్చ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు ఈ ఇద్దరూ. అయితే డిబేట్లో ట్రంప్ పైచేయి సాధించారంటూ బైడెన్ డెమొక్రటిక్ సహచరులు సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.ట్రంప్తో సాగిన డిబేట్లో తన ప్రదర్శపై అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం స్పందించారు. ‘‘స్పష్టంగా చెప్పాలంటే.. నేను కుర్రాడిని కాదనే విషయం నాకు తెలుసు. అలాగని నడకలోనూ, మాటల్లోనూ, చర్చల్లోనూ అంత తేలికగా వ్యవహరించను. నేను ఈ బాధ్యతను(అధ్యక్ష పదవి) మళ్లీ సమర్థవంతంగా నిర్వహించగలనని మనసారా, ఆత్మ సాక్షిగా నమ్మాను. కాబట్టే మళ్లీ బరిలో నిలుచున్నా. ఏది ఏమైనా.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేది లేదు. రిపబ్లికన్ ప్రత్యర్థి ట్రంప్ను ఓడించి తీరతా’’ అని బైడెన్ అన్నారు.దేశాధ్యక్ష పీఠం కోసం డెమొక్రటిక్ పార్టీ నుంచి బైడెన్, రిపబ్లికన్ల తరఫున ట్రంప్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి(భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) జరిగిన డిబేట్లో పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వీరిద్దరి మధ్య ఇదే తొలి ముఖాముఖి చర్చ. దేశ ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు, విదేశాంగ విధానం, గర్భవిచ్ఛిత్తి తదితర అంశాలపై ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకొని.. దాదాపు 90 నిమిషాలపాటు ఆరోపణలు గుప్పించుకున్నారు. -
మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్
వ్లాదిమిర్ పుతిన్ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే దేశం రష్యా. చాలా సంవత్సరాలుగా పుతిన్ ఏలుబడిలో ఉన్న రష్యాలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు కీలకంగా మారనుంది. అందుకు కారణం.. ఆ దేశానికి అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం. గతంలో ఒక్కరోజులో పోలింగ్ పూర్తయ్యేది. అయితే.. దేశ చరిత్రలో తొలిసారిగా వరసగా మూడు రోజులపాటు అంటే 15, 16, 17 తేదీల్లో పోలింగ్కు రష్యా సిద్ధమైంది. శుక్రవారం పోలింగ్ ప్రారంభమైందక్కడ.. ప్రస్తుత పదవీకాలంతో కలిపి పుతిన్ ఇప్పటికే నాలుగు సార్లు(2000, 2004, 2012, 2018)లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 2008లో ప్రధానిగానూ సేవలందించారు. మానవహక్కుల గొంతుక, విపక్ష నేత అలెక్సీ నావల్నీ గత నెల మారుమూల కారాగారంలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఈసారి పుతిన్ వ్యతిరేక ఓటింగ్ పెరుగుతుందా? లేదా అనేది వేచిచూడాలి. ఉక్రెయిన్పై దురాక్రమణతో ప్రస్తుతం తన అధీనంలో ఉన్న నాలుగు ఉక్రెయిన్ రీజియన్లలోనూ ఈ ఎన్నిక క్రతువు కొనసాగనుంది. పుతిన్ హవా.. అధ్యక్ష రేసులో పుతిన్ విజయబావుటా ఎగరేస్తారని ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. అయినా సరే పౌర హక్కులను కాలరాస్తూ, నియంత పోకడలతో దేశాన్ని ఏలుతున్న పుతిన్ పాలనకు అంతం పలుకుతామంటూ విపక్ష పార్టీల నేతలు ప్రతినబూనారు. ఎన్నికల రణరంగంలో పుతిన్ను ఓడిస్తామంటూ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ రష్యా(ఎల్డీపీఆర్) తరఫున అభ్యరి్థగా లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ అభ్యరి్థగా వ్లాదిస్లేవ్ దవాన్కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యరి్థగా నికోలే ఖరిటోనోవ్లు ఎన్నికల బరిలో నిలిచారు. దేశ ఓటర్లలో పుతిన్కు 75 శాతం మద్దతు ఉందని, ఈ ముగ్గురు తలో 5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని ముందస్తు పోలింగ్ అంచనాలు విశ్లేíÙస్తున్నాయి. పోలింగ్ ఎక్కడెక్కడ? పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ గురువారం కంటే ముందే మొదలుపెట్టారు. శుక్రవారం సాధారణ ఓటింగ్ మొదలైంది. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపై పుతిన్ ప్రధానంగా దృష్టిపెట్టారు. రష్యా భూభాగంలో ఎలాగూ మెజారిటీ సాధిస్తానని పుతిన్ బలంగా నమ్ముతున్నారు. ఉక్రెయిన్ ప్రాంతాల్లో గెలిచి తమది అధర్మ యుద్ధం కాదని ప్రపంచానికి చాటి చెప్పాలని పుతిన్ యోచిస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎన్నికలు, రెఫరెండమ్లు ఇప్పటికే నిర్వహించారు. అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని ప్రపంచదేశాలు మొత్తుకున్నా పుతిన్ పట్టించుకోవట్లేదు. ఈసారి 11.42 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలుస్తోంది. అర్హులైన ఓటర్లు విదేశాల్లో ఉన్నా సరే ఓటేయొచ్చు. మార్చి 19 కల్లా తొలి దఫా ఫలితాలు వెల్లడి కావచ్చు. తుది ఫలితాలు తెలియాలంటే మార్చి 29వ తేదీకా ఆగాల్సిందే. 2018 గత అధ్యక్ష ఎన్నికల్లో 68 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకెన్నాళ్లు పుతిన్ పాలిస్తారు? మరో రెండు పర్యాయాలు దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనువుగా చట్టం చేసి 2021లో పుతిన్ దానిపై సంతకం చేశారు. ఈసారి గెలిచి, 2030లోనూ గెలిస్తే 2036దాకా పుతిన్ దేశాధ్యక్షుడిగా కొనసాగుతారు. రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యంత ఎక్కువకాలం దేశాన్ని పాలించిన నేతగా పుతిన్ పేరు ఇప్పటికే చరిత్రకెక్కింది. కుంభస్థలిని కొట్టగలరా ? పోటీలో ఏ అభ్యర్థి నిలబడాలి అనేది దాదాపు దేశ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) నిర్ణయిస్తుంది. ఎల్డీపీఆర్ నేత లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ నేత వ్లాదిస్లేవ్ దవాన్కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ నేత నికోలే ఖరిటోనోవ్లు ఈసారి బరిలో దిగారు. పుతిన్ను వీరంతా విమర్శిస్తున్నప్పటికీ ఉక్రెయిన్తో యుద్ధాన్ని వీరు వ్యతిరేకించలేదు. యుద్ధాన్ని వ్యతిరేకించిన ఏకైక విపక్ష నేత బోరిస్ నదేహ్దిన్ను పోటీకి నిలబడకుండా సీఈసీ అడ్డుకుంది. అభ్యరి్ధత్వానికి సరిపడా సంతకాలను సేకరించలేకపోయారని ఆయన అభ్యరి్ధత్వాన్ని తిరస్కించింది. మరో అభ్యర్ధి యెకటేరియా డుంట్సోవానూ సీఈసీ ఇలాగే పక్కకునెట్టింది. పుతిన్ను ప్రధానంగా విమర్శించే విపక్ష నేత అలెక్సీ నావల్నీ ఇప్పుడు ప్రాణాలతో లేడు. స్లట్స్కీ, దవాన్కోవ్, ఖరిటోనోవ్లు దేశ సమైక్యత విషయానికొచ్చేసరికి పుతిన్కు పరోక్షంగా మద్దతు పలుకుతారు. ఈ లెక్కన దేశ సమైక్యత జెండా పట్టిన పుతిన్కే ఎక్కువ ఓట్లు పడతాయి. దీంతో వీళ్లు పుతిన్ను ఓడించడం అనేది అసంభవం. పుతిన్కు నిజంగా అంతటి ఫాలోయింగ్ ఉందా? రష్యా పౌరులు ఆంక్షల చట్రం, నిఘా నీడలో జీవిస్తారని పశి్చమదేశాలు తరచూ ఆరోపిస్తుంటాయి. దీంతో పుతిన్ను ఇష్టపడే ఎన్నుకుంటున్నారా లేదంటే మరో ప్రత్యామ్నాయం లేక పుతిన్కు జై కొడుతున్నారా అనేది ఇతమిద్ధంగా ఎవరికీ తెలీదు. పుతిన్ పాపులారిటీ 80 శాతాన్ని దాటేసిందని అక్కడి ప్రభుత్వేతర ఎన్నికల మేథో సంస్థ ‘ది లెవడా సెంటర్’ ఇటీవల ప్రకటించింది. అయితే 2023 చివరి నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరవరలు ఎగిసిన నేపథ్యంలో పుతిన్ పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగాయని సంస్థ విశ్లేషించడం గమనార్హం. తనను వ్యతిరేకించే వాళ్లను పుతిన్ అస్సలు సహించలేడని పుతిన్కు గతంలో ప్రసంగాలు రాసి ఇచ్చిన అబ్బాస్ గలియమోవ్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA presidential election 2024: ట్రంప్కు షాక్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి షాక్ తగిలింది. 2024 నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో రాష్ట్ర సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2021లో కాపిటల్ హిల్పై జరిగిన దాడి ఉదంతంలో ఆయన పాత్ర ఉందని తేలి్చంది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ (సెక్షన్ 3) ప్రకారం ట్రంప్ను దోషిగా నిర్ధారించింది. దీని ప్రకారం ప్రభుత్వంపై, ప్రభుత్వ సంస్థలు, భవనాలపై దాడిలో పాల్గొనే అధికారులు భవిష్యత్తులో ప్రభుత్వ పదవులు చేపట్టడానికి అనర్హులు. కాకపోతే అధ్యక్ష అభ్యరి్థని ఈ సెక్షన్ కింద పోటీకి అనర్హుడిగా ప్రకటించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి! ఈ తీర్పు కొలరాడో రాష్ట్రం వరకే వర్తిస్తుంది. తీర్పు నేపథ్యంలో కొలరాడోలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎన్నిక (ప్రైమరీ)లో ట్రంప్ పోటీ చేయకుండా కోర్టు అనర్హత వేటు వేసింది. ప్రైమరీ బ్యాలెట్ పేపర్ల నుంచి ఆయన పేరును తొలగించాలని ఆదేశించింది. ‘‘కాపిటల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ స్వయంగా పురిగొల్పారు. అక్రమ పద్ధతుల్లో, హింసాత్మకంగా అధికార మారి్పడిని అడ్డుకోజూశారు. తద్వారా దేశ ప్రజల తీర్పునే అపహ్యాసం చేశారు. కనుక సెక్షన్ 3 ప్రకారం దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆయన అనర్హుడు’’ అంటూ ఏడుగురు జడ్జిల ధర్మాసనం 4–3 మెజారిటీతో తీర్పు చెప్పింది. ఆశలపై నీళ్లు!: మరోసారి అధ్యక్షుడు కావాలన్న 77 ఏళ్ల ట్రంప్ కలలకు కొలరాడో కోర్టు తీర్పు గట్టి ఎదురు దెబ్బేనని భావిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో ఇప్పటికే ఆయన అందరి కంటే ముందున్నారు. కొలరాడో కోర్టుది తప్పుడు తీర్పంటూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తనను ఏదోలా అడ్డుకునేందుకు న్యాయవ్యవస్థను కూడా అడ్డగోలుగా వాడుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ట్రంప్ లాయర్లు ప్రకటించారు. కొలరాడో కోర్టు కూడా తన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు జనవరి 4 దాకా గడువిచి్చంది. అప్పటిదాకా తీర్పు అమలుపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ రాజకీయ భవితవ్యాన్ని సుప్రీంకోర్టులోనే తేలనుంది. అయితే, ఒకట్రెండు నెలల్లో రాష్ట్రాలవారీగా ప్రైమరీలు మొదలవుతున్న నేపథ్యంలో ఆలోగా సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించకపోతే ట్రంప్ పరిస్థితి ఏమిటన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కొలరాడోలో మార్చి 5న జరగనున్న ప్రైమరీకి అధ్యక్ష అభ్యర్థుల బ్యాలెట్ పత్రాల ఖరారుకు జనవరి ఐదో తేదే తుది గడువు! అంతేగాక కాపిటల్ భవనంపై దాడి ఉదంతానికి సంబంధించి ఇంకా పలు రాష్ట్రాల్లో ట్రంప్ కేసులు ఎదుర్కొంటున్నారు. అక్కడా ఇలాంటి తీర్పే వస్తే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ మరింతగా చిక్కుల్లో పడనుంది. ఈ పరిణామాలపై స్పందించేందుకు డెమొక్రటిక్ పార్టీ నిరాకరించింది. వివేక్ రామస్వామి అండ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వానికి ట్రంప్తో పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి కూడా కొలరాడో సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టడం విశేషం. ఈ విషయంలో ట్రంప్కు అండగా నిలవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఈ తీర్పు కారణంగా కొలరాడో రిపబ్లికన్ ప్రైమరీలో ట్రంప్ పోటీ పడలేకపోతే తాను కూడా అక్కడ పోటీ చేయబోనని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులెవరూ కూడా కొలరాడో ప్రైమరీలో బరిలో దిగొద్దని 38 ఏళ్ల వివేక్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. -
అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో జేవియర్ ఘన విజయం
బ్యూనోస్ ఎయిరీస్ (అర్జెంటీనా): అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఆర్థికవేత్త, టీవీ విశ్లేషకుడు జేవియర్ మిలే ఘన విజయం సాధించారు. ఆర్థిక మంత్రి సెర్గియో మస్సాను మట్టికరిపిస్తూ 55.7 శాతం ఓట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 99.4 శాతం ఓట్లను లెక్కించగా ప్రత్యర్థి సెర్గియోకు 44.3 శాతం ఓట్లు పడ్డాయి. ఈ దక్షిణ అమెరికా దేశంలో 1983లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తే ఒక నేతకు అధిక మెజారిటీ రావడం ఇదే తొలిసారి. -
లవ్ స్టోరీ చెప్పిన భార్య: తొలి బిడ్డను కోల్పోయాం.. వివేక్రామస్వామి భావోద్వేగం
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన, పారిశ్రామికవేత్త,భారతీయ సంతతికి చెందిన వివేక్ గణపతి రామస్వామి తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. ఈక్రమంలో అయోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో భార్య అపూర్వ, కుమారుడితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తి త జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను వివేక్ను ట్విటర్లో షేర్ చేశారు. తన భార్యకు గర్భం దాల్చి మూడున్నర నెలలకే గర్భస్రావం జరిగిందని ఇది తమకు చాలా బాధకరమైన క్షణమని పేర్కొన్నారు. ముఖ్యంగా తొలి బిడ్డను కోల్పోవడతో రెండోసారి కూడా ఆ భయం వెంటాడిందన్నారు. కానీ ఆ భగవంతుడిమీద విశ్వాసంతోనే ధైర్యాన్ని తెచ్చు కున్నామని, అలా కార్తీక్ , అర్జున్ వచ్చారని తమ జీవితాల్లోరావడంతో సంతోషం నిండిందంటూ అయోవాలోని ఫ్యామిలీ లీడర్ థాంక్స్ గివింగ్ ఫ్యామిలీ ఫోరమ్లో రామస్వామి తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. I haven’t spoken publicly about the loss of Apoorva and my first child—it’s difficult for us to talk about it. Apoorva and I draw strength from our faith in God and are so blessed to be the parents to our two sons Karthik and Arjun. pic.twitter.com/x2qzWqrxS5 — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 17, 2023 తన విశ్వాసమే తన స్వేచ్ఛ ను ఇచ్చిందనీ అదే ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నడిపించిందని చెప్పుకొచ్చాడు. దేవుడు ఒక్కడే అని తాను విశ్వసిస్తానన్నారు. అలాగే తల్లితండ్రుల పెంపకం, వారి పట్ల గౌరవం వివాహం, ఇతర సాంప్రదాయ విలువల్ని వారి నుంచి నేర్చుకున్నానన్నారు. హిందూ విశ్వాసం, సిద్ధాంతాలు, క్రైస్తవ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు నేర్చుకున్న క్రైస్తవ విలువల మధ్య సారూప్యాన్ని ప్రస్తావించారు. ఇవి మతపరమైన సరిహద్దులను అధిగమించి ఉన్నతమైన దైవిక శక్తికి చెందినవని పేర్కొన్నారు. అటు రామస్వామి భార్య అపూర్వ కూడా తమ ప్రేమ ఎలా మొదలైందీ పంచుకున్నారు. తొలుత ఒక కాలేజీ పార్టీలో కలుసుకున్నామని తెలిపారు. మెడ్ స్కూల్లో ఉండగా, వివేక్ అక్కడ న్యాయ విద్యార్థిగా ఉన్నారు. అక్కడ వివేక్ను చూశాను...చాలా ఆసక్తికరమైన వ్యక్తిగా అనిపించాడు. వెంటనే వెళ్లి వివేక్ను పరిచయం చేసుకున్నానని కానీ అపుడు వివేక్ పెద్ద ఆసక్తి చూపించలేదన్నారు. కానీ అప్పటినుంచి తరచు కలుసుకుంటూ, తాము పరస్పరం ఎంత దగ్గరి వారిమో గుర్తించాం. అప్పటినుంచీ కలిసే ఉన్నామని తెలిపారు. కాగా వివేక్ రామస్వామి తండ్రి వీజీ రామస్వామి జనరల్ ఎలక్ట్రిక్లో ఇంజినీర్గా పనిచేశారు. తల్లి గీతా రామస్వామి వృద్ధులకు సంబంధించిన జీరియాట్రిక్ సైకియాట్రిస్టు. భార్య అపూర్వ సర్జన్. యేల్ విశ్వవిద్యాలయంలో పరిచయం వీరి పెళ్లికి దారితీసింది. 2015లో అపూర్వ తివారీని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు అబ్బాయిలు. 2023 ఆగస్టు నాటి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం వివేక్ రామస్వామి సంపద విలువ 95 కోట్ల అమెరికన్ డాలర్లకు పైమాటే. అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024 మంగళవారం జరగనున్నాయి. Voters in Iowa want to know the story how Apoorva and I met. Here’s how. 😉 📍 Osceola, IA pic.twitter.com/N7duPToNlO — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 19, 2023 -
హిందూ మత విశ్వాసమే స్ఫూర్తి: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: హిందూ మత విశ్వాసం తనకు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచి్చందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు. అధ్యక్ష రేసులో నిలిచేందుకు కూడా ఆ విశ్వాసమే తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడన్నది హిందూ మత మౌలిక విశ్వాసమని 38 ఏళ్ల వివేక్ చెప్పారు. -
వివేక్ రామస్వామి సర్ఫింగ్ వీడియో వైరల్: నీళ్లలోకి తోసేసి మరీ..!
అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచారు. 3వ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి సర్ఫ్ చేయడం నేర్చుకుంటున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. డిబేట్ తర్వాత మియామీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాజ్ సాయర్ రామస్వామి సర్ఫింగ్కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. "కాబోయే ప్రెసిడెంట్కి సర్ఫ్ చేయడంఎలాగో నేర్పిస్తున్నా’’ అనే క్యాప్షన్తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. మాట్లాడుతూనే ఉన్నట్టుండి వివేక్ను నీళ్లలోకి తోసివేయడం, అలాగే గతంలో ఎప్పుడు సర్ఫింగ్ చేయని రామస్వామి, బోర్డు మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించి రెండుసార్లు నీటిలో పడిపోవండి లాంటి దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తానికి నేర్పుగా నేర్చుకుని నీటి అలల్ని ఎదుర్కొని ఈజీగా సర్ఫింగ్ చేశారు. అంతేకాదు నాట్నుంచి పక్కకు తప్పుకొని మరీ సూట్తోనే సర్ఫింగ్ చేయాలన్న సాయల్ సవాల్ను కూడా స్వీకరించిన రామస్వామి అలవోకగా వేక్ సర్ఫింగ్లో విజయం సాధించడం విశేషం. ఇప్పటికే 7 లక్షల 50 వేల మందికిపైగా వీక్షించారు.దీంతో నెక్ట్స్ ప్రెసిడెంట్ అని కొందరు, మేన్ ఆఫ్ యంగ్ పీపుల్ మరికొందరు కమెంట్ చేయగా, ఇంకొందరు నెగిటివ్ కమెంట్స్ కూడా చేశారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి వ్యక్తిగత దూషణకు దిగారు. విదేశాంగ విధానంపై చర్చలో భాగంగా వేదికపై ఉన్న ఏకైక మహిళా అభ్యర్థి నిక్కీపై విరుచుకుపడ్డారు వివేక్. ఇద్దరు భారతీయ సంతతి లీడర్ల మధ్య వైరం చర్చకు దారి తీసింది. 2024 నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి View this post on Instagram A post shared by Kaz (@kazsawyer) -
2024 అధ్యక్ష ఎన్నికల బరిలో పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(71) 2030 వరకు పదవిలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు వచ్చే ఏడాది మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నడూలేని విధంగా అత్యంత ప్రమాదకరమైన కాలంలో రష్యాను నడిపించాలని ఆయన భావిస్తున్నట్లు అక్కడి మీడియా అంటోంది. దీనిపై తుది నిర్ణయమైపోయిందని, ఇందుకు తగ్గట్లుగా పుతిన్ మద్దతుదారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనను ఢీకొట్టే ప్రత్యర్థులెవరూ లేరని పరిశీలకులు అంటున్నారు. -
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాది గెలుపు
మాలె: మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష నేత మహ్మద్ ముయిజ్ 53 శాతం ఓట్లతో అనూహ్య విజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలెహ్కు 46 శాతం ఓట్లు రాగా, మొత్తమ్మీద 18వేల మెజారిటీతో ముయిజ్ విజయం సాధించారని అక్కడి మీడియా తెలిపింది. అధ్యక్ష బరిలోకి ఆలస్యంగా దిగిన ముయిజ్ రెండో రౌండ్లో విజయం సాధించడం గమనార్హం. సెప్టెంబర్లో జరిగిన మొదటి రౌండ్ పోలింగ్ ముయిజ్, సోలెహ్ల్లో ఎవ్వరికీ 50 శాతం పైగా ఓట్లు దక్కలేదు. దీంతో, శనివారం రెండో రౌండ్ పోలింగ్ జరిగింది. ముయిజ్కు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ను చైనా అనుకూల పార్టీగా భావిస్తుంటారు. అధికారంలోకి వస్తే మాల్దీవుల్లో ఉన్న భారత్ బలగాలను వెనక్కి పంపించివేస్తానని, భారత్పై ఆధారపడటం తగ్గిస్తానని హామీ ఇచ్చారు. -
Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సుమారు ఏడాది సమయం వుంది. ఈలోపే ఎన్నికల వేడి మొదలైనట్లు అక్కడి వాతావరణం గమనిస్తే అర్ధమవుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. డోనాల్డ్ ట్రంప్ రూపంలో అమెరికాలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ బైడెన్ వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది నాలుగోసారి. కాకపోతే ఇప్పటివరకూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు తొలిసారిగా ట్రంప్ను, అతని అనుచరులను ఉద్దేశిస్తూ నేరుగా విరుచుకుపడ్డారు. బరిలోకి ట్రంప్.. బైడెన్ విసుర్లు అదే సమయంలో, రిపబ్లికన్ పార్టీపైనా విసుర్లు విసిరారు. అరిజోనాలో తన ఒకప్పటి సహచరుడు, దివంగత జాన్ మైకెన్ స్మృతిగా చేపట్టిన లైబ్రరీ నిర్మాణ కార్యక్రమం వేదికగా బైడెన్ తన వాగ్బాణాలను ఎక్కుపెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరుపున మళ్ళీ డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడి బరిలో దిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సభ్యుల మద్దతు బలంగా కూడగట్టుకొనే దిశగా ట్రంప్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే తనకంటూ ఒక వర్గాన్ని నిర్మించుకున్నారు. గత మిడ్ టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్స్ ఓడిపోవడంతో రిపబ్లికన్స్ లో ఆశలు చిగురిస్తున్నాయి. డెమోక్రట్లకు కాస్త కలిసివచ్చింది ప్రస్తుతం అమెరికాలో జో బైడెన్ రేటింగ్స్ పడిపోవడం, 80ఏళ్ళ ముదుసలి ప్రాయానికి దగ్గర కావడం మొదలైన అంశాలు డోనాల్డ్ ట్రంప్కు తన విజయం పట్ల విశ్వాసాన్ని కలుగజేస్తున్నట్లు భావించాలి. ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం వున్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బీదపలుకులు పలకడం ఏమీ బాగాలేదు. దీని ద్వారా తన ఓటమి, తన పార్టీ ఓటమి తధ్యమని సంకేతం ఇచ్చినట్లైంది. మొన్నటి మిడ్ టర్మ్ ఎన్నికల ముందు ట్రంప్పై ఎదురుదాడికి దిగిన సందర్భం డెమోక్రట్లకు కాస్త కలిసివచ్చింది. చదవండి: అమెరికాను ముంచెత్తిన వరదలు... న్యూయార్క్ అతలాకుతలం! ట్రంప్ సునిశిత పరిశీలన అదేంటంటే? అతి స్వల్ప తేడాతో మెజారిటీని కోల్పోయారు. లేకపోతే, ఇంకా ఎక్కువ బలహీన పడివుండేవారనే వ్యాఖ్యలు వినపడ్డాయి. ఈ అంశాన్ని డెమోక్రట్స్ తేలికగా తీసుకోరాదు. జో బైడెన్ పాలనలోని ప్రతి తప్పటడుగును ట్రంప్ చాలా సునిశితంగా పరిశీలిస్తున్నారు. బైడెన్/ డెమోక్రట్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం వచ్చేసింది. గతంలో డోనాల్డ్ ట్రంప్ పాలన గొప్పగా లేకపోయినా, నేటి బైడెన్ పాలన అద్భుతంగా వుందని చెప్పడానికి వాతావరణం పెద్దగా కనిపించడం లేదు. కాకపోతే ట్రంప్ నియంతగా, అహంకారిగా,సంపన్నుల పక్షపాతిగా కనిపిస్తాడు.అంతకు మించి శ్వేత జాత్యహంకారం, మిగిలిన జాతుల పట్ల వివక్ష ట్రంప్ లో పతాకస్థాయిలో కనిపిస్తాయి.జో బైడెన్ ఆ పార్టీ పేరుకు తగ్గట్టుగా ప్రజాస్వామ్యయుతంగా కనిపిస్తాడు. మూర్ఖంగా ప్రవర్తించి పరువుపోగొట్టుకున్నాడు పిచ్చిచేష్టలు, కోవిడ్ కష్టాలు మొదలైనవి ట్రంప్ పాలనపై తీవ్ర ప్రజావ్యతిరేకతను రగల్చడంతో మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలవ్వక తప్పలేదు. ట్రంప్ ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా మూర్ఖంగా ప్రవర్తించి పరువుపోగొట్టుకున్నాడు. తన పరిపాలనాకాలంలో అంతర్జాతీయ సంబంధాలను కూడా అడగంటించాడు. అభివృద్ధి ఎటూ లేదు. మంచిపేరు కూడా తెచ్చుకోలేకపోయాడు. దేశం పరువూ పోగొట్టాడు. కాకపోతే, శ్వేత జాతీయుల్లో తమ జాతినేతగా ముద్రవేయడంలో కొంత విజయం సాధించాడు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ విషయానికి వస్తే, బలమైన నేతగా ముద్రవేసుకోలేకపోయాడని చెప్పవచ్చు. ఏడాది ఆగాల్సిందే డెన్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అని నినాదం పదే పదే వినిపిస్తున్నారు. అమెరికా గొప్పతనం తగ్గుముఖం పట్టిందని, మళ్ళీ పూర్వ వైభవం రావాలని ఆ వాఖ్యలే చెప్పకనే చెబుతున్నాయి. ఆర్ధిక మాంద్యం కష్టాలు అమెరికాను వెంటాడుతూనే వున్నాయి. ఏ రీతిన చూసినా అటు అమెరికా పరిస్థితి ఇటు జో బైడెన్ స్థితి అంత ఆశాజనకంగా లేవు. ఈ సంవత్సర కాలంలో ఏవైనా బలమైన మార్పులు జరిగితే, బైడెన్కు కొంత అనుకూల వాతావరణం వస్తుంది. డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవి రేసులో ఇంకా కొందరు నేతలు లేకపోలేదు. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వంపై కూడా కొన్ని ఆలోచనలు అలుముకుంటున్నాయి. ఏది ఏమైనా, అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల అగ్గి మొదలైంది. రాజెవరో రెడ్డవరో తేలాలంటే ఒక ఏడాది ఆగాల్సిందే. -మాశర్మ సీనియర్ జర్నలిస్ట్ -
‘బైడెన్ పిచ్చితో మూడో ప్రపంచ యుద్ధమే!’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ధ్వజమెత్తారు. పనికిమాలిన అధ్యక్షుడంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. బైడెన్కు పిచ్చి పట్టిందని.. ఆ పిచ్చి అమెరికాను మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం ట్రంప్ విడుదల చేశారు. ‘‘కీలక దర్యాప్తు సంస్థల విషయంలో.. ఆయుధాల సమీకరణలో బైడెన్ చర్యలు అమెరికా భవిష్యత్తును ప్రమాదంలో పడేసివిగా ఉన్నాయి. దేశానికి రక్షణ కవచంలా ఉండే సరిహద్దు విషయంలో బైడెన్ ఎంతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గోడ లేకపోతే దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆయన మానసిక స్థితి ద్వారా విపత్తు సంభవించొచ్చు. ఆయనకు మతి భ్రమించింది. ఆయన అనాలోచిత నిర్ణయాలు, చేష్టలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు’’ అని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున 2024 అధ్యక్ష బరిలో నిల్చునే ప్రయత్నంలో ఉన్న మాజీ అధ్యక్షుడు ట్రంప్.. తీవ్రస్థాయిలో బైడెన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఆయన కోర్టు కేసులతో చిక్కుల్లో పడుతున్నారు కూడా. అయితే ట్రంప్ విమర్శలను అంతే తేలికగా తీసుకుంటున్న అధ్యక్షుడు బైడెన్.. వెటకారంగా స్పందిస్తున్నారు కూడా. Pretty comical to hear the Projection King say this about Biden today: “I believe that he has gone mad. A stark raving lunatic.” pic.twitter.com/0EQBVYwz9V — Ron Filipkowski (@RonFilipkowski) August 30, 2023 -
జైలులో లొంగిపోతా: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీచేయడానికి సన్నాహాల్లో చేసుకుంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కేసుల భయం, అరెస్టు భయం వెంటాడుతోంది. 2020లో జార్జియా రాష్ట్ర ఎన్నికల ఫలితాలను మార్చేయడానికి ప్రయతి్నంచిన కేసులో ట్రంప్ గురువారం ఫుల్టన్ కౌంటీ జైలులో లొంగిపోనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. అరెస్టు కావడానికి జార్జియాలోని అట్లాంటాకు వెళ్తున్నానని తెలియజేశారు. అక్కడ జిల్లా అటార్నీ ఫానీ విల్లీస్ తనను అరెస్టు చేస్తారని పేర్కొన్నారు. తన అరెస్టు ప్రక్రియను అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలోని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ సమన్వయం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయతి్నంచిన కేసులో ట్రంప్తోపాటు మరో 18 మంది ఆగస్టు 25లోగా లొంగిపోవాలని గతంలో జడ్జి ఆదేశించారు. అయితే ట్రంప్తో పాటు మరో 18 మంది కూడా సరెండర్ కావడానికి సిద్ధమైనట్లు సమాచారం. -
అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మరో భారతీయుడు
వాషింగ్టన్: 2024లో జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా మరో భారతీయుడు ఎంట్రీ ఇచ్చారు. ఇండో అమెరికన్ ఇంజినీర్ అయిన హిర్ష్ వర్ధన్ సింగ్(38) ఈ మేరకు మూడు నిముషాల నిడివి ఉన్న ఒక వీడియో సందేశం ద్వారా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. హిర్ష్ వర్ధన్ సింగ్ కంటే ముందు రిపబ్లికన్ పార్టీ తరపున సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హాలీ(51), మిలియనీర్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(37) అమెరికా అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా హిర్ష్ వర్ధన్ సింగ్ ఈ రేసులో నిలిచిన మూడో భారతీయ సంతతి వారిగా నిలిచారు. వీడియో సందేశంలో సింగ్ మాట్లాడుతూ.. నేను జీవితకాలం రిపబ్లికన్ గా ఉంటానని, న్యూ జెర్సీ రిపబ్లికన్ పార్టీ కన్జర్వేటివ్ విభాగాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన మొట్టమొదటి అమెరికన్ ను నేనేనన్నారు.. గత కొన్నేళ్లుగా వచ్చిన మార్పులను యధాస్థితికి తీసుకొచ్చి అమెరికా విలువలను కాపాడేందుకు బలమైన నాయకత్వం అవసరముందన్నారు. నాది స్వచ్ఛమైన రక్తం.. కోవిడ్ సమయంలో కూడా ఎటువంటి వ్యాక్సినేషన్ల జోలికి వెళ్ళలేదని.. అందుకే నేను రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష రేసులో నిలవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ మేరకు గురువారమే ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ లో తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు హిర్ష్ వర్ధన్ సింగ్. హిర్ష్ వర్ధన్ సింగ్ గతంలో న్యూజెర్సీ తరపున 2017,2021లో గవర్నర్ గాను, 2018లో హౌస్ సీటు కోసం, 2020లో సెనేటర్ గాను ప్రయత్నించారు. కానీ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో కూడా గవర్నర్ గా క్యాంపెయిన్ చేస్తూ డోనాల్డ్ ట్రంప్ తో పోటీపడ్డారు. కానీ నామినేషన్లలో మూడో స్థానంలో నిలిచారు. మొత్తంగా రిపబ్లికన్ పార్టీ తరపున ఈసారి ముగ్గురు భారత సంతతి వారు అధ్యక్ష పదవి కోసం నామినేషన్లలో పోటీ పడుతున్నారు. ఇదే పార్టీ తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో డోనాల్డ్ ట్రంప్ మొదటి వరుసలో ఉన్నారు. కానీ ఆయనపై నేర అభియోగాలున్న నేపథ్యంలో తర్వాతి వరుస వారిని అదృష్టం వరించినా వరించొచ్చు. అధ్యక్షుడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జులై 15-18 వరకు మిల్వాకీ, విస్కాన్సిన్ లో రిపబ్లికన్లు సమావేశం కానున్నారు. I'm entering the race for President.https://t.co/OEHCSYOdvK pic.twitter.com/RyxW4sKMSW — Hirsh Vardhan Singh (@HirshSingh) July 27, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: ట్రంప్
శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: ట్రంప్ -
మళ్లీ ఎన్నికల బరిలోకి
వాషింగ్టన్: అసంపూర్తిగా ఉన్న బాధ్యతలను పూర్తి చేసేందుకు తనకు మరో అవకాశమివ్వాలని అమెరికా ప్రజలను అధ్యక్షుడు జో బైడెన్ (80) కోరారు. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన మూడు నిమిషాల వీడియోతో ఎన్నికల ప్రచారానికి ఆయన అధికారికంగా శ్రీకారం చుట్టారు. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్నే మరోసారి తన రన్నింగ్ మేట్గా ఎంచుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ కి చెందిన బైడెన్ అమెరికా చరిత్రలో అత్యంత ఎక్కువ వయసున్న అధ్యక్షుడు. ఇక కమల దేశ తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్గారికార్డు సృష్టించారు. బైడెన్పై ట్రంప్ ధ్వజం: బైడెన్ అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడని ట్రంప్ ఆరోపించారు. ‘‘ప్రపంచ వేదికపై దేశ పరువు ప్రతిష్టలను ఆయన పూర్తిగా మంటగలిపారు. తన చేతగానితనంతో అమెరికాను మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబెట్టారు’’ అంటూ నిప్పులు చెరిగారు. బైడెన్ అధికార ప్రకటనకు కాస్త ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగడాన్ని అమెరికా చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన విషయంగా అభివర్ణించారు. రిపబ్లికన్ల అతివాదంపై పోరు 2024 ఎన్నిలను రిపబ్లికన్ల అతివాదంపై పోరుగా బైడెన్ అభివర్ణించారు. అబార్షన్ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక భద్రత చట్రం వంటివి ఎన్నికల్లో ప్రధానాంశాలన్నారు. ‘‘గత అధ్యక్ష ఎన్నికలను అమెరికా ఆత్మను పరిరక్షించేందుకు జరిగిన పోరు. అదింకా కొనసాగుతూనే ఉంది. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, హక్కులు మున్ముందు మరింత వికసిస్తాయా, కుదించుకుపోతాయా అన్నది ఇప్పుడు మనందరి ముందున్న పెద్ద ప్రశ్న. రానున్న ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పిడికిలి బిగించేందుకు తరానికి ఒక్కసారే వచ్చే అవకాశం. రండి అందరమూ కలిసికట్టుగా పని పూర్తి చేద్దాం’’ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో కలసి రావాల్సిందిగా అనంతరం కమల కూడా ఒక ప్రకటనలో అమెరికన్లకు పిలుపునిచ్చారు. ‘‘దేశ చరిత్రలో ఇది అత్యంత కీలక సమయం. స్వేచ్ఛ తదితర మౌలిక హక్కులపై రిపబ్లికన్ అతివాదుల దాడి నానాటికీ పెరిగిపోతోంది. మహిళకు తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలపై హక్కులను హరించజూస్తున్నారు. ఓటు హక్కునూ వదల్లేదు. ప్రజల గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తున్నారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు దేశాన్ని తిరోగమనంలోకి నెట్టజూస్తున్నారు’’ అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై విమర్శలు ఎక్కుపెట్టారు. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్ ముందున్న విషయం తెలిసిందే. భారత అమెరికన్లు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి తదితరులు ఆయనకు పోటీదారులుగా ఉన్నారు. -
US presidential election 2024: ట్రంప్ కేసు దారెటు!?
అవినీతి అక్రమాలకు పాల్పడి, న్యాయస్థానంలో నేర విచారణను ఎదుర్కొంటున్న మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా అపకీర్తిని మూటగట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ మళ్లీ దేశాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున తానే బరిలో ఉంటానని సంకేతాలిస్తున్నారు. అసలు అది సాధ్యమేనా అన్న చర్చ ప్రపంచమంతటా సాగుతోంది. ట్రంప్పై నమోదైన హష్ మనీ చెల్లింపుల కేసులో ఇకపై ఏం జరగవచ్చన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్పై కోర్టులో విచారణ ప్రారంభం కావడానికి చాలా సమయం పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ముందే కేసులను కొట్టివేయించేందుకు ట్రంప్ న్యాయబృందం ప్రయత్నాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండొచ్చన్నది ఆసక్తికరంగా మారింది... గాగ్ ఆర్డర్ ఇస్తారా? ► డొనాల్డ్ ట్రంప్పై తీవ్రమైన అభియోగాలు వచ్చాయని, అవి నిరూపితమైతే ఆయనకు గరిష్ట స్థాయిలో జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ► న్యాయమూర్తులపై ట్రంప్ అవాకులు చెవాకులు పేలుతున్నారు. న్యూయార్క్ సుప్రీంకోర్టు జడ్జి జువాన్ మెర్చాన్, మన్హట్టన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్పై విరుచుకుపడ్డారు. ► ట్రంప్ మంగళవారం మన్హట్టన్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు హంగామా సృష్టించారు. ఇదంతా న్యాయస్థానానికి చికాకు తెప్పించింది. ► సమాజంలో హింసను ప్రేరేపించే, అశాంతిని సృష్టించే, ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యాఖ్యలకు, ప్రవర్తనకు దూరంగా ఉండాలని ట్రంప్కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మెర్చాన్ హితవు పలికారు. ► ఇది జరిగిన ఐదు గంటల తర్వాత ట్రంప్ నోరు పారేసుకున్నారు. జువాన్ మెర్చాన్, అల్విన్ బ్రాగ్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ► మెర్చాన్, ఆయన భార్య, ఆయన కుటుంబం తనను ద్వేషిస్తోందని ఆరోపించారు. ఇక అల్విన్ బ్రాగ్ ఒక విఫలమైన జిల్లా అటార్నీ అని ఆక్షేపించారు. ఆయనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అల్విన్ బ్రాగ్ ఒక జంతువు, మానసిక రోగి అని ట్రంప్ మండిపడ్డారు. ► ట్రంప్ నోటికి తాళం వేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జువాన్ మెర్చాన్ గాగ్ ఆర్డర్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ► గాగ్ ఆర్డర్ జారీ చేస్తే కేసుల గురించి ట్రంప్ గానీ, ఆయన న్యాయబృందం గానీ ఎక్కడా బహిరంగంగా చర్చించకూడదు. ► గాగ్ ఆర్డర్ను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణించి కేసు నమోదు చేస్తారు. ట్రంప్కు 1,000 డాలర్ల జరిమానా లేదా 30 రోజుల జైలు శిక్ష.. లేదా రెండు శిక్షలూ విధించే అవకాశం ఉంటుంది. సాక్ష్యాలు అందాక ఏం చేస్తారో? ► ట్రంప్ హష్ మనీ చెల్లించిన కేసులో మన్హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం గత ఐదేళ్లుగా విచారణ కొనసాగిస్తోంది. ► చెల్లింపుల వ్యవహారాన్ని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, ఇది ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని అల్విన్బ్రాగ్ చెబుతున్నారు. ► దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూటర్లు ట్రంప్ న్యాయ బృందానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘డిస్కవరీ’ అంటారు. ► ఇది 35 రోజుల్లోగా పూర్తికావాలి. కానీ, అల్విన్ బ్రాగ్ నేతృత్వంలోని ప్రాసిక్యూటర్ల బృందానికి 65 రోజుల సమయం.. అంటే జూన్ 8 దాకా గడువు ఇచ్చారు. సాక్ష్యాలు చేతికి అందాక ట్రంప్ న్యాయవాదులు ఎలాంటి ఎత్తుగడ వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ పోటీ ఖాయమేనా? ► ట్రంప్ లాయర్ల తీర్మానాలపై డిసెంబర్ 4న కోర్టు తీర్పు వెలువడనుంది. ► తీర్మానాలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ట్రంప్పై అసలైన విచారణ ప్రారంభమవుతుంది. ► వచ్చే ఏడాది జనవరి నుంచి విచారణ చేపట్టాలని తాము కోర్టును కోరుతామని ప్రాసిక్యూటర్లు చెప్పారు. ► మార్చి నుంచి జూన్ వరకూ అమెరికాలో వసంత కాలం. అప్పుడైతే బాగుంటుందని ట్రంప్ లాయర్లు అభిప్రాయపడుతున్నారు. ► విచారణ మొదలయ్యే నాటికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రైమరీ ఎన్నికల్లో ప్రజలు పార్టీల తరపున పోటీ చేసే నామినీలకు ఓటు వేస్తారు. ► ట్రంప్పై విచారణ పూర్తయ్యి, తుది తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. కొత్త అధ్యక్షుడు కొలువుతీరుతాడు. ► 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నిక్షేపంగా పోటీ చేయొచ్చు. ఏ చట్టమూ ఆయనను అడ్డుకోలేదు. ► రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేయడానికి ట్రంప్ ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ► ఒకవేళ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్ను కోర్టు దోషిగా తేల్చి, శిక్ష ఖరారు చేస్తే పదవి నుంచి దిగిపోవడమో లేక కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాడడమో చేయాల్సి ఉంటుంది. తీర్మానం ప్రవేశపెడతారా? ► ట్రంప్ను అన్ని కేసుల నుంచి నిర్దోషిగా బయటకు తీసుకువస్తామని ఆయన తరపు లాయర్లు ఇప్పటికే తేల్చిచెప్పారు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ► చట్టప్రకారం చూస్తే విచారణ ప్రారంభం కావడానికి ముందు కేసులన్నింటినీ పునఃపరిశీలించి, ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టును అభ్యర్థించే వెసులుబాటు ఉంది. ఈ మేరకు కోర్టులో తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ► కేసులను పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టాలని ట్రంప్ బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తే ట్రంప్కు విముక్తి లభించినట్లే. అయితే, ఇదంతా ఆయన లాయర్ల శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ► ట్రంప్ కేసులను విచారిస్తున్న జడ్జిని విధుల నుంచి తొలగించాలని, విచారణ వేదికను మన్హట్టన్ నుంచి సమీపంలోని స్టాటెన్ ఐలాండ్కు మార్చాలని కోరుతూ కూడా తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు వీలుంది. మన్హట్టన్లో ట్రంప్ అభిమానులు పెద్దగా లేరు. అక్కడ విచారణ జరపడం సమంజసం కాదని ఆయన వాదిస్తున్నారు. ► మామూలుగా అయితే 45 రోజుల్లోగా తీర్మానం ప్రవేశపెట్టాలి. ట్రంప్ బృందానికి జడ్జి మెర్చాన్ ఆగస్టు 8 దాకా గడువు ఇచ్చారు. అంటే నాలుగు నెలలు. ట్రంప్ లాయర్ల తీర్మానంపై ప్రాసిక్యూటర్లు స్పందించడానికి సెప్టెంబర్ 19వ తేదీని డెడ్లైన్గా నిర్దేశించారు. ► తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలూ కచ్చితంగా వాడుకుంటామని, ప్రతి చిన్న అంశాన్ని కూడా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తున్నామని ట్రంప్ న్యాయవాది జోయ్ టాకోపినా చెప్పారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
బైడెన్ మళ్లీ పోటీ చేస్తారు: జిల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆ పదవికి పోటీపడనున్నారు. ఆయన భార్య జిల్ బైడెన్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఈ మేరకు తెలిపారు. 80 ఏళ్ల బైడెన్ ఇప్పటికే అమెరికా అధ్యక్షుల్లో అత్యంత వయోధికునిగా రికార్డు సృష్టించారు. రెండేళ్లలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలో దిగే ఆలోచన ఉందని ఆయన కూడా ఇప్పటికే పలుమార్లు చెప్పారు. సీఎన్ఎన్తో మాట్లాడుతూ జిల్ ఇదే విషయాన్ని గుర్తు చేశారు. ఆయన నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నట్టు తెలిపారు. రెండోసారి పోటీపై బైడెన్ బహుశా మరో రెండు మూడు నెలల్లో అధికారిక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. అయితే డెమొక్రటిక్ పార్టీ సహచరుల్లో ప్రధానంగా ఆయన వయసుపైనే అభ్యంతరాలు నెలకొన్నాయి. దీనిపై రాయిటర్స్–ఇప్సోస్ తాజాగా నిర్వహించిన పోల్లో బైడెన్ పోటీ చేయొద్దని డెమొక్రాట్లలో ఏకంగా 52 శాతం మంది అభిప్రాయపడ్డారు! మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరఫున రెండోసారి అధ్యక్ష బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు కూడా ప్రస్తుతం 76 ఏళ్లు! పైగా పార్టీ అభ్యర్థిత్వం కోసం నిక్కీ హేలీ తదితరులు ఇప్పటికే ఆయనకు పోటీదారులుగా ఉన్నారు. -
నేపాల్ ప్రభుత్వంలో కుదుపు
కాఠ్మాండు: వచ్చే నెలలో జరగబోయే నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార కూటమి పార్టీ సీపీఎన్–యూఎంఎల్ బలపరిచిన అభ్యర్థినికాకుండా అధికార కూటమిలోలేని వేరొక పార్టీ అభ్యర్థికి ప్రధాని ప్రచండ మద్దతు పలకడం సీపీఎన్–యూఎంఎల్కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన నేతలైన ఉపప్రధాని, ఆర్థికమంత్రి బిష్ణు పౌద్యాల్, విదేశాంగ మంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. దీంతో రెండు నెలల క్రితమే ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూలే అవకాశాలు ఎక్కువయ్యాయి. విపక్ష నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రామచంద్ర పౌద్యాల్కు గత శనివారం ఎనిమిది రాజకీయ పార్టీలు సమ్మతి తెలపడం, అధికారకూటమిలోని నేషనల్ డెమొక్రటిక్ పార్టీ.. ప్రభుత్వం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం, ఉపప్రధాని పదవికి రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ లింగ్టెన్ రాజీనామాచేయడం తెల్సిందే. సీపీఎం–యూఎంఎల్ మద్దతులేకున్నా పార్లమెంట్లో 89 మంది సభ్యులున్న నేషనల్ కాంగ్రెస్ పార్టీతో విశ్వాసతీర్మానాన్ని ప్రచండ సర్కార్ గట్టెక్కే వీలుంది. గత డిసెంబర్లో 7 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అధికార కూటమి పార్టీలు మద్దతు ఉపసంహరిస్తే ప్రధాని ప్రచండ నెలరోజుల్లోపు పార్లమెంట్లో విశ్వాసపరీక్షలో నెగ్గాలి. -
Russia-Ukraine War: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం రెండో ఏడాదిలోకి చొరబడింది. దురాక్రమణ ప్రయత్నాలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాది మారణహోమం తర్వాత కూడా వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ రాజ్యకాంక్ష ఏమాత్రం చల్లారలేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉక్రెయిన్పై ఉరుకులు పరుగుల మీద విరుచుకుపడ్డ రష్యాకు, తన అస్త్రాలేవీ పనికిరాకుండా పోయాయని జ్ఞానోదయం కలగడానికి ఎంతోసేపు పట్టలేదు. బాహుబలిగా కాలుదువ్విన పుతిన్ ఏడాది తిరిగేసరికి ప్రపంచం దృష్టిలో విలన్ అయ్యారు. సొంత ప్రజల దృష్టిలోనూ బాహుబలి హోదాను ఒకింత కోల్పోయారు. ఇంతకీ పుతిన్ ఊహించినదేమిటి? ఆయనకు ఎదురైందేమిటి...? ఎస్ రాజమహేంద్రారెడ్డి: పూర్వపు సోవియట్ యూనియన్ రిపబ్లిక్కులన్నింటినీ మళ్లీ ఒకే తాటిమీదకు తేవాలన్నది తన లక్ష్యమని పుతిన్ చెప్పుకుంటారు. పొరుగు దేశాలైన ఉక్రెయిన్, బెలారస్ కూడా ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనని అంటారాయన. రెండేళ్ల క్రితం ఆయన రాసిన ఓ సుదీర్ఘ వ్యాసంలో కూడా ఈ విషయాన్ని సుస్పష్టం చేశారు. బెలారస్తో రష్యాకు ఎలాంటి విభేదాలూ లేవు. పైగా ఉక్రెయిన్పై దాడిలో రష్యాకు ఆదినుంచీ అది వెన్నుదన్నుగా ఉంది. రష్యా తొలుత ఉక్రెయిన్లో చొరబడేందుకు తన భూభాగాన్ని అనుమతించింది కూడా. ఎటొచ్చీ పుతిన్కు పేచీ అల్లా ఉక్రెయిన్తోనే! ఆ దేశ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి కూడా రష్యా ఎన్నడూ ఇష్టపడలేదు. రష్యా, ఉక్రెయిన్ ఒకే దేశమన్నదే పుతిన్ గట్టి నమ్మకం. లోగుట్టు వేరే నిగూఢంగా చూస్తే మాత్రం, ఈ గొడవంతా పైపై పటారమే. అసలు విషయం ఏమిటంటే సుదీర్ఘ కాలం పాటు రష్యాకు తిరుగులేని నాయకునిగా వెలిగిపోవాలన్నది పుతిన్లో అంతర్లీనంగా ఉన్న ఆశగా చెప్తారు. మూడేళ్ల క్రితం ఆయన ఆ దిశగా ప్రయత్నం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణతో రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్షునిగా 16 ఏళ్లపాటు నిరాటంకంగా కొనసాగేలా కొత్త చట్టం తెచ్చేందుకు క్రెమ్లిన్ ప్రయత్నించింది. ఆ సమయంలో రష్యా టీవీ పుతిన్ కీర్తనలు, గుణగానాలతో హోరెత్తేది. ‘కల్లోల సాగరంలాంటి ప్రపంచంలో రష్యా నౌకను సమర్థంగా నడిపిస్తున్న కెప్టెన్ పుతిన్’ అంటూ ఊదరగొట్టేవారు. క్రెమ్లిన్ దృష్టిలో పుతిన్ సకల కళావల్లభుడు, సకలశాస్త్ర పారంగతుడు. అందుకే జూడో, రేసింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ విన్యాసాల్లో పుతిన్ సాహసకృత్యాల తాలూకు ఫొటోలను తరచూ ప్రపంచం ముందుకు తెస్తూంటుంది క్రెమ్లిన్. రష్యా ప్రజలను ప్రభావితం చేసి పుతిన్ పట్ల ఆరాధనా భావాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో క్రెమ్లిన్ ఎంచుకున్న మార్గమిది. అసలు విషయమేమిటంటే 2024లో రష్యా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఆలోపు ఏదో ఒక ఘనకార్యం చేసి పుతిన్ కీర్తిని అమాంతం పెంచేయడం క్రెమ్లిన్ లక్ష్యం. పశ్చిమ దేశాల కనుసన్నల్లో సాగుతున్న ఉక్రెయిన్ను ఓ దారికి తెస్తే బాహుబలి పుతిన్ సత్తా ఏమిటో తెలుస్తుందని, అధ్యక్ష ఎన్నికల్లో మంచి ప్రచారాస్త్రంగా మారుతుందని క్రెమ్లిన్ థింక్టాంక్ అంచనా. అనుకున్నదే తడవుగా దాడికి దిగడం, ఆరంభంలో కొన్ని ప్రాంతాను ఆక్రమించి ఎగిరి గంతెయ్యడం... తర్వాత ఉక్రెయిన్ధాటికి తట్టుకోలేక వాటిని వదిలేసి తోకముడవడం చకచకా జరిగిపోయాయి. అయినా సరే, ఇప్పటికీ ఉక్రెయిన్పై దాడిని తప్పుగా పుతిన్ అంగీకరించడం లేదు. రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఇదంతా పశ్చిమ దేశాల కుట్రేనని సెలవిచ్చారు! దానికి జవాబుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏకంగా ఉక్రెయిన్ యుద్ధభూమిలో అడుగుపెట్టారు! ఈ పోరులో తమ వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఉక్రెయిన్ను గెలవడం రష్యా తరం కాదని అక్కడే మీడియాముఖంగా ప్రకటించేశారు. బహుశా పుతిన్ కూడా ఇలాంటి సవాలు కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు! ఏదోలా వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికల దాకా యుద్ధం కొనసాగాలన్నదే ఆయన అభిమతమని పరిశీలకుల అంచనా. యుద్ధం సమాధుల మీద 2024 అధ్యక్ష ఎన్నికలను నెగ్గాలని పుతిన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆపద్ధర్మ పాత్రతో మొదలై... 1999లో బోరిస్ యెల్సిన్ ఆకస్మిక రాజీనామాతో ఆపద్ధర్మ అధ్యక్షునిగా తొలిసారి గద్దెనెక్కిన పుతిన్ 2000–2004, 2004–08ల్లో రెండు దఫాలుగా అధ్యక్షునిగా కొనసాగారు. అప్పట్లో రష్యా అధ్యక్ష పదవీకాలం నాలుగేళ్లే. తర్వాత 2008 నుంచి 2012 దాకా ఆయన ప్రధానిగా ఉన్నారు. ఈ దశలో రాజ్యాంగ సవరణల ద్వారా అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచారు. తర్వాత 2012 నుంచి 2018 దాకా, 2018 నుంచి ఇప్పటిదాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2024 మార్చితో పదవీకాలం ముగుస్తుంది. ఒక వ్యక్తి వరుసగా రెండుసార్లకు మించి అధ్యక్షునిగా ఉండరాదన్న నిబంధనను కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు. ఫలితంగా 2024తో పాటు 2030 ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం పుతిన్కు సంక్రమించింది. ఈ రెండుసార్లూ గెలిస్తే 2036 దాకా ఆయనే రష్యా అధినేతగా చక్రం తిప్పుతారు. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఒకే యుద్ధంతో అటు రాజ్యకాంక్షను, ఇటు పదవీకాంక్షనూ నెరవేర్చుకోవాలని పుతిన్ పట్టుదలగా ఉన్నారు. అందుకే యుద్ధానికి ఇప్పుడప్పట్లో ముగింపు పలికేందుకు ససేమిరా అంటున్నారు. యుద్ధంలో వెనకబడుతున్నట్టు అన్పించినప్పుడల్లా అణ్వాయుధ బూచితో ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికా మద్దతుతో లొంగేది లేదంటూ దీటుగా తలపడుతున్నారు. చివరికి గెలుపెవరిదైనా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మాత్రం వైరి వర్గాలు రెండింటినీ వెంటాడుతూనే ఉంటాయి. చరిత్ర చెక్కిలిపై యుద్ధం ఎప్పుడూ ఓ కన్నీటి బిందువే! చెరిగిపోని మచ్చే!! కొసమెరుపు ఏడాది యుద్ధం బాహుబలిగా వ్లాదిమిర్ పుతిన్కున్న పేరుప్రతిష్టలను బలి తీసుకుంటే, పూర్వాశ్రమంలో సినిమాల్లో కమేడియన్ పాత్రలు పోషించిన వొలోదిమిర్ జెలెన్స్కీని మాత్రం నిజజీవితంలో హీరోను చేసింది! -
ముందు మీ పార్టీలో ఎన్నికలు పెట్టుకోండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ప్రహసనమంటూ బీజేపీ పేర్కొనడంపై కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశిథరూర్ తీవ్రంగా స్పందించారు. విమర్శలకు ముందుగా కాషాయ పార్టీ ఎన్నికలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ‘మా అంతర్గత సమస్యలను పరిష్కరించుకోగల సత్తా మాకుంది. మా పార్టీ ఎన్నికల్లో మీ జోక్యం అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఒక ప్రహసనమే అని తేలింది. పోటీ సమఉజ్జీల మధ్య జరగడం లేదు. థరూర్కు సరైన వివరాలతో కూడిన డెలిగేట్ల జాబితాను కూడా ఇవ్వలేదు’ అంటూ అంతకుముందు బీజేపీ నేత మాలవీయ ట్వీట్ చేశారు. ‘పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు ఖర్గే వైపే మొగ్గుచూపుతున్నారు. గాంధీ కుటుంబానికి మరో ఎంఎంఎస్ 2.0 వెర్షన్ రానుంది’ అంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్నుద్దేశించి పరోక్షంగా అందులో పేర్కొన్నారు. -
గెహ్లాట్పై చర్యలకు శశిథరూర్ డిమాండ్
భోపాల్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు మద్దతుగా గెహ్లాట్ తన ట్విటర్లో ఈమధ్య ఓ వీడియో సందేశం ఉంచారు. ఈ క్రమంలో ఖర్గేకు బహిరంగ మద్దతు ప్రకటించడంపై థరూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థులు ఎవరైనా సరే..అంటూ మొదలుపెట్టి గెహ్లాట్ ప్రసంగం కొనసాగింది. ‘‘ఖర్గే పార్టీ నేతలతో, కార్యకర్తలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రతిపక్ష నేతలతోనూ చర్చించగల సామర్థ్యం ఉంది. కాబట్టి, పార్టీ ప్రతినిధులంతా ఆయన్ని ఘనమైన మెజార్జీతో గెలిపించాలి’’ అని గెహ్లాట్ సదరు వీడియో సందేశంలో కోరారు. ఈ పరిణామంపై గురువారం భోపాల్(మధ్యప్రదేశ్) పార్టీ కార్యాలయంలో శశిథరూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పార్టీ ఆఫీస్ బేరర్గానీ, ముఖ్యమంత్రిగానీ, పీసీసీ చీఫ్లు గానీ ఏ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనడంగానీ, మద్దతు తెలపడం లాంటి పనులు గానీ చేయకూడదు. मैं उम्मीद करता हूं जो भी डेलीगेट हैं वो भारी बहुमत से श्री मल्लिकार्जुन खड़गे को कामयाब करेंगे।कामयाब होने के बाद में वो हम सबका मार्गदर्शन करेंगे व कांग्रेस मजबूत होकर प्रतिपक्ष के रूप में उभर कर सामने आएगी।यह मेरी सोच है, मेरी शुभकामनाएं है खड़गे साहब भारी मतों से कामयाब हों। pic.twitter.com/OQ4Nk8zFKa — Ashok Gehlot (@ashokgehlot51) October 13, 2022 అలాంటిది గెహ్లాట్ బహిరంగంగా ఖర్గేకు మద్దతు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధికార యంత్రాంగం ఈ వ్యవహారంపై పక్షపాతం ప్రదర్శించకుండా దర్యాప్తు చేయాలి. అలాగే గెహ్లాట్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి’’ అని థరూర్ పేర్కొన్నారు. చాలా చోట్లా పీసీసీ చీఫ్లు, సీఎల్పీ నేతలు, బడా నేతలు మల్లికార్జున ఖర్గేకు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆ కార్యక్రమాలకు కార్యకర్తలను రమ్మంటూ పిలుస్తున్నారు. ఆయనతో కూర్చుని.. చాలాసేపు చర్చిస్తున్నారు. నా విషయంలో మాత్రం ఇది ఎందుకనో జరగడం లేదు అంటూ థరూర్ ఇంతకు ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎల్లుండి.. అంటే అక్టోబర్ 17 సోమవారం జరగనున్నాయి. మరోవైపు పార్టీ హైకమాండ్ మీద ధిక్కార స్వరం వినిపించి పార్టీని ప్రక్షాళన చేయాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న జీ23 నేతలు.. ఖర్గేకే తమ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా మనుగడ సాగించాలంటే ఖర్గే పగ్గాలు అందుకోవాలని సీనియర్ నేత మనీశ్ తివారీ సైతం స్పష్టం చేశారు. జీ–23 కూటమిలో శశిథరూర్ ఉన్నప్పటికీ.. ఖర్గేకే వాళ్లంతా జై కొట్టడం విశేషం. ఇదీ చదవండి: చచ్చేదాకా బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు! -
ప్రియాంక గాంధీల కుటుంబానికి చెందినది కాదు! కాంగ్రెస్ ఎంపీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షురాలిగా ప్రియాంక వాద్ర ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న లేవనెత్తారు కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలేఖ్. హిందు సంప్రదాయం ప్రకారం ప్రస్తుతం ఆమె వాద్రా కుంటుంబానికి చెందిన ఇంటి కోడలే గానీ గాంధీ కుటుంబ సభ్యురాలు కాదు కదా అని ఖలేఖ్ అన్నారు. అలాగే ఆమె కాంగ్రెస్ చీఫ్గా ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కూడా అని చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేయమని కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. అదీగాక అశోక్ గెహ్లాట్ కూడా రాహుల్గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండమని పలుమార్లు కోరారు. ఐతే రాహుల్ గాంధీ కొన్ని వ్యక్తి గత కారణాల వల్ల గాంధీ కుటుంబంలోని వారెవ్వరూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండకూడదని నిర్ణయించకున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం శశిథరూర్ పోటీ చేస్తున్నట్లు తేలింది గానీ ఇంకా రాజస్తాన్ సంక్షోభం విషయమై అశోక్ గెహ్లాట్ పోటీ చేస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. నామినేషన్ వేసేందుకు అక్టోబర్ 1 చివరి తేది కాగా, నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి చివరి తేది అక్టోబర్ 8 . అంతేగాక అదే రోజు(అక్టోబర్ 8న) సాయంత్రం 5 గంటల ఫైనల్ లిస్ట్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తుంది పార్టీ. అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడిస్తారు. (చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్?) -
రాహుల్ అంగీకరించకపోతే...బయటవారికే పగ్గాలు ఇస్తే?
రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా? లేదా? ఇప్పుడు కాంగ్రెస్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ సంసిద్ధంగా ఉన్నట్టు ప్రకటించడంతో అందరి దృష్టి రాహుల్ తదుపరి అడుగులపై పడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తూ ఉండడంతో పార్టీని ముందుకు నడిపించే నాథుడెవరన్న ఆందోళన మొదలైంది. రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తారో లేదో ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగే నాయకులు కూడా చెప్పలేకపోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 21 సెప్టెంబర్ 20 మధ్య అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని గత ఏడాది అక్టోబర్లో కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2020లో జీ–23 పేరుతో కొందరు సీనియర్ నేతలు అధిష్టానంపై తిరుగుబాటు చెయ్యడంతో సోనియా పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు ఇంకా కొనసాగుతున్నారు. గాంధీ కుటుంబానికే సారథ్యం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతూ కాంగ్రెస్ ముక్త భారత్ అని నినదిస్తున్న నేపథ్యంలో గాంధీ కుటుంబమే పార్టీకి రథసారథిగా ఉండాలన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు తెరతీస్తూ ఎదురు తిరిగిన వారిపై సీబీఐ, ఈడీ అస్త్రాన్ని ప్రయోగిస్తోందన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో గాంధీ కుటుంబానికి చెందిన వారే పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. అయితే రాహుల్ గాంధీ మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు. అధ్యక్ష పదవిపై ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. మరోవైపు బీజేపీ పదే పదే వంశపారంపర్య రాజకీయాలను ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఆ తరహా రాజకీయాలపై దేశంలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ తాను అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆత్మరక్షణలో పడిపోతానని, ఆ పదవి తనని మరింత బలహీనుడిగా మారుస్తుందన్న ఆందోళన రాహుల్ గాంధీలో ఉందని రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ అభిప్రాయపడ్డారు. ‘‘24 అక్బర్ రోడ్: ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ ది పీపుల్ బిహైండ్ ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ ది కాంగ్రెస్’’తో పాటు పలు పొలిటికల్ పుస్తకాలు రచించిన ఆయన రాహుల్ ఆందోళన సరైనదే అయినప్పటికీ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులే సారథిగా ఉంటేనే అధికార పార్టీ వారిని టచ్ చేయడానికి జంకుతుందని అభిప్రాయపడ్డారు. ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా చేస్తే కాంగ్రెస్కి పూర్వ వైభవం వస్తుందని ఇటీవల ఉదయ్పూర్ చింతన్ శిబిర్లో కొందరు నాయకులు డిమాండ్ చేసినప్పటికీ ఆమె మాత్రం అందుకు సుముఖంగా లేరు. బయటవారికే ఇస్తే.. ? గాంధీ కుటుంబం కాకుండా బయటవారు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు మానసికంగా సంసిద్ధులవుతున్నారు. అలాంటప్పుడు పార్టీ పగ్గాలు ఎవరు స్వీకరిస్తే బాగుంటుందన్న చర్చ కూడా మొదలైంది. సీనియర్ నాయకులు డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, సుశీల్ కుమార్ షిండే, అశోక్ గెహ్లాట్, కుమారి సెల్జా వంటి నాయకులైతే బాగుంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. స్వాతంత్య్రదినోత్సవం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో అంబికా సోని జాతీయ జెండాని ఎగురవేయడంతో ఆమె కూడా రేసులో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. సోనియాకి కరోనా సోకడంతో అంబికా సోని జెండా ఎగురవేశారే తప్ప ఆమెకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని లేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బయటవారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే పరిస్థితి రాదని, ఎన్నికలొచ్చే సమయానికి రాహుల్ని ఒప్పించగమన్న ధీమాలో ఓ వర్గం ఉంది. రాహుల్ అంగీకరించకపోతే...? ఒకవేళ రాహుల్ గాంధీ అధ్యక్షుడు అవడానికి సుముఖంగా లేకపోతే సోనియాగాంధీయే అధ్యక్షురాలిగా ఉండి ఆమెకు సహాయంగా కనీసం ముగ్గురు సీనియర్ నాయకుల్ని కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో నియమించాలని కొందరు నాయకు లు అభిప్రాయపడుతున్నారు. బయట వారికి పార్టీ పగ్గాలు అప్పగించి రాహుల్ గాంధీ వారికి ఒక గైడ్లా వ్యవహరిస్తే కుటుంబ రాజకీయాల విమర్శల నుంచి బయటపడవచ్చునని మరి కొందరి ఆలోచనగా ఉంది. గాంధీ కుటుంబానికి మన్మోహన్ సింగ్ లాంటి అత్యంత నమ్మకమైన నాయకుడి అవసరం కూడా ఉంది. కానీ కాగడా పెట్టి వెతికినా అలాంటి నాయకుడెవరూ కనిపించడం లేదని, ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అదేనని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ మణీంద్ర నాథ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేడు రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు
-
రాష్ట్రపతి ఎన్నికలు.. ఢిల్లీలో ఓటేసిన కేంద్ర మంత్రులు, ఎంపీలు
-
అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎం వాడరు!
ఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు ఎన్నికల కోసం ఎన్నో సంస్కరణలు, మార్పులు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉంటాయి కూడా. ఇందులో ఈవీఎంల వాడకం అనేది టెక్నాలజీతో ముడిపడిన అంశం. ఎన్నికలొచ్చిన ప్రతీసారి చర్చనీయాంశంగా(రాజకీయ విమర్శలకు సైతం వేదిక) మారుతుంటుంది కూడా. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడు ఈవీఎంలనే ఉపయోగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. మరి.. రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఈవీఎంలు ఎందుకు వాడటం లేదు?. బ్యాలెట్ పేపర్ విధానంతోనే రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు జరుగుతుందసలు?.. ముందుగా ఈవీఎం టెక్నాలజీ సంగతి చూద్దాం. ఈవీఎంలలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు.. దాని పక్కనే సంబంధిత బటన్ ఉంటుంది. ఓటర్లు నచ్చిన అభ్యర్థి బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న సాఫ్ట్ వేర్ ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయాన్ని కౌంటింగ్ రోజున క్షణాల్లో చూపించేస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల విషయానికి వచ్చేసరికి... దీని పోలింగ్ విధానం అలగ్ ఉంటుంది. ఈవీఎంలు ఎంత మాత్రం సరిపోవు. ఎందుకంటే.. ఓటు వేసే వారికి కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలనే నిబంధన ఇక్కడ వర్తించదు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులకు తమ ఛాయిస్ ఆధారంగా ప్రిఫరెన్సియల్ ఓట్లు వేసే ఛాన్స్ ఉంది. ప్రాధాన్యతల ఆధారంగా, వారి ఇష్టానుసారం ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటర్లు ఓటేయొచ్చు. చివరికి.. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఓట్లు పడ్డాయనే ఆధారంగా విజేతను ప్రకటిస్తారు!. బ్యాలెట్ పేపర్లోని కాలమ్ 2 లో ఓటర్ ఇష్టాన్ని బట్టి ఒకటి.. రెండు.. మూడు.. ఇలా ఎంతమందికైనా ఓటు వేయవచ్చు. అందువల్లే రాష్ట్రపతి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తారు. మరి ఈవీఎంలలో కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది కదా. ఈ కారణంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడం లేదు. -
అప్పటి వరకు ఒక స్టార్ హోటల్లోనే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు: హైకమాండ్ ఆదేశం
శివాజీనగర(బెంగళూరు): రాష్ట్రపతి ఎన్నికలు ముగిసేవరకు (జులై 18) తన 122 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు నగరంలో ఒక స్టార్ హోటల్లో బస చేయాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది. ఈ మేరకు విప్ల చేత సమాచారం పంపింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధంగా ఓటు చేయాలనేది హోటల్లోనే బోధిస్తారు. ఇందుకోసం ఢిల్లీలో ముగ్గురు నాయకులను శిక్షణనివ్వడానికి పంపించారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అత్యవసర కారణాలతో మినహాయింపు కోరిన కొందరు మంత్రులు మినహాయించి మిగతా వారంతా హోటల్లో ఉండే అవకాశముంది. ఓటింగ్ రోజున హోటల్ నుంచి నేరుగా విధానసౌధకు చేరుకుంటారు. చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా! -
ఈ నెల 12న విజయవాడకు ద్రౌపది ముర్ము రాక
సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న ద్రౌపది ముర్ము వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కోరేందుకు మంగళవారం విజయవాడకు వస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో మంగళగిరి సమీపంలోని కన్వెన్షన్ హాల్లో జరిగే వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరనున్నారు. నామినేటెడ్ నుంచి కేబినెట్ పదవుల వరకూ దేశచరిత్రలో ఎన్నడూలేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సింహభాగం పదవులిచ్చిన సీఎం వైఎస్ జగన్.. సామాజిక న్యాయం చేయడమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పారు. తద్వారా ఆ వర్గాల సామాజిక, రాజకీయ, విద్య, ఆర్థిక సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో.. సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీగా ద్రౌపది ముర్ముకు ఇప్పటికే వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. దీంతో.. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఆమె పాల్గొని.. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరనున్నారు. -
చెన్నైలో స్టాలిన్ను కలిసిన యశ్వంత్ సిన్హా
చెన్నై: రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా గురువారం చెన్నైకి వచ్చారు. డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నాఅరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డీఎంకే మిత్రపక్ష పార్టీల అగ్ర నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా వారిని కోరారు. ఇదిలా ఉండగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జూలై 2న చెన్నై, పుదుచ్చేరిలో పర్యటించి మిత్రపక్షాలను కలుసుకుని మద్దతు కోరనున్నారు. చదవండి: (మహారాష్ట్ర: షిండే రాక.. కాషాయ నేతల్లో అప్పుడే కలకలం) -
ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి ఇన్నేళ్లా?
భారత రాష్ట్రపతి స్థానానికి తమ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును నిలబెట్టింది. ఆమె గెలిస్తే తొలిసారిగా రాష్ట్రపతి పదవి చేపట్టిన గిరిజనురాలిగా చరిత్ర సృష్టిస్తారు. ఎన్నిక లాంఛనప్రాయమే అనే అంచనాలున్న నేపథ్యంలో భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్నవేళ ఇదొక శుభ పరిణామం అనుకోవచ్చు. అయితే, ఒక ఆదివాసీ... దేశ అత్యున్నత స్థానానికి చేరడానికి 75 సంవత్సరాలు పట్టిందనేది కఠిన వాస్తవం. మితవాద పక్షం నుంచి ఈ ముందడుగు పడుతుందనేది మరొక నిజం. ఉదారవాద పార్టీలు ఇప్పటికీ కొన్ని చట్రాల్లోంచి బయటకు రాలేదన్నది ఇంకో నిజం. ఇన్ని నిజాల మధ్యలో ఇంకో నిజం ఏమిటంటే, దేశంలో ముస్లింలకు తమ జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం దక్కడం లేదు. అందర్నీ కలుపుకొని పోయేట్టుగా మన విధానాలు ఉండాలన్నది మరిచిపోరాదు. ‘‘భారత రాష్ట్రపతి పదవికి తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్మును బీజేపీ అభ్యర్థిగా నిలబెడుతున్నందుకు గర్వంగా ఉంది. లక్షలాదిమంది ప్రజలు, ముఖ్యంగా దారిద్య్ర బాధల్ని, కష్టనష్టాలను అనుభవించి వాటిని ఎదుర్కొంటున్న ప్రజలు ముర్ము జీవితం నుంచి గొప్ప ధైర్యాన్ని పొందుతారు. విధాన నిర్ణయాల పట్ల ఆమె అవగాహన, కారుణ్య దృష్టి మన దేశానికి ఎంతగానో తోడ్పడ తాయి. ఎందుకంటే, ద్రౌపది ముర్ము సమాజ సేవకు, పేదలు, అణగారిన, విస్మరించబడిన వర్గాల ఉద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న మహిళ. – ప్రధాని నరేంద్ర మోదీ ‘‘భారత తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును బరిలోకి దించాలని ఒక వైపున మితవాద పార్టీ అయిన బీజేపీ నిర్ణయించగా, దేశంలోని అభ్యుదయకర అతివాద పార్టీలుగా పేరున్న రాజకీయ పక్షాలు ఇప్పటికీ అగ్రవర్గాలకు చెందిన అభ్యర్థులనే పట్టుకుని వేలాడ వలసి రావడం విచారకరం. ‘అభ్యుదయవాదులం’ అనుకునే సవర్ణులు ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవడం అంత కష్టమైన పనా? కాగా, అదే సమయంలో దేశానికి తొలి ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి 75 సంవత్సరాల కాలం పట్టడం, అందులోనూ మితవాద పక్షమైన బీజేపీ అభ్యర్థిగా నిలబడవలసి రావడం ఆశ్చర్యకరం’’. – ‘కఠువా’ అత్యాచార కేసులో వాదించిన సుప్రసిద్ధ న్యాయవాది దీపికా సింగ్ రజావత్ ‘‘తనకు అనుకూలమైన ‘డమ్మీ’ రాష్ట్రపతిగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థిని బీజేపీ నిలబెట్టడం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ తరగతుల ప్రజలను మోసం చేయడానికే. అయితే రాజకీయ, పరిపాలనా సంబంధమైన శక్తియుక్తులున్న మహిళ ద్రౌపది ముర్ము అని మరచిపోరాదు.’’ – జాతీయ కాంగ్రెస్ ప్రకటన అయితే, వ్యక్తి శక్తియుక్తులకన్నా కీలకమైన అంశం – గత 75 ఏళ్లుగా భారత రాజకీయాల్నీ, అధికార పదవులలో ఉన్న పాలక శక్తుల్నీ నడిపిస్తున్నది భారత సెక్యులర్ రాజ్యాంగమూ కాదు; దేశానికీ, పాలనకూ దిక్సూచిగా ఉండవలసిన అందలి విస్పష్టమైన ఆదేశిక సూత్రాలూ కావు. ‘భారత ప్రజలమైన మేము’ (ఉయ్ ది పీపుల్) ‘మాకై అంకితమిచ్చుకున్న రాజ్యాంగ పత్రం’ అని పేర్కొన్నా, ‘మీరెవరు మమ్మల్ని శాసించడానికి?’ అని ఎదురు ప్రశ్నలకు దిగిన రాజకీయ పాలకులున్న దేశం మనది. ‘ఆదేశిక సూత్రాల’నే కాదు, ‘పౌర బాధ్యత’ల ప్రత్యేక అధ్యాయం ద్వారా దేశ ప్రజలలో శాస్త్రీయ ధోరణులను ప్రబుద్ధం చేయాలన్న స్పష్టమైన ‘తాఖీదు’ను కూడా కాంగ్రెస్–బీజేపీ పాలకులు పక్కకునెట్టి యథేచ్చగా తిరుగుతున్నారు. ఇక అధికార పార్టీ నేతృత్వంలో హిందూత్వ రాజకీయాల ద్వారా విద్యా వ్యవస్థ స్వరూప స్వభావాన్నే తారుమూరు చేసే ప్రయత్నాలు శరవేగాన జరుగుతున్నాయి. ఇందుకు విద్యా, విశ్వవిద్యాలయ స్థాయిలో స్థిరపడిన అభ్యుదయకర నిబంధనల్నీ, చట్టాలనే మార్చే యత్నాలు వేగంగా సాగుతున్నాయని మరచిపోరాదు. అనేక మతాలు, మత విశ్వాసాలు, ప్రత్యేక సంప్రదాయాలు, అనేక తెగలు, బహుళ జాతులు, బహు భాషలతో కూడిన భారత ప్రజలందరినీ తాను విశ్వసించే ‘మూస’లో బంధించడానికి బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ప్రయత్నిస్తోంది. అవే ఎత్తుగడలతో 2024 ఎన్నికల వైపు కూడా దూసుకుపోతోంది. ఇందుకు అన్ని ఎత్తుగడలకంటే కీలకమైన మాధ్యమం విద్యా రంగం అని భావిం చింది. అందుకే ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ప్రాతినిధ్యం దక్కడం లేదు బహుళ జాతులతో కూడిన భారతదేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్య కేంద్రంగా వర్ధిల్లాల్సిన పార్లమెంట్ను సహితం స్వభా వంలోనూ, ఆచరణలోనూ సంకుచిత స్థాయికి దిగజార్చుతూ వచ్చారు. సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. అవీ రసవిహీనమైన ఉబుసుపోని చర్చలతోనే ముగుస్తున్న సందర్భాలే ఎక్కువ. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి పాత్ర నామమాత్రం. ఇక యూరప్తో పోల్చితే అక్కడి ఎన్నో దేశాల కంటే భారత ముస్లిం జనాభా ఎక్కువ. అనేక దేశాల స్థాయిలో భారత ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అయినా రాజకీయ స్థాయిలోనూ, సంస్థాగత స్థాయిలోనూ ముస్లింల ప్రతిపత్తికి విలువ లేనట్టుగా పాలక విధాన పోకడలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే, భారతదేశంలో ప్రజా రాజకీయ కార్యాచరణకూ, ప్రజాస్వామ్య మనుగడకూ కీలకం – విస్పష్టమైన విధానాల ఆచరణే నని చరిత్ర రుజువు చేస్తోంది. కనుకనే, భారతదేశంలో విశిష్ట ‘ఎమెరిటిస్’ ప్రొఫెసర్ జోయా హాసన్ (జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ) ప్రస్తుతం దేశంలో ముస్లిం మైనారిటీల దుఃస్థితిని గురించి ఇలా పేర్కొనక తప్పలేదు: ‘‘గత పదేళ్లలోనే భారతదేశ సెక్యులర్ (అన్ని మతాలనూ సమంగా పరిగణించే) వ్యవస్థ రాజ్యాంగ పునాదులు కాస్తా దేశ రాజకీయ పాలనా పద్ధతుల వల్ల బీటలు వారుతున్నాయి.’’ ఎందుకంటే, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ ముస్లింల ప్రాతినిధ్యం వారి జనాభాకు తగిన దామాషాలో పెరగనే లేదు. పైగా జనాభాలో 20 కోట్ల మందికిపైగా ఉన్న ముస్లింలను రెచ్చగొట్టేలా పాలకపక్ష ప్రతినిధి ప్రవక్త మహమ్మద్ను తూలనాడుతూ ప్రకటనలు చేయడంతో దేశవ్యాప్తంగా అశాంతిని ప్రజ్వలింపజేసింది. అందరూ కలిస్తేనే... హిందూస్థాన్ ఒక ఆదివాసీ మహిళను దేశ రాష్ట్రపతి స్థానంలో నిలబెట్టడానికి బీజేపీ పడుతున్న తాపత్రయంలో ఒక్క శాతం అభిమానాన్ని కూడా ముస్లిం మైనారిటీల మనోభావాలపట్ల చూపక పోవడం క్షమించరాని వివక్షగా పరిగణించక తప్పదు. అంతేగాదు, ఈ వివక్ష చివరికి ఎక్కడికి దారి తీసి మరింత అలజడికి కారణమవుతోందంటే, ఫలానావాడు ‘హిందువుల’ వ్యతిరేకి అని ఎక్కడ ముద్ర పడుతుందోనన్న జంకు కొద్దీ హిందూ రాజకీయ పక్షీయులూ, పార్టీలూ న్యాయబద్ధంగా ముస్లింలకు ఇచ్చే టికెట్ల సంఖ్యను తగ్గించేయడం జరుగుతోందని ప్రొఫెసర్ జోయా హాసన్ వెల్లడించారు. అంతేగాదు, ప్రజాస్వామ్య విలువలకూ, వ్యక్తి ఉనికికీ కూడా గౌరవం పూజ్యం. పైగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పాలకులు ప్రజా కోర్కెలను లేదా ప్రజా ఉద్యమాలను అణచటానికి, కట్టడాలను కూలగొట్టడానికి ఇటీవల ‘బుల్డోజర్’లను కూడా యథేచ్చగా వాడుతున్నారు. ఇప్పటికైనా మనం గుర్తించి తీరవలసిన సత్యం – భారతదేశం ఒకప్పుడు నాగరిక దేశంగా ప్రపంచ ఖ్యాతి గడించడానికి కారణం ఏమిటో భారతీయుడైన రఘుపతిరాయ్ ఫిరాక్ అనే కవి లిఖించిన ఆర్ద్రమైన ఈ క్రింది కవితలో వెల్లడవుతోంది: ‘‘ప్రపంచంలోని నలు మూలల ఉన్న దేశాల నుంచి వచ్చే పోయే వర్తక సమూహాలతోనే ఈ దేశం కిటకిటలాడే హిందూస్థాన్గా రూపు దిద్దుకుంది.’’ దానికి అనుగుణంగానే సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులలో ఒకరైన గణేష్ దేవో, భారతదేశంలో ప్రచలితమవుతున్న అనేక భాషలలో ప్రాంతీయ భిన్నత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: విపక్షాల తరపున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనున్న మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాల్గొనాలని నిర్ణయించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావుతో సహా కొంతమంది ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం. యశ్వంత్ సిన్హాకు మద్దతునిస్తున్నట్లు అధికారికంగా టీఆర్ఎస్ నుంచి ప్రకటన రాకున్నా కేటీఆర్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరవుతుండటం గమనార్హం. విపక్షాలతోనే టీఆర్ఎస్ పార్టీ ఉందనే సంకేతాలు పంపించడానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హాజరవుతున్నట్లు సమాచారం. -
ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా!
స్వతంత్ర భారతదేశం అమృతోత్సవాలు జరుపుకొంటున్న సంవత్సరమిది. మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గర్వించదగిన కొన్ని మధుర క్షణాలను కూడా ఈ యేడు మోసుకొస్తున్నది. ఈ దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి హోదా! ఏడున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడా హోదా మొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళకు దక్కబోతున్నది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, భారత ప్రధాన న్యాయమూర్తి వంటి ఉన్నత హోదా కలిగిన పదవులేవీ దేశంలో 12 కోట్ల జనాభా కలిగిన షెడ్యూల్డ్ తెగలకు ఇంతవరకూ దక్కలేదు. పీఏ సంగ్మా కొంతకాలం లోక్సభ స్పీకర్గా పనిచేశారు. అయితే ఆయన ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం కారణంగా ఎస్.టీ. గుర్తింపు లభించిందే తప్ప స్వతహాగా గిరిజన జీవితంలోంచి వచ్చినవాడు కాదు. అధిక జనాభా కలిగిన ప్రధాన గిరిజన తెగల్లో ఒకటైన సంతాల్ తెగకు చెందిన ద్రౌపదీ ముర్మూ ఎన్నిక ఇక లాంఛనప్రాయమే. 1857 నాటి సిపాయి తిరుగుబాటును మనం ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తిస్తున్నాం. కానీ అంతకంటే ముందే అక్కడక్కడ విడివిడిగా జరిగిన ప్రతిఘటనా పోరాటాలు ఇప్పటికీ మనల్ని ఉత్తేజితుల్ని చేస్తూనే ఉన్నాయి. కట్టబొమ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాలపై సినిమాలు కూడా వచ్చాయి. ఆ కోవలోనిదే, అంతకంటే విస్తృతమైనది, ప్రభావవంతమైనది సంతాల్ తిరుగుబాటు. 1855లో సంతాల్ గిరిజనులు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపారు. స్వతంత్ర భారతావని తొలి పారిశ్రామిక ప్రస్థానంలో ముందువరసలో నడిచిన కార్మికుల్లో సంతాల్ గిరిజనులున్నారు. అసన్సోల్, బీర్భూమ్ బొగ్గు బావుల్లోకి ప్ర«థమంగా దిగిన వారిలో, రూర్కేలా, జెమ్షెడ్పూర్లలో ఉక్కును మండించిన అగ్రగామి దళంలో అత్యధికులు సంతాల్ గిరిజనులే. ఇన్నేళ్లకైనా వారి త్యాగాలను దేశం గుర్తించి గౌరవించిందని భావించి ముర్మూ ఎంపికను స్వాగతించడం ప్రజాస్వామ్యానికి శోభనిస్తుంది. ప్రతిపక్ష శిబిరానికి రాజకీయ కారణాలుంటాయి కనుక, వారూ పోటీ అభ్యర్థిని రంగంలోకి దించారు. ప్రజాస్వామ్యంలో అది వారికి ఉన్న స్వేచ్ఛ, హక్కు. ఎవరూ కాదనలేరు. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తేనే రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 48 శాతం ఓట్లున్నాయి. కొన్ని చిన్నాచితకా పార్టీలను సమీకరించి మెజారిటీ ఓట్లు సాధించడం బీజేపీ పెద్దలకు కష్టమేమీ కాదు. ఆ అవసరం లేకుండా ఇప్పటికే రెండు ప్రధాన ప్రాంతీయ పక్షాలు ముర్మూ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించాయి. ఒరిస్సా రాష్ట్ర మహిళ కనుక బీజేడీ అధినేత, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మద్దతిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్ ఐడియాలజీలో సామాజిక న్యాయం ఒక ముఖ్యాంశం. కనుక ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్దతు తెలిపారు. బిఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ముర్మూకే తన ఓటని చెప్పారు. ముందుముందు మరికొన్ని పార్టీలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉన్నది. వారు బీజేపీ అగ్రనేతల ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ, నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నిక, మహారాష్ట్ర సంక్షోభం... వగైరా బర్నింగ్ టాపిక్లకు దీటైన ఒక రాజకీయ కలకలాన్ని సృష్టించవలసిన అగత్యం ఈ సందర్భంగా ఎల్లో మీడియాకు ఏర్పడింది. చంద్రబాబు అవసరమే ఎల్లో మీడియా అగత్యం. ఆయన ఆలోచన, మనసులోని మాట ముందుగా ఎల్లో మీడియా ద్వారా జనంలోకి వస్తుంది. సదరు ఆలోచనకు జనం నుంచి వ్యతిరేకత రాకపోతే ఇక విజృంభిస్తారు. వస్తే మాత్రం తాత్కాలికంగా కొంతకాలం సద్దుమణుగుతారు. అదును కోసం వేచి చూస్తారు. ఇంగ్లిష్ మీడియం విషయంలో జరిగిందదే. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా ముందు ఎల్లో మీడియాను ఉసిగొలిపారు. జనంలో వ్యతిరేకత కనబడటంతో చంద్రబాబు తాత్కాలికంగా సర్దుకున్నారు. కొంతకాలం తర్వాత విశాఖపట్నం జిల్లాలో రోడ్డుపక్కనున్న జన సమూహంతో ముచ్చటిస్తూ మరోసారి మనసులోని మాటను బయటపెట్టారు. మఖం మీద గుద్దినంత స్పష్టంగా జనం వ్యతిరేకించడంతో మళ్లీ వెనక్కి తగ్గారు. బలహీనవర్గాల అభ్యున్నతి పట్ల, సాధికారత పట్ల ఆయనే స్వయంగా తన వ్యతిరేకతను పలుమార్లు బయట పెట్టుకున్న వ్యక్తి కనుక, పేదపిల్లలకు ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకించడంలో ఎప్పటికీ తగ్గరు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేయడాన్ని ఆయన గానీ, ఎల్లో మీడియా గానీ బహిరంగంగా వ్యతిరేకించడం కష్టం. కానీ ద్రౌపదీ ముర్మూ అభ్యర్థిత్వం పట్ల ఈ కూటమి అసహనం స్పష్టంగా బయటకు వచ్చింది. ఉపరాçష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావాలని చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా గట్టిగా కోరుకున్న విషయం వాస్తవం. తప్పేమీ కాదు. ఆయన తెలుగువాడు కనుక, ఆయన రాష్ట్రపతి అయితే బాగుంటుందనుకోవడంలో ఏ దోషమూ లేదు. తెలుగుదేశం వారే కాదు. తెలుగువాళ్లందరూ సంతోషిస్తారు. కానీ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవలసింది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ తన జాతీయ అవసరాల కోసం, వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. అది సహజం. కానీ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టడానికి ఒక గిరిజన మహిళను మొట్టమొదటిసారిగా, అదీ ఆజాదీ అమృత మహోత్సవ సందర్భంలో ఎంపిక చేయడం స్వాగతించవలసిన విషయం. రాజకీయ ఎజెం డాలను పక్కన పెట్టి మద్దతు ఇవ్వవలసిన సందర్భం. కానీ ముర్మూ అభ్యర్థిత్వం పట్ల ఎల్లో ముఠా ఒక్క మాటయినా మాట్లాడకుండా, వెంకయ్యనాయుడును ఎంపిక చేయకపోవడం తెలుగు జాతిని అవమానించడమే అనే పాటను అందుకున్నది. అభ్యర్థి ఎంపికకు ఒకటి రెండు రోజుల ముందు ‘ఆయన అత్యున్నత పదవిలో ఉండాలని దేశం కోరుకుంటున్నట్టు’ ప్రత్యేక కథనాలు ఎల్లో మీడియాలో వచ్చాయి. ఎంపిక రోజున ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ‘యోగా డే’లో పాల్గొన్నారు. వెంటనే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరడంతో ఎల్లో ఛానల్స్లో కూడా హడావిడి మొదలైంది. ‘రాష్ట్రపతిగా మన వెంకయ్య’ అంటూ ప్రత్యేక చర్చాగోష్ఠులు నడిపారు. చివరకు ద్రౌపదీ ముర్మూను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ఒక యాంకరైతే దక్షిణ భారతదేశం విడిపోవడం తప్ప మరో మార్గం లేదన్నట్టుగా మాట్లాడారు. వెంకయ్యను రాష్ట్రపతిని చేయకపోవడం వల్ల దక్షిణ భారతదేశం విడిపోవాలనే ఆలోచన చాలామందిలో వచ్చేసినట్టు ఆయన కనిపెట్టేశాడు. మరో చానల్ తన విచిత్ర కథనాన్ని నడిపింది. ఈ కథనం ప్రకారం రాష్ట్రపతి ఎంపికలో బీజేపీ బుర్ర లేకుండా వ్యవహరించింది. వెంకయ్యను ఎంపిక చేసి వుంటే తెలంగాణ ఎన్నికల్లో ఆయన సామాజికవర్గం వాళ్లు బీజేపీకి సహకరించే వారు. వారి మద్దతు లేకుండా తెలంగాణలో బీజేపీ ఎట్లా గెలుస్తుంది? గోల్డెన్ ఛాన్స్ను బీజేపీ మిస్ చేసుకుంది... ఇలా సాగిందా కథనం. తెల్లారేసరికల్లా ఆ రెండు పత్రికల్లో విషాద కథనాలు... వెంకయ్యను మోసం చేశారు. వెంకయ్య ఎంత చేశారు మోదీకి! ఆయన ప్రధాని కావడానికి మన వెంకయ్యే కారణం. మోదీకి కృతజ్ఞత లేదు... ఇదీ సారాంశం. అంతా ఎల్లో మీడియా హడావిడే తప్ప రాష్ట్రపతి అభ్యర్థిత్వం గురించి వెంకయ్య నాయుడు ఎక్కడా ఎవరితో మాట్లాడింది కూడా లేదు. ముర్మూ అభ్యర్థిత్వం గురించి తెలిసో తెలియదో కానీ, పార్టీ అవసరాల గురించీ, ఆలోచనల గురించీ ఆయనకు తెలిసే ఉంటుంది. అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే తన ఆశీస్సుల కోసం వచ్చిన ముర్మూను సాదరంగా ఆహ్వానించారు. ఆయన ముఖంలో ఎక్కడా అసంతృప్తి ఛాయలు కనబడలేదు. కనిపించిన అసంతృప్తి ఛాయలు, విషాద ఛాయలన్నీ ఎల్లో మీడియాలోనే! ఎల్లో మీడియా అంటే చంద్రబాబు చేతిలోని మైకు తప్ప మరొకటి కాదు. కనుక ఎల్లో మీడియా విషాదమే చంద్రబాబు విషాదం. చంద్రబాబు విషాదమే తెలుగుదేశం పార్టీ విషాదం. అసలెందుకింత విషాదం? కోస్తా జిల్లాల్లోని ఒక బలమైన సామాజిక వర్గానికి ఈ ఎల్లో ముఠా తనను తాను వ్యాన్గార్డ్గా భావించుకుంటున్నది. ‘మీ రక్షకులం మేమే’నని సదరు సామాజిక వర్గాన్ని ఈ ముఠా భ్రమింపజేస్తున్నది. నిజానికి అనేక దశాబ్దాల కిందనే కృషితో, క్రమశిక్షణతో వృద్ధిలోకి వచ్చిన సామాజిక వర్గమది. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, అభ్యుదయవాదులు, హేతువాదులు, క్రాంతి కారులు ఆ వర్గం నుంచి వచ్చారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత క్రమంగా అక్కడక్కడా కుక్కమూతి పిందెలు పడటం ప్రారంభమైంది. ఈ కుక్కమూతి పిందెలన్నీ కలిసే ఎల్లో సిండికేట్గా ఒక ముఠా ఏర్పాటైంది. ప్రగతిశీల సామాజిక వర్గంగా సంపాదించుకున్న ప్రతిష్ఠను ఈ ముఠా తమ స్వార్థ ప్రయోజనాల కోసం పీల్చి పిప్పిచేస్తున్నదని చాలామంది ప్రముఖులు ఇప్పుడు వాపోతున్నారు. వెంకయ్యనాయుడు ఈ ఎల్లో పార్టీతో సంబంధం లేని వేరే పార్టీకి జాతీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీ వల్లనే తాను ఉన్నత స్థాయికి చేరుకోగలిగానని గర్వంగా చెప్పు కుంటారు. ఆయన ఎల్లో ముఠా కబ్జా చేసిన సామాజిక వర్గంలో పుట్టినవారే. కనుక, ఆయన అత్యున్నత పదవిలో ఉంటే మన పార్టీని కష్టకాలంలో ఆదుకుంటారనేది ఎల్లో ముఠా తలపోత. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి బీజేపీకి బద్ధవిరోధం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా ఉందన్న ఉద్దేశంతో కాబోలు, చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి వెంకయ్యనాయుడు ఢిల్లీ స్థాయిలో సహకరించి ఉంటారు. అందువల్ల ఆయన రాష్ట్రపతి కావాలని ఎల్లో ముఠా గట్టిగానే కోరుకున్నది. అయితే రాష్ట్రంలో ఆయన సొంత పార్టీ నేతలెవ్వరూ కూడా ముర్మూ ఎంపికను వ్యతిరేకించలేదు. పైగా స్వాగతించారు. ఎల్లో ముఠా కోరుకున్నట్టు ఏ ఉద్యమమూ జరగలేదు. ఎవరూ వీధుల్లోకి రాలేదు. పైగా ఎల్లో మీడియా ధోరణిని తీవ్రంగా ఎండగట్టారు. ఆశాభంగం చెందిన ఎల్లో మీడియా కొత్త ఎత్తు వేసింది. తమ పార్టీ భావజాలానికి అనుగుణంగా ఉండటంతో ముర్మూ ఎంపికను వైఎస్సార్సీపీ స్వాగతించింది. మద్దతు ప్రకటించింది. రాష్ట్రం కోసం బేరాలాడకుండానే ముర్మూకు మద్దతు తెలపడమేమిటని ఎల్లో గ్యాంగ్ ఒక వాదాన్ని లేవ దీసింది. ఇదా సందర్భం? ఒక అద్భుతమైన చరిత్ర పురుడు పోసుకోబోయే వేళ భ్రూణహత్యకు పురిగొల్పుతున్నది ఈ ముఠా. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ఏ శక్తులు కుయుక్తులు పన్నాయో ఆ శక్తులన్నీ ఇప్పుడు ‘బేరాల’ పాట పాడుతున్నాయి. బేరాల ముసుగేసుకొని బీరాలుపోతున్న ఈ ప్రగతి నిరోధకుల నిజస్వరూపాన్ని ప్రజలు గమనించకుండా ఉండరు. సరిగ్గా కేంద్రంలో ఇవే పరిస్థితులు ఉండి, జగన్ గారి స్థానంలో బాబుగారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ముర్మూ ఎంపిక తర్వాత ఎల్లో మీడియా కథనాలు ఎలా ఉండేవి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండని ఒక ప్రకటన విడుదల చేస్తే లక్షల సంఖ్యలో పోస్టుకార్డులు వస్తాయి. అందులో కనీసం 90 శాతం మంది సరైన సమాధానమే రాస్తారు. ఎందుకంటే ఎల్లో మీడియా ఎప్పుడే కథనాన్ని ఎలా రాస్తుందో ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది. ‘మొన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు మోదీకి చంద్రబాబు ఈ సలహా ఇచ్చారు. ద్రౌపది ముర్మూను ఎంపిక చేయాలని గట్టిగా చెప్పారు. అందుకు ప్రధాని అంగీకరించారు. వాజ్పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేత ముస్లిం మైనారిటీకి చెందిన అబ్దుల్ కలామ్ను బాబే నిలబెట్టించారు. ఇప్పుడు గిరిజన మహిళను సూచించి బాబు మరో ఘనకార్యం చేశారు’ అని రాసి ఉండేవారు. ఎనీ డౌట్? ఎల్లో మీడియా ప్రచారం వల్ల నిజంగానే కలామ్ను బాబే సూచించారని చాలామంది భ్రమపడ్డారు. ములాయంసింగ్ యాదవ్ చేసిన సూచనకు అంగీకరించి వాజ్పేయి కలామ్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారని చాలాకాలం తర్వాత గానీ బయటకు రాలేదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ప్రతిష్ఠాత్మకం?
రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులుగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకూ, విపక్షాలకూ కూడా ఈ ఎన్నిక కీలకం కానుంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు సర్వాధినేత రాష్ట్రపతి. ప్రధాన మంత్రి, ఆయన మంత్రిమండలి రాష్ట్రపతి అభిమతానికి అనుగుణంగానే తమ పదవుల్లో కొనసాగుతారు. ‘సంప్రదాయాలకు’ భిన్నంగా రాష్ట్రపతి తమ పూర్తి విచక్షణాధికారాలను ఉపయోగించుకోవచ్చు. బహుశా రాబోయే సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రధానమంత్రి నియామకం విషయంలో రాష్ట్రపతి కీలక భూమిక పోషించాల్సిన అవసరం పడవచ్చు. అందుకేనేమో ప్రతిపక్షాలు, అధికార పక్షం రాష్ట్రపతి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. 1969లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రేరణతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, అంతరాత్మ ప్రబోధం అన్న నినాదంతో అధికార కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతిగా వరహగిరి వెంకట గిరి నెగ్గిన ఏకైక సందర్భం మినహాయించి, ఇంత ప్రతిష్టాత్మకంగా దేశంలోని అత్యున్నత స్థానానికి ఎన్నిక జరగడం మున్నెన్నడూ జరగలేదు. తాను కోరుకున్న అభ్యర్థి మాత్రమే రాష్ట్రపతిగా ఎన్నిక కావాలని ఇందిరా గాంధీ పట్టుబట్టడం వెనుక స్పష్టమైన కారణం ఉందనేది జగద్విదితం. తాను ప్రతిపాదించిన అభ్యర్థిని కాదని నీలం సంజీవ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోని ఆమె వ్యతిరేక వర్గమైన ‘సిండికేట్’ ఎంపిక చేసింది. రాజ్యాంగం రాష్ట్రపతికి కట్టబెట్టిన విశేష అధికారాలను ఉపయోగించి సమర్థుడైన సంజీవరెడ్డి సహాయంతో తనను పదవి నుండి తొలగించ డానికి సిండికేట్ పన్నిన కుట్రలో భాగంగానే తనకు ఇష్టంలేని అభ్యర్థిని ఎంపిక చేశారని ఇందిరాగాంధీ పసిగట్టారు. కారణాలు ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఒకవైపు ఆయన పార్టీ లోనూ, పార్టీ వెలుపలా నరేంద్ర మోదీకి వెల్లువెత్తుతున్న వ్యతిరేకత, బీజేపీకి వ్యతిరేకంగా బలడుతున్న విపక్షాల ఐక్యత, బహుశా రాబోయే సార్వ త్రిక ఎన్నిక తరువాత ప్రధానమంత్రి నియామకం విషయంలో రాష్ట్ర పతి కీలక భూమిక పోషించాల్సిన అవసరం పడవచ్చు. ఇందిరా గాంధీ హయాంలో లాగా బీజేపీలోని మోదీ వ్యతిరేక వర్గం కూడా వారు కోరుకున్న అభ్యర్థి రాష్ట్రపతి అవుతే మంచిదని భావిస్తుండవచ్చు కూడా. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో కూడా, స్పష్టంగా కానీ, అస్పష్టంగా కానీ, ఎక్కడా రాష్ట్రపతి కంటే ప్రధానమంత్రికి ఎక్కువ అధికారాలున్నాయని చెప్పలేదు. కాకపోతే చాలామంది రాజ్యాంగ నిపుణులు బ్రిటిష్ నమూనానూ, అక్కడి సంప్రదాయాలనూ మన రాజ్యాంగానికి అన్వయించి ఉదాహరణలు ఇస్తుంటారు. వాస్తవానికి మనది చాలావరకు బ్రిటిష్ మోడల్ అయినప్పటికీ దాన్ని మొత్తానికి మొత్తం అనుసరించడం లేదు. కొంతమేరకు మనది పార్లమెంటరీ వ్యవస్థ అయితే, కొంతమేరకు ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అనాలి. భారత రాజ్యాంగం ప్రకారం నిజమైన కార్యాచరణ వ్యవస్థ రాష్ట్రపతిదే గానీ ప్రధానిది కాదు. రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సలహాలనూ, సూచనలనూ స్వీక రిస్తారని ఆర్టికల్ 74లో పేర్కొన్నారు. ఎన్నో ముఖ్యమైన నియామకాలను రాష్ట్రపతే చేస్తారు. వారిలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ న్యాయమూర్తులు, ఎన్నికల అధికారులు తదితరులుంటారు. షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనకు సంబంధించి కమిషన్లను కూడా వారే నియమిస్తారు. అన్నిటికన్నా ప్రాధాన్యమైంది, ఆర్టికల్ 352 నుండి 360 వరకు పేర్కొన్న రాష్ట్రపతికున్న ఎమర్జెన్సీ విశేషాధికారాలు. ఆ సమయంలో రాష్ట్రపతి, పౌరుల ప్రాథమిక హక్కులను సైతం రద్దు చేయవచ్చు. ఆయన ఆమోదం కొరకు పార్లమెంటు అంగీకరించిన అన్ని బిల్లులూ రావాల్సిందే. ఆయన వాటిని ఆమోదించనూవచ్చు, తిరస్కరించనూవచ్చు లేదా పునఃపరిశీలనకు పంపనూవచ్చు. రాజ్యాంగాధికార చక్రవర్తులతో (కాన్స్టిట్యూషనల్ మోనార్క్స్) రాష్ట్రపతి పాత్రను పోల్చవచ్చు. రాష్ట్రపతి అధికారాలను కార్యనిర్వా హక, శాసన, న్యాయ, మిలిటరీ, దౌత్య, ఆర్థిక, ఎమర్జెన్సీపరమైనవిగా విభజించవచ్చు. కార్యనిర్వాహక అధికారాల కింద రాష్ట్రపతి ప్రధాన మంత్రినీ, ఆయన మంత్రివర్గ సహచరులనూ నియమించి వారికి పోర్ట్ఫోలియోలను కేటాయించడం జరుగుతుంది. ఆయన ద్వారా నియామకమైన వీరందరినీ తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ప్రధానిని రాష్ట్రపతి నియమించడానికి ఫలానా విధమైన పద్ధతి అని రాజ్యాంగంలో ఎక్కడా ప్రత్యేకంగా నిబంధనలు పొందు పరచలేదు. సాంప్రదాయాలుండవచ్చు. అది పూర్తిగా రాష్ట్రపతి విచక్ష ణాధికారం. రాష్ట్రపతి దేశాధినేత అయితే, ప్రధాని కేవలం ప్రభుత్వా ధినేత మాత్రమే. దేశాధినేతగా, ఎవరిని ప్రభుత్వాధినేతగా ఎంపిక చేయాలనే విషయంలో, రాష్ట్రపతికి సంపూర్ణ హక్కు, విచక్షణాధికా రాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. విక్టోరియా మహారాణి 1894లో తన విచక్షణాధికారాలు ఉపయోగించి, పదవీ విరమణ చేసిన గ్లాడ్ స్టోన్ సలహాను పక్కకు పెట్టి, లార్డ్ రోస్బెరీని ప్రధానిగా నియమించారు. తిరిగి 1957లో ఎలిజబెత్ మహారాణి తన విచక్షణాధికారాలను సంపూర్ణంగా వాడుకుని, ప్రధాని కావాల్సిన బట్లర్కు బదులుగా హెరాల్డ్ మాక్మిలన్ను ఆ పదవిలో నియమిం చారు. మెజారిటీ స్థానాలను గెల్చుకున్న కన్జర్వేటివ్ పార్టీ తమ నాయ కుడిని ఎన్నుకునే లోపలే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నరోజుల్లో నెహ్రూ మరణానంతరం, అధికార కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడించక ముందే, గుల్జారీ లాల్ నందాను ప్రధానమంత్రిగా నియ మించారు. మరో మారు కూడా గుల్జారీలాల్ నందాను ప్రధానిగా నియమించారాయన. కాకపోతే రెండు సార్లు కూడా నందా కేవలం ఆపద్ధర్మ ప్రధానిగానే కొనసాగారు. 1989 సాధారణ ఎన్నికల అనంతరం, కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయడానికి విముఖత వ్యక్తపరచడంతో... వీపీ సింగ్ను ప్రధానిగా నియమించడానికీ, ఆ తరువాత ఆయన రాజీ నామా దరిమిలా, మొదలు రాజీవ్ గాంధీనీ, తరువాత చంద్రశేఖర్నూ ఆహ్వానించడానికీ, అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ తన విచాక్షణా ధికారాలను పూర్తిగా వినియోగించుకున్నారు. 1979లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా వ్యవహరించిన తీరు ఆ పదవికున్న ప్రాధాన్యతను తెలియచేస్తుంది. మొరార్జీ దేశాయి ప్రభుత్వం విశ్వాస నిరూపణలో ఓటమి తరువాత మొదలు వైబీ చవాన్ను ఆహ్వానించడంలో, తరువాత మొరార్జీకి మరో చాన్స్ ఇవ్వ కుండా ఉండటంలో, చరణ్ సింగ్ను చివరకు ప్రధానిగా నియమించ డంలో రాష్ట్రపతి వ్యవస్థకున్న విశేష అధికారాలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఆ తరువాత చరణ్ సింగ్ను విశ్వాస పరీక్షకు ఆదేశించారు రాష్ట్రపతి. అలా ఆదేశించడం అప్పటికి అదే మొదటిసారి. 25 రోజు ల్లోపలే చరణ్ సింగ్ ప్రధానిగా రాజీనామా చేసి పార్లమెంట్కు వెళ్ళని మొదటి, చివరి ప్రధానిగా మిగిలిపోయారు. లోక్సభను రద్దు చేయ మన్న ఆయన సిఫార్సుకు నీలం సంజీవరెడ్డి అంగీకరించారు. చరణ్ సింగ్ను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగమన్నారు. దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రపతిని విమర్శించాయే కానీ ఆయన అధికారాలను కుదించలేకపోయాయి. చరణ్ సింగ్ను ప్రధానిగా కొనసాగమని రాష్ట్రపతి కోరడానికి కారణం, రాజ్యాంగపరమైన బాధ్యతే. ఈ ఉదాహరణలన్నీ ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియ జేస్తున్నాయి. ప్రధాన మంత్రి, ఆయన మంత్రిమండలి రాష్ట్రపతి అభిమతానికి అనుగుణంగానే పదవిలో కొనసాగుతారు. ఇంతవరకూ జరగక పోయినా, ఇక ముందూ జరిగే అవకాశాలు లేకపోయినా, రాజ్యాంగంలోని అంతర్లీన అర్థం ప్రకారం, సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ, తాను నియమించిన ప్రధానినీ, ఆయన ప్రభుత్వాన్నీ రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఒక వేళ రాష్ట్రపతే కనుక తన విశేష–విచక్షణాధికారాలను అవసరమైనప్పుడు ఉపయోగించు కోకపోతే, పదవీ స్వీకారం చేసినప్పుడు చెప్పే ‘‘రాజ్యాంగాన్నీ, చట్టాన్నీ తన శాయశక్తులా, అహర్నిశలూ విధేయతతో సంరక్షిస్తాననీ, కాపాడుతాననీ, భద్రపరుస్తాననీ’’ అనే మాటలకు అర్థం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికైతే భవిష్యత్లో ఏం జరుగుతుందో? వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ ముఖ్యమంత్రి సీపీఆర్ఓ మొబైల్: 80081 37012 -
ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు!
ఆటలోనైనా, వేటలోనైనా... గెలవాలంటే వ్యూహం ముఖ్యం. రాజకీయాలకూ అది వర్తిస్తుంది. ఆ సంగతి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి తెలిసినంతగా విపక్షాలకు సైతం తెలిసినట్టు లేదు. భారత రాష్ట్రపతి పీఠానికి తాజాగా అధికార, విపక్ష కూటములు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తీరు అచ్చంగా అలాంటిదే. అభ్యర్థి ఎవరన్నది గుట్టుగా ఉంచి, మంగళవారం దాకా మంతనాలు సాగించిన బీజేపీ, చివరకు తన భాగస్వామ్య పక్షాలతో కూడిన ‘జాతీయ ప్రజాస్వామ్య కూటమి’ (ఎన్డీఏ) అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మూ పేరు బయటపెట్టింది. ఒక మహిళను, అందులోనూ ఆదివాసీని అభ్యర్థిగా ప్రకటించి, ఆటలో మొదటి బంతిలోనే ప్రతిపక్ష కూటమిని దాదాపు అవుట్ చేసింది. మరోపక్క బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ కలసి యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపాయి. కానీ, అభ్యర్థి ఎంపికకే కష్టపడిన విపక్షాలు రేపు ఎన్నికలలో గట్టి పోటీనిస్తామన్న నమ్మకం మాత్రం కలిగించలేకపోయాయి. కిందిస్థాయి నుంచి పైకొచ్చిన ద్రౌపది ప్రస్థానం ఆసక్తికరం. ఒడిశాలో మారుమూల మయూర్ భంజ్ జిల్లాకు చెందిన ఆమె రాజకీయాల్లోకి రాక ముందు గిరిజన ఉద్యమకారిణిగా ఓ అగ్గిబరాటా. నీటిపారుదల శాఖలో క్లర్కుగా మొదలై, టీచరుగా పనిచేసి, రాజకీయాల్లోకి వచ్చి కౌన్సిలరై, రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్ర ఆమెది. 2007లో రాష్ట్ర ఎమ్మెల్యేలలో బెస్ట్గా ఎంపికైన ఆమె నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ – బీజేపీ కూటమి సర్కారులో మంత్రిగా కూడా అనేక విభాగాలను సమర్థంగా నిర్వహించి పేరు తెచ్చుకోవడం విశేషం. మునుపు జార్ఖండ్ గవర్నర్గా పనిచేసిన ఈ సంథాల్ మహిళ సామర్థ్యానికి కొదవ లేదు. అయితే, అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపికలో ఆమె సమర్థత కన్నా మహిళగా, ఆదివాసీగా ఆమె అస్తిత్వానికే ప్రాధాన్యం ఇచ్చారనేది విశ్లేషకుల వాదన. పైపెచ్చు, ఉత్తర, దక్షిణ భారతావనుల నుంచే రాష్ట్రపతులు ఎన్నికవుతూ వస్తున్న దేశంలో తూర్పు ప్రాంతం నుంచి గిరిజన మహిళను బరిలోకి దింపడం బీజేపీకి సామాజిక, రాజకీయ ప్రయోజనాలు తెచ్చిపెట్టే తురుఫుముక్క. ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో దూరమైన ఆదివాసీ ఓటర్లను ఆకర్షించడానికీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మహిళల– దేశంలోని 10 కోట్ల గిరిజనుల ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకోవడానికీ బీజేపీకి ఇదొక మంచి ఛాన్స్. రాగల రెండేళ్ళలో గుజరాత్ సహా అనేక ఎన్నికలున్న వేళ ఒక్క దెబ్బకు బోలెడు పిట్టలని ఆలోచించాకే ఆమెను అభ్యర్థిగా ప్రకటించారనుకోవచ్చు. మరోపక్క కారణాలు ఏమైనా, వయస్సు, అనుభవం ఉన్న ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్, గోపాలకృష్ణ గాంధీ – ముగ్గురూ విపక్ష రాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీకి నిరాకరించడం గమనార్హం. ఎట్టకేలకు ఐఏఎస్ అధికారిగా పని చేసి, జనతా పార్టీలో చేరి, ఆ పైన బీజేపీకి వలస వచ్చి, 2014లో మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని గట్టిగా బలపరిచి, ఆనక పార్టీనీ, క్రియాశీలక రాజకీయాలనూ వీడి ఆయనకు తీవ్ర విమర్శకుడిగా మారిన యశ్వంత్ సిన్హా విపక్షాలకు దిక్కయ్యారు. 2020 బెంగాల్ ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఆయన రాజకీయ, సామాజిక అనుభవం మెచ్చ దగినదే. విపక్షాల చర్చల్లో ఆది నుంచీ ఆయన పేరు వినపడింది. విపక్షాలు మొదట ఇతర అభ్యర్థుల వైపు మొగ్గినా, చివరకు ప్రత్యామ్నాయాలు కరవయ్యాక సిన్హా పేరుకే సరే అనాల్సి వచ్చింది. ఆయన కాషాయ గతాన్ని పట్టించుకోనట్టు ప్రవర్తించాల్సి వచ్చింది. అయితే, ఆయన గెలుపు కష్టమే. నిజానికి, మండల్ కమిషన్ రోజుల నుంచి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేస్తూ వచ్చిన అస్తిత్వ రాజకీయాల ఛాయలోకి రాష్ట్రపతి భవన్ వచ్చి చాలాకాలమైంది. దళిత పక్షపాతులమనే ముద్ర కోసం కె.ఆర్. నారాయణన్ను కాంగ్రెస్ తెస్తే, మైనారిటీలకు అనుకూలమనే పేరు కోసం అబ్దుల్ కలామ్ను వాజ్పేయి హయాంలో ఎన్డీఏ తెర పైకి తెచ్చిందనే విశ్లేషణలూ లేకపోలేదు. అంత మాత్రాన ఆ మేధావుల సమర్థతను తక్కువగా చూడలేం. ద్రౌపది అభ్యర్థిత్వాన్ని సైతం ఆ దృష్టితోనే అర్థం చేసుకోక తప్పదు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకొని, పునాదిని విస్తరించుకొనే క్రమంలో క్రితంసారి 2017లో రామ్నాథ్ కోవింద్తో, ఇప్పుడు అందుకు కొనసాగింపుగా ద్రౌపదితో బీజేపీ తిరుగులేని పాచిక విసిరింది. దుర్భర దారిద్య్రం నుంచి పైకొచ్చిన ద్రౌపది లాంటి వారి కథ సమాజానికి స్ఫూర్తినిస్తూనే, ఓటర్లకు పార్టీ నుంచి తగిన రాజకీయ సూచనలు చేసినట్టయింది. అలా అటు సామాజిక మార్పు, ఇటు రాజకీయ బలం – రెండూ సమకూరాలన్నది వ్యూహం. వ్యూహం నుంచి, ఓట్ల అంకెల దాకా అన్నీ అధికార బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకే అనుకూలంగా ఉన్న వేళ... రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను నెల ముందే ఇప్పుడే ఇట్టే ఊహించవచ్చు. అటు మహిళ, ఇటు ఆదివాసీ కావడంతో ద్రౌపది అభ్యర్థిత్వాన్ని ఎవరైనా వ్యతిరేకించడం కష్టమే. ఒడిశా మూలాల రీత్యా నవీన్ పట్నాయక్ బీజేడీ సైతం ఆమెకే జై కొడుతుంది. ఎలక్టోరల్ కాలేజీలో సానుకూలతతో ఆమె గెలుపు నల్లేరుపై బండి నడకే. అద్భుతాలేమైనా జరిగితే తప్ప అతి పిన్నవయసు రాష్ట్రపతిగా ద్రౌపది అత్యున్నత పీఠంపై అధివసిస్తారు. 75 ఏళ్ళ స్వతంత్రభారతంలో తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా, ప్రతిభా పాటిల్ తర్వాత రెండో మహిళా రాష్ట్రపతిగా రికార్డుకెక్కుతారు. ఇన్నేళ్ళకైనా దేశ అత్యున్నత పీఠం గిరిజనులకు దక్కడం స్వాగతించాల్సిన విషయం. రాజకీయ ఎత్తుగడగానైనా, సామాజిక మార్పు తెచ్చే నిర్ణయం తీసుకున్నందుకు ఎన్డీఏను అభినందించాల్సిందే. ఇలాగే మహిళలకూ, గిరి జనులకూ పెద్దపీట వేయడాన్ని ఇతర రంగాల్లోనూ పాలకపక్షం కొనసాగిస్తే తప్పక హర్షించాల్సిందే. -
ఎవరీ ద్రౌపది ముర్ము? రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఆమెనే ఎందుకు?
న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్రపతి అత్యున్నత పదవికి ద్రౌపది ముర్ముని ప్రతిపాదించడానికి ముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ని సంప్రదించి మరీ ఆమె పేరును ఖరారు చేసింది. అంతేకాదు రాబోయే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేడీ ఆమెకు మద్దతు ఇవ్వనుందని సమాచారం. ఈ మేరకు మోదీ ప్రభుత్వం ఆమె పేరునే ఎందుకు? ప్రస్తావించింది. ఆమెకే ఈ అత్యున్నత పదవిని ఎందుకు? పట్టం గట్టాలనుకుంటోంది వంటి రకరకాల ప్రశ్నలు అందరి మదిలోనే తలెత్తే ప్రశ్నలే... ఇంతకీ ఆమె ఎవరంటే... ఐతే గతంలో బీజేపి 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో దళితవ్యక్తిని రాష్ట్రపతిగా చేసి అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. మళ్లీ ఇప్పుడూ అందరీ అంచనాలను తారుమారు చేస్తూ... మోదీ చెబుతూ ఉండే సబ్కా సాథ్ సబ్ కా బిస్వాస్ నినాదానికి అద్దం పట్టేలా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి పదవికి నామినేట్ చేశారు. ఈ మేరకు ద్రౌపది ముర్ము జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్ంత్ సిన్హా పై పోటీ చేయనున్నారు. ద్రౌపది ముర్ము ఒక సాధారణ గిరిజన మహిళ. ఆమె 1997లోఒడిశాలోని రాయరంగ్పూర్ నగర్ పంచాయితీలో కౌన్సిలర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె 2000లో బీజేపీ-బీజేడీ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2015 లో జార్ఖంఖ్ గవర్నర్గా అత్యున్నత పదవిని అలంకరించారు. అంతేకాదు ఒడిశా ప్రభుత్వంలో రవాణా, వాణిజ్యం, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఆమెకు విభిన్న పరిపాలనా అనుభవం ఉంది. ఈ మేరకు ద్రౌపరి ముర్ము మాట్లాడుతూ...ఎన్డీఏ తరుఫున రాష్ట్రపతి పదవికి నామినేట్ అయ్యానని తెలుసుకుని చాలా ఆనందించానన్నారు. తొలుత తాను చాలా ఆశ్చర్యపోయానని చెప్పారు. ఒక గిరిజన మహిళగా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదన్నారు. ఒడిశా శాసనసభ్యులు, ఎంపీలు తనకు మద్దతిస్తారని విశ్వాసిస్తున్నాని చెప్పారు. అంతేకాదు తాను ఒక గిరిజన పుత్రికగా, ఒడియాగా నాకు మద్దతు ఇవ్వండని సభ్యులందరిని అభ్యర్థించే హక్కు కూడా ఉందని నొక్కి చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనుందన్న వార్త తెలియగానే ఒడిశాలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ముఖ్యంగా ఆమె నివశించే మయుర్భంజ్ జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైతే గనుక గిరిజన మహిళగా ఎన్నికైన తొలి రాష్ట్రపతిగా ఖ్యాతీ గాంచుతుంది. (చదవండి: ‘మహా’ సంకటం: ఏక్నాథ్ షిండేకు ఊహించని షాక్!) -
రాష్ట్రపతి ఎన్నికల బరిలో యాశ్వంత్ సిన్హా
-
రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు..??
-
ఆభ్యర్ధి కోసం అన్వేషణ
-
మమత భేటీకి టీఆర్ఎస్ దూరం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు దేశవ్యాప్తంగా 19 పార్టీలకు, విపక్ష పార్టీల సీఎంలకు మమత ఆహ్వానం పలికారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్కు కూడా ఆహ్వానం పంపారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాల్లో తలమునకలై ఉన్న కేసీఆర్ ఈ భేటీకి దూరంగా ఉండటంతో పాటు పార్టీ తరఫున ప్రతినిధి బృందాన్ని కూడా పంపకూడదని నిర్ణయించారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో సత్సంబంధాలు కోరుకుంటున్నా, మమత భేటీకి హాజరవడం ద్వారా ఎదురయ్యే పరిణామాలను దృష్డిలో పెట్టుకుని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు నేతృత్వంలో టీఆర్ఎస్ బృందాన్ని పంపాలని తొలుత భావించినా సుదీర్ఘ మంతనాల తర్వాత మొత్తానికే దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. ఢిల్లీ భేటీ నేపథ్యంలో ప్రగతిభవన్లో సీఎం మంగళవారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘ భేటీ నిర్వహించారు. కరీంనగర్ పర్యటనలో ఉన్న వినోద్ కుమార్ సీఎం పిలుపు మేరకు మధ్యాహ్నం ప్రగతిభవన్కు చేరుకున్నారు. మమత భేటీలో పాల్గొనడం ద్వారా ఎదురయ్యే అనుకూల, ప్రతికూల రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ వైఖరిపై చర్చ జాతీయ రాజకీయాల్లో నెలకొన్న రాజకీయ శూన్యతను ప్రస్తావిస్తూ గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ సుదీర్ఘంగా వివరించినట్లు తెలిసింది. ఈ భేటీకి కాంగ్రెస్ను కూడా మమత ఆహ్వానించడం, అదే భేటీకి టీఆర్ఎస్ హాజరైతే రాష్ట్రంలో ఎదురయ్యే రాజకీయ పరిణామాలు, విమర్శలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్ బలహీనత, విపక్షాల అనైక్యత వల్లే బీజేపీకి ఎదురులేకుండా పోయిందని వ్యాఖ్యానిస్తున్న కేసీఆర్.. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్పై విమర్శలకు తావు ఇవ్వరాదనే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బుధవారం జరిగే సమావేశం ప్రాథమిక భేటీ మాత్రమే అయినందున జాతీయ స్థాయిలో వివిధ విపక్ష పార్టీల మనోగతం తెలుసుకునేందుకు ఈ సమావేశం దోహదం చేస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతలతో వరుస భేటీలు జరిపిన కేసీఆర్, మరోవైపు జాతీయ పార్డీ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తనదైన శైలిలో పాత్ర పోషిస్తారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
రాష్ట్రపతి ఎన్నికలు: తెరపైకి శరద్ పవార్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయ సాధనకు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం తెరపైకి వస్తున్న నేతల పేర్లలో ప్రతిపక్షాల తరఫున కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పవార్ అభ్యర్థిత్వంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆపార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే గురువారం ముంబైలో శరద్పవార్తో భేటీ అయి, వెల్లడించినట్లు సమాచారం. అయితే, పవార్ నుంచి గానీ, ఎన్సీపీ నుంచి గానీ ఈ విషయమై ఎటువంటి స్పందన రాలేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతోపాటు, తమిళనాడు సీఎం స్టాలిన్తో ఫోన్లో చర్చలు జరిపారు. టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎంతోనూ ఖర్గే ఫోన్లో మాట్లాడారు. ఆదివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరఫున ఆప్ నేత సంజయ్ సింగ్ కూడా ఇదే విషయమై శరద్ పవార్తో ముంబైలో సమావేశమయ్యారు. దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన పవార్, పలు సందర్భాల్లో కూటముల ఏర్పాటుతోపాటు ప్రభుత్వాలను గద్దె దించడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం, మహారాష్ట్రలో కొనసాగుతున్న మూడు భిన్న సిద్ధాంతాలు కలిగిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం ఆయన చొరవ ఫలితమే. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం సాధించే బాధ్యతను బీజేపీ అధిష్టానం..ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లకు అప్పగించింది. వారిద్దరూ ఎన్డీఏ పక్షాలతోపాటు వివిధ పార్టీల నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. ఏకాభిప్రాయం కుదరకుంటే ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం 10,86,431 ఓట్లకు గాను 50%ఓట్లు సాధించిన వారే రాష్ట్రపతి అవుతారు. మెజారిటీ మార్కును దాటేందుకు బీజేపీకి మరో 13వేల ఓట్ల అవసరముంది. -
మనమంతా ఏకమవుదాం..విపక్ష నేతలకు మమతా బెనర్జీ పిలుపు..!!
-
కేసీఆర్ ఇలా చేయకుంటే దుష్ఫలితాలు గ్యారెంటీ
-
Presidential Polls: ‘రాష్ట్రపతి’ బరిలో ఉమ్మడి అభ్యర్థి!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించే దిశగా ప్రయత్నాలకు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ పదును పెడుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు విపక్ష నేతలతో వరుస సంప్రదింపులు జరిపిన ఆమె, వాటి మధ్య ఏకాభిప్రాయ సాధన బాధ్యతను పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. వెంటనే రంగంలోకి దిగిన ఖర్గే తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఆమెతో పాటు డీఎంకే నేత తిరుచి శివ, ఆప్ నేత సంజయ్ సింగ్తో పాటు వామపక్షాల నేతలకు కూడా ఆయన ఫోన్లు చేశారు. శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కూడా ఖర్గే చర్చించనున్నారు. ఆయన చర్చల సందర్భంగా ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న అభిప్రాయానికి మమత కూడా సానుకూలత వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. దీనిపై త్వరలో ప్రాంతీయ పార్టీలతో సంయుక్త సమావేశం ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఖర్గే గురువారమే ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసి ఈ విషయమై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాదనకు పవార్ కూడా సానుకూలమేనని ఖర్గే అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కీలక ప్రాంతీయ పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేడీ అనుసరించబోయే వైఖరిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. వాటితో చర్చలకు కాంగ్రెసేతర నేతలను పురమాయించాలన్న యోచన కూడా ఉంది. బీజేపీని వ్యతిరేకిస్తున్న తృణమూల్ వంటి కీలక ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్తో ఉప్పూనిప్పుగా ఉండటం ఏకాభిప్రాయ సాధన ప్రయత్నాలకు అడ్డంకిగా కన్పిస్తోంది. దీన్ని అధిగమించేందుకు రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెసేతర నేతను బరిలో దించాలని సోనియా భావిస్తున్నట్టు సమాచారం. ‘ఒక్క’ శాతంపై బీజేపీ దృష్టి రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునేందుకు కావాల్సిన 1.1 శాతం ఓట్లపై బీజేపీ కూడా దృష్టి సారించింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల మొత్తం ఓట్ల విలువ 10.86 లక్షల్లో బీజేపీకి 48.9 శాతం ఉన్నాయి. దాంతో మిగతా 11,990 ఓట్ల కోసం ప్రాంతీయ పార్టీలను బీజేపీ సంప్రదిస్తోంది. ముఖ్యంగా బిజూ జనతాదళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై నమ్మకం పెట్టుకుంది. రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్కు ముందే ఆ పార్టీల చీఫ్లు నవీన్ పట్నాయక్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. ఎలక్టోరల్ కాలేజీలో బీజేడీకి 13 వేల పై చిలుకు, వైఎస్సార్సీపీకి 45 వేల పై చిలుకు ఓట్లున్నాయి. నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ మద్దతూ తమకేనని బీజేపీ అంటోంది. ఆయనతోనూ చర్చలకు ప్రత్యేక బృందాన్ని పంపనుంది. -
రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గనున్న.. ఎంపీల ఓటు విలువ
న్యూఢిల్లీ: ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుల ఓటు విలువ 700కు పడిపోనుంది. గతంలో ఇది 708గా ఉండేది. 83 స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దవడమే ఇందుకు కారణం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత లద్దాఖ్, జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్ విభజన జరగడం తెలిసిందే. జమ్మూకశ్మీర్లో శాసనసభ ఉనికిలో లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఎంపీల ఓటు విలువ తగ్గిపోతున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక జూలైలో జరగనుంది. ఎంపీల ఓటు విలువ రాష్ట్రాల్లో శాసనసభ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. చదవండి: తల్లిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమతో ముద్దాడిన సీఎం -
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు
ప్యారిస్: ఫ్రాన్సు అధ్యక్ష పదవికి ఆదివారం మొదటి రౌండ్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 13 మంది నేతలు బరిలో ఉండగా ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, మరీన్ లీపెన్ మధ్యే ప్రధాన పోటీ ఉంది. మొదటి విడత ఎన్నికల్లో ఏ ఒక్కరికీ 50% మించి ఓట్లు రాకుంటే ఈ నెల 24వ తేదీన నిర్ణయాత్మక రెండో విడత ఓటింగ్ చేపడతారు. ఫ్రాన్సు చరిత్రలో అధ్యక్ష పదవికి రెండో రౌండ్ ఎన్నిక ఎన్నడూ జరగలేదు. 2017 ఎన్నికల్లో లీ పెన్పై విజయం సాధించి మాక్రాన్ పిన్న వయస్కుడైన ఫ్రాన్సు అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. చదవండి: ఫ్రాన్స్కు పరీక్షా సమయం -
ఫ్రాన్స్కు పరీక్షా సమయం
యూరప్ ఖండమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల తొలి దశ పోలింగ్ ఆది వారం జరగబోతోంది. ఈనెల 24న జరగబోయే మలి దశకు ప్రధానంగా ఎవరు పోటీలో ఉంటారో ఈ పోలింగ్ ఫలితం తేల్చేస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడు, మధ్యేవాద పక్ష నాయకుడు ఇమ్మానియేల్ మేక్రాన్ సునాయాసంగా గెలుస్తారని గత నెలలో వెలువడిన సర్వేలు చెప్పినా... ఇటీవల ఆయన ప్రత్యర్థి, తీవ్ర మితవాద పక్షనేత మెరైన్ లీ పెన్ తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నారని తేలింది. తాను విజయం సాధిస్తే ప్రళయం ఖాయమని స్టాక్ మార్కెట్లు ప్రజల్లో అనవసర భయాలు సృష్టిస్తున్నాయని లీపెన్ అంటున్నారు. నిజానికి మేక్రాన్కు ఎన్నడూ లేనంత అనుకూల పరిస్థితులు న్నాయి. కానీ ఆయన ఎన్నికల ప్రచారం ఆలస్యంగా మొదలుకావడమే లీ పెన్కు వరమైందని నిపు ణుల భావన. అయిదేళ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రెండో దశ ఎన్ని కల్లో 66 శాతం ఓట్లు సాధించినప్పుడు మేక్రాన్ వయసు 39 ఏళ్లు. నెపోలియన్ బోనపార్ట్ తర్వాత అంత చిన్న వయసులో ఫ్రాన్స్ అధ్యక్ష పీఠం దక్కించుకున్నవారు మరెవరూ లేరు. అయితే అప్పటి పరిస్థితులు వేరు. ఇరవై రెండేళ్ల తర్వాత 2012లో విజయకేతనం ఎగరేసిన సోషలిస్టు పార్టీ పాలనలో పూర్తిగా విఫలమై అప్రదిష్టపాలైంది. అధ్యక్షుడిగా పాలించిన హొలాండ్ అసమర్థుడిగా ముద్రపడి, చివరి సమయంలో బెనోయిట్ హమాన్కు పీఠం అప్పగించారు. ఆయన కూడా ప్రజలను ఆకట్టు కోలేకపోయారు. అటు లీ పెన్ తీవ్ర మితవాద భావాలతో జనాన్ని హడలెత్తించారు. తాను అధ్యక్షురాలిగా గెలిస్తే నాటో కూటమి నుంచి ఫ్రాన్స్ను తప్పిస్తానని, రష్యాతో సంబంధాలు మెరుగు పరుస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇవన్నీ మార్కెట్లను బెంబేలెత్తించాయి. ఆ పరిస్థితుల్లో మేక్రాన్ సునాయాసంగా గెలిచారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తీవ్ర మిత భావాలు ఫ్రాన్స్ ప్రజానీకానికి రుచించడం లేదన్న నిజాన్ని లీ పెన్ గ్రహించారు. దానికితోడు ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగడంతో ఆ దేశం ప్రస్తావన, పుతిన్ ప్రస్తావన ఆమె మానుకున్నారు. అలాగే వలసల విషయంలోనూ ఉదారంగా ఉంటున్నారు. ఏ దేశంలో కల్లోలం ఏర్పడినా వేలాదిమంది ఫ్రాన్స్కు వచ్చిపడి స్థానికుల అవకాశాలను దెబ్బ తీస్తున్నారని, దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నారని 2017 ఎన్నికల్లో ఆమె విరుచుకుపడేవారు. తాను వచ్చిన వెంటనే వలసల నిరోధానికి చట్టం చేస్తాననేవారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఉక్రెయిన్ వాసులు మన సోదర సోదరీమణులేనని, వారిని ఆదుకోవడం మన కర్తవ్యమని లీ పెన్ చెబుతున్నారు. బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్ పడుతున్న అవస్థలు అందరికీ తెలియడంతో యూరొపియన్ యూనియన్(ఈయూ) నుంచి ఫ్రాన్స్ బయటకు రావాలన్న డిమాండ్ను ఈసారి ఆమె అటకెక్కించారు. ఆ మాటంటే ఓటమి ఖాయమని లీ పెన్కు అర్థమైంది. గతంతో పోలిస్తే ఆమె అభిప్రాయాలు సరళం కావడం ఓటర్లకు నచ్చి ఉండొచ్చు. అలాగని ఓటర్లలో ఆమె గురించిన భయాందోళనలు పూర్తిగా పోలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆమె ఈయూ నిబంధనలను బేఖాతరు చేసి విదేశీ కార్మికుల స్థానంలో ఫ్రాన్స్ పౌరులకే ఉద్యోగాలు కట్టబెడతామని హామీ ఇస్తున్నారు. అలాగే ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా బురఖా వాడకుండా చర్యలు తీసుకుంటా నంటున్నారు. అయితే ఉక్రెయిన్పై దాడి తర్వాత పుతిన్పై జర్మనీ వగైరా దేశాల్లో ఏర్పడిన అభిప్రా యమే ఫ్రాన్స్లోనూ ఉంది. యూరప్ ఖండానికి ఆయన ముప్పుగా పరిణమిస్తాడన్న భయాందో ళనలున్నాయి. లీపెన్ ఇప్పుడు పుతిన్ ప్రస్తావన మానుకుని ఉండొచ్చు. కానీ ఆమె గెలిస్తే ఫ్రాన్స్ సంక్షోభంలో కూరుకుపోతుందనీ, అది అంతిమంగా ఈయూ దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి పుతిన్కు పరోక్షంగా తోడ్పడుతుందనీ నమ్ముతున్నవారున్నారు. లీ పెన్ ధోరణులు పుతిన్కే ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అందువల్ల తొలి దశలో మేక్రాన్ కంటే ఆధిక్యత తెచ్చుకున్నా, రెండో దశలో ఆమె దెబ్బతినడం ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్నవారు సమర్థవంతమైన పాలన అందిస్తేనే ప్రజలు వారికి మరోసారి అధి కారం కట్టబెడతారు. అంతేతప్ప ఏవో సాకులు వెదికి, ఎవరివల్లనో ముప్పు వస్తుందని భయపెట్టి ఓట్లడిగే రోజులు పోయాయి. కనీసం ఫ్రాన్స్ ప్రజానీకం అలాంటి అధినేతలను విశ్వసించరు. మేక్రాన్ను ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఆయన చెప్పినవన్నీ చేసి ఉండకపోవచ్చుగానీ ఆర్థికంగా ఫ్రాన్స్ను మెరుగ్గా నిలిపారు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఈయూలో ఫ్రాన్స్ పలుకుబడిని పెంచారు. అటు కార్పొరేట్ సంస్థల పన్నులనూ తగ్గించారు. ఇటు మధ్యాదాయ వర్గాలకూ పన్ను పోటు తగ్గించారు. నిరుద్యోగిత 7 శాతానికి పరిమితం చేస్తానన్న మేక్రాన్ 2017 నాటి వాగ్దానానికి కరోనా గండికొట్టింది. కానీ ఆయన అన్ని రకాల చర్యలూ తీసుకుని ఆ హామీని నెరవేర్చారు. వీటితోపాటు ఉగ్ర దాడుల తర్వాత మితవాద ఓటర్ల మనసు గెల్చుకోవడానికి దేశ ముస్లిం జనాభాను ‘విదేశీ ప్రభావం’ నుంచి తప్పించడానికంటూ నిరుడు ఒక చట్టం తీసుకొచ్చారు. ఫ్రాన్స్ శతాబ్దాలుగా నమ్ముతున్న ఉదారవాద విలువలకు ఈ చట్టం సమాధి కట్టిందని వామపక్ష, ఉదారవాద పక్ష నేతలు ఆరోపించగా... మత ఉగ్రవాదం కట్టడికి ఇది సరిపోదని మితవాదులు విమర్శించారు. మొత్తానికి మేక్రాన్, లీ పెన్ల మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం తగ్గిందన్న తాజా సర్వేల జోస్యం ఫ్రాన్స్లో కలవరం రేపుతోంది. ఆదివారం పోలింగ్ మాటెలా ఉన్నా 24న జరిగే తుది ఎన్నికల నాటికైనా మేక్రాన్ పుంజుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి. -
Sakshi Cartoon: ..వరుసబెట్టి గెలుచుకుంటూ వస్తున్నారుగా మేడం!
..వరుసబెట్టి గెలుచుకుంటూ వస్తున్నారుగా మేడం! -
ఫిలిప్పీన్స్ అధ్యక్ష బరిలో బాక్సర్ పకియావ్
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్ష పదవికి వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో బరిలో ఉంటానని ఆ దేశ బాక్సింగ్ దిగ్గజం, సెనేటర్ మానీ పకియావ్(42) ప్రకటించారు. ఆదివారం జరిగిన పీడీపీ–లబన్ పార్టీ సమావేశంలో పకియావ్ పేరును ఒక వర్గం నేతలు ప్రతిపాదించగా ఆయన అందుకు సమ్మతించారు. ప్రభుత్వ మార్పు కోసం వేచి చూస్తున్న ఫిలిపినో ప్రజలకు నిజాయితీతో సేవలందిస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ‘నేనొక యోధుడిని. బరిలోనూ వెలుపల యోధుడిగానే ఎల్లప్పుడూ ఉంటాను’ అని పేర్కొన్నారు. అధికార పీడీపీ–లబన్లోని ఒక వర్గానికి పకియావ్, సెనేటర్ అక్విలినో నాయకత్వం వహిస్తున్నారు. పార్టీలోని మరో వర్గం, ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు డుటెర్టెని ఉపాధ్యక్షుడిగా, సెనేటర్ బాంగ్ గోను అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేసింది. బాక్సింగ్లోని ఎనిమిది వేర్వేరు విభాగాల్లో ప్రపంచ టైటిళ్లను గెలుచుకున్న ఏకైక బాక్సర్గా పకియావ్ చరిత్ర సృష్టించారు. చదవండి: షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్ Tokyo Olympics: ముఖానికి 13 కుట్లు.. అయినా సరే పోరాటం -
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో రైసీ గెలుపు
దుబాయ్: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఇబ్రహీం రైసీ ఘన విజయం సాధించారు. పోలైన ఓట్లలో ఇప్పటిదాకా 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తవగా వాటిలో 62 శాతం ఓట్లను రైసీ దక్కించుకున్నట్లు ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ శనివారం ప్రకటించింది. ఇరాన్లో అత్యంత శక్తివంతమైన నేత అయిన అయతొల్లా అలీ ఖమేనీకి రైసీ అత్యంత ఆప్తుడు. రైసీ ప్రస్తుతం ఇరాన్ చీఫ్ జస్టిస్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికలను బహిష్కరించాలన్న పిలుపులతోపాటు చాలా మంది ఓటింగ్కు దూరంగా ఉండటంతో 5.9 కోట్ల ఓటర్లలో 2.89 కోట్ల మందే ఓటేశారు. పోలైన ఓట్లలో రైసీకి 1.79 కోట్ల ఓట్లు పడ్డాయి. రైసీతో పోటీపడిన మాజీ రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ మొసెన్ రెజాయీకి 34 లక్షల ఓట్లు, అబ్దుల్నాజర్ హెమ్మతీకి 24 లక్షల ఓట్లు దక్కాయి. మరో అభ్యర్థికి 10 లక్షల ఓట్లు పడ్డాయి. ఇటీవల నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదవడం తెల్సిందే. రైసీ గెలుపును ఖరారుచేస్తూ ఇంకా అధికారిక ఫలితాలు వెల్లడికాలేదు. రైసీకి గట్టి పోటీ ఇవ్వగలరని భావించిన అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ నేతృత్వంలోని ప్యానెల్ తిరస్కరించడంతో రైసీ సునాయాసంగా గెలిచారు. 60 ఏళ్ల రైసీ గతంలోనూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడినా ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ చేతిలో ఓటమి చవిచూశారు. తాజా ఎన్నికల్లో గెల్చిన రైసీ ఆగస్టులో అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
అమెరికా ఫస్ట్’ నుంచి ‘అమెరికా లాస్ట్’కు: ట్రంప్
వాషింగ్టన్: 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘అమెరికా ఫస్ట్’ నుంచి ‘అమెరికా లాస్ట్’కు దిగజారామన్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక సోమవారం తొలిసారి బహిరంగ సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఆర్లాండొలో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘మనం మళ్లీ గెలుపుబాట పట్టాలి. ముందు సెనెట్ ఎన్నికల్లో గెలుపొందాలి. తరువాత, రిపబ్లికన్ అధ్యక్షుడు వైట్హౌజ్లో మళ్లీ అడుగుపెట్టాలి’ అని మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య వ్యాఖ్యానించారు. 2022 మిడ్ టర్మ్ ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని, అలా చేయడం వల్ల కన్సర్వేటివ్ ఓట్లు చీలుతాయని ట్రంప్ పేర్కొన్నారు. రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ గెలిస్తే.. ఆయనకు అధ్యక్ష ఎన్నికల్లో మద్దతిస్తానని రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత మిట్ రోమ్నీ ఇప్పటికే ప్రకటించారు. కరోనాపై పోరు సహా అన్ని అంశాల్లో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని ట్రంప్ విమర్శించారు. అక్రమ వలసదారుల కోసం సరిహద్దులను తెరిచారన్నారు. ట్రంపిజం అంటే దృఢమైన సరిహద్దులని వ్యాఖ్యానించారు. పారిస్ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరడంపై బైడెన్పై విమర్శలు గుప్పించారు. వాతావరణ సమతౌల్యత విషయంలో అమెరికా కన్నా భారత్, చైనా, రష్యాల బాధ్యత ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. ‘రష్యా, చైనా, భారత్లు కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉంటే, ఆ భారం మనపై పడుతోంది’ అని విమర్శించారు. -
2024లో.. అగ్రరాజ్యానికి తొలి మహిళా ప్రెసిడెంట్!
వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో క్యాండేస్ ఓవెన్స్ కనుక నిలబడితే, నిలబడి గెలిస్తే అమెరికా చరిత్రలోనే ఆమె ‘యంగెస్ట్ ప్రెసిడెంట్’ అవుతారు. తొలి మహిళా ప్రెసిడెంట్ అవుతారు. తొలి మహిళా బ్లాక్ ప్రెసిడెంట్ అవుతారు. తెల్లవాళ్ల గ్రాండ్ ఓల్డ్ పార్టీ (రిపబ్లికన్ పార్టీ).. అధ్యక్ష పదవికి నిలబెట్టిన తొలి ‘బ్లాక్’ క్యాండిడేట్ అవుతారు. అమెరికా చరిత్రలోనే జాన్ ఎఫ్.కెన్నెడి ‘యంగెస్ట్’ ప్రెసిడెంట్! జో బైడెన్ ‘ఓల్డెస్ట్’ ప్రెసిడెంట్! ప్రమాణ స్వీకారం చేసే నాటికి కెన్నెడీ వయసు 43. బైడెన్ వయసు 78. (థియోడర్ రూజ్వెల్ట్ 42 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడు అయినప్పటికీ ఆయన నేరుగా ఎన్నికైన అభ్యర్థి కాదు. అధ్యక్షుడు విలియం మెకిన్లే హత్య జరగడంతో ఆ స్థానంలోకి వెళ్లినవారు). బైడెన్ ‘అతి పెద్ద’ రికార్డును బ్రేక్ చేసే వారు బహుశా సమీప భవిష్యత్తులో ఉండకపోవచ్చు. కానీ, కెన్నెడీ రికార్డు భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనైనా బ్రేక్ అవచ్చు. అసలు వచ్చే ఎన్నికల్లోనే (2024) కెన్నెడీ రికార్డు ఓ అమ్మాయి చేతిలో బద్దలయ్యేలా కనిపిస్తోంది. ఆ అమ్మాయే క్యాండేస్ ఓవెన్స్. ప్రస్తుతం ఆమె వయసు 31. అమెరికా ప్రెసిడెట్గా పోటీ చేయడానికి కనీస వయసు 35. మరో నాలుగేళ్లలో ఆమె ఆ గీత దాటేస్తారు కనుక పోటీ చేసే అర్హత లభిస్తుంది. క్యాండేస్ ఓవెన్ : మరో నాలుగేళ్లలో అమెరికా ప్రెసిడెంట్? ఇటీవలే కదా అమెరికాలో ట్రంప్ వెళ్లిపోయి, జో బైడెన్ వచ్చింది! మళ్లీ ఎప్పటికో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఇంత అకస్మాత్తుగా క్యాండేస్ ఓవెన్స్ అనే యువతి పేరు వినిపించడం ఏమిటి? ఆమె ఎవరు? ఏ పార్టీ? రాజకీయ అనుభవం ఉందా? ముందుగా మొదటి ప్రశ్నకు సమాధానం. ఆమె పేరును ఎవరూ ప్రతిపాదించలేదు. తనే స్వయంగా ప్రకటించుకున్నారు. ‘ఐ లవ్ అమెరికా. థింకింగ్ అబౌట్ రన్నింగ్ ఫర్ ప్రెసిడెంట్’ అని ఫిబ్రవరి 7న ఒక ట్వీట్ ఇచ్చారు! క్యాండేస్ కన్సర్వేటివ్ ఆథర్. అమెరికన్ సంప్రదాయ విలువలకు కట్టుపడిన రచయిత్రి. ఇంకా.. ఆ దేశ రాజకీయ వ్యవహారాలపై చక్కటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేస్తుంటారు. సామాజిక కార్యకర్త కూడా. అధ్యక్ష ఉపాధ్యక్షులుగా జో బైడెన్, కమలా హ్యారిస్ వచ్చి ఇరవై రోజులైనా కాలేదు, అప్పుడు వాళ్లిద్దరి రాజకీయ వ్యవహార శైలులను ఆమె తప్పు పట్టడం ఆరంభించారు! అయితే క్యాండేస్ చేసే ఏ కామెంట్ అయినా గాలిలో కలిసిపోయేదేమీ కాదు. స్వయంగా బైడెన్, కమల ఆ కామెంట్లను విని తమకు తాముగా సమీక్షించుకున్నా ఆశ్చర్యం లేదు. అంత ప్రామాణికంగా ఉంటాయి క్యాండేస్ సునిశితమైన పరిశీలనలు. ఆమె మాటకు, రాతకు అమెరికన్ సమాజంలో అంతటి విలువ ఉంది! ఫిబ్రవరి ఏడున ఆమె అలా ట్వీట్ పెట్టగానే.. ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ’ అయిన రిపబ్లికన్ పార్టీకి తెల్లవాళ్లను మాత్రమే తమ అధ్యక్ష అభ్యర్థిగా అంగీకరించే చరిత్ర ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి మీరెలా ఎన్నికల్లో నిలబడగలరు..’ అని ఒక యూజర్ ప్రశ్నించారు. అందుకు.. ‘దిస్ ఓన్ట్ ఏజ్ వెల్’ అని క్యాండేస్ సమాధానం ఇచ్చారు. ఎప్పటికీ అలాగనే ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు అని? నల్లజాతి వాళ్లను చేరదీసేది డెమోక్రాటిక్ పార్టీనే అయినప్పటికీ, ఆ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తుంటారు క్యాండేస్. ఆఫ్రికన్ సంతితి అమెరికన్ మహిళ ఆమె. అయినప్పటికీ ఆమె డొనాల్డ్ ట్రంప్ను సమర్థిస్తూ వచ్చారు. ఆయన ముఖ్య అనుచరురాలిగా ముద్ర పడ్డారు. సోషల్ మీడియాలో క్యాండేస్ చేసే వ్యాఖ్యలు తరచు వివాదాస్పదం అవుతుంటాయి. గత ఏడాది డిసెంబర్లో ‘వోగ్’ మ్యాగజీన్ ముఖచిత్రంగా వచ్చిన హ్యారీ స్టెయిల్స్ (27 ఏళ్ల బ్రిటిష్ నటుడు) దుస్తుల పై ఆమె కొన్ని విసుర్లు వేశారు. ఆ కవర్ పేజీపైన హ్యారీ కుచ్చుల పావడా వంటి డ్రెస్ను ధరించి మోడలింగ్ చేస్తూ ఉంటారు. ఆ ఫొటోకు వోగ్ ఇచ్చిన కాప్షన్.. ‘బ్రింగ్ బ్యాక్ మ్యాన్లీ మెన్’. ఆ కాప్షన్ని ఎగతాళి చేస్తూ.. ‘ఫెమినైజేషన్ ఆఫ్ మెన్’ అని ట్వీట్ చేశారు క్యాండేస్. ఈ మధ్య కూడా యు.ఎస్. కాంగ్రెస్ ప్రతినిధి అలెగ్జాండ్రియా ఓకేషియో–కార్టెజ్ తనపై హత్యాయత్నం జరిగినట్లు ఫేక్ ప్రచారం చేయించుకున్నారు అని క్యాండేస్ అనడం డెమోక్రాటిక్లకు ఆగ్రహం తెప్పించింది. జనవరి 6న జరిగిన ‘కాపిటల్ హిల్’ భవంతి విధ్వంసంలో తనను అంతం చేయడానికి కొంతమంది రిపబ్లికన్లు ప్రయత్నించారని కార్టెజ్ ఆరోపించడమే క్యాండేస్ విమర్శకు కారణం. క్యాండేస్కు గత జనవరిలోనే తొలి బిడ్డ పుట్టాడు. భర్త జార్జి ఫార్మర్ ‘హెడ్జ్ ఫండ్’ అనే ఒక పెట్టుబడుల వ్యాపార సంస్థ ఉద్యోగి. క్యాండేస్ ఓవెన్స్ మరీ అనామకురాలైతే కాదు. ఆమెలో ఉన్న మరొక గుణం కొంతమంది మహిళా కాంగెస్ ప్రతినిధులు, సెనెటర్లలో ఉన్నదే. అంశాలపరంగా వారు విభేదిస్తారు. సొంత మనుషులనైనా, సొంత పార్టీల వారినైనా వదిలిపెట్టరు. అమెరికన్ రాజకీయాల్లో వ్యక్తిత్వం గల లీడర్గా ఎదగడానికి అవసరమైన స్వభావమే అది. ‘వోగ్’ కవర్ను అవహేళన చేసిన క్యాండేస్ తన కెరీర్ ఆరంభంలో ఆ పత్రికలో ఇంటెర్న్గా చేశారు. ప్రస్తుతం డెమోక్రాటిక్ విధాలను తప్పుపడుతున్న క్యాండీస్, ట్రంప్ అధ్యక్షుడు అవగానే డెమొక్రాటిక్ పార్టీ నుంచి రిపబ్లికన్ పార్టీలోకి మారిపోయారు. క్యాండేస్ కనెక్టికట్లో జన్మించారు. నలుగురు పిల్లల్లో తను ఒకరు. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగారు. క్యాండేస్ అభిప్రాయాలు స్పష్టమైనవీ, చురుకు పుట్టించేవి. టీనేజ్లోనే ఆమెపై మూడుసార్లు జాత్యహంకార దాడులు జరిగాయి. ఆమె ‘టెడెక్స్’ ప్రసంగాలను వింటే.. ప్రత్యర్థిపై దూకుడును ప్రదర్శించడంలో కమలా హ్యారిస్ కంటే క్యాండేస్ బలమైన వ్యక్తి అనిపిస్తుంది. అయితే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ‘కమల వర్సెస్ క్యాండేస్’ అనే మలుపు దగ్గరికి అమెరికా చేరుకునేందుకు అనేక రాజకీయ పరిణామాలైతే సంభవించవలసి ఉంటుంది. వాటిల్లో అనూహ్యమైనవీ ఉంటే ఉండొచ్చు. వివాదాస్పద విమర్శలు ♦అలెగ్జాండ్రియా ఓకేషియో–కార్టెజ్ : క్యాపిటల్ హిల్ ఘటనలో తనపై హత్యాయత్నం జరిగిందని కార్టెజ్ అనడాన్ని కూడా క్యాండేస్ ఓవెన్ హాస్యాస్పదం అన్నారు. అది ఫేక్ హత్యాయత్నం విమర్శించారు. ♦‘వోగ్’ ఫ్యాషన్ మ్యాగజీన్ మీద వచ్చిన బ్రిటిష్ నటుడు హ్యారీ ఫొటో : ‘బ్రింగ్ బ్యాక్ మాన్లీ మ్యాన్’ అని వోగ్ ఈ ఫొటోకు కాప్షన్ పెడితే.. క్యాండేస్ ‘ఫెమినైజేషన్ ఆఫ్ మెన్’ అని అవహేళన చేయడం వివాదం అయింది. -
ట్రంప్ నోట అదే మాట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే అదే పాట పాడుతున్నారు. ఎన్నికల్లో తానే అసలైన విజేతని మళ్లీ చెప్పుకున్నారు. పూర్తి స్థాయిలో రిగ్గింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో మోసం చేసి మరీ బైడెన్ అధ్యక్ష పీఠం దక్కించుకున్నారని ఆరోపించారు. ‘‘డెమొక్రాట్లు మోసం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్కి పాల్పడ్డారు. అలా రిగ్గింగ్ చేసిన ఎన్నికల్లో బైడెన్ విజేతగా నిలిస్తే, నేను ఓడిపోయాను’’ అని అన్నారు. జనవరి 5న జరగనున్న స్పెషల్ సెనేట్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థుల తరఫున శనివారం జార్జియాలో ప్రచారం చేసిన ట్రంప్ ఈ ఎన్నికల్లో కూడా అవకతవకలు జరుగుతాయని జోస్యం చెప్పారు. ‘‘నేను నిజంగా ఓడిపోయి ఉంటే ఆ పరాజయం చాలా గొప్పగా ఉండేది. అప్పుడు నేనే ఓడిపోయానని చెప్పుకొని నా ఇంటికి వెళ్లిపోయేవాడిని’’ అని పేర్కొన్నారు. బైడెన్ విజయం ఖరారయ్యాక ట్రంప్ ప్రజల మధ్యన మాట్లాడడం ఇదే తొలిసారి. (చదవండి: రాత్రికి రాత్రే నా ఓట్లు మాయం..) -
2024లో పోటీ చేస్తాను: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కానీ ఆయన అపజయాన్ని అంగీకరించడం లేదు. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్, మోసం జరిగిందని ఆరోపిస్తూ కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్కు సంబంధించి ఓ చర్చ జరగుతుంది. ఎన్నికల్లో ఓడిపోయారు.. రాజకీయాల్లో కొనసాగుతారా.. లేక తిరిగి తన పాత వ్యాపార జీవితంలోకి ప్రవేశిస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోనే కొనసాగబోతున్నట్లు ప్రకటించారు. మరో ముఖ్య విషయం ఏంటంటే 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరో మారు పోటీ చేస్తానని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. వైట్హౌస్లో నిర్వహించిన క్రిస్టమస్ పార్టీలో ట్రంప్ తన రాజకీయ జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నాలుగేళ్లు చాలా అద్భుతంగా గడిచాయి. మరో నాలుగేళ్లు ప్రజలకు సేవ చేయాలని భావించాం. అందుకోసం ఎంతో శ్రమించాం. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాం. మరో నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను’ అంటూ పరోక్షంగా 2024 ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని వెల్లడించారు ట్రంప్. (చదవండి: ఉమెన్ అమెరికా) అలానే ట్విట్టర్ వేదికగా ట్రంప్ ‘మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో’ అంటూ షేర్ చేసిన వీడియోలో ఆయన దేశ ఎన్నికల వ్యవస్థ పూర్తిగా దాడికి గురయ్యిందని.. ఎన్నో అవకతవకలు జరగుతున్నాయని తెలిపారు. అందువల్లే తాను ఓడిపోయానని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఎన్నో అవకతవకలు జరిగాయాని.. వాటన్నింటికి సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని తెలిపారు. దేశానికి అధ్యక్షుడిగా చేసిన తాను ఓడిపోవడం గణాంకపరంగా అసాధ్యం అని ట్రంప్ వీడియోలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆయన పోటీ చేసిన ఆరు రాష్ట్రాలు కూడా తమ ఫలితాలను ధ్రువీకరించాయి. బైడెన్, ట్రంప్ కన్నా ఏడు మిలియన్ల ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించినట్లుగా నేషనల్ కౌంట్ ప్రకటించింది. -
‘ఇలాంటి ఘోరాన్ని ఇంతవరకు చూడలేదు’
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని భావిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్న అతడి పర్సనల్ డిఫెన్స్ న్యాయవాది రూడీ గియులియానికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఎన్నికల్లో జో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారంటూ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతుండగా ఆయన హెయిర్ డై కరిగి ముఖం మీదకు కారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతుండగా.. దాన్ని తలదన్నే మరో వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఇది కూడా రూడీ గియులియానికి చెందినదే కావడం విశేషం. ఇక ఈ వీడియోలో రూడీ గియులియాని చర్యలు చూస్తే.. నవ్వు, ఆసహ్యం రెండు ఒకేసారి వస్తాయి. ఇక ఈ వీడియోలో రూడీ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. ఇంతలో ఓ నాప్కిన్ తీసి ముక్కు చీదుకుంటాడు. అనంతరం దాన్ని పడేయకుండా మరో వైపు మడతపెట్టి.. దానితో నోరు, నుదురు తుడుచుకుంటాడు. ఆ తర్వాత దాన్ని తీసి జేబులో పెట్టుకుంటాడు. ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 1.5మిలియన్ల మంది వీక్షించారు. (చదవండి: బైడెన్ గెలిచాడని ఒప్పుకున్న ట్రంప్!) ఇక నెటిజనులు ఆయన్ని ఓ ఆట ఆడేసుకున్నారు. ‘ఓరే నాయన అసలే ఇది కోవిడ్ కాలం. నువ్వేమో ఏ మాత్రం జాగ్రత్త లేకుండా ముక్కు తుడుచుకున్న నాప్కిన్తోనే ముఖం తుడుచుకున్నావ్.. ఏంటి నీ ధైర్యం’.. ‘అరే అక్కడ నాప్కిన్ బండిల్ పెట్టండి’.. ‘ఇదంతా లైవ్లో టెలికాస్ట్ అవుతుంది.. మర్చిపోయావా’.. ‘కోవిడ్, ఇతర జబ్బులు ఎలా వ్యాప్తి చెందుతాయో వివరించడానికి నువ్వు సరైన ఉదాహరణ’ అంటూ నెటిజనులు కామెంట్ చేశారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికి ట్రంప్, అతడి మద్దతుదారులు దాన్ని అంగీకరించడం లేదు. జో బైడెన్ ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తున్నారు. -
అమెరికా ఎన్నికలు.. ఆంధ్రా రాజకీయం!
తను ఓడిపోతే అమెరికాలో అరాచక శక్తులు రాజ్యం చేస్తాయనీ, శ్వేతజాతీయులకు భద్రత కరువవుతుందని ట్రంప్ గట్టిగా ప్రచారం చేసినా.. అమెరికా ఓటర్లు ట్రంప్నే పక్కన పడేశారు. అలాగే తనకు ఓటేయకపోతే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఆగిపోతాయని, అరాచక శక్తులు రాజ్యం చేస్తాయనీ చంద్రబాబు కూడ గత ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఆయన్నే అధికారం నుండి తొలగించారు. రాజధానిని మూడు విభాగాలుగా చేసి మూడు ప్రాంతాలకు పంచుతూ కొత్త ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ది బిల్ వెనుక ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’ అనే సూత్రం ఉంది. దీన్ని పట్టించుకోకుండా ప్రజల ఆకాంక్షలను వమ్ముచేసి.. భద్రలోకం కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వాలకు అమెరికాలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా ప్రజలు ఒకేలా బుద్ధి చెబుతారు. అభద్రలోకం కోసం పనిచేసే ప్రభుత్వాలకు ప్రజలు పట్టం కడతారు. అమెరికాలో మార్క్సిస్టుల ప్రభావంతో ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ అంటూ మొదలయిన ఉద్యమంలో ఫాసిస్టు వ్యతిరేక బృందాలు (యాంటిఫా), ముస్లింలు, శ్వేతజాతీయుల్లోని ఉదారవాదులు, డెమోక్రాట్స్ తదితరులు కలవడంతో అది ‘‘ఆల్ లైవ్స్ మేటర్’’ ఉద్యమంగా మారింది. ట్రంపిజాన్ని మొత్తంగా ఓడించకపోయినా దాన్ని అధిగమించి అధికార పీఠాన్ని మార్చగల శక్తిగా ఆవిర్భవించింది. అమెరికా ఉద్యమం ముందుకు తెచ్చిన ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’ అనే విలువలకు వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రాసంగికత వుంది. గత ప్రభుత్వాధినేత చంద్రబాబు తన బ్రాండ్ ఇమేజ్గా ప్రచారం చేసుకున్న పోలవరం, అమరావతి ప్రాజెక్టుల్లో ఈ సంబంధాన్ని మరింత స్పష్టంగా చూడవచ్చు. పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం – 2014లో జాతీయ హోదా కల్పించారు. ఇందులో ఇరిగేషన్, హైడల్ పవర్ అనే రెండు కాంపోనెంట్లు వున్నాయి. హైడల్ పవర్ యూనిట్ను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించకూడదనుకున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తానే స్వయంగా నిర్మించాలనుకుంది. ఇక ఇరిగేషన్ కాంపోనెంట్ వరకు ఎంత ఖర్చయితే అంత నూటికి నూరు శాతం నిధుల్ని కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఈ చట్టబద్ధ బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోజాలదు. ఇరిగేషన్ కాంపోనెంట్లో మళ్ళీ రెండు విభాగాలున్నాయి. మొదటిది ఆర్ఆర్ ప్యాకేజీ, రెండోది డ్యామ్ నిర్మాణం. 2019 ఫిబ్రవరి 18 నాటికి ఈ రెండు విభాగాల నిర్మాణ వ్యయం 55,548.87 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఇందులో, ఆర్–ఆర్ ప్యాకేజీ, డ్యామ్ నిర్మాణ వ్యయాలు దాదాపు 60 శాతం, 40 శాతంగా వుంటాయి. పోలవరం నిర్వాసితుల్లో అత్యధికులు ఆదివాసులు. 2013లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ప్రాజెక్టు ఆయకట్టులోనే పునరావాసం ఏర్పాటు చేయాలి. సహాయక, పునరావాస (ఆర్–ఆర్) ప్యాకేజీని సంపూర్ణంగా అమలు పరిచాకే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. కేంద్ర జలవనరుల శాఖకు చెందిన పోలవరం ప్రాజెక్టు అ«థారిటీ (పీపీఏ) నుండి నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఆర్–ఆర్ ప్యాకేజీని పక్కన పెట్టి ఇరిగేషన్ కాంపోనెంట్ మీద దృష్టిని సారించింది. ఆ విభాగంలో దాదాపు 16 వేల కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు 70 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పుకుంది. అయితే ఆర్–ఆర్ ప్యాకేజీ విభాగంలో ఇప్పటివరకు నాలుగో వంతు కూడా ఖర్చుపెట్టలేదు. దాదాపు ఈ కాలంలోనే రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ (సీఆర్డీఏ) ద్వారా రాజధాని అమరావతి ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి చారిత్రకంగా కొన్ని ఒప్పందాలున్నాయి. 1937 నవంబర్ 16 నాటి శ్రీభాగ్ ఒప్పందంలో ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకుని పోవడం’ అనే ప్రాతిపదికన రాయలసీమ, మధ్య ఆంధ్రా, ఉత్తరాంధ్రాలకు రాజధాని, హైకోర్టు, యూనివర్శిటీలను పంచుకున్నారు. ఆ ప్రకారం 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1956లో మరో పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం హైదరాబాద్ స్టేట్లోని తెలంగాణ ప్రాంతం, ఆంధ్రరాష్ట్రం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి. 2014 లో మళ్ళీ పునర్ వ్యవస్థీకరణ జరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి అలనాటి ఆంధ్రరాష్ట్రం విడిపోయింది. అంటే శ్రీభాగ్ ఒప్పందం మళ్ళీ అమల్లోకి రావాలి. కానీ, అలా జరగలేదు. రాజధాని విభాగాల మీద రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు హక్కులు లేకుండా శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలన్నింటినీ అమరావతిలోనే నెలకొల్పే ప్రయత్నాలు సాగాయి. ఇవి అత్యంత సహజంగానే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో నిరసనలకు దారి తీశాయి. వారు తమదైన రోజు కోసం ఎదురు చూశారు. ఆ ప్రాంతాల ‘విద్యావంతుల వేదికలు’, ‘డెవలప్మెంట్ ఫోరం’ల నినాదాల సారాంశం కూడా ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’. గత ప్రభుత్వం పోలవరం, అమరావతుల్లో అనుసరించిన అభివృద్ధి నమూనాలను గమనిస్తే అడవి, మైదానాల మధ్య వివక్ష ఏ స్థాయిలో సాగిందో అర్థం అవుతుంది. అమరావతి ప్రాజెక్టులో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటూ భూ సమీకరణ పథకాన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయ భూముల్ని పారిశ్రామిక, వాణిజ్య, నివాస భూములుగా మార్చి స్థానిక భూ యజమానుల సంపదను పెంచే పథకాలను రచించారు. పోలవరంలో ల్యాండ్ పూలింగ్ స్కీమూ లేదు; భూసేకరణ పథకాన్ని అమలుచేసే నిజాయితీ లేదు. స్థానికుల సంపదను పెంచే ఊసే లేదు. ఫలితంగా, పోలవరం ముంపు మండలాల్లో ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’ వంటి నినాదాలు ముందుకు వచ్చాయి. తను ఓడిపోతే అమెరికా కమ్యూనిస్టుల పాలవుతుందని, అరాచక శక్తులు రాజ్యం చేస్తాయనీ, శ్వేతజాతీయులకు భద్రత కరువవుతుం దని ఈసారి ఎన్నికల్లో ట్రంప్ గట్టిగా ప్రచారం చేశారు. కానీ అమెరికా ఓటర్లు ట్రంప్నే పక్కన పడేశారు. దాదాపు ట్రంప్ పద్ధతుల్లోనే తనకు ఓటేయకపోతే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఆగిపోతాయని, అరాచక శక్తులు రాజ్యం చేస్తాయనీ చంద్రబాబు కూడా గత ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వారినే అధికారం నుండి తొలగించారు. ఆ ప్రాంతాల్లోని 87 శాతం అసెంబ్లీ సీట్లలో గత అధికార పార్టీ ఓడి పోయింది. ఎన్నికల్ని ప్రజాభీష్టానికి భారమితిగా భావిస్తే, అమరావతి పోలవరం ప్రాజెక్టుల గురించి బాబు చేసిన ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆసక్తి లేదని తేలిపోయింది. యాదృచ్ఛి కమే కావచ్చుగానీ, రాజధానిని మూడు విభాగాలుగా చేసి మూడు ప్రాంతాలకు పంచుతూ కొత్త ప్రభుత్వం తెచ్చినది ఆంధ్రప్రదేశ్ డీసెం ట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ బిల్ వెనుక ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’ అనే సూత్రం వుంది. ఆంధ్రప్రదేశ్లోని అధికశాతం రాజకీయ పార్టీలకు విజయవాడ, గుంటూరుల్లో ఆర్థిక పునాదులున్నాయి. అవి విజయవాడ, గుంటూరు రంగు కళ్ళద్దాల నుండి రాష్ట్రాన్ని చూడడం మొదలెట్టాయి. రాష్ట్రంలో మరో 11 జిల్లాలున్నాయని గత ఎన్నికల్లో ప్రజలు గుర్తు చేసినా ఆ పార్టీలకు అర్థం కాలేదు. రాజధానికి చెందిన రెండు విభాగాలను అమరావతి నుండి తరలించడాన్ని నిలిపివేయాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అంతటి స్థిర నిర్ణయాన్ని వారు పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ విషయంలో ప్రదర్శించలేకపోయారు. ఏమిటీ దీని అర్థం? పెట్టుబడిదారీ వ్యవస్థ పుంజుకుంటున్న దశలో ప్రాజెక్టులకు గొప్ప గౌరవం వుండేది. ఆధునిక దేవాలయాలు అని కొనియాడేవారు. అదొక దశ. సరళీకృత అర్థిక విధానం విజృంభించాక ప్రాజెక్టుల లోపల దాగున్న చీకటి కోణాలు వెలుగులోనికి రావడం మొదలయింది. ప్రాజెక్టులు భౌగోళికంగా ధనిక, పేద వర్గాల మధ్య ఒక విభజన రేఖను గీస్తాయి. పోలవరం ప్రాజెక్టు ఆయకట్టులోని భూ యజ మానులకు నిస్సందేహంగా వరమే; కానీ రిజర్వాయర్ ముంపు ప్రాంత నివాసులకు అది శాపం. నీటిపారుదల ప్రాజెక్టులు వ్యవసాయ భూములున్నవారి సంపదను పెంచడమేగాక భూమిలేనివాళ్ళ కష్టాలనూ పెంచుతాయి. అమరావతి ప్రాజెక్టు వల్ల విజయవాడ గుంటూరు నగరాల్లో భూముల ధరలు, ఇళ్ళ అద్దెలు భారీగా పెరిగిన మాట వాస్తవం. కానీ, స్వంత భూమిలేక అద్దె ఇళ్లలో వుండేవాళ్ళ పరిస్థితి ఏమిటీ? అంచేత, ఆధునికానంతర కాలంలో ప్రాజెక్టుల మీద పునరాలోచనలు మొదలయ్యాయి. ప్రాజెక్టులవల్ల లబ్ధిపొందని సామాజిక వర్గాలకు నగదు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు ఈ నేపథ్యంలోనే వచ్చాయి. ఈ సందర్భంలో ప్రస్ఫుటంగా కనిపించే అమానుషం ఏమంటే ప్రాజెక్టులవల్ల లబ్ధిపొందిన వర్గాలు నగదు బదిలీ పథకాలని ‘పప్పుబెల్లాలు’ అంటూ హేళన చేస్తాయి. ‘పప్పుబెల్లాల’ పంపిణీలవల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోతున్నదని పెద్ద గోల చేస్తాయి. ఇది ఆర్థిక అహంకారం. వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే భద్రలోకం సంపదను మరింతగా పెంచడం మాత్రమే. ఇది అసలు సిసలు ఆర్థిక అహం కారం. భద్రలోకం కోసం పనిచేసే ప్రభుత్వాలకు అమెరికాలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా ప్రజలు ఒకేలా బుద్ధి చెపుతారు. అభద్రలోకం కోసం పనిచేసే ప్రభుత్వాలకు ప్రజలు పట్టం కడతారు. డానీ రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు మొబైల్ : 90107 57776 -
టార్గెట్ బైడెన్ వయా చైనా!
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక లాంఛనమే అయినా ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్ బైడెన్ను ఇరకాటంలోకి నెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైట్హౌస్లో మరో రెండు నెలలు ఉండనున్న ట్రంప్ పదవి నుంచి దిగిపోయే ముందు చైనాకు చుక్కలు చూపుతారని, ఇది బైడెన్ను ఆత్మరక్షణలోకి పడవేసేందుకేనని చెబుతున్నారు. కరోనా వైరస్ పుట్టుక, విస్తృత వ్యాప్తి, అమెరికాలో ఆర్థిక మాంద్యానికి చైనాను నిందిస్తూ వచ్చిన ట్రంప్ ఇక డ్రాగన్ టార్గెట్గా చెలరేగుతారని ఓ నివేదిక స్పష్టం చేసింది. చైనాతో అమెరికా సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న క్రమంలో బైడెన్ రాకతో ద్వైపాక్షిక బంధం బలపడుతుందని భావిస్తున్న క్రమంలో సమస్యను మరింత జటిలం చేసేందుకు ట్రంప్ దూకుడు కనబరుస్తారని విదేశీ వ్యవహారాల నిపుణులు జెఫ్ మూన్ వ్యాఖ్యానించారు. చైనాను ఇబ్బందులకు గురిచేసేలా తైవాన్ అంశాన్ని ట్రంప్ మరోసారి తెరపైకి తెస్తారని భావిస్తున్నారు. చైనా అధికారులకు వీసాల నిలిపివేతతో పాటు 2022లో బీజింగ్లో జరిగే ఒలింపిక్స్లో అమెరికన్ అథ్లెట్లు పాల్గొనకుండా నిలువరించవచ్చని చెబుతున్నారు. టిక్టాక్, వీచాట్లపై నిషేధం అనంతరం మరిన్ని చైనా యాప్లపై ట్రంప్ నిషేధం విధించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. చదవండి : ట్రంప్ మెలానియా విడాకులు? బైడెన్కు చిక్కులు చైనాతో సంబంధాలను చక్కదిద్దేందుకు పూనుకునే బైడెన్కు ఇబ్బందులు కలిగించేందుకే ట్రంప్ చైనాకు చెక్ పెట్టే చర్యలను ముమ్మరం చేస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన విధానాలను తప్పక కొనసాగించాల్సిన పరిస్థితిని బైడెన్ ముందుంచేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారని కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సరా క్రెప్స్ పేర్కొన్నారు. మరోవైపు చైనా పట్ల 73 శాతం అమెరికన్లలో వ్యతిరేకత ప్రబలిందని ప్యూ రీసెర్చి సెంటర్ పరిశోధన నేపథ్యంలో డ్రాగన్తో సంబంధాల పట్ల బైడెన్ ఎలాంటి విధానాలను అవలంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
‘‘చిల్ డొనాల్డ్ చిల్’’ ట్రంప్కు గట్టి కౌంటర్
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్కు భారీ షాకిస్తూ.. డెమొక్రాట్ జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో స్వీడిష్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బెర్గ్ (17) ప్రతీకారం తీర్చుకున్నారు. గతంలో తనను అపహాస్యం చేసిన ట్రంప్కు సోషల్మీడియాలో గట్టి కౌంటర్ ఇచ్చారు. 'చిల్, డోనాల్డ్, చిల్' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ అవకాశం కోసం గ్రెటా 11 నెలలు వేచి చూడాల్సి వచ్చింది. (పాపం ట్రంప్.. కోర్టులో కూడా ఓటమే) తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు ఎదురుదెబ్బ తగులుతున్న సమయం చూసి ట్రంప్పై ఆమె సెటైర్లు వేశారు. ముఖ్యంగా ఓటమిని అంగీకరించలేక "స్టాప్ ది కౌంట్!" అంటూ కుపితుడైపోతున్న ట్రంప్ను ఆమె ట్రోల్ చేశారు. "చాలా హాస్యాస్పదం. డొనాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్ సమస్యపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం స్నేహితుడితో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్ సినిమాకు వెళ్లండి! చిల్, డొనాల్డ్, చిల్!" అంటూ థన్బర్గ్ గురువారం ట్వీట్ చేశారు. దీంతో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రంప్ను భారీగా ట్రోల్ చేస్తున్ననెటిజన్లు గ్రెటా ట్వీట్తో మరింత హంగామా చేస్తున్నారు. వ్యంగ్య కామెంట్లతో హల్ చల్ చేస్తున్నారు. లక్షల కొద్దీ 'లైక్'లు, వేలాది రీట్వీట్లతో సందడి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే పర్యావరణ హితం కోసం విశేష కృషి చేస్తున్న గ్రేటా థన్బర్గ్ను 2019లో టైమ్ మ్యాగజైన్ ఇయర్ ఆఫ్ ది పర్సన్ పేరుతో సత్కరించింది. ఈ సందర్బంగా చిల్ గ్రెటా అంటూ గ్రెటాను ట్రంప్ ఎగతాళి చేశారు. "చాలా హాస్యాస్పదం గ్రెటా తన యాంగర్ మేనేజ్మెంట్పై పని చేయాలి, ఆపై స్నేహితుడితో మంచి పాత ఫ్యాషన్ చిత్రానికి వెళ్లండి!! " అంటూ ట్వీట్ చేశారు. దీంతో మనసునొచ్చుకున్న గ్రెటా మంచి సమయం కోసం వేచి చూసి గట్టి కౌంటర్ ఇచ్చిందన్నమాట. కాగా తాజా ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ టార్గెట్గా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. So ridiculous. Donald must work on his Anger Management problem, then go to a good old fashioned movie with a friend! Chill Donald, Chill! https://t.co/4RNVBqRYBA — Greta Thunberg (@GretaThunberg) November 5, 2020 Greta held onto this for 11 MONTHS and dropped an absolute precision missile strike. pic.twitter.com/0MxnWSNKZ3 — Jim Harper (@NewsroomJim) November 6, 2020 -
అమెరికా ఓటర్ ‘స్వింగ్’ ఎటు?
వాషింగ్టన్: డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల హై వోల్టేజ్ ప్రచార పర్వం అనంతరం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కోవిడ్ –19 మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. ఓటర్లు పోలింగ్ బూత్ల ముందు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ముందస్తు పోలింగ్ నమోదవడం విశేషం.మొత్తం 23.9 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటికే సుమారు 10 కోట్లమంది తమ తీర్పును బ్యాలెట్లలో నిక్షిప్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ‘మెయిల్–ఇన్(పోస్టల్)’ బ్యాలెట్ల లెక్కింపునకు మరికొన్ని రోజులు పట్టే నేపథ్యంలో.. పోలింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే విజేత ఎవరో తెలిసే అవకాశం లేదు. అమెరికాలో సుమారు 25 లక్షల మంది భారతీయ ఓటర్లున్నారు. వారిలో దాదాపు 13 లక్షల మంది కీలక రాష్ట్రాలైన టెక్సాస్, మిషిగన్, ఫ్లారిడా, పెన్సిల్వేనియాల్లోనే ఉన్నారు. కాగా, స్వింగ్ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ల్లో వందలాది మంది ఓటర్లు పోలింగ్ బూత్ల ముందు బారులు తీరి తమ అవకాశం కోసం ఎదురుచూస్తుండటం కనిపించింది. వేర్వేరు టైమ్ జోన్స్ కారణంగా పోలింగ్ సమయం వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఇదాహోలోని ఓ పోలింగ్ కేంద్రం తూర్పు తీరంలోని వర్జీనియా, న్యూయార్క్, న్యూజెర్సీ, మెయిన్ రాష్ట్రాల్లో పోలింగ్ ఉదయం 6 గంటలకు(భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలు), కాలిఫోర్నియాలో ఉదయం 7 గంటలకు(భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలు) ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావచ్చని ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నవారు భావిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమవడానికి ముందు ‘ఓట్.. ఓట్.. ఓట్’ అంటూ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ‘మీ స్వేచ్ఛ, మీ ఉపాధి, మన భవిష్యత్తు దీనిపైననే ఆధారపడి ఉన్నట్లుగా భావించి ఓటేయండి. ఎందుకంటే అదే నిజం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇది ఎన్నికల రోజు. వెళ్లి ఓటు వెయ్యి.. అమెరికా’ అని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ ట్వీట్ చేశారు. ‘2008, 2012ల్లో బరాక్ ఒబామాతో పాటు నాపై మీరు విశ్వాసం ఉంచారు. మళ్లీ అడుగుతున్నా.. మరోసారి నన్ను, కమలను విశ్వసించండి. దేశానికి అయిన గాయాన్ని మాన్పుతాం. మీ విశ్వాసాన్ని వమ్ము చేయను’ అని బైడెన్ పేర్కొన్నారు. ‘మీకు, ఓటుకు మధ్య మరి దేనికి చోటివ్వకండి. ఓటింగ్పై అనుమానాలుంటే ఓటర్ హాట్లైన్కు ఫోన్ చేయండి’ అని డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారతీయ అమెరికన్ కమలా హ్యారిస్ ట్వీట్ చేశారు. ‘ఇప్పటికే ఓటేసి ఉంటే, ఈ రోజు ఓటేస్తున్న వారికి, వారి బూత్ను గుర్తించడంలో సాయం చేయండి’ అని మరో ట్వీట్ చేశారు. ‘మన జీవితాలు దీనిపై ఆధారపడ్డాయని భావించి ఓటేయాలి. మన ప్రజాస్వామ్యం దీనిపై ఆధారపడి ఉంది అని భావించి ఓటేయాలి’ అని కమల ఓటర్లకు పిలుపునిచ్చారు. పామ్ బీచ్లోని పోలింగ్ కేంద్రం వద్ద మెలానియా ట్రంప్ వైట్హౌస్ నుంచే వీక్షణం పోలింగ్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించగా.. జో బైడెన్ చర్చ్లో ప్రార్థనల్లో పాల్గొన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత వాషింగ్టన్లోని అధ్యక్షభవనం వైట్హౌస్లో కొందరు సన్నిహితులతో కలిసి ట్రంప్ ఎన్నికల ఫలితాలను వీక్షించనున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో కనీసం 270 ఓట్లు సాధించిన వారు ఈ ఎన్నికల్లో విజేతగా నిలుస్తారు. ఈ ఎన్నికల్లో కరోనా వైరస్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కేసులు, మరణాల సంఖ్యలోనూ అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆదివారం ఒక్కరోజే యూఎస్లో 81 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఎన్నికల ప్రచారం ముగిసే రోజు ట్రంప్.. కీలక రాష్ట్రాలైన విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియాల్లో ప్రచారం చేయగా.. ఆయన ప్రత్యర్థి జో బైడెన్ పెన్సిల్వేనియా, ఆహియోల్లో ప్రచారం నిర్వహించారు. శ్వేత సౌధంలో అడుగుపెట్టేందుకు స్వింగ్ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, విస్కాన్సిస్, జార్జియా, నార్త్ కరోలినా, ఆరిజోనాల ఫలితాలు కీలకమని ద హిల్ పత్రిక అభిప్రాయపడింది. న్యూహాంప్షైర్ నుంచే తొలి ఫలితాలు ఈ ఎన్నికల్లో న్యూహాంప్షైర్ పట్టణంలోని మొత్తం 5 ఓట్లను గెలుచుకుని బైడెన్ ముందంజలో ఉన్నారు. ఈ చిన్న పట్టణం ఫలితాలు ప్రతీ ఎన్నికల్లోనూ మొదట వెలువడుతాయి. ఎలక్టోరల్ ఓట్లు.. పాపులర్ ఓట్లు 2016 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కన్నా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు సుమారు 29 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. దేశవ్యాప్తంగా ఓటర్లు వేసిన మొత్తం ఓట్లను పాపులర్ ఓట్లు అంటారు. ప్రత్యర్థి కన్నా ఎక్కువ పాపులర్ ఓట్లు వచ్చినప్పటికీ ఆమె ఓడిపోయారు. అందుకు కారణం, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ. ఇది అమెరికా రాజ్యాంగంలో పొందుపర్చిన విధానం. ఈ విధానం ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలంటే కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లను సాధించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో ట్రంప్నకు 304, హిల్లరీకి 227 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అమెరికాలోని 50 రాష్ట్రాల మొత్తం ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 538. ప్రతీ రాష్ట్రానికి వేర్వేరుగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైన ప్రతినిధుల సభ సభ్యులు, సెనెటర్ల సంఖ్య ఆధారంగా ఈ ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. అత్యధిక ఎలక్టోరల్ ఓట్లున్న 10 రాష్ట్రాలను పరిశీలిస్తే.. కాలిఫోర్నియాకు 55 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, టెక్సస్ ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 38. న్యూయార్క్, ఫ్లారిడాల్లో 29 చొప్పున, ఇలినాయిస్, పెన్సిల్వేనియాల్లో 20 చొప్పున, ఒహాయొలో 18, జార్జియా, మిషిగాన్లో 16 చొప్పున, నార్త్ కరోలినాలో 15 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ఫ్లారిడా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, ఆరిజోనాల్లో ఆధిక్యత సాధిస్తే ట్రంప్నకు విజయావకాశాలున్నాయని భావిస్తున్నారు. మిషిగన్, విస్కాన్సిస్, పెన్సిల్వేనియాలపై, డెమొక్రాటిక్ పార్టీకి పెద్దగా పట్టులేని ఆరిజోనాపై జో బైడెన్ ప్రధానంగా దృష్టి పెట్టారు. న్యూయార్క్లో ఓ హోటల్కు రక్షణగాప్లైవుడ్ బోర్డులను అమర్చిన దృశ్యం ఘర్షణల భయంతో.. ఎన్నికల వేళ ఘర్షణలు జరగొచ్చనే వార్తల నేపథ్యంలో అమెరికాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వైట్ హౌస్, కీలక ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత పెంచారు. న్యూయార్క్, బోస్టస్, వాషింగ్టన్, హూస్టన్, షికాగో, శాన్ఫ్రాన్సిస్కో సహా ప్రధాన నగరాలు, పట్టణాల్లోని షాప్స్ ముందు యజమానులు ప్లైవుడ్ బోర్డులను రక్షణగా పెట్టుకున్నారు. బ్యాంకులు, ఇతర సంస్థలు సెక్యూరిటీని పెంచుకున్నాయి. వాల్మార్ట్ తమ దుకాణాల నుంచి తుపాకులు, ఇతర మందుగుండు సామగ్రిని తొలగించింది.న్యూయార్క్కు సంబంధించినంత వరకు ఇవన్నీ అపోహలేనని, తాను సిటీ పోలీస్ కమిషనర్ డెర్మాట్తో మాట్లాడానని న్యూయార్క్ మేయర్ బ్లాసియో పేర్కొన్నారు. పూజ పూర్తయ్యాక ప్రసాదం పంపిణీ కమల గెలుపు కోసం స్వగ్రామంలో పూజలు చెన్నై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న తరుణంలో తమిళనాడులోని తులసెంథిరపురం ప్రజలు తమ ఇంటి ఆడపడుచు గెలుపుని కాంక్షిస్తూ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ స్వగ్రామమైన ఆ కుగ్రామంలో ఆమె విజయాన్ని కోరుతూ పూజలు చేస్తున్నారు. తిరువారూర్ జిల్లాలో ఉన్న ఆ పల్లెలో ఎక్కడికక్కడే కమలా హ్యారిస్ పోస్టర్లు వెలిశాయి. తమ ఊరి ఆడపడుచు అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలు కావాలని మనసారా కోరుకుంటూ గ్రామస్తులంతా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కమల తాతగారైన పీవీ గోపాలన్ స్వగ్రామమైన తులసెంథిరపురంలో ఉన్న ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ‘‘కమలా హ్యారిస్ నెగ్గాలి. అదే మేము కోరుకుంటున్నది. ఆమె గెలిస్తే భారత్కి, తమిళనాడు రాష్ట్రానికే కాదు, మా పల్లెకి కూడా అత్యంత గర్వకారణం’’ అని స్థానికులు అంటున్నారు. -
మరో వివాదంలో ట్రంప్ : ఎవరా మహిళ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ కు దొరికి పోయారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. తన ప్రత్యర్థి, డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో మెలానియాకు డూప్ను వెంటబెట్టుకుని తిరుగుతున్నారన్న తాజా వివాదం వైరల్ అవుతోంది. (ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్) వివరాల్లోకి వెళితే గతకొన్ని రోజులుగా ట్రంప్ తన వెంట మెలానియాను పోలి ఉన్న మరో మహిళను తీసుకెడుతున్నారంటూ సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు, మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ అజ్ఞాత మహిళకు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నెల 22వ తేదీన టెన్నెస్సె స్టేట్లోని నాష్విల్లేలోని యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన డిబేట్కు హాజరు కావడానికి ట్రంప్ తన అధికారిక నివాసం వైట్హౌస్ నుంచి మెరైన్ వన్ ఎయిర్ క్రాఫ్ట్లో బయలుదేరడానికి ముందు తీసిన ఫొటో తాజా వివాదానికి కారణమైంది. ఎయిర్ క్రాఫ్ట్లోకి అడుగు పెట్టడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ తన అభిమానులకు అభివాదరం చేస్తోన్న సమయంలో ఆయన పక్కనే నిల్చుని కనిపించారామె. ఈ ఫోటోలను పరిశీలించిన వారు ఆమె మెలానియా కాదని, మరో మహిళ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఎవరా ఆ అజ్ఞాత మహిళ అంటూ ‘ఫేక్ మెలానియా’ హ్యాష్ట్యాగ్ను ట్యాగ్ చేస్తున్నారు. మరోవైపు గుర్తు తెలియని మహిళను తన భార్యగా ప్రపంచానికి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు మండిపడుతున్నారు. కాగా డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య ప్రథమ మహిళ మెలానియీ ఇటీవల కరోనా బారిన పడ్డారు. అయితే మిలటరీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న ట్రంప్ ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. విపరీతమైన దగ్గు కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కీలకమైన సమావేశానికి హాజరు కాలేకపోతున్నారంటూ ఆమె ప్రతినిధి వెల్లడించిన సంగతి తెలిసిందే. So, why do you think they need a #FakeMelania? pic.twitter.com/XpAJkXZiW8 — Bmar✨🏰🏳️🌈|BLM🌊💙 (@Bmar_Matrix) October 25, 2020 That is the $64,000 question. Can we get #FakeMelania trending? https://t.co/27TgMnZbDR pic.twitter.com/vrjIYmKQn9 — voteblue2020 (@lflorepolitics) October 25, 2020 #fakemelania How it started How it’s going pic.twitter.com/w6sgvv6NqF — TheQueerGuy (@TheQueerGuy) October 25, 2020 She very pretty Melania, da? #FakeMelania #PutinsPuppet pic.twitter.com/lVwfu8NYvB — moonshine blind (@moonshineblind) October 26, 2020 -
అమెరికా ఎన్నికలు: జో బైడెన్ వార్నింగ్
-
ట్రంప్ క్యాంపెయిన్ ఖాతాను బ్లాక్ చేసిన ట్విటర్
న్యూయార్క్ : అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ ట్విటర్ ఖాతాను గురువారం కొద్దిసేపు నిలిచిపోయింది. ట్రంప్ క్యాంపెయిన్ ఖాతాను ట్విటర్ బ్లాక్ చేయడం పట్ల రిపబ్లికన్ సభ్యులు మండిపడ్డారు. దీనిపై తాము న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియా కంపెనీలు స్వేచ్ఛను హరిస్తూ స్పీచ్ పోలీస్గా వ్యవహరిస్తున్నాయని దీనికి ట్విటర్ బాధ్యత వహించాలని ఆరోపించారు. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్ కుమారుడిపై ట్రంప్ బృందం ఓ వీడియాను పోస్ట్ చేయగా ఇది నిబంధనలకు విరుద్ధమని టీమ్ట్రంప్ ఖాతాను ట్విటర్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఉక్రెయిన్ ఇంధన కంపెనీతో హంటర్ బిడెన్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలపై న్యూయార్క్ పోస్ట్ స్టోరీని ప్రస్తావిస్తూ ఈ వీడియోను రూపొందించారు. ఉక్రెయిన్తో లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని రిపబ్లికన్ సారథ్యంలోని సెనేట్ కమిటీలు నిగ్గుతేల్చాయని బిడెన్ క్యాంపెయిన్ ప్రతినిధి ఆండ్రూ బేట్స్ స్పష్టం చేశారు. ప్రైవేట్ సమాచారం పోస్ట్ చేయడం, హ్యాక్డ్ మెటీరియల్స్పై కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందున టీమ్ట్రంప్, వైట్హూస్ ప్రెస్ కార్యదర్శి కీలిగ్ మెననీ, న్యూయార్క్ పోస్ట్ల ఖాతాలను నిలిపివేశామని ట్విటర్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోస్టులను తొలగిస్తే తిరిగి ఆయా ఖాతాల నుంచి ట్వీట్లు చేయవచ్చని చెప్పుకొచ్చారు. చదవండి : అమెరికా ఎటువైపు? -
ట్రంప్కి కరోనా నెగెటివ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఊరట లభించింది. ఆయనకి కరోనా పరీక్షలో నెగెటివ్గా తేలింది. తనకి కరోనా పాజిటివ్ అంటూ ట్రంప్ ప్రకటించిన పన్నెండు రోజుల్లోగా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయట పడ్డారు. ట్రంప్కి చేసిన యాంటీజెన్ కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సియాన్ కాన్లే చెప్పారు. ఈ నెల 1న ట్రంప్ తనకి కరోనా సోకినట్టు వెల్లడించారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఫ్లోరిడాలో ఎన్నికల ప్రచారానికి ట్రంప్ బయల్దేరడానికి కాస్త ముందు ట్రంప్కి కరోనా నెగెటివ్ వచ్చినట్టుగా సియాన్ కాన్లే ప్రకటించారు. ఇతర పరీక్షల్లో కూడా ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు వెల్లడైందని ఆయన తెలిపారు. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ట్రంప్కి వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. చావో రేవో ఎన్నికలు కరోనా పరీక్షల్లో నెగెటివ్గా తేలడంతో ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని ఇక విస్తృతంగా నిర్వహించనున్నారు. ఫ్లోరిడాలో ప్రచారం కోసం వెళుతూ ట్రంప్ మాట్లాడారు. అమెరికా చరిత్రలో ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి అన్నారు. ఎలాగైనా తాము గెలవాలని చెప్పారు. జో బైడెన్ అవినీతికి పాల్పడి డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ తెచ్చుకున్నారని ఆరోపించారు. సోషలిస్టులు, లెఫ్టిస్టులు, మార్క్సిస్టుల చెప్పు చేతల్లో ఆయన ఉన్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బైడెన్ నెగ్గితే రాడికల్ లెఫ్ట్ చేతుల్లోకి దేశం వెళ్లిపోతుందని అందరూ అప్రమత్తంగా ఉండాలని ట్రంప్ హెచ్చరించారు. -
‘నేనిప్పుడు శక్తిమాన్’
వాషింగ్టన్ : కోవిడ్-19 బారినపడి అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని పదిరోజుల పాటు కోల్పోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన క్యాంపెయిన్ను ముమ్మరం చేశారు. తాను పూర్తిగా కోలుకుని శక్తిని కూడగట్టుకున్నానని ఫ్లోరిడా క్యాంపెయిన్లో ట్రంప్ ఉత్తేజపూరితంగా మాట్లాడారు. తాను కరోనా వైరస్కు గురై ఇప్పుడు పూర్తిగా రోగనిరోధకత సాధించానని వైద్యులు చెబుతున్నారని పెద్దసంఖ్యలో చేరుకున్న అభిమానులు,ప్రజలను ఉద్దేశించి ట్రంప్ పేర్కొన్నారు. తాను శక్తివంతంగా ఉన్నానని, హుషారుగా నడుస్తానని..ప్రేక్షకులందరినీ ముద్దాడగలను..ఇక్కడ ఉన్న యువతను గాఢంగా హత్తుకుంటానని శ్రోతలను ఉత్సాహపరిచారు. ఇక ట్రంప్ ఫ్లోరిడా పర్యటనకు ముందు ఆయనకు నిర్వహించిన కరోనా టెస్ట్లో నెగెటివ్ వచ్చిందని అధ్యక్షుడి వైద్య బృందం వెల్లడించింది. నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందు కీలక రాష్ట్రాలను చుట్టిరావాలని ట్రంప్ ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారం రోజుల తర్వాత ఫ్లోరిడా క్యాంపెయిన్లో ట్రంప్ ఏకంగా గంట సేపు మాట్లాడారు. హిల్లరీ క్లింటన్పై విమర్శల నుంచి మీడియా అవినీతి ప్రస్తావన, లెఫ్ట్కు హెచ్చరికలు, సోషలిస్ట్లపై విరుచుకుపడుతూ ట్రంప్ తనదైన దూకుడు ప్రదర్శించారు. స్లీపీ జో’ అంటూ తన ప్రత్యర్ధిపైనా చురకలు వేస్తూ ట్రంప్ ప్రసంగం సాగింది. మరో 22 రోజుల్లో ఫ్లోరిడాలో తాము గెలుపొందుతామని, వైట్హౌస్లో మరో నాలుగేళ్లు కొనసాగుతామని స్పష్టం చేశారు. ‘మరోవైపు కరోనా వైరస్ వెంటాడుతున్నా ట్రంప్ భారీ సభలు, మాస్క్ లేకుండా కలియతిరగడం వంటి చర్యలతో ప్రచార పర్వం సాగిస్తుంటే జో బిడెన్ మాత్రం కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ ప్రచార ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. చదవండి : అధ్యక్ష అభ్యర్థుల ఖర్చు ఎంతో తెలుసా? -
ఐ యామ్ ఫీలింగ్ గ్రేట్: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: కరోనా మహమ్మారి బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొమ్మిది రోజుల తర్వాత శనివారం రాత్రి ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఎన్నికల ర్యాలీలో వందల సంఖ్యలో ట్రంప్ మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైట్హౌస్ బాల్కనీ నుంచి ప్రసంగిస్తూ.. 'నేను ఈ సమయాన్ని గొప్పగా భావిస్తున్నాను (ఐ యామ్ ఫీలింగ్ గ్రేట్). నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. బయటకు వెళ్లి ఓటు వేయండి' అంటూ మద్దతుదారులను ఉత్సాహపరిచారు. కాగా ర్యాలీకి హాజరైన ట్రంప్ మద్దతుదారులు 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' అని రాసిన టోపీలను ధరించి హాజరయ్యారు. (రెండో డిబేట్ రద్దు) కాగా.. వైట్హౌస్ వైద్యులు ట్రంప్ ఆరోగ్యంపై ప్రకటన చేస్తూ వైట్ హౌస్ చేరుకున్న నాటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనలో వ్యాధి లక్షణాలు కనిపించలేదు. చికిత్సకు బాగా స్పందించారని వైట్ హౌస్ డాక్టర్ సియాన్ కాన్లే తెలిపారు. ఇచ్చిన మందుల వల్ల కూడా ఎటువంటి దుష్ప్రభావాలు లేవని తెలిపారు. ఇక సోమవారం ట్రంప్ సెంట్రల్ ఫ్లోరిడాలో క్యాంపెయిన్ చేయనున్నారు. అయితే ఇది పూర్తిగా అవుట్ డోర్లో జరుగుతుందా లేదా ఇండోర్లోనా అనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్తో రెండో అధ్యక్ష ఎన్నికల డిబేట్కు ట్రంప్ 'నో' చెప్పారు. దీంతో అక్టోబర్ 15న జరగాల్సిన ఈ డిబేట్ రద్దయింది. అధ్యక్ష ఎన్నికల డిబేట్లో చివరిదైన మూడో డిబేట్ అక్టోబర్ 22న జరగనుంది. -
ఈ వాదనలు మొదలైందెప్పుడో తెలుసా?
ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్యం?... అగ్రరాజ్యం అమెరికా.. అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశం? మన భారతదేశమే.. బాగానే ఉందికానీ.. రెండు దేశాల్లోనూ ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలే కాబట్టి అంతా ఒకటే అనుకుంటున్నారా? కాదండోయ్... చాలా తేడాలున్నాయి. మిగిలిన వాటిని కాసేపు పక్కనబెడితే... అమెరికా ఎన్నికల్లో అందరినీ ఆకర్షించే ఘట్టం... ప్రెసిడెన్షియల్ డిబేట్స్ లేదా అధ్యక్ష అభ్యర్థుల వాదోపవాదాలు. ఈ చర్చల ఘట్టం మొదలైందెప్పుడు?.. నేపథ్యం ఏంటి?.. ఏ ఏ అంశాలపై చర్చ సాగుతుంది?.. ఇవి కూడా భారతదేశ టెలివిజన్ చానెల్ చర్చల మాదిరిగానే ఉంటాయా?.. ఆసక్తికరమైన ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం... కొన్ని రోజుల క్రితమే.. అమెరికా అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ల మధ్య తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ ముగిసింది. చర్చ హుందాగా జరగలేదని.. అంశాలపై కాకుండా.. వ్యక్తులపై మాట్లాడుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత డొనాల్డ్ ట్రంప్ కాస్తా కోవిడ్ బారిన పడటం.. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా కంటే ఆన్లైన్ ద్వారా చర్చ మేలని బైడెన్ ప్రతిపాదించారు. అయితే దీనికి ట్రంప్ నిరాకరించడంతో రెండో చర్చ వాయిదా పడింది. మూడోదఫా వాదోపవాదాలూ డోలాయమానంలో పడిపోయాయి. ఒకవేళ మూడవ చర్చ కూడా జరక్కపోతే.. అలా జరగడం 1976 తరువాత ఇదే మొదటిసారి అవుతుంది. అధ్యక్ష చర్చలు ఎప్పుడు మొదలయ్యాయంటే? 1776లో స్వాతంత్య్ర ప్రకటనతోనే మొదలుకాలేదు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలూ రాజ్యాంగాన్ని ఆమోదించిన 1788లోనూ కాదు. తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ 1789లో పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంలోనూ ఈ చర్చల ప్రక్రియ మొదలు కాలేదు. చాలా లేటుగా.. 1960లోనే మొదలయ్యాయి. అంతకుమునుపు 1858 ప్రాంతంలో అబ్రహాం లింకన్ , స్టీఫెన్ ఏ డగ్లస్ల మధ్య తొలిసారిగా ముఖాముఖి చర్చలు మొదలైనా... వాటికి సంస్థాగత రూపు మాత్రం లభించలేదు. లింకన్ , డగ్లస్ల మధ్య వరుసగా ఏడుసార్లు చర్చలు జరిగాయి. ప్రక్రియ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. మధ్యవర్తి కూడా లేకుండా అభ్యర్థులు ఇరువురు ముఖాముఖి వాదించుకునేవారు. ముందుగా ఒక అభ్యర్థి చర్చను ప్రారంభించి గంటసేపు తాను చెప్పదలచుకున్న అంశాలను వివరించేవారు. ప్రత్యర్థి తన వాదనలు వినిపించడంతోపాటు తిప్పికొట్టేందుకు గంటన్నర సమయం లభించేది. తొలుత ప్రసంగించిన అభ్యర్థి తన స్పందనలు తెలియజేసి చర్చను ముగించేవారు. ఆ తరువాత 1940లో వెండెల్ విల్లికీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నామినేట్ కాకమునుపే అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ను ముఖాముఖి చర్చకు ఆహ్వానించారు. అయితే రూజ్వెల్ట్ చర్చ తిరస్కరించారు. 1948, 1956లలోనూ అధ్యక్ష పదవికి నామినేట్ కాక మునుపే అంటే ప్రైమరీల అభ్యర్థులుగా థామస్ ఈ డీవీ హరాల్డ్ స్టాట్సెన్ లు, అడ్లాయి స్టీవెన్ సన్ , ఎస్టేస్ కీఫావెర్ల మధ్య చర్చలు జరిగాయి. తొలి చర్చ రేడియోలో ప్రసారం కాగా.. మలి చర్చ తొలిసారి టెలివిజన్లో ప్రసారమైంది. ఓ విద్యార్థి ఆలోచన... 1956లో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ విద్యార్థి ఫ్రెడ్ కాన్ అధ్యక్ష పదవికి నామినేట్ అయిన ఇరుపార్టీల అభ్యర్థులను చర్చ కోసం ఒక వేదికపైకి తీసుకు వచ్చే ఆలోచన చేశారు. అడ్లాయి స్టీవెన్ సన్ డెమొక్రటిక్ పార్టీ తరఫున, అప్పటి అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డ్వైట్ ఐసన్ హోవర్లు తమ యూనివర్సిటీలో చర్చించాలని కాన్ ఆహ్వానం పంపారు. ఈ అంశంపై ప్రజల్లో ఆసక్తిని పెంపొందించేందుకు కాన్ పలు వార్తా పత్రికలకు, దేశంలోని ప్రముఖులకు లేఖలు రాసి చర్చ కార్యక్రమానికి ఆహ్వానించారు. తొలి లేఖ అందుకున్న మాజీ అధ్యక్షుడు రూజ్వెల్ట్ భార్య ఎలెనార్ అందుకు తన సమ్మతిని తెలపడంతోపాటు అడ్లాయి స్టీవెన్ సన్ ప్రచార కార్యదర్శికీ ఆ లేఖ ప్రతిని పంపారు. అయితే చివరకు ఆ ఏడాది చర్చ జరక్కపోయినా ఈ అంశంపై విస్తృత ప్రచారం మాత్రం సాధ్యమైంది. ఇది కాస్తా.. 1960లో యూనివర్సిటీ వేదికలపై అధ్యక్ష అభ్యర్థుల చర్చలకు పునాది పడింది. అయితే 1964, 68, 72లలో చర్చలు అసలు జరగలేదు. 1976లో గెరాల్డ్ ఫోర్డ్, జిమ్మీ కార్టర్ల మధ్య ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగ్గా 1980లోనూ జిమ్మీ కార్టర్కు, రొనాల్ల్ రీగన్కు మధ్య మూడు చర్చలు సాఫీగా జరిగాయి. రీగన్ తరఫున జాన్ బి. ఆండర్సన్ చర్చల్లో పాల్గొనడం విశేషం. అధ్యక్ష అభ్యర్థులతోపాటు ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య కూడా చర్చలు 1984లో మొదలయ్యాయి. ‘సీపీడీ’ ఏర్పాటు... అధ్యక్ష అభ్యర్థుల చర్చలకు పూర్తి సంస్థాగత రూపు రేఖలు లభించింది 1987లో. అమెరికన్ పౌరులకు తాము ఎన్నుకోబోయే అభ్యర్థుల గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పించే లక్ష్యంతో ‘ద కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్’ (సీపీడీ) ఏర్పాటైంది. లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటైన సీపీడీ చర్చలకు సంబంధించిన పరిశోధనలు, కార్యకలాపాల నిర్వహణ, అమెరికా అధ్యక్ష అభ్యర్థుల చర్చలకు ప్రాయోజకత్వం వహిస్తుంది. 1988 నుంచి 2020 వరకూ అన్ని ప్రెసిడెన్షియల్ డిబేట్స్ సీపీడీ ఆధ్వర్యంలోనే జరిగాయి. చర్చల నాణ్యతను మరింత పెంచేందుకు, ఓటరు చైతన్యానికి కూడా సీపీడీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అధ్యక్ష అభ్యర్థుల చర్చను చేపట్టేందుకు ఆసక్తి చూపే ఇతర దేశాలకు సాంకేతిక సాయం అందించేందుకూ సీపీడీ ప్రయత్నాలు చేస్తోంది. బోస్నియా, బురుండీ, కొలంబియా, ఘన, హైతీ, లెబనాన్ , నైజర్, నైజీరియా, పెరూ, రొమేనియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఉగాండా, ఉక్రెయిన్ తదితర దేశాల్లోనూ ఈ చర్చల పద్ధతిని ప్రవేశపెట్టింది. ముఖ్యమైన విషయాలు.. 1. అమెరికాలో టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారాలు 1928, జూలై 2న ప్రారంభమయ్యాయి. కానీ, అధ్యక్ష ఎన్నికల చర్చలు మొదలైంది మాత్రం 1960లోనే. మసాచూసెట్స్ సెనేటర్ జాన్ ఎఫ్ కెనడీ, అప్పటి వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ ఎం.నిక్సన్ల మధ్య తొలిసారి టెలివిజన్లో చర్చ జరిగింది. చర్చతోపాటు ఎన్నికల్లోనూ కెన్నడీ గెలుపొందారు. 2. అమెరికన్ పౌరులు ప్రతి ముగ్గురిలో ఒకరు అధ్యక్ష అభ్యర్థుల చర్చలపై ఆసక్తి చూపుతారని గణాంకాలు చెబుతున్నాయి. తొలి టెలివిజన్ చర్చను 6,64,00,000 మంది ప్రత్యక్షంగా వీక్షించారని అంచనా. అప్పట్లో అమెరికా జనాభా 18.07 కోట్లు మాత్రమే. ప్రస్తుతం అది 32.47 కోట్లు. 3. 1960 నాటి చర్చల్లో నిక్సన్ అనారోగ్యంతోనే పాల్గొన్నారు. స్టేజ్పైకి వెళ్లేందుకు తగిన మేకప్ చేస్తామన్న అనుచరుల సూచనను నిక్సన్ పట్టించుకోలేదు. 1968లో మరోసారి అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన నిక్సన్ అప్పటి ఉపాధ్యక్షుడు హ్యూబర్ట్ హంఫ్రీతో చర్చ జరిపేందుకు నిరాకరించారు. ఆ ఎన్నికల్లో నిక్సన్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. 4. 1960 తర్వాత మూడుసార్లు అధ్యక్ష అభ్యర్థుల చర్చలు జరక్కపోగా.. 1976లో జిమ్మీ కార్టర్, గెరాల్డ్ ఫోర్డ్ల మధ్య మరోసారి చర్చల సంప్రదాయం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ చర్చలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఇదే ఏడాది తొలిసారి ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చలు మొదలు కావడం విశేషం. 5. అధ్యక్ష అభ్యర్థుల చర్చల్లో చేసే నినాదాలు వారి విజయావకాశాలను ప్రభావితం చేస్తూంటాయి,. 1980లో జిమ్మీ కార్టర్తో జరిగిన చర్చలో ‘నాలుగేళ్ల క్రితం కంటే ఇప్పుడు మీరు బాగున్నారని అనుకుంటున్నారా?’ అని మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ అడిగిన ప్రశ్న అతడికి రెండుసార్లు పదవి దక్కేలా చేసిందని రాజకీయ నిపుణులు చెబుతారు. ఆ తరువాతి ఎన్నికలు ప్రతి ఒక్కదానిలోనూ అభ్యర్థులు కొంచెం అటుఇటుగా అదే అర్థం ధ్వనించే నినాదాలు చేయడం రీగన్ ప్రకటన ప్రభావమెంతో చెబుతుంది. 6. రొనాల్డ్ రీగన్ , మాజీ ఉపాధ్యక్షుడు వాల్టర్ మొండేలేల మధ్య 1984లో జరిగిన చర్చలోనూ.. రీగన్ వయో వృద్ధుడని వాల్టర్ ప్రస్తావించగా.. ‘ఈ ప్రచారంలో వయసును ఒక అంశంగా చేయదలచుకోలేదు. ప్రత్యర్థి యువకుడు, అనుభవం లేని వాడని నా రాజకీయ అవసరాల కోసం చెప్పను’ అని రీగన్ సమాధానమిచ్చి వాల్టర్ కూడా నవ్వుకునేలా చేశాడు. 7. 1992 అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో తొలిసారి చర్చలో ఇద్దరు కాకుండా ముగ్గురు పాల్గొన్నారు. అధ్యక్ష హోదాలో జార్జ్ హెచ్.డబ్ల్యూ బుష్, అర్కాన్సస్ రాష్ట్ర గవర్నర్ హోదాలో బిల్ క్లింటన్, స్వతంత్ర అభ్యర్థిగా రాస్ పెరోట్ ఈ చర్చలో పాల్గొన్నారు. 8. 2012లో బరాక్ ఒబామా, మిట్ రోమ్నీల మధ్య జరిగిన చర్చ అత్యధిక అమెరికన్లు వీక్షించిన చర్చగా నిపుణులు చెబుతారు. కార్టర్, రీగన్ చర్చను 4.58 కోట్ల కుటుంబాలు చూడగా... ఒబామా, రోమ్నీల చర్చను 4.62 కోట్ల కుటుంబాల్లో చూశారని వారు వివరిస్తారు. 2016లో హిల్లరీ, ట్రంప్ డిబేట్ను 8.4 కోట్ల మంది వీక్షించారు. 9. 2008 నాటి అధ్యక్ష అభ్యర్థుల చర్చలో తొలిసారి యూట్యూబ్, ట్విట్టర్ల ద్వారా అమెరికన్ పౌరులు నేరుగా అభ్యర్థులను ప్రశ్నలు అడగటం మొదలైంది. 2016 నాటి ప్రైమరీ ఎన్నికల్లో ఫేస్బుక్ ద్వారా అభ్యర్థులపై ప్రశ్నలు సంధించారు. -
కరోనా దేవుడిచ్చిన వరం : ట్రంప్
వాషింగ్టన్: కరోనా మహమ్మారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో వింత వ్యాఖ్యలు చేశారు. కరోనా మామూలు ఫ్లూ లాంటిదే అంటూ ప్రకటించి వివాదాన్ని రేపిన ట్రంప్ తాజాగా మరో వివాదాన్ని రాజేశారు. తనకు కరోనా సోకడం దేవుడిచ్చిన వరమంటూ అభివర్ణించారు. కోవిడ్-19 పాజిటివ్ రావడంతో మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి కోలుకున్న తర్వాత ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కరోనా తనకు "దేవుని ఆశీర్వాదం" అని భావిస్తున్నానన్నారు. అందువల్లే దాన్ని నయం చేసే శక్తిమంతమైన డ్రగ్స్ గురించి తనకు తెలిసిందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ మందులను ఉపయోగించడం వల్ల అది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తన అనుభవంలోకి వచ్చిందన్నారు. (వైట్హౌస్కి కరోనా కాటు..) తనకు చికిత్స అందించిన వైద్యులపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అమెరికా పౌరులకు కూడా ఇదే స్థాయిలో ఉచితంగా చికిత్స అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు కరోనా విస్తరణపై డ్రాగన్ దేశంపై ఇప్పటికే పలుమార్లు మండిపడిన ట్రంప్ మరోసారి తన దాడిని ఎక్కు పెట్టారు. ప్రపంచానికి చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. చైనా చేసిన వైరస్కు అమెరికన్లు డబ్బులు చెల్లించాల్సిన పనిలేదంటూ విరుచుకుపడ్డారు. కాగ కరోనా మహమ్మారికి తీవ్రంగా ప్రభావితమైన దేశంగా అమెరికా నిలుస్తోంది. కరోనా విలయం కారణంగా ఇప్పటికే రెండు లక్షల పదివేలకుపైగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోతున్నారు. A MESSAGE FROM THE PRESIDENT! pic.twitter.com/uhLIcknAjT — Donald J. Trump (@realDonaldTrump) October 7, 2020 -
బాంబు పేల్చిన మైక్రోసాఫ్ట్!
వాషింగ్టన్: అమెరికా ఎన్నికలు ఇంకా నెలన్నర ఉండగానే హ్యాకర్ల బాంబు పేలింది. గత ఎన్నికల్లాగే ఈ ఎన్నికల్లోనూ విదేశీ హ్యాకర్లు తలదూర్చే ప్రమాదముందంటూ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ప్రధానంగా రష్యా, చైనా, ఇరాన్ల నుంచి ఎన్నికలకు ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ మళ్లీ గెలవాలని రష్యా కోరుకుంటే, కచ్చితంగా ట్రంప్ ఓడిపోవాలన్నది చైనా, ఇరాన్ ఆశ. 2016 తరహాలో ఈ సారి కూడా అమెరికా ఎన్నికల్లో విదేశీ హ్యాకర్లు రంగంలోకి దిగినట్టు ట్రంప్ ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ హెచ్చరికలు పంపింది. రష్యా, చైనా, ఇరాన్ నుంచి హ్యాకర్ల ముప్పు వాటిల్లుతోందని, ప్రజల తీర్పును తారుమారు చేసే వ్యూహం పన్నుతున్నాయని, విదేశీ హ్యాకర్లపై తమకు కచ్చితమైన ఆధారాలున్నాయన్న మైక్రోసాఫ్ట్ తెలిపింది. 2016 ఎన్నికల్లో డెమొక్రాట్ల ఆన్లైన్ క్యాంపెయిన్ అనూహ్యంగా దారి తప్పింది. డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సందేశాలు, వీడియో క్లిప్పులు, సోషల్ మీడియా మెసెజ్లు ఎంతగా ప్రయత్నించినా ఓటర్లకు చేరలేదన్న ఆరోపణలున్నాయి. దీని వెనక రష్యా హ్యాకర్ల హస్తం ఉందంటూ అప్పట్లో గగ్గోలు పెట్టారు డెమొక్రాట్లు. ఆ విషయం దర్యాప్తులో తేలకుండానే 2020 ఎన్నికలు వచ్చాయి. అధ్యక్ష పదవికి అభ్యర్థులు ఖరారై ప్రచారం ఊపందుకుంటున్న వేళ.. మైక్రోసాఫ్ట్ బాంబు పేల్చింది. ఇప్పటికే విదేశీ హ్యాకర్లు రంగంలోకి దిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది. డొనాల్డ్ ట్రంప్, బైడెన్ ప్రచారంపై సైబర్ రాడార్ పెట్టారని, 200 కంపెనీల సాయంతో రష్యా హ్యాకింగ్ చేస్తోన్నట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఇప్పటికే రంగంలోకి రష్యా కంపెనీ స్ట్రోంటియం గ్రూప్ దిగిందని, గతంలో బ్రిటన్ ఎన్నికల్లోనూ చిచ్చుబెట్టినట్టు స్ట్రోంటియం గ్రూప్పై ఆరోపణలున్నాయని తెలిపింది. స్ట్రోంటియం గ్రూప్ రష్యా ఇంటలిజెన్స్ సర్వీస్కు దగ్గరి సంబంధాలున్నాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అమెరికాకు చిరకాల ప్రత్యర్థి అయిన రష్యా ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చిచ్చు పెట్టబోతుందన్నది మైక్రోసాఫ్ట్ హెచ్చరిక. రష్యా ఇంటలిజెన్స్ సర్వీస్ జీఆర్యూ మిలిటరీ సర్వీసెస్కు అత్యంత సన్నిహితంగా మెలిగే సంస్థ స్ట్రోంటియం గ్రూప్. సైబర్ దాడులకు స్ట్రోంటియం గ్రూప్ పెట్టింది పేరు. ఇప్పుడిదే గ్రూప్ అమెరికాలోనూ ప్రజాభిప్రాయాన్ని తప్పుబట్టించే పనిలో పడిందన్నది మైక్రోసాఫ్ట్ వెల్లడించిన అంశం. ఇప్పటివరకు రష్యా కంపెనీ చేసిన సైబర్ అటాక్లను అడ్డుకున్నామని, అయితే ఇప్పుడు చైనా, ఇరాన్లు జత కలిసాయని, ఈ గ్రూప్ ఆట కట్టించకపోతే ఫలితాలు తారుమారయ్యే అవకాశముందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. పార్టీలు, నాయకులు వాడుతున్న సోషల్ మీడియా యాప్లో చాలా లొసుగులున్నాయని, సరిగ్గా ఇక్కడే రష్యా, చైనా, ఇరాన్ సైబర్ అటాక్ చేస్తున్నాయని తెలిపింది. జో బైడెన్ క్యాంపెయిన్లో కీలకంగా ఉన్న కొందరి ఈమెయిల్ అకౌంట్లను ఇప్పటికే హ్యాక్ చేశారని, ట్రంప్ దగ్గరి మనుషుల్లోనూ కొందరి ఈమెయిల్ హ్యాక్ అయ్యాయని తెలిపింది. అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలైన రష్యా, చైనా, ఇరాన్ ఈ విషయంలో ఒకరికొకరు సహకారం అందించుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే అమెరికా ఎన్నికలపై చైనా డేగ కన్ను వేసినట్టు గుర్తించారు. హ్యాకింగ్లో సిద్ధహస్తులైన తన కంపెనీ జిర్కోనియంను చైనా రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. విద్యార్థి వీసాల రూపంలో అమెరికాలో ఉంటోన్న పలువురిని జిర్కోనియం రంగంలోకి దించినట్టు గుర్తించారు. హ్యాకింగ్ ఉప్పందగానే అమెరికా దాదాపు వెయ్యి మంది చైనా విద్యార్థుల వీసాలు రద్దు చేసింది. హ్యాకింగ్కు ప్రయత్నిస్తున్న దేశాలు.. ప్రధానంగా అమెరికా ప్రముఖ సంస్థల రికార్డులను టార్గెట్ చేసినట్టు గుర్తించారు. ఇరాన్ కంపెనీ పాస్పరస్ కూడా చైనా, రష్యాలకు దీటుగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఒక అడుగు ముందుకేసి ఏకంగా వైట్హౌజ్ అధికారులపై ఇరాన్ నిఘా పెట్టినట్టు తెలిసింది. మే, జూన్ నెలల్లో ఇరాన్ కంపెనీ పాస్పరస్ ప్రయత్నాలు చేసిందని, ఈ ప్రయత్నాలను పసిగట్టినట్టు గూగుల్ కంపెనీ వెల్లడించింది. (చదవండి: ఏనుగు లేదా గాడిద.. ఎవరిది పైచేయి?!) రష్యా, చైనా, ఇరాన్.. మూడింటికి అమెరికా అంటే పీకలదాక కోపం ఉంది. ఇప్పుడు ఈ మూడు తమ కంపెనీలను రంగంలోకి దించాయి. చైనా కంపెనీ జిర్కోనియం ప్రముఖ సంస్థలను టార్గెట్ చేస్తే.. ఇరాన్ కంపెనీ పాస్పరస్ ఏకంగా వైట్ హౌజ్ అధికారుల ఖాతాలను తస్కరించినట్టు తెలిసింది. చైనా, ఇరాన్ చేసిన ప్రయత్నాలను తాము పసిగట్టినట్టు గూగుల్ కూడా వెల్లడించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ ఆరోపణలను రష్యా, చైనా వేర్వేరుగా ఖండించాయి. అమెరికా ఎన్నికలతో తమకు సంబంధం లేదంటూ రష్యా, చైనా, ఇరాన్ చెబుతున్నా.. అన్ని వేళ్లు మాత్రం ఆ మూడు దేశాలపైనే చూపిస్తున్నాయి. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీలో అత్యున్నత సైబర్ డిపార్ట్మెంట్ ఇప్పటికే వీటిపై దృష్టి పెట్టింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీలు ఇచ్చిన సమాచారాన్ని మరింత విశ్లేషించే పనిలో హోంలాండ్ అధికారులు పడ్డారు. మూడు దేశాలది అమెరికాపై కోపమే అయినా ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. రష్యా మరోసారి ట్రంప్ గెలవాలని కోరుకుంటోండగా, చైనా మాత్రం ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో గెలవద్దంటోంది. చైనా తరహాలోనే ఇరాన్ ఆలోచిస్తుంది. తమపై సైనిక దాడి చేసినందుకు ట్రంప్కు బుద్ధి చెప్పాలన్నది ఇరాన్ లక్ష్యం. ఎవరి టార్గెట్ ఎలా ఉన్నా.. ఇప్పటికే విలువైన కొంత సమాచారం హ్యాకర్లకు చిక్కినట్టు ఇంటలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. అగ్రరాజ్యమని చెప్పుకునే తమకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై హోంలాండ్ అధికారులు గుర్రుగా ఉన్నారు. హ్యాకర్ల ఆట పూర్తి స్థాయిలో కట్టించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. (చదవండి: నిజంగా అమెరికాలో ఆ పరిస్థితి ఉందా?) -
నవంబర్ 3కు రెండు రోజుల ముందే వ్యాక్సిన్!
వాషింగ్టన్: అక్టోబర్ సర్ప్రైజ్.. ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోట వినబడుతున్న మాట. అక్టోబర్లో అమెరికన్లకు కరోనాకు వ్యాక్సిన్ ఇస్తాడన్నది దీని అర్థం. ఈ ఒక్క వాక్సినే తనను రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోబెడుతుందన్నది ట్రంప్ ఆశ. మరి నిజంగా అమెరికాలో ఆ పరిస్థితి ఉందా? కరోనా అమెరికాను ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎంత దెబ్బ తీసింది? ప్రజలు ట్రంప్ తీసుకున్న చర్యలను హర్షిస్తారా? లేక బుద్ధి చెబుతారా? కరోనా చుట్టు తిరుగుతున్న అమెరికా ఎన్నికలు చివరికి ఎలాంటి ముగింపు పలుకుతాయి? అక్టోబర్ సర్ప్రైజ్గా మిగులుతుందా? లేక ట్రాజెడీగా మారుతుందా? అమెరికా ఎన్నికలపై కరోనా బలంగా ప్రభావం చూపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అమెరికాలో ఉగ్రవాదం కంటే కరోనానే ఎక్కువ ప్రమాదమన్న భావన వచ్చింది. దాదాపు 70లక్షల కరోనా కేసులు, 2 లక్షల మరణాలతో అమెరికా అతలాకుతలమయింది. ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ను అయితే కరోనా భారీగా దెబ్బతీసింది. కరోనాను అరికట్టడంలో ట్రంప్ సర్కారుపై చాలా మంది అమెరికన్లకు పీకల్దాక కోపముంది. ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్లో న్యూయార్క్తో పాటు చాలా రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం చేసింది. దాదాపు ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా ప్రభావం చూపింది. ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా సగటు అమెరికన్ను వణికించింది కరోనానే. అందుకే ఉగ్రవాదం కంటే పెద్ద ప్రమాదకారిగా కరోనాను చిత్రీకరించారు అమెరికన్లు. యూరోపియన్ దేశాల్లో కరోనాను కట్టడి చేసినట్టుగా అమెరికాలో ట్రంప్ వైరస్ను నియంత్రించలేకపోయారన్న విమర్శలున్నాయి. నవంబర్ 3న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దానికి రెండు రోజుల ముందుగానే వాక్సిన్ ఇస్తామన్న ధీమాలో ట్రంప్ ఉన్నారు. ఇప్పటికే వాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. దీని ద్వారా కరోనా భయం లేకుండా చేశానని ట్రంప్ చెప్పుకోవచ్చు. ప్రజల్లో నమ్మకం నింపే ఈ వాక్సిన్ ప్రయత్నంలో కొన్ని అవాంతరాలు ఉన్నాయి. ట్రంప్ క్యాంపెయిన్లో కీలక అస్త్రంగా భావిస్తున్న అక్టోబర్ సర్ప్రైజ్ వికటించవచ్చన్నది నిపుణుల అంచనా. హడావిడిగా అక్టోబర్లోనే అమెరికన్లకు కరోనా వాక్సిన్ ఇవ్వడం ఏమాత్రం శ్రేయస్కరం కాదంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యంతో ఆటలాడడం సరికాదని, అక్టోబర్ సర్ప్రైజ్ కాస్తా... అక్టోబర్ ట్రాజెడీగా మారే ప్రమాదముందంటున్నారు నిపుణులు. ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అసలుకే మోసం తేవచ్చని, పరిశోధనలు పూర్తి కాకుండా ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదముందంటున్నారు. (చదవండి: నవంబర్ నాటికి చైనా వ్యాక్సిన్) ఈసారి కరోనా ప్రభావం పోలింగ్పైనా ఉండొచ్చంటున్నారు. కరోనా కారణంగా అబ్సెంటీ బ్యాలెట్లు సకాలంలో చేరుకోకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లలేకపోయిన వారు అబ్సెంటీ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా కారణంగా ఫ్లోరిడా రాష్ట్రంలో అబ్సెంటీ బ్యాలెట్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఈ ఎన్నికల్లో ఫ్లోరిడా ఫలితాలు రావడానికి రాత్రి 10 గంటలు దాటొచ్చని భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఇదే ఫ్లోరిడా కారణంగా అధ్యక్ష ఫలితాలు ఏకంగా నెల ఆలస్యమయ్యాయి. పోటాపోటీగా సాగిన రీకౌంటింగ్లో అప్పట్లో జార్జ్ బుష్ కేవలం 537 ఓట్లతో ఆల్గోరెను వెనక్కి నెట్టాడు. ఈ సారి కూడా అదే పరిస్థితి కరోనా కారణంగా అబ్సెంటీ బ్యాలెట్తో రావచ్చంటున్నారు. (చదవండి: 1,000 రెట్లు ఎక్కువ ప్రతీకారం తీర్చుకుంటాం) -
ట్రంప్ బాధ్యతారాహిత్యం
ఊహించని రీతిలో మాట్లాడటం... అందరినీ బెదరగొట్టే నిర్ణయాలు అలవోకగా చేయడం, పెను దుమారం రేపడం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు అలవాటు. మరో నాలుగు నెలల్లో జరగాల్సిన దేశాధ్యక్ష ఎన్నికలను వాయిదా వేస్తే మంచిదంటూ గురువారం ఆయన చేసిన ట్వీట్ అమెరికాలో ఆ మాదిరి దుమారాన్నే సృష్టించింది. ఈలోగా తన ఉద్దేశం అదికాదంటూ ఆయన శుక్రవారం మరో ట్వీట్ చేశారు. మెయిల్ ద్వారా జరిగే ఓటింగ్లో అవకతవకలు జరగొచ్చునన్న అనుమానం మాత్రమే వ్యక్తం చేశానని, ఎన్నికలైన మూడు నెలల తర్వాత అవకతవకలు జరిగాయని తెలుసుకుంటే దేశం ఇబ్బందికర పరిస్థితుల్లో పడుతుంది గనుక ముందే దానిపై అప్రమత్తం చేశానని తాజాగా ట్రంప్ చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికలను అడ్డుకోవడం ఆయన తరంకాదని ఢంకా బజాయిస్తున్న వారున్నట్టే... ట్రంప్ ఏదో ఒకటి చేసి వీటిని ఆపే అవకాశం వుందని భయపడేవారున్నారు. కరోనా మహమ్మారి విరుచుకుపడటం మొదలుపెట్టిననాటినుంచి డెమొక్రాట్లలో చాలామంది ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో ఒక సాకు చూపి ఆయన ఎన్నికల వాయిదా వేసే ప్రమాదం లేకపోలేదని వారు చెబుతూ వచ్చారు. అయితే అధ్యక్షుడి ఇష్టాయిష్టాలను అనుసరించి అధ్యక్ష ఎన్నికలు జరగవు. 1788లో తొలి ఎన్నికలు జరిగిననాటినుంచీ అవి క్రమం తప్పకుండా నవంబర్ 3నే జరుగుతున్నాయి. కనుకనే ట్రంప్ ధోరణి డెమొక్రాట్లకు మాత్రమే కాదు... రిపబ్లికన్లకు కూడా విపరీతమే అనిపించింది. అనేకమంది రిపబ్లికన్లు ఎన్నికల వాయిదాను ఎలా కోరతారంటూ ట్రంప్ను నిలదీశారు. ఇందువల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని వారి ఆందోళన. వివిధ సర్వేల్లో తన డెమొక్రాటిక్ ప్రత్యర్థి జో బైడన్ కంటే ఆయన బాగా వెనకబడివున్నారు. ఎటూ దాపురించబోయే ఆ ఓటమికి ముందే కొన్ని కారణాలను వెదుక్కుంటే మంచిదన్న నిర్ణయానికి రావడం వల్లే ఆయన ఆ మాట అని వుండొచ్చు. కానీ అది ఆశించిన ఫలితం ఇచ్చే అవకాశం కనబడకపోగా, సొంత పార్టీలోనే బెడిసికొట్టింది. దాంతో ట్రంప్ వెనక్కి తగ్గారు. మెయిల్ ఇన్ ఓటింగ్ విధానం ఎందుకు చెడ్డదో, ఆ ప్రక్రియలో అవకతవకలు ఎలా చోటుచేసుకుంటాయని అనుకుంటున్నారో ఆయన సరిగా చెప్పలేదు. కాలిఫోర్నియా, కొలరాడో, హవాయి, ఒరెగాన్, ఉతా, వెర్మాంట్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ అమలవుతోంది. 2000 సంవత్సరంలో ఒరెగాన్ తొలిసారి ఈ విధానాన్ని అమలు చేయగా, అనంతరకాలంలో మరో ఆరు రాష్ట్రాలు దాన్ని అనుసరించాయి. ఈ రాష్ట్రాల్లోని రిజిస్టర్డ్ ఓటర్లకు ప్రభుత్వాలే బ్యాలెట్ పేపరు మెయిల్ చేస్తాయి. తమకిష్టమైన అభ్యర్థిని ఎంచుకుంటూ ఓటేశాక, ఆ బ్యాలెట్ పేపర్లను ఓటర్లు తిరిగి మెయిల్ చేయొచ్చు. లేదా నిర్దేశించిన కేంద్రాలకు స్వయంగా వెళ్లి బ్యాలెట్ బాక్సుల్లో వేయొచ్చు. ఒరెగాన్ ఉదాహరణే తీసుకుంటే అక్కడ ఇంతవరకూ పదికోట్ల బ్యాలెట్లు మెయిల్ చేస్తే అందులో కేవలం 12 సందర్భాల్లో మాత్రమే అక్రమాలు జరిగాయన్న ఆరోపణలొచ్చాయి. గత 20 ఏళ్లలో మొత్తం 25 కోట్ల బ్యాలెట్లు మెయిల్ చేయగా అందులో 0.00006 శాతం మేర అక్రమమైనవి వున్నాయని తేలింది. రిపబ్లిన్లు సైతం ఎప్పుడూ అక్రమాలకు సంబంధించి ఆరోపణలు చేయలేదు. కనుక ఇప్పుడు హఠాత్తుగా అవకతవకల గురించి ప్రస్తావన తీసుకురావడం వెనక తాను నెగ్గే అవకాశం లేని ఎన్నికలపై అందరిలోనూ ముందుగా అనుమాన బీజాలు నాటడమే ట్రంప్ ప్రధాన ధ్యేయంగా కనబడుతోంది. అయితే అమెరికా రాజ్యాంగంలో ఎన్నికలను ఆలస్యం చేయడానికి లేదా రద్దు చేయడానికి అధ్యక్షుడికి ఎలాంటి అధికారాలూ లేవు. ఆ నిబంధనను సవరించి, దాన్ని నెగ్గించుకోగల బలం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు లేదు. సెనేట్లో రిపబ్లికన్లకు బలం వున్నమాట వాస్తవమే అయినా, వారిలో చాలామంది ట్రంప్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతికూలతలన్నీ అధిగమించి ఒకవేళ ఎన్నికలు వాయిదా వేయగలిగినా ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తమ పదవుల్లో కొనసాగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇరవయ్యో రాజ్యాంగ సవరణ ప్రకారం జనవరి 20వ తేదీ మధ్యాహ్నంతో వారి పదవీకాలం ముగుస్తుంది. ఒకవేళ ట్రంప్ కోరికే నెరవేరి ఎన్నికలు వాయిదాపడినా, రద్దయినా అధ్యక్ష, ఉపాధ్యక్ష బాధ్యతలు ఎవరు చూస్తారన్నది చెప్పడం కష్టం. అదంతా అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. దానికి సంబంధించిన నిబంధనలున్నా వాటి అవసరం ఇంతవరకూ ఎప్పుడూ రాలేదు. కనుకనే ట్రంప్ను నెత్తిన పెట్టుకు మోస్తున్న రిపబ్లికన్లుగానీ, అధ్యక్ష భవనం వైట్హౌస్ ప్రతినిధులుగానీ ఎన్నికల వాయిదా విషయంలో ట్రంప్కు అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడటానికి సిద్ధపడలేకపోయారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఏటికి ఎదురీదుతోంది. 30వ దశకంనాటి మహా మాంద్య పరిస్థితులు ఆ దేశాన్ని ఇప్పుడు చుట్టుముట్టాయి. వినియోగిత బాగా పడిపోయింది. వ్యాపారం దెబ్బతింది. ఇదంతా మళ్లీ నిలబడుతుందని అందరూ ఆశిస్తుండగానే కొత్తగా బయటపడుతున్న కరోనా కేసులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మొత్తంగా అయిదేళ్ల వృద్ధి తుడిచిపెట్టుకుపోయింది. రెండో దఫా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించండంటూ వైట్హౌస్ పైనా, కాంగ్రెస్పైనా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. జీడీపీ దారుణంగా పడిపోయిందన్న తాజా గణాంకాలకు తోడు ట్రంప్ చేసిన ట్వీట్ పర్యవసానంగా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కరోనా స్వైరవిహారం మొదలయ్యాక ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన 3 లక్షల కోట్ల ప్యాకేజీ ద్వారా వేలాది కంపెనీలు తమ ఉద్యోగులకు ఇన్నాళ్లుగా వేతనాలిస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోయినవారికి వారానికోసారి 600 డాలర్ల నిరుద్యోగ భృతి ఇస్తున్నాయి. శనివారంతో ఇది నిలిచిపోయింది. ఈ తరుణంలో దేశాధినేతగా ఎంతో బాధ్యతగా మెలగాల్సిన ట్రంప్ మరింత అస్థిరతకు తావిచ్చేలా ప్రవర్తించారు. ఇది ప్రమాదకరమైన ధోరణి. -
అమెరికా గడ్డపై 14 భారతీయ భాషల్లో ప్రచారం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ను ఢీకొంటున్న జో బిడెన్ ప్రచార కార్యక్రమం ఇండో-అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేలా రూపొందింది. అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపే ఇండో-అమెరికన్ ఓటర్లను చేరుకునేందుకు 14 భాషల్లో జో బిడెన్ ప్రచార కార్యక్రమాన్ని పకడ్బందీగా ప్లాన్ చేశారు. కీలక రాష్ట్రాల్లో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల గెలుపు అవకాశాలను భారత సంతతికి చెందిన ఓటర్లు నిర్ధేశించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన ఇండో-అమెరికన్ ఓటర్ల కోసం జో బిడెన్ ఆకట్టుకునే నినాదాలతో ముందుకొచ్చారు. ‘అమెరికా కా నేత..కైసా హో, జో బిడెన్ జైసా హో’ ( అమెరికా అధినేత బిడెన్లా ఉండాలి) అంటూ హిందీ, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో నినాదాలతో హోరెత్తించనున్నారు. చదవండి : అధ్యక్ష ఎన్నికల వాయిదాకు సంకేతాలు 2016లో ఆబ్ కీ ట్రంప్ సర్కార్ ( ఈసారి ట్రంప్ ప్రభుత్వం) నినాదం భారతీయుల మనసును తాకిన క్రమంలో డెమొక్రటిక్ పార్టీ ప్రచారాన్ని ఏకంగా 14 భారతీయ భాషల్లో చేపట్టేందుకు జో బిడెన్ క్యాంపెయిన్ వ్యూహకర్తలు సంసిద్ధమయ్యారు. ఇండో-అమెరికన్ ఓటర్లను వారి మాతృభాషలోనే చేరువయ్యేందుకు ప్రణాళికలు రూపొందించామని బిడెన్ క్యాంపెయిన్ బృందంలో ఒకరైన అజయ్ భుటోరియా తెలిపారు. తెలుగు, హిందీ, పంజాబీ, తమిళ్, బెంగాలీ, ఉర్దూ, కన్నడ, మళయాళీ, ఒరియా, మరాఠీ, నేపాలీ సహా 14 భాషల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు జో బిడెన్ ప్రచార బృందంతో అజయ్ కసరత్తు సాగిస్తున్నారు. భారత్లో హోరెత్తే ఎన్నికల ప్రచారాన్ని చూసిన అనుభవంతో జో బిడెన్ క్యాంపెయిన్లో ఆ సందడి ఉండేలా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. అమెరికాలో నివసించే ఇండో-అమెరికన్ ఓటర్లలో ఆ ఉత్సుకత కనిపించేలా ‘అమెరికా కా నేత..కైసా హో, జో బిడెన్ జైసా హో’ నినాదాన్ని ముందుకుతెచ్చామని తెలిపారు. నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్తో డెమొక్రటికక్ అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్ తలపడనున్నారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో జో బిడెన్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ తరపున జో బిడెన్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారయ్యింది. అధ్యక్ష పోటీకి అవసరమైన 1993 మంది ప్రతినిధులు మద్దతు బిడెన్కు లభించింది. అలాగే, అదే పార్టీకి చెందిన బెర్ని శాండర్స్ సైతం ఏప్రిల్లో పోటీ నుంచి తప్పుకోవడంతో బిడెన్కు మార్గం సుగమం అయ్యింది. దీంతో డెమొక్రట్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్తో మాజీ ఉపాధ్యక్షుడు బిడెన్ నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తలపడనున్నారు.(నిరుద్యోగరేటుకు ఫ్లాయిడ్కు ముడి.. ట్రంప్పై ఆగ్రహం) 77 ఏళ్ల బిడెన్ 36 ఏళ్ల నుంచి సెనేటర్గా కొనసాగుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి మూడోసారి ప్రయత్నించి విజయం సాధించారు. గతంలో రెండుసార్లు పోటీపడినా డెమొక్రాట్ల మద్దతు పొందలేకపోయారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బిడెన్ 2009 నుంచి 2017 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. త్వరలో జో బిడెన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రతినిధులు తనకు మద్దతు ఇవ్వడంపై జో బిడెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ‘అధ్యక్ష పదవి కోసం జరిగే యుద్ధంలో విజయం సాధించడానికి దేశవ్యాప్తంగా ఉన్న అమెరికన్ల ఓట్లను సంపాదించడానికి ఇక రోజూ ప్రయత్నిస్తా. ఇప్పుడు మనకు గౌరవం తెచ్చే ఉద్యోగాలు కావాలి.ప్రతి అమెరికన్కు సమన్యాయం జరగాలి. కరోనా నేపథ్యంలో కుంచించుకుపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.. వారి అవసరాలు తీర్చి, సహాయపడే ఒక అధ్యక్షుడు కావాలి’ అని పేర్కొన్నారు. దేశం గతంలో ఎన్నడూ చూడని నిరుద్యోగాన్ని చవి చూస్తోందని,1960 తర్వాత అంతటి స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ట్రంప్పై పరోక్షంగా విమర్శించారు. (కరోనాతో దావూద్ ఇబ్రహీం మృతి..!) -
ఎన్నికల వాయిదా సమస్యే లేదు: ట్రంప్
వాషింగ్టన్: ముందుగా అనుకున్న ప్రకారం నవంబర్ 3వ తేదీనే ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరుగుతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్లో మార్పులు ఉంటాయా అన్న విలేకర్ల ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇచ్చారు. ‘ఏదేమైనా అధ్యక్ష ఎన్నికల తేదీల్లో మార్పులు ఉంటాయని నేననుకోవడం లేదు. అలా ఎందుకు చేయాలి? నవంబర్ 3 మంచి తేదీ’ అని వైట్హౌజ్లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. కాగా, కోవిడ్ క్లిష్ట సమయాల్లో అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికలు వాయిదా వేసే విషయమై ఆలోచించాలని ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న జో బిడెన్ గతవారం కోరిన సంగతి తెలిసిందే. (చదవండి: టాప్–3లో భారత్) -
ఇన్స్టాగ్రామ్ ‘ప్లేబాయ్’ కీలక నిర్ణయం!
వాషింగ్టన్ : ఎల్లప్పుడు చుట్టూ అందమైన అమ్మాయిలతో విలాసవంతమైన పార్టీలతో కాలక్షేపం చేసే ‘ప్లేబాయ్’గానే కాకుండా, ప్రముఖ సోషల్ మీడియా ‘ఇన్స్టాగ్రామ్’ కింగ్గా గుర్తింపు పొందిన డేన్ బిల్జేరియన్ 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ఓ విదేశీ పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. రానున్న ఎన్నికల్లో మాత్రం హిల్లరీ క్లింటన్పై పోటీచేసే కన్యే వెస్ట్కే ఓటు వేస్తానని ఆయన అన్నారు. నాపైనే కన్యే వెస్ట్ పోటీ చేస్తారని భావిస్తున్నానని పగలబడి నవ్వుతూ చెప్పారు. నిజంగా 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా, ముమ్మాటికి అని చెప్పలేనుగానీ, ఇంకా చాలా సమయం ఉన్నందున అప్పటికీ అన్నివిధాల సిద్ధం కావచ్చని భావిస్తున్నానని ఇన్స్టాగ్రామ్లో 2.9 కోట్ల మంది అభిమానులున్న బిల్జేరియన్ తెలిపారు. అమెరికా, ఫ్లోరిడాలోని టంపాలో జన్మించిన బిల్జేరియన్కు 38 ఏళ్లు. విలాసవంతమైన సొంత పడవ (యాట్)లో మిస మిసలాడే భామలతో కులుకుతూ, మిత్రులతో గడుపుతూ, పరిచారక బృందం సేవల మధ్య సుందర సముద్ర తీరాల వెంట తిరుగుతూ, దీవుల్లోని విలాసవంతమైన భవనాల్లో బస వేస్తూ, విందు వినోదాల్లో తేలిపోవడం, వాటి తాలూకు ఫొటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ఆయనకు సరదా. ఇప్పుడు అదే వృత్తి కూడా. ఆయనకు అమెరికాలో ఉన్న మూడు విలాసవంతమైన ఇళ్ల పరిసరాల్లో కూడా ఆయన ముద్దగుమ్మలతో నడిపే శృంగార లీలల గురించి గుసగుసలు ఎక్కువగానే వినిపిస్తుంటాయి. పుట్టుకతోనే ధనవంతుడైనప్పటికీ బిల్జేరియన్ ‘పోకర్ స్టార్’గాను, పలు వ్యాపారాల ద్వారాను అంతులేని సంపదనను సమకూర్చుకున్నారు. ‘లోన్ సర్వైవర్’ అనే హాలీవుడ్ సినిమాను కూడా నిర్మించారు. ఇప్పటిలాగే ఖర్చు పెట్టినా రెండు, మూడు జన్మల వరకు ఆయన సంపద తరగదు. డబ్బే కాకుండా మంచి శరీర సౌష్టవంతో ఆకర్షణీయంగా ఉండడం ఆయన వెంట అమ్మాయిలు పడడానికి మరో కారణం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బిల్జేరియన్ మద్దతిస్తానంటున్న కన్యే వేస్ట్ ప్రముఖ అమెరికా పాప్ సింగరే కాకుండా అమెరికా ప్రముఖ మోడల్, టీవీ ప్రెజంటర్, వ్యాపార వేత్త కిమ్ కర్దాషియిని భర్త. అమెరికా ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తానన్న విషయం ఆయన ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కంటే డొనాల్డ్ ట్రంప్నే ఇష్టపడతానని బిల్జేరియన్ 2016 ఎన్నికలకు ముందే చెప్పారు. అప్పటికే ఆయనకు ట్రంప్తో పరిచయం ఉంది. పరిచయం ఉన్న వ్యక్తిగా కాకుండా రాజకీయాల్లో ఇంకా రాటుదేలని వ్యక్తిగా, రాజకీయాల్లో మొరటువాడిగా భావించి, అలాంటి వారయితే దేశం కోసం అంతో, ఇంతో కృషి చేస్తారని భావించి సమర్థించినట్లు ఫలితాల అనంతరం లారీ కింగ్ అనే జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. -
అమెరికాను గొప్పగా చేస్తా
వాషింగ్టన్: దేశాభివృద్ధికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న తన అజెండాను పూర్తి చేయడం కోసం తనకు మరో నాలుగేళ్లు అవకాశం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు విజ్ఙప్తి చేశారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్న ట్రంప్ మంగళవారం ఫ్లోరిడాలో జరిగిన భారీర్యాలీలో అధికారికంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికలకు ‘కీప్ అమెరికా గ్రేట్’ అన్న కొత్త నినాదాన్ని ట్రంప్ ఖాయం చేశారు. ‘అమెరికాకు రెండో సారి అధ్యక్షుడు కావడం కోసం అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం కోసం మీ ముందుకొచ్చా. మిమ్మల్ని ఎన్నడూ తలదించుకునేలా చేయనని హామీ ఇస్తున్నా’ అని 73 ఏళ్ల ట్రంప్ తన మద్దతుదారులనుద్దేశించి అన్నారు. ఈ ర్యాలీకి 20 వేల మందికిపైగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికే కన్నుకుట్టేంతగా ఎదిగిందని అన్నారు. దేశాన్ని నాశనం చేయాలని చూస్తే సహించేది లేదని ప్రతిపక్ష డెమోక్రాట్లను హెచ్చరించారు. మూడేళ్ల క్రితం తాను సాధించిన విజయం అమెరికా చరిత్రలోనే సువర్ణ ఘట్టమన్నారు. అమెరికా ఫస్ట్ విధానాన్ని కొనసాగిస్తానని, వలస విధానాలను కఠినతరం చేస్తానని, రక్షణ వ్యయాన్ని పెంచుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. తన హయాంలో దేశం గణనీయమైన పురోగతి సాధించిందని, వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే ఆ అభివృద్ధి అంతా ఆగిపోతుందని 80 నిముషాల తన ప్రసంగంలో ట్రంప్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. ‘మనం నిరంతరం ముందుకెళ్తున్నాం. పోరాడుతున్నాం. గెలుస్తున్నాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ సతీమణి మెలానియాసహా ఆయన కుటుంబ సభ్యులు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ట్రంప్ ప్రసంగిస్తుండగా ‘మరో 4 సంవత్సరాలు’ అన్న నినాదాలతో ర్యాలీ దద్దరిల్లింది. దేశాన్ని సామ్యవాదంవైపు నెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అమెరికాను ఎప్పటికీ సామ్యవాద దేశం కానీయనని హామీ ఇచ్చారు. ఈ రెండున్నరేళ్లతో తాము చేసినంత అభివృద్ధి ఇంకెవరూ చేయలేదన్నారు. అక్రమల వలసలను కఠినంగా అణిచివేస్తామని ఉద్ఘాటించారు. ‘తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు డెమోక్రాట్లు అక్రమ వలసలను చట్టబద్ధం చేయాలంటున్నారు. డెమోక్రాట్లు దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు’ అని అన్నారు. ట్రంప్ వైఫల్యాలను తాము ఎత్తిచూపుతామని డెమోక్రటిక్ నేషనల్ కమిటీ సభ్యుడు జాన్ సాంతోస్ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, వలసవిధానాలు, ముస్లింలపై నిషేధం వంటి ట్రంప్ నిర్ణయాలు ఇక్కడి దక్షిణాసియా ప్రజల జీవితాల్ని దుర్భరం చేశాయన్నారు. 2020 నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జోయ్ బిడెన్సహా దాదాపు పాతిక మంది ప్రయత్నిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎంపికకు సంబంధించిన ప్రైమరీ ప్రక్రియ వచ్చే ఏడాది మొదలుకానుంది. -
అధ్యక్ష ఎన్నికల్లో ఎమర్సన్ విజయం
హరారే : జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్–పేట్రియాటిక్ ఫ్రంట్ (జాను-పీఎఫ్)పార్టీ విజయం సాధించింది. ప్రస్తుత అధ్యక్షుడు ఎమర్సన్ మునగాగ్వా(75) విజయం సాధించారని దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎమర్సన్ మునగాగ్వాకు 50.8 శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష నాయకుడు నెల్సన్ చమీసాకు 44.3 శాతం ఓట్లు వచ్చాయి. 50 శాతానికి పైగా స్వల్ప ఓట్లు సాధించటంతో రెండో దఫా ఎన్నికలను ఎమర్సన్ మునగాగ్వా తప్పించుకున్నారు. రెండోసారి జింబాబ్వే అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జింబాబ్వే ప్రజలకు ఎమర్సన్ కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ సమయంలో ప్రజలు వర్గాలుగా విభజించబడినా.. మనందరి కలలను సాకారం చేసుకోవడానికి ఐకమత్యంతో కలుసుందామని పిలుపునిచ్చారు. ఇదో కొత్త ఆరంభం అంటూ అభివర్ణించారు. ప్రేమ, శాంతి, ఐకమత్యంతో అందరం కలిసి కొత్త జింబాబ్వేని నిర్మిద్దామని ట్విట్టర్లో పేర్కొన్నారు. Thank you Zimbabwe! I am humbled to be elected President of the Second Republic of Zimbabwe. Though we may have been divided at the polls, we are united in our dreams. This is a new beginning. Let us join hands, in peace, unity & love, & together build a new Zimbabwe for all! pic.twitter.com/FbdrixAktR — President of Zimbabwe (@edmnangagwa) August 2, 2018 గతేడాది నవంబర్లో జింబాబ్వేను 37 ఏళ్ల పాటు పరిపాలించిన రాబర్ట్ ముగాబేను పదవి నుంచి తొలగించిన తర్వాత ఆ దేశంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవే. ఈ ఎన్నికల్లో అధికార జాను-పీఎఫ్ పార్టీకి 144 స్థానాలు, ఎండీసీ కూటమికి 64 స్థానాలు, నేషనల్ పాట్రియాటిక్ ఫ్రంట్కు ఒక స్థానం లభించాయి. -
మెక్సికోకు వామపక్ష అధ్యక్షుడు
మెక్సికో సిటీ: ఆధునిక మెక్సికో చరిత్రలో తొలిసారిగా ఓ వామపక్ష నాయకుడు ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. దాదాపు గత శతాబ్ద కాలంగా మెక్సికోను పాలిస్తున్న రెండు పార్టీ లను కాదని ఆ దేశ ప్రజలు ఈసారి వామపక్ష పార్టీకి పట్టంగట్టారు. 2014లో మొరెనా పార్టీని స్థాపించిన ఆమ్లో (ఆండ్రస్ మ్యాన్యువల్ లోపెజ్ ఆబ్రడార్)కు తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 53 శాతం ఓట్లు వచ్చాయి. ఆధునిక కాలపు మెక్సికో ఎన్నికల్లో ఓ అభ్యర్థికి 50 శాతానికి మించి ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఇన్నేళ్లూ పాలించిన నేషనల్ యాక్షన్ పార్టీ (పీఏఎన్), ఇన్స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ (పీఆర్ఐ)లు వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. తీవ్ర అవినీతి, మితిమీరిన హింస, మత్తుపదార్థాలు తదితర సమస్యలతో విసిగిపోయిన మెక్సికన్లు తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను తిరస్కరించారు. విజయానంతరం ఆమ్లో ప్రసంగిస్తూ ‘ఇదో చరిత్రాత్మకమైన రోజు. ఈ రాత్రి ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని అన్నారు. వెనుజులా అనుసరిస్తున్న విధానాలనే ఆమ్లో మెక్సికోలో అమలుచేసి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తారంటూ విమర్శకులు వ్యక్తం చేసిన భయాలను ఆయన కొట్టిపారేశారు. అవినీతిని నిర్మూలించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన చెప్పగా, మత్తు పదార్థాల వ్యాపారులకు ప్రభుత్వంలోని పెద్దలు, సైన్యంతో సంబంధాలు ఉన్నందున అవినీతిని రూపుమాపడమనేది ఆమ్లో ముందున్న అతిపెద్ద సవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆమ్లో డిసెంబరులో అధ్యక్షపదవి చేపట్టనున్నారు. పార్టీ స్థాపించాక తొలి ఎన్నికలోనే గెలుపు ఆమ్లో గతంలోనూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2014లో తన సొంత పార్టీ మొరెనా (నేషనల్ రీజనరేషన్ మూవ్మెంట్)ను స్థాపించిన అనంతరం తొలిసారి పోటీచేసిన ఎన్నికల్లోనే గెలుపొందడం గమనార్హం. 1953లో జన్మించిన ఆమ్లోకు దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. మెక్సికోలో ప్రస్తుత అధికార పార్టీ పీఆర్ఐలో 1976లో చేరి ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980ల చివర్లో ఆయన మరో పార్టీలో చేరి గవర్నర్ సహా పలు ఎన్నికల్లో పోటీచేశారు. 2000లో మెక్సికో సిటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాగా, మంచి వక్తగా ఆమ్లో పేరుతెచ్చుకున్నారు. -
టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో ఎర్డోగన్ గెలుపు
ఇస్తాంబుల్: టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ(ఏకేపీ) అభ్యర్థి రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్(64) మరోసారి ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఎర్డోగన్కు 52.5 శాతం ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి ముహర్రెమ్ ఇన్సేకు 30.6 శాతం ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో 87 శాతం మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎర్డోగన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినట్లు సుప్రీం ఎలక్షన్ కమిటీ ప్రకటించడంతో టర్కీ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. తాజా ఎన్నికలతో ఎర్డోగన్ మరో ఐదేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. కాగా, అధ్యక్ష ఎన్నికలతో పాటు పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లోనూ ఎర్డోగన్కు చెందిన ఏకేపీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. 600 సీట్లున్న టర్కీ పార్లమెంటులో ఏకేపీ పార్టీ 293 స్థానాలను దక్కించుకోగా, మిత్రపక్షం ఎంహెచ్పీ 50 సీట్లలో విజయం సాధించింది. -
వీహెచ్పీ నుంచి వైదొలగిన తొగాడియా
గుర్గావ్: గత మూడు దశాబ్దాలుగా విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ)లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రవీణ్ తొగాడియా ఆ సంస్థ నుంచి పూర్తిగా వైదొలిగారు. వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్ష పదవికి శనివారం జరిగిన ఎన్నికల్లో ఆయన నామినేట్ చేసిన రాఘవరెడ్డి ఓడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తొగాడియా 2011 నుంచి వీహెచ్పీకి ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. వీహెచ్పీ కొత్త ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా హిమాచల్ప్రదేశ్ మాజీ గవర్నర్ వీఎస్ కోక్జె ఎన్నికయ్యారు. ఆయనకు 131 ఓట్లు రాగా, ప్రస్తుత అధ్యక్షుడు రాఘవరెడ్డికి 60 ఓట్లు దక్కాయి. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత ఈ పదవికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తొగాడియా ఆరోపించారు. వీహెచ్పీ నుంచి వైదొలిగినా హిందువుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. -
ఓప్రాపై విరుచుకుపడ్డ ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా మీడియా మొఘల్ ఓప్రా విన్ఫ్రేపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. అభద్రతా భావంతో ఉన్న తనపై ఆమె ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఆమె గనుక అధ్యక్ష ఎన్నికల్లో గనుక పోటీచేస్తే చిత్తుగా ఓడించి తీరతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. మీడియా ఎంట్రపెన్యూర్, టెలివిజన్ సలహాదారు అయితే ఓప్రా విన్ఫ్రీ ప్రస్తుతం సీబీఎస్ ప్రోగ్రామ్కు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ ఏడాది పాలనపై ఆమె ప్రజా వేదికలను ఏర్పాటు చేసి చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ట్రంప్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా.. ఆయన స్పందించారు. ‘ఓఫ్రా నాకు బాగా తెలుసు. గతంలో ఆమె నన్ను ఇంటర్వ్యూ చేయటంతో ఆమెను దగ్గరగా పరిశీలించాను. అందులో ఆమె అడిగిన ప్రశ్నలన్నీ పక్షపాతంగానే ఉన్నాయి. ఆమె చేస్తున్న ఆరోపణలు అసంబంద్ధమైనవి. అసత్య ఆరోపణలతో ఆమె ప్రజలను ఆకర్షించాలని చూస్తోంది. ఒకవేళ ఆమె గనుక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే మిగతా వాళ్ల మాదిరే ఓడిపోవటం ఖాయం’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ఊహగానాలు మీడియాలో ఊపందుకున్నాయి. దీనికి తోడు ఆమె సన్నిహితులు కూడా ఆమె పోటీ చేస్తారనే చెబుతున్నారు. కానీ, తొలుత ఈ వార్తలను ఖండించిన ఓప్రా.. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రసంగంలోనూ ఆ విషయంపై స్పష్టత ఇచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆమె మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ట్రంప్ కూడా గతంలో ఆమె పోటీ చేయనున్న అంశంపై స్పందిస్తూ... ఆమె అంత సాహసం చేస్తుందని తాను అనుకోవటం లేదని వ్యాఖ్యానించారు. -
‘ఎఫ్బీఐ మెమో బహిర్గతం చేయండి’
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఎఫ్బీఐ జరిపిన దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగలేదంటూ రూపొందించిన ఒక రిపబ్లికన్ మెమోను సంపూర్ణంగా బహిర్గతం చేసేందుకు శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ మెమో బహిర్గతం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎఫ్బీఐ డైరెక్టర్ చేసిన హెచ్చరికలను సైతం డొనాల్డ్ ట్రంప్ పక్కనబెట్టారు. ఈ సందర్భంగా ఎఫ్బీఐ సీనియర్ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘చాలామంది సిగ్గుపడాల్సి ఉంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు డెవిన్ న్యూన్స్ ఈ మెమోను రూపొందించారు. ఎలాంటి మార్పులూ చేయకుండానే ఈ మెమోను విడుదల చేయాలని ట్రంప్ ఆదేశించినట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. -
సరిగ్గానే వేశా: యాదయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు సరిగ్గానే వేశానని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మీడియా అంటే తనకు గౌరవం ఉం దని, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయ వద్దన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ.. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, పార్టీ ఆదేశాల మేరకు తన ఓటును రహస్యంగానే వేశానన్నారు. మీడియాలో ప్రచా రమైనట్లుగా తాను తప్పుగా ఓటు వేయలేదని, రెండో బ్యాలెట్ పేపర్ కూడా అడగలేదన్నారు. ఈ విషయంలో అధిష్టానం తననేమీ అడగలే దని, తనకు తానుగా ప్రతిస్పందిస్తున్నానని ఎమ్మెల్యే యాదయ్య పేర్కొన్నారు. -
ఏకపక్షంగా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్
- అందరి మద్దతు ఎన్డీయే అభ్యర్థి కోవింద్కే.. - కాంగ్రెస్కు ప్రాతినిధ్యం కరువు - మధ్యాహ్నం 2 గంటలకే 100 శాతం పోలింగ్ నమోదు - ఓటు హక్కు వినియోగించుకున్న 174 మంది ఎమ్మెల్యేలు - మురిగిపోయిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లు? సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ఎన్నికలు రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిశాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేలందరూ సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన 174 మంది ఓటు వేశారు. రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీలు మూడూ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కే మద్దతు ప్రకటించడంతో పోలింగ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం చంద్రబాబునాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగా ఓటు వేశారు. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలసి ప్రత్యేక బస్సులో అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ఒకేసారి ఎక్కువమంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెండు కంపార్టుమెంట్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఐఏఎస్ అధికారి కౌల్దార్ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ తరఫున పోలింగ్ ఏజెంట్లుగా పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి (వైఎస్సార్సీపీ), మంత్రి కాల్వ శ్రీనివాసులు (టీడీపీ) పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని సంగతి తెలిసిం దే. పోలింగ్కు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నప్పటికీ మధ్యాహ్నం 2 గంట ల్లోపే అందరు ఎమ్మెల్యేలతో పాటు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇక్కడే తమ ఓటుహక్కు వినియోగించుకున్నా రు. నిర్ణీత గడువుకంటే ముందుగానే వంద శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల రిట ర్నింగ్ అధికారి సత్యనారాయణ తెలిపారు. రెండు చెల్లని ఓట్లు..? తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బ్యాలెట్ పేపరులో ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ పేరు ఎదురుగా ఒకటి అంకె వేయడంతో పాటు తమ పేర్లు కూడా రాసినట్లు తెలిసింది. దీంతో ఆ రెండు ఓట్లు చెల్లకుండా పోయాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బ్యాలట్ పేపరులో తమ పేర్లు రాశారని తెలిసి పార్టీ అధినేత చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పలుమార్లు మాక్ పోలింగ్ నిర్వహించినా అలా ఎందుకు చేశారని చంద్రబాబు ప్రశ్నించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
రామ్నాథ్ కోవింద్ గెలుపు ఖాయం
ఎంపీ జితేందర్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని ఎంపీ జితేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం లోక్సభ వాయిదా పడిన తర్వాత టీఆర్ఎస్ ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం జితేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం కేసీఆర్ సూచనలు తీసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పినట్టుగానే ఎన్డీయే అభ్యర్థిగా రాజకీయ అనుభవం, దళిత వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్ను మోదీ ఎంపిక చేశారన్నారు. అనంతరం ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను సాధించుకోవడానికి ఈ సమావేశాల్లో పట్టుబడతామని అన్నారు. చట్టంలో పొందుపరిచినట్టు ఉమ్మడి హైకోర్టు విభజన, అసెంబ్లీ సీట్ల పెంపును చేపట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సీట్ల పెంపునకు ఉద్దేశించిన బిల్లు సిద్ధంగా ఉందని, మూడు రోజుల్లో అది పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
అమరావతిలో తొలి పోలింగ్
-
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన వైఎస్ జగన్
-
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన వైఎస్ జగన్
విజయవాడ: రాజధాని అమరావతిలో తొలిసారి జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీకి వచ్చిన వైఎస్ జగన్ ఓటింగ్ ప్రారంభమైన కొంత సమయానికి అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో ఓటేశారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత వైఎస్ జగన్ అక్కడే తన చాంబర్లో కొద్దిసేపు ఉండి పోలింగ్ను పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు నేటి ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్కు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్టేట్ గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యేలతో ఆయన భేటీ సందర్భంగా.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాసనసభ్యులకు ఆయన వివరించారు. భేటీ అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు బస్సులో అసెంబ్లీకి వెళ్లారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి, అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాద్, మిథున్ రెడ్డిలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు ఎంపీ మేకపాటి నివాసంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ అంశంపై నేతలు చర్చించారు. సమావేశం అనంతరం పార్లమెంట్కు వెళ్లిన నేతలు ఓటింగ్లో పాల్గొన్నారు. -
రామ్నాథ్ గెలుపు నల్లేరుపై నడకే
-
నేడే నూతన రాష్ట్రపతి ఎన్నిక
-
కోవింద్కు భారీ మెజారిటీ ఖాయం
టీడీఎల్పీ, బీజేఎల్పీ సమావేశంలో రేవంత్, కిషన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ భారీ మెజారిటీతో గెలుస్తారని టీడీఎల్పీ నేత రేవంత్రెడ్డి, బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి అన్నారు. టీడీఎల్పీ, బీజేఎల్పీ పక్షాలు ఆదివారం సం యుక్తంగా సమావేశమయ్యాయి. కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ ముఖ్యనేతలు మోత్కుపల్లి నర్సింహులు, నామా వెంకటేశ్వర్రావు, రావుల చంద్రశేఖర్రెడ్డి, వేం నరేందర్రెడ్డి, అమర్నాథ్బాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్కు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నామని రేవంత్రెడ్డి చెప్పారు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కోవింద్కు అండగా ఉండాలని కోరారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ, ఓడిపోతామని తేలిపోయిన తర్వాత కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల్లో దిగజారుడు వ్యూహాన్ని అవలం బిస్తున్నారని విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమకు ఓట్లేస్తారంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి రామ్నాథ్ అన్ని రంగాల్లో సమర్థుడని కిషన్రెడ్డి పేర్కొన్నారు. -
మన రాష్ట్ర ఓట్ల విలువ 31,992
- 23,916 విలువైన ఓట్లతో టీఆర్ఎస్ అగ్రస్థానం - 4,548 ఓట్లతో తర్వాతి స్థానంలో కాంగ్రెస్ - ఎమ్మెల్యే ఓటు విలువ 132.. ఎంపీకి 708 - ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్ - అసెంబ్లీ కమిటీ హాల్లో ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికకు రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రానికి చెందిన 119 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ జరగనుంది. ఎంపీలంతా ఢిల్లీలోనే ఓటింగ్లో పాల్గొంటారు. అధికార టీఆర్ఎస్.. ఎన్డీఏ అభ్యర్థి రాంనాథ్ కోవింద్కు మద్దతు ప్రకటిం చిన సంగతి తెలిసిందే. టీడీపీ కూడా మద్దతి స్తోంది. యూపీఏ అభ్యర్థిగా కాంగ్రెస్ మీరాకు మార్ను బరిలోకి దింపింది. రాష్ట్రంలో టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం, సీపీఎం ఓటింగ్లో పాల్గొననున్నాయి. ఓటు విలువ ఇలా.. ఈ ఎన్నికలలో ఎంపీ ఓటు విలువ 708, కాగా ఎమ్మెల్యే ఓటు విలువ 132గా నిర్ణయించారు. లోక్సభ, రాజ్యసభ సభ్యుల ఓటు విలువ ఒకే మాదిరిగా ఉంటుంది. ఈ లెక్కన తెలంగాణ లోని 119 అసెంబ్లీ నియోజవర్గాలకు సంబం« దించి ఉన్న ఓట్ల విలువ 15,708. రాష్ట్రంలో లోక్సభ, రాజ్యసభ సభ్యులంతా కలిపి 24 మంది. కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ప్రాతి నిధ్యం వహిస్తున్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఒక స్థానం ఖాళీ అయ్యింది. దీంతో 23 మంది ఎంపీల ఓట్ల విలువ 16,284. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల విలువను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో మొత్తం ఓట్ల విలువ 31,992. ఓట్ల విలువలో టీఆర్ఎస్దే సింహభాగం. దీంతో ఆ పార్టీ నాయకత్వం ఒక్క ఓటు కూడా వృథా కాకుం డా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఆదివారం వారందరికీ తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్ నిర్వహించింది. ఇక పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఎన్డీఏ ఏర్పాటు చేసిన మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ చేతిలో 90 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు (14 లోక్సభ, 3 రాజ్యసభ సభ్యులు) ఉన్నారు. దీంతో ఒక్క టీఆర్ఎస్ చేతిలోనే 23,916 విలువైన ఓట్లు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేతిలో 13 మంది ఎమ్మెల్యే లు, నలుగురు ఎంపీలున్నారు. దీంతో ఆ పార్టీ చేతిలో 4,548 విలువైన ఓట్లున్నాయి. ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతో ఎంఐఎం 1,632 విలువైన ఓట్లు, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతో బీజేపీ 1,368 విలువైన ఓట్లు, ముగ్గురు ఎమ్మెల్యేల తో టీడీపీ 396 విలువైన ఓట్లు కలిగి ఉన్నాయి. సీపీఎంకు ఒక ఎమ్మెల్యేతో 132 విలువైన ఓట్లు మాత్రమే ఉండగా.. ఆ పార్టీ యూపీఏ అభ్యర్థి మీరా కుమార్కు మద్దతు పలికింది. ఎంఐఎం తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. సోమవారం నాటి ఓటింగ్ లో ఆ పార్టీ పాల్గొనకపోవచ్చని భావిస్తున్నా రు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి పోలింగ్ ఏజెంట్లగా ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్), బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి వ్యవహ రిస్తారు. యూపీఏ అభ్యర్థికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లు వంశీచందర్రెడ్డి, సంపత్ కుమార్ ఏజెం ట్లుగా ఉంటారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ పేపర్లను భద్రపరచి మంగళవారం ఉదయం ఢిల్లీకి పంపుతారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఎమ్మెల్యేల కోసం పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ఇవ్వనున్నారు. -
నేరుగా ఓటింగ్కే
- మా నేతలంతా సీనియర్లే.. - మాక్ పోలింగ్ అక్కర్లేదు: జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేరుగా ఓటింగ్కే వెళ్లనున్నారు. యూపీఏ అభ్యర్థి మీరాకుమార్ వచ్చిన సందర్భంగానే గాంధీభవన్లో ఓటింగ్ విధానంపై పార్టీకి చెందిన సీనియర్లు సూచనలు చేశారు. పార్టీలో ఒకరిద్దరు మినహా అందరూ సీనియర్ సభ్యులే కావడం వల్ల మాక్ పోలింగ్ అవసరం లేదని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలంతా సోమవారం ఉదయమే ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. పోలింగ్ ఏజెంట్లుగా పార్టీ ఎమ్మెల్యేలు సంపత్కుమార్, వంశీచంద్రెడ్డి వ్యవహరించనున్నారు. సీఎం ఓటు మీరాకే: సంపత్ తెలంగాణ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో వందశాతం తన ఓటును యూపీఏ అభ్యర్థి మీరాకుమార్కే వేస్తారని ఎమ్మెల్యే సంపత్కుమార్ అన్నారు. మీరాకుమార్ను కాదని ఓటు వేయడానికి సీఎం మనస్సాక్షిఒప్పుకోదన్నారు. రాజకీయ, ఇతర అవసరాల కోసం బీజేపీ నేత రాంనాథ్ కోవింద్కు ఓటేయాలని బయటకు చెప్పినా కేసీఆర్ మనస్సాక్షి అందుకు అంగీకరించదని తెలిపారు. -
తొలి ‘బీజేపీ రాష్ట్రపతి’గా కోవింద్
- ఓడిన రెండో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలువనున్న మీరా నేడు జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో... రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించే మొదటి బీజేపీ అభ్యర్థిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. అదే సమయంలో ఓటమి పాలయ్యే రెండో కాంగ్రెస్ అభ్యర్థిగా మీరా కుమార్ నిలిచిపోనున్నారు. రాష్ట్రపతి పదవికి ఇంతవరకూ 14సార్లు ఎన్నికలు జరగ్గా ఒకే ఒక్కసారి కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. 1969లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవ రెడ్డి.. ఇందిరాగాంధీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి వీవీ గిరి చేతిలో పరాజయం పొందారు. ఇక బీజేపీ అధికారంలో ఉండగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో రాష్ట్రపతి పదవికి ఆ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దిగడం ఇదే మొదటిసారి. అటల్ బిహారీ వాజ్పేయ్ ప్రధానిగా ఉండగా జరిగిన 2002 ఎన్నికలో గెలిచిన కలాంకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా 2007 రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తరఫున ఉపరాష్ట్రపతి భైరవ్సింగ్ షెఖావత్ పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సమయంలో మూడు సందర్భాల్లో మాత్రమే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. 1977, 2002 ఎన్నికల్లో కాంగ్రెస్ లోక్సభలో ప్రతిపక్షంలో ఉండగా, 1997లో యునైటెడ్ ఫ్రంట్ సర్కారుకు కాంగ్రెస్ బయటి నుంచి మద్దతిచ్చింది. 1997 రాష్ట్రపతి ఎన్నికలో అప్పటి ఉపరాష్ట్రపతి, కాంగ్రెస్ నేత కేఆర్ నారాయణన్కు దళితుడనే కారణంగా యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్యపక్షాలు, వామపక్షాలతో పాటు బీజేపీ మద్ధతు తెలిపాయి. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. 2002లో ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయపక్షాలు ప్రతిపాదించిన ఏపీజే అబ్దుల్ కలాంకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మద్దతివ్వగా, వామపక్షాల అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీ సెహగల్పై ఆయన గెలిచారు. ఇక ఎమర్జెన్సీ అనంతరం 1977లో కాంగ్రెస్ మొదటిసారి రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ పెట్టలేదు. జనతా పార్టీఅభ్యర్థిగా ముందుకొచ్చిన కాంగ్రెస్ మాజీ నేత నీలం సంజీవరెడ్డికి కాంగ్రెస్ మద్దతివ్వడంతో పోటీలేకుండా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతిగా ఆయన నిలిచారు. ఇక రాష్ట్రపతి ఎన్నికలో(1969) ఓడిపోయిన తొలి కాంగ్రెస్ ‘అధికార’ అభ్యర్థి కూడా నీలం సంజీవరెడ్డే కావడం విశేషం.. ఆయన అభ్యర్థిత్వం నచ్చని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఉపరాష్ట్రపతి వీవీ గిరిని ‘ఇండిపెండెంట్’ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. ఆ ఎన్నికల్లో నీలం ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. సంజీవరెడ్డి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులెవరూ ఓడిపోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున పోటీకి దిగిన మీరాకుమార్కు 17 పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్, మీరాకుమార్ను సమర్ధిస్తున్న వివిధ పార్టీల బలాబలాలు పరిశీలిస్తే మీరా ఓటమి ఖాయమని స్పష్టమవుతోంది. ఇదే జరిగితే రాష్ట్రపతి ఎన్నికలో ఓడిన రెండో కాంగ్రెస్ నేతగా మీరా చరిత్రకెక్కుతారు. రెండోసారి రాష్ట్రపతి ఎన్నికల్లో కులం ప్రస్తావన రాష్ట్రపతి ఎన్నికలో మొదటిసారి 1997లో కులం తెరపైకి వచ్చింది. అప్పటికి ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్ను తొలి దళిత రాష్ట్రపతిని చేయాలంటూ పాలక యునైటెడ్ ఫ్రంట్, కాంగ్రెస్ కోరగా, బీజేపీ అందుకు అంగీకరించి మద్దతు పలికింది. మళ్లీ 20 సంవత్సరాల తర్వాత, పాలక ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ తన అభ్యర్థిగా కోవింద్ను ప్రకటించి, దళిత అభ్యర్థిని గెలిపించాలనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. కాంగ్రెస్కు విజయావకాశాలు లేకున్నా దళితులకు పదవులిచ్చే విషయంలో తానే ముందున్నానని చెబుతూ దళిత వర్గానికే చెందిన మీరాను అభ్యర్థిగా ఎంపికచేసింది. దళిత్ వర్సెస్దళిత్ అంటూ ప్రచారం జరుగుతున్నా, దళితుల్లో అధిక మద్దతున్న చర్మకారేతర(చమార్ లేదా జాటవ్) నేతను రాష్ట్రపతిని చేయడం ద్వారా వారి మద్దతు బలోపేతం చేసుకోవడం బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జాగ్రత్తగా ఓటేయండి : సీఎం కేసీఆర్
పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచన - తెలంగాణ భవన్లో రాష్ట్రపతి ఎన్నిక మాక్ పోలింగ్ - మంత్రి లక్ష్మారెడ్డి గైర్హాజరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి - పోలింగ్లో ఎమ్మెల్యే షకీల్ తడబాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కును అప్రమత్తంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణభవన్లో ఆదివారం మాక్ పోలింగ్ నిర్వహించారు. మంత్రి హరీశ్రావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. మాక్ పోలింగ్ అనంతరం సీఎం.. ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. ఓటింగ్లో అనుసరిం చాల్సిన వ్యూహం, పద్ధతులను వివరించారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్కు రావాలని సూచిం చారు. మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించుకోవాలని నిర్ణయించారు. తర్వాత ఎమ్మెల్యేలంతా బస్సుల్లో అసెంబ్లీకి వెళ్లి ఓటింగ్లో పాల్గొనాలన్నారు. టీఆర్ఎస్ తరఫున పోలిం గ్ ఏజెంట్లుగా కొప్పుల ఈశ్వర్, గంపా గోవర్ధన్ వ్యవహరించనున్నారు. మాక్ పోలింగ్కు మంత్రి లక్ష్మారెడ్డి గైర్హాజరయ్యారు. దీనిపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి ముఖ్యమైన సమావేశాలకు రావాలి కదా అని అన్నట్టు సమాచారం. మాక్ పోలింగ్ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ ఓటు వేయడంలో తడబడ్డా రు. నంబర్ వన్ వేయడానికి పైన కొమ్మును, కింద అడ్డగీత వేశారు. గమనించిన హరీశ్రావు నిలువుగా నంబర్ వేస్తే సరిపోతుందని, కొమ్ములు వద్దని సూచించారు. విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసుకోండి టీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఇటీవల నియామకమైన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను, విద్యార్థులకు జరిగిన మేలును క్షేత్రస్థాయిలోకి తీసుకుపోయేలా విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు. విద్యార్థి విభాగం బలపడితే స్థానికంగా ఎమ్మెల్యేలకే రాజకీయంగా ఉపయోగపడుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. విద్యార్థి విభాగానికి సభ్యత్వం సోమవారం నుంచి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించి, పర్యవేక్షిస్తారని తెలిపారు. -
మనస్సాక్షి ప్రకారం ఓటేయండి: సోనియా
న్యూఢిల్లీ: రాష్ట్ర పతి ఎన్నికల్లో మనస్సాక్షితో ఓటేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్షాలకు ఆదివారం పిలుపునిచ్చారు. సంకుచిత భావం, విభజన–మత వాదాలపై ప్రతిపక్షం జరుపుతున్న పోరాటమే రాష్ట్రపతి ఎన్నికలని ఆమె అన్నారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్, ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాల క్రిష్ణ గాంధీలను సోనియా విపక్ష నాయకులకు లాంఛనంగా పరిచయం చేశారు. ‘మనం నమ్ముతున్న విలువలపై మనకు విశ్వాసం ఉండాలి. ఈ ఎన్నిక విభిన్న విలువలు, భావాల సంఘర్షణకు ప్రతినిధిగా నిలుస్తుంది. మహాత్మా గాంధీతోపాటు వేలాది మంది స్వాతంత్య్ర సమర యోధులు పోరాడి సాధించిన భారతదేశాన్ని రక్షించేందుకు ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని ఎన్నిక కోరుకుంటోంది’ అంటూ విపక్ష నాయకులతో జరిగిన సమావేశంలో సోనియా ప్రసంగించారు. కాగా, ప్రభు త్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమా వేశానికి గైర్హాజరైన జేడీయూ నేతలు, విపక్షాల భేటీకి కూడా రాలేదు. -
రాష్ట్రపతి ఎన్నిక విధానం ఇలా..
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక బ్యాలెట్ పేపర్పై జరుగుతుంది. పేపర్పై ఓ వైపున అభ్యర్థుల పేర్లు, మరోవైపున ప్రాధాన్యతా క్రమం ఉంటాయి. ఎటువంటి ఎన్నికల గుర్తులు ఉండవు. ఓటర్లు (ప్రజా ప్రతినిధులు) తమ అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న ప్రాధాన్యత సంఖ్యలను ఎంచుకోవాలి. ఎన్నికలో ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారో అన్ని ప్రాధాన్యతలను ఓటర్లు ఇవ్వవచ్చు. విజేతను నిర్ణయించే పద్ధతి అభ్యర్థి గెలుపొందాలంటే మొత్తం పోలైన, చెల్లుబాటయ్యే ఓట్ల విలువలో 50 శాతం ప్లస్ 1 రావాలి. మొదట తొలి ప్రాధాన్యతా ఓట్లను లెక్కించి, అందుకు అనుగుణంగా ఆయా అభ్యర్థులు సాధించిన ఓట్ల విలువ ఎంతో చెప్తారు. ఎవరైనా 50 శాతం ప్లస్ 1 సాధించి ఉంటే వారిని విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యతా ఓట్లతో విజేత ఎవరో తేలకపోతే ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగిస్తూ లెక్కింపు ను కొనసాగిస్తారు. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని పోటీ నుంచి తొలగించి, అతనికి పోలైన రెండో ప్రాధాన్యతా ఓట్లను మిగిలిన అభ్యర్థులకు సమానంగా పంచుతారు. ఇలా ఓ అభ్యర్థికి 50 శాతం ప్లస్ 1 ఓట్ల విలువ వచ్చి విజేత ఎవరో తేలేవరకు ఈ పద్ధతిని కొనసాగిస్తారు. ఒకవేళ తప్పించిన అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లలో రెండో ప్రాధాన్యత ఓటు లేకపోతే, దానిని తర్వాతి లెక్కింపుల్లో పరిగణలోనికి తీసుకోరు. -
నేడే రాష్ట్రపతి ఎన్నిక
- పార్లమెంట్ హౌస్, అసెంబ్లీల్లో పోలింగ్ - 20న ఓట్ల లెక్కింపు - ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ గెలుపు నల్లేరుపై నడకే.. - దేశవ్యాప్తంగా మొత్తం పోలింగ్ కేంద్రాలు 32 - ఓటు వేయనున్న ఎంపీల సంఖ్య 776 - ఓటు వేయనున్న ఎమ్మెల్యేల సంఖ్య 4,120 - ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 10,98,903 న్యూఢిల్లీ రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్, విపక్ష అభ్యర్థి మీరా కుమార్లు పోటీలో తలపడుతున్నారు. పార్లమెంట్ హౌస్లో ఒక పోలింగ్ కేంద్రాన్ని, రాష్ట్ర అసెంబ్లీల్లో ఒక్కో కేంద్రాన్నీ కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం 33 మంది పరిశీలకులను నియమించింది. పార్లమెంట్ హౌస్లో ఇద్దరిని, అసెంబ్లీల్లో ఒక్కొక్కరిని నియమించారు. దామాషా ప్రాతినిధ్యం విధానంలో రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. అనంతరం వివిధ రాష్ట్రాల రాజధానుల నుంచి బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి తరలించి ఈ నెల 20న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటు వేస్తారు. తొలి ప్రాధాన్యాన్ని తప్పక ఇవ్వాలి. తొలి ప్రాధాన్యం ఇవ్వని ఓటును గుర్తించరు. లెక్కింపు అనంతరం 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఓటర్లకు ప్రత్యేక పెన్నులు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వ్యక్తిగత పెన్నులను తీసుకురాకుండా ఈసీ నిషేధం విధించింది. వీరికి ప్రత్యేకంగా రూపొందించిన మార్కర్ పెన్నులను అందిస్తారు. ఎంపీలకు ఆకుపచ్చ రంగు బ్యాలట్ కాగితాలను, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలట్ కాగితాలను ఇస్తారు. తాము అందించే సీరియల్ నంబర్లతో కూడిన ఊదారంగు సిరా పెన్నులతోనే ఓటేయాలని ఈసీ ఆదివారం ఓ ప్రకటనలో సూచించింది. ‘ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందు పోలింగ్ సిబ్బంది వారి వ్యక్తిగత పెన్నులను తీసుకుని, ప్రత్యేక పెన్నులను ఇస్తారు. ఓటర్లు కేంద్రం నుంచి బయటకు వచ్చేటప్పుడు వాటిని మళ్లీ తీసుకుని, వారి పెన్నులను వారికి ఇస్తారు’అని కొత్త నిబంధన గురించి ఈసీ ప్రతినిధి ఒకరు చెప్పారు. గత ఏడాది హరియాణాలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈసీ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రత్యేక పెన్నులను మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ తయారు చేసింది. ఓటేసే సమయంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుపుతూ ఈసీ ప్రత్యేక పోస్టర్లను కూడా సిద్ధం చేసింది. ఒక అభ్యర్థికి అనుకూలంగా ఓటేయాలని పార్టీలు విప్ జారీ చేయకూడదని పేర్కొంది. అసెంబ్లీల్లో ఓటేయనున్న 55 మంది ఎంపీలు 14 మంది రాజ్యసభ, 41 మంది లోక్సభ ఎంపీలు కలిపి మొత్తం 55 మంది ఎంపీలు పార్లమెంట్ హౌస్లో కాకుండా ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటు వేయనున్నారు. వీరిలో ఎంపీ సభ్యత్వాన్ని ఇంకా వదులుకోని యూపీ సీఎం, డిప్యూటీ సీఎంలు యోగి అదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య, గోవా సీఎం మనోహర్ పరీకర్ ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్లమెంట్ హౌస్లో, మరో నలుగురు ఎమ్మెల్యేలు వేరే రాష్ట్రంలోని అసెంబ్లీలో ఓటేయనున్నారు. రెండు శిబిరాలుగా చీలిన సమాజ్వాదీ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల వేళ సమాజ్వాదీ పార్టీ రెండు శిబిరాలుగా విడిపోయింది. ములాయం సింగ్ నేతృత్వంలోని ఒక వర్గం కోవింద్కు ఓటేయడం ఖాయం కాగా.. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వర్గం మాత్రం మీరాకుమార్కు మద్దతు ప్రకటించింది. కోవింద్ మంచి ఎంపికని, ఆయనతో ఎప్పటి నుంచో సత్ససంబంధాలు ఉన్నాయని ఇంతకముందే ములాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవింద్కు మోదీ ముందస్తు శుభాకాంక్షలు ఎన్నికలకు ఒకరోజు ముందుగానే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ ఎంపీల సమావేశానికి హాజరైన కోవింద్కు ప్రధాని శుభాకాంక్షలు చెప్పారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ వెల్లడించారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్తో కోవింద్కున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ఎన్నుకునేది వీరు.. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. వీరిలో 776 మంది ఎంపీలు(233 మంది రాజ్యసభ , 543 మంది లోక్సభ ఎంపీలు), 4,120 మంది ఎమ్మెల్యేలు సహా మొత్తం 4,896 మంది ఉన్నారు. ఎంపీల ఓటు విలువ 708 కాగా, ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రానికీ రాష్ట్రానికీ మారుతూ ఉంటుంది. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం.. ఒక రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించి, తర్వాత దాన్ని వెయ్యితో భాగించగా వచ్చే మొత్తం ఆ రాష్ట్రంలోని ఒక ఎమ్మెల్యే ఓటు విలువ. దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్యతో భాగించగా వచ్చే మొత్తం ఒక ఎంపీ ఓటు విలువ. ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 10,98,903. కాగా, 5,37,683 ఓట్లున్న ఎన్డీఏకు తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి మరో 12,000 ఓట్లు అవసరం. బీజేడీ, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్తోపాటు అన్నాడీఎంకేలోని చీలిక వర్గాల మద్దతుతో కోవింద్ సునాయాసంగా గెలిచే అవకాశముంది. కోవింద్ గెలుపు దాదాపు నిశ్చయమేనని తెలుస్తున్నా.. లోక్సభ మాజీ స్పీకర్ అయిన మీరా కుమార్ గెలుపు కోసం కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవడానికి విపక్షం ప్రయత్నాలు మానడం లేదు. మీరా, బిహార్ మాజీ గవర్నర్ అయిన కోవింద్లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి మద్దతు కోరారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఈ నెల 24తో ముగియనుంది. -
రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
- ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజ సదారాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర శాసనసభా కార్యదర్శి, ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజ సదారాం తెలిపారు. సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ కమిటీ హాలులో పోలింగ్ బూత్, ఇతర ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ భన్వర్లాల్, కేంద్ర ఎన్ని కల పరిశీలకులు సునిల్ కుమార్తో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యేలందరికీ ఎన్నికల నిబంధనలను తెలియ జేశాం. ప్రాధాన్య ఓటు ఈసీ సమకూర్చిన పెన్నుతోనే ఎమ్మెల్యేలు తాము ఓటు వేయదల్చుకున్న అభ్యర్ధి పేరు ఎదురుగా ఉన్న గడిలో 1 అంకెను వేయాలి. తామేసిన ఓటును రహస్యంగానే ఉంచాలి’అని రాజసదారాం తెలిపారు. -
ఇక సమరమే
► ముగిసిన రామ్నాథ్ కోవింద్, మీరాకుమార్ ప్రచారం ► నేడు ఎన్డీయే పక్షాల ఎంపీలతో మోదీ భేటీ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే 14 రాష్ట్రాల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ వ్యక్తిగతంగా పర్యటించి ప్రచారం పూర్తిచేసుకున్నారు. శనివారం ఒక్కరోజే మహారాష్ట్ర, గోవా, గుజరాత్లలో సుడిగాలి పర్యటన చేశారు. అటు కోవింద్ కోసం ఆదివారం ఎన్డీయే పక్ష ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. తటస్థంగా ఉన్న ఎంపీలు, పలురాష్ట్రాల ఎమ్మెల్యేలను మోదీ మద్దతుకోరనున్నారు. మీరా కుమార్, విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ సంయుక్తంగా ఆదివారం 18 పార్టీల విపక్ష కూటమి ఎంపీలకు ఢిల్లీలో తేనీటి విందు ఇవ్వనున్నారు. అయితే కాంగ్రెస్ నేతల్లోనూ కొందరు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి పోటీ పెట్టడం కన్నా ఎన్నిక ఏకగ్రీవం అయితేనే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఒకసారి మాత్రమే రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైంది. రెండు సార్లు తీవ్రమైన పోటీ నెలకొనగా మిగిలినవి ఏకపక్షంగానే జరిగాయి. ఆ రెండు సందర్భాల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి జకీర్ హుస్సేన్, విపక్షాల అభ్యర్థి కోకా సుబ్బారావు (తూర్పుగోదావరి, ఏపీ) మధ్య 1967 రాష్ట్రపతి ఎన్నిక హోరాహోరీగా సాగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన కోకా సుబ్బారావుకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభించింది. ఈ ఎన్నికల్లో సుబ్బారావు లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. తెలుగు వర్సెస్ తెలుగు 1969లో జాకీర్ హుస్సేన్ హఠాన్మరణంతో మరోసారి రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ సారి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సభ్యులు వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి (ఇద్దరూ తెలుగువారే) మధ్యే పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు నీలం సంజీవరెడ్డిని (నాటి లోక్సభ స్పీకర్) అభ్యర్థిగా ప్రకటించింది. అయితే నామినేషన్కు ముందు ఉపరాష్ట్రపతి వీవీ గిరి నామినేషన్ వేసి (ఇందిర ప్రోత్సాహంతో) అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులు అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటేయాలని ఇందిర ప్రకటించినా తెరవెనుక రాజకీయాలతో తన అభ్యర్థి వీవీ గిరిని గెలిపించుకున్నారు. నిజలింగప్ప, కామరాజ్ నాడర్, మొరార్జీ దేశాయ్, అతుల్య ఘోష్, ఎస్కే పాటిల్ మొదలైన వారి నుంచి ఇందిరకు పార్టీలోనే తీవ్రమైన అసమ్మతి ఎదురైంది. అయితే 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంజీవరెడ్డిని రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా గెలిపించుకుంది. ఆమోదానికి 18 బిల్లులు సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 18 బిల్లులను ఆమోదం పొందాల్సిన బిల్లుల జాబితాలో చేర్చారని పరిశోధనా సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ శనివారం వెల్లడించింది. వీటిలో 9 బిల్లులను లోక్సభ ఇప్పటికే ఆమోదించిందనీ, కొన్నింటిని రెండు సభలూ ఆమోదించాల్సి ఉందని పీఆర్ఎస్ పేర్కొంది. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. -
రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర శాసన సభా కార్యదర్శి, ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజా సదారాం తెలిపారు. సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ కమిటీ హాలులో పోలింగ్ బూత్, ఇతర ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ భన్వర్లాల్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు సునిల్ కుమార్తో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లు అయినా ఎమ్మెల్యేలందరికీ ఎన్నికల నియమ నిబంధనలను తెలియజేశాం. వారికి వ్యక్తిగతంగానూ వివరాలను పంపించాం. ప్రాధాన్య ఓటు భారత ఎన్నికల కమిషన్ సమకూర్చిన పెన్నుతోనే ఎమ్మెల్యేలు తాము ఓటు వేయదల్చుకున్న అభ్యర్ధి పేరు ఎదురుగా ఉన్న గడిలో 1 అంకెను వేయాలి. ఇది పూర్తిగా రహస్య పద్ధతిలో జరిగే ఎన్నిక. సభ్యులు తామేసిన ఓటును రహస్యంగానే ఉంచాలి’ అని రాజసదారాం తెలిపారు. -
రాష్ట్రపతి ఎన్నికపై టీఆర్ఎస్ జాగ్రత్తలు
క్రాస్ ఓటింగ్ జరగకుండా చర్యలు - ఒక్క చెల్లని ఓటు నమోదు కాకుండా తర్ఫీదు - ఆదివారం ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ - అందుబాటులో నిబంధనలు, సూచనల కాపీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. తమ పార్టీకి చెందిన ఒక్క ఓటు క్రాస్ కాకుండా, అదే మాదిరిగా ఒక్క ఓటూ మురిగిపోకుండా ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, వారి ఓట్లు తమ అభ్యర్థి మీరాకుమార్కే పడతాయని కాంగ్రెస్ నాయకులు పదేపదే చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో గులాబీ అధినాయకత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏడాదిన్నర కిందట ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నాలు జరిగాయి. ఎన్నికల బరిలో నిలిచిన తెలంగాణ టీడీపీ అభ్యర్ధి వేం నరేందర్రెడ్డి కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును కొనుగోలు చేసి, క్రాస్ ఓటింగ్ చేయించేందుకు ప్రయత్నించారు. ఏసీబీకి రేవంత్ పట్టుబడడంతో క్రాస్ ఓటింగ్ కుట్ర బట్టబయలు అయ్యింది. అయితే, మరికొందరు ఎమ్మెల్యేలు సైతం టీడీపీ నేతలతో మంతనాలు జరిపారని ప్రచారం జరిగింది. స్టీఫెన్సన్ వ్యవహారంతో అంతా భగ్నం కావడంతో వారి పేర్లు బయటకు రాలేదు. కానీ, ఆ ఎమ్మెల్యేలు ఎవరనే విషయంలో పార్టీ అధినేతకు కొంత సమాచారం ఉందన్న ప్రచారమూ పార్టీ వర్గాల్లో జరిగింది. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో అలాంటి ‘సీన్ రిపీట్’ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓటింగ్పై అవగాహన రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం చెల్లని ఓట్లు నమోదు అవుతున్న ఉదంతాలను పరిగణనలోకి తీసుకుని తమ పార్టీ ఓట్లన్నీ చెల్లే విధంగా ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటికే శాసనసభ సచివాలయం నుంచి ఎన్నికల నిబంధనలు, ఓటు వేసేప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు.. సూచనలతో కూడిన కాపీలు ఎమ్మెల్యేలకు పంపించారని సమాచారం. దీంతో పాటు ఆదివారం తెలంగాణ భవన్లో ఒక గంట పాటు ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్యేలకు ఇదే తరహాలో అవగాహన కల్పించా రు. టీఆర్ఎస్కు చెందిన 90 మంది ఎమ్మెల్యేల ఓట్లవిలువ 11,880, 17 మంది ఎంపీల ఓట్ల విలువ 11,968. వెరసి మొత్తం విలువ 23,848. కాగా, ఎంపీలు అంతా ఢిల్లీలోనే తమ ఓట్లు వేయనున్నారని, ఒక రోజు ముందుగానే ఢిలీకి చేరుకోవాలని అధినాయకత్వం వారిని ఆదేశించిందని చెబుతున్నారు. ఇవీ.. జాగ్రత్తలు ► ప్రతీ ఓటరు తమ ప్రాధాన్య ఓటును అభ్యర్థి పేరు ఎదురుగా గడిలో 1 అంకెను ఉంచడం ద్వారా వేయాలి. ► ప్రాధాన్యాన్ని కేవలం అంకెలలో (1) మాత్రమే సూచించాలి. పదాలలో (ఒకటి అని) సూచిస్తే అది చెల్లని ఓటు అవుతుంది. ► తమ ప్రాధాన్యాన్ని గుర్తించడానికి టిక్ (రైట్ గుర్తు), ఇంటు (రాంగ్ గుర్తు) వాడొద్దు. ► పోలింగ్ కేంద్రంలో ఎన్నికల కమిషన్ సమకూర్చిన పెన్నునే వినియోగించాలి. ► ఓటును కచ్చితంగా రహస్యంగానే ఉంచాలి. నిబంధన ఉల్లంఘిస్తే అది చెల్లదు. ► బ్యాలెట్ పేపర్పై పేర్లు, పదాలు రాయడం, ఓటరు తన సంతకం చేయడం కూడదు. ► బ్యాలెట్ పేపర్ చిరిగినా, పాడైనా కొత్త బ్యాలెట్ ఇవ్వరు. -
17న విజయవాడకు జగన్
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 17న విజయవాడకు వెళుతున్నారు. అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ ఓట్లూ రామ్నాథ్కు వస్తాయి
బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్కు ఓటు వేస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, ఆత్మప్రబోధానుసారం ఓట్లేయాలని కాంగ్రెస్ నేతలిచ్చిన పిలుపు మేరకు కోవింద్కు ఓట్లేస్తారన్నారు. ఓడిపోతామని తెలిసీ మీరాకుమార్ ను పోటికి పెట్టడం బలిపశువును చేయడమేనన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీలోనే ఉన్నారని, రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్కే ఓటేస్తారని చెప్పారు. -
కాంగ్రెస్ది దిగజారుడు రాజకీయం
మీరాకుమార్ను బలిపశువును చేస్తున్నారు: బాల్క సుమన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికపై టీఆర్ఎస్ వైఖరిని కాంగ్రెస్ తప్పుపట్టడాన్ని ఖండిస్తున్నామని, రామ్నాథ్ కోవింద్కు మద్దతు ఎందుకిస్తున్నామో పార్టీ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. కోవింద్ దళితుడు మాత్రమే కాకుండా న్యాయ కోవిదుడని, సీఎం కేసీఆర్ సూచనతోనే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత అభ్యర్థిని మోదీ ఎంపిక చేశారని అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గురువారంబాల్క సుమన్ విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ ఫోన్ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నేతల అభిప్రాయం తీసుకుని ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. దళితుల మీద కాంగ్రెస్కు ప్రేమ ఉంటే ఎన్డీయే కంటే ముందే ఎందుకు దళిత అభ్యర్థిని ప్రకటించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆరోపించారు. మీరాకుమార్ అంటే తమకూ ప్రత్యేక అభిమానం ఉందని, కాంగ్రెస్ ఆమెను బలి పశువును చేస్తోందన్నారు. సీబీఐ కేసులకు భయపడే టీఆర్ఎస్ ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ఇచ్చిందనడం బట్టకాల్చి మీద వెయ్యడమేనని, సీబీఐ కేసుల చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని వ్యాఖ్యానించారు. ఎన్డీయేలోలేని బీజేడీ, జేడీయూ, అన్నాడీఎంకే వంటి పార్టీలు కూడా టీఆర్ఎస్ తరహాలోనే కోవింద్కు మద్దతు ఇస్తున్న విషయం కాంగ్రెస్కు తెలియదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంపత్ అవగాహన లేమితో క్రాస్ ఓటింగ్ గురించి మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ ఓట్లన్నీ కోవింద్కే పడతాయన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం కోదండరాంగ్గా మారారని, తప్పుడు ప్రయోజనాలతో ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. -
భారత్ కలలను నిజం చేయడానికి ప్రయత్నిస్తా
- ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ స్పష్టీకరణ - టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కోవింద్ సమావేశం సాక్షి, అమరావతి: ‘‘ఆధునిక భారతదేశం కలలను నిజం చేయడానికి ప్రయత్నిస్తా... కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తా... సమాజ అభివృద్ధి, యువత కలలను నెరవేర్చడమే లక్ష్యంగా నూతన భారత్ నిర్మాణం కోసం కృషి చేస్తా. నేను ఏ రాజకీయ పార్టీకీ చెందిన వాడిని కాదు. బిహార్ గవర్నర్గా నన్ను నియమించినప్పుడే బీజేపీకి రాజీనామా చేశా. అప్పటి నుంచి రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నా’’ అని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన మంగళవారం విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగు వారికి గర్వకారణమన్నారు. రాష్ట్రపతిగా 125 కోట్ల మంది ప్రజలకు సేవ చేసేందుకు తనకు మద్దతివ్వాలని కోవింద్ కోరారు. ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ రాష్ట్రపతిగా మంచి మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తున్నామని వెంకయ్య పేర్కొన్నారు. కోవింద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి అభ్యంతరం ఏమైనా ఉందా? అని అడిగారని, తాను సంపూర్ణ మద్దతిస్తానని చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కోవింద్కు 70 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి స్థితిలో మరొకరు గెలిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఏపీ మూడేళ్ల పసిబిడ్డ అని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయని, కోవింద్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి రామ్నాథ్ కోవింద్ పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశం అనంతరం కోవింద్కు చంద్రబాబు అల్పాహార విందు ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన రామ్నాథ్కు గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుతోపాటు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. -
రాజ్యాంగ విలువలను కాపాడుతా..
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఉద్ఘాటన - రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తా.. - దేశ సరిహద్దుల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా - నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు - వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కోవింద్ భేటీ - రాష్ట్రపతి, స్పీకర్ వంటి ఉన్నత పదవులకు పోటీ వద్దు: జగన్ - రామ్నాథ్ కోవింద్కు వైఎస్ జగన్ పాదాభివందనం సాక్షి, హైదరాబాద్: తాను భారత రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవి ఔన్నత్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుతానని, రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తానని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీఏ) రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ చెప్పారు. రాష్ట్రపతి పదవి హుందా తనాన్ని, గౌరవాన్ని ఇనుమడింపజేస్తానని పేర్కొన్నారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ ప్రచారంలో భాగంగా హైదరాబా ద్కు వచ్చిన కోవింద్ మంగళవారం హోటల్ పార్క్ హయత్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి లో సైనిక దళాల సుప్రీం కమాండర్ హోదాలో దేశ సరిహద్దుల పరిరక్షణకు శక్తివంచన లేకుం డా కృషి చేస్తానన్నారు. బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ఎందరో మహానుభావులు రాష్ట్రపతి పదవిని అధిష్టించి దేశానికి మరువలేని సేవలందించారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరా బాద్కు చెందిన డాక్టర్ జాకీర్ హుస్సేన్, అనంతపురం జిల్లాకు చెందిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారని ప్రశంసించారు. ఆ మహానుభావులందరి ఆదర్శాలను అనుకరించే ప్రయత్నం చేస్తాన న్నారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటిం చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నని కోవింద్ అన్నారు. ఎన్డీఏ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించక ముందే జగన్ ముందుకొచ్చి మద్దతు తెలపడం ముదావహం అని చెప్పారు. కోవింద్ విజయంలో వైఎస్సార్సీపీ భాగస్వామి ‘‘నిన్నటి వరకూ అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అంటూ నీతులు వల్లిస్తోంది. ఆ పార్టీ ఒకప్పుడు దేశంలో ఎమర్జెన్సీని విధించి మానవ హక్కులను హరించింది. నాయకులను జైళ్లకు పంపి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసింది’’ అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీకి చురక అంటించారు. రామ్నాథ్ కోవింద్ను దళితు డని మాత్రమే భావించరాదని, ఆయనకు కెపాసిటీ (సామర్థ్యం), క్యాలిబర్ (బలం), కాండక్ట్ (నడత), క్యారెక్టర్ (వ్యక్తిత్వం) మెండుగా ఉన్నాయని తనదైన శైలిలో చెప్పారు. కోవింద్ను దళితుడనే కారణంతో ఎంపిక చేయలేదని, ఆయనలో ఉన్న శక్తిసా మర్థ్యాలను గుర్తించామన్నారు. ప్రతిపక్షం మాత్రం కులం పేరుతో రాజకీయం చేయాలని చూస్తోందని ఆరోపించారు. కోవింద్కు మద్దతు ఇవ్వడానికి జగన్ ముందుకు రావడం ఆహ్వానించదగిన విషయ మన్నారు. కోవింద్ విజయంలో వైఎస్సార్సీపీ కూడా భాగస్వామి అవుతున్నందుకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా ఓటు వేయాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు వివరించారు. సభా వేదికపై బీజేపీ ఏపీ పరిశీలకుడు గణేశన్, అమర్జీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి, ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆసీనులయ్యారు. రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోవింద్కు ఘన స్వాగతం కోవింద్ నిర్ణీత సమయం కంటే 20 నిమిషాలు ముందుగా మంగళవారం ఉదయం 10.55 నిమిషాలకు పార్క్ హయత్ హోటల్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు వైఎస్ జగన్తో పాటు మేకపాటి రాజమోహన్రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పి.మిథున్రెడ్డి, బుట్టా రేణుక, వెలగపల్లి వరప్రసాద్, వైఎస్సార్సీపీ శాసనసభ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎదురేగి సాదర స్వాగతం పలికారు. వేదికపై ఆసీనులైన తరువాత కోవింద్ను జగన్ శాలువాతో సత్కరించారు. మిగతా అతిథులను ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, బుట్టా రేణుక సత్కరించిన తరువాత పరిచయ కార్యక్రమం మొదలైంది. తొలుత ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి కోవింద్కు పరిచయం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా వేదికపైకి వెళ్లగా జగన్ పక్కనే నుంచుని వారిని కోవింద్కు పరిచయం చేశారు. జగన్, విజయసాయిరెడ్డి కోవింద్కు గౌర వ సూచకంగా పాదాభివందనం చేశారు. ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలి: వైఎస్ జగన్ రామ్నాథ్ కోవింద్కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. రామ్ నాథ్ కోవింద్తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగపరంగా ఉన్నతమైన రాష్ట్రపతి, స్పీకర్ వంటి పదవులకు పోటీ ఉండరాదని తాము విశ్వసిస్తున్నామని, అందువల్లే ఎన్డీయే తన అభ్యర్థిని ఖరారు చేయక ముందే మద్దతు ప్రకటించామని గుర్తుచేశారు. ఒక దళితుడు రాష్ట్రపతి అయ్యే అవకాశం దేశంలో రెండోసారి వచ్చినందుకు అందరూ గర్వపడాలని, కోవింద్ను గెలిపిద్దామని పిలుపునిచ్చారు. అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నిక విషయంలో రాజకీయ సిద్ధాంతాలకు తావే ఉండరాదన్నారు. రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గెలుపు తథ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలని, పోటీ అవసరం లేదనే సంప్రదాయాన్ని నెలకొల్పాలని జగన్ కోరారు. -
కేసీఆర్తో మాట్లాడే ప్రయత్నం చేశా
మద్దతుపై యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ ► సీఎం కార్యాలయానికి సమాచారం ఇచ్చాం.. అందుబాటులోకి రాలేదు సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు కోరడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో మాట్లాడటానికి ఫోన్ చేశాను. ఫోనులో అందుబాటులోకి రాలేదు. మాట్లాడుతామని ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం కూడా పెట్టినాము’అని రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి, లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్అలీ తదితరులతో కలసి సోమవారం ఆమె గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు.‘నేను లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటైంది. ఆ సమయంలో లోక్సభ స్పీకర్గా ఉండటం ఒక చారిత్రక ఘట్టం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తీసుకుంది. అలాంటి తెలంగాణ ప్రజాప్రతినిధులంతా నాకు మద్దతు ఇవ్వాలి’ అని మీరాకుమార్ విజ్ఞప్తి చేశారు. విపక్ష పార్టీలకు కృతజ్ఞతలు... రాష్ట్రపతిఎన్నికలో తన అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించిన 17 ప్రతిపక్ష పార్టీలకు మీరాకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. భిన్న దృక్పథాలున్న వేర్వేరు పార్టీలు సిద్ధాంతాల పరిరక్షణకోసం ఏకమై తనకు మద్దతు ఇస్తున్నాయన్నారు. తాను పర్యటించిన అన్ని రాష్ట్రాల్లో విశేషాదరణ వస్తోందన్నారు. ‘నేను బలిపశువును, బకరాను కాను. నేను ఒంటరిని కాను, సిద్ధాంతాలకోసం రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీలో ఉన్నాను. తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకముంది. నాకు మద్దతును ఇవ్వాలని ఎంఐఎంను కూడా కోరుతా. టీఆర్ఎస్కు, ఎంఐఎంకు లేఖలు రాస్తా. మై బిహార్ కీ బేటీ హూ.. మగర్ దేశ్ హమారా హై(నేను బిహార్ బిడ్డనే. కానీ దేశమంతా మనదే)’అని మీరాకుమార్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వారం రోజులే చాలా ఎక్కువ అని అన్నారు. ఎన్నికలకు ఇంకా రెండువారాల సమయం ఉందని.. ఏమైనా జరగవచ్చని పేర్కొన్నారు. అధికార పక్షం నుంచీ మద్దతిస్తారు.. అధికార బీజేపీలో ఉన్న చాలామంది తనకు మద్దతు ఇస్తారని మీరా ధీమా వ్యక్తం చేశారు. ‘అధికార పార్టీల సభ్యుల ఓట్లు పొందడానికి మా వ్యూహాలు మాకున్నాయి. మాకు మద్దతు ఇస్తున్న అందరి పేర్లు బయటకు చెప్పలేము కదా’అని మీరాకుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీకాదన్నారు. రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని స్పష్టంచేశారు. దేశంలో లౌకిక వాదానికి విఘాతం కలిగించే సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రజలు ఏంతినాలో, ఏం తినకూడదో ప్రభుత్వమే చెప్పడం ప్రమాదకరమన్నారు. కేసీఆర్.. మనసు మార్చుకో: ఉత్తమ్ ముస్లింలు, క్రైస్తవులు దేశంలో పరాయివారని వ్యాఖ్యానించిన రామ్నాథ్ కోవింద్కు ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ఎలా ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మనసు మార్చుకుని, యూపీఏ అభ్యర్థి మీరాకుమార్కు మద్దతు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్రెడ్డి, ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం శాసనసభ్యుడు సున్నం రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకటరెడ్డి, జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాతృ హృదయంతో వ్యవహరించా.. తెలంగాణ బిల్లుపై మీరాకుమార్ లోక్సభలో తెలంగాణ బిల్లు వచ్చిన సమయంలో మాతృహృదయంతో వ్యవహరించానని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి, లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన మీరా కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు చెందిన ముఖ్యులు, వివిధ మీడియా సంస్థల సంపాదకులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి, ఆత్మగౌరవంకోసం స్వరాష్ట్ర కాంక్షతో తెలంగాణ యువత ప్రాణత్యాగాలకు సిద్ధపడుతుంటే ద్రవించిపోయానన్నారు. చారి త్రక సమయంలో తెలంగాణ ఏర్పాటుకు పనిచేసిన సంతృప్తి ఉందన్నారు. తనకు తెలంగాణతో ఎంతో అనుబంధముందన్నారు. హైదరాబాద్తో తనది రెండు తరాల అనుబంధమన్నారు. కాగా, కాంగ్రెస్ నేతలతో కలసి తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపంవద్ద మీరాకుమార్ నివాళులు అర్పించారు. -
వైఎస్సార్సీపీ ఓటింగ్ కీలకం
- మీరాకుమార్కు మద్దతివ్వండి - వైఎస్ జగన్కు పీసీసీ చీఫ్ రఘువీరా లేఖ విజయవాడ సెంట్రల్: రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు 17 పార్టీలు బలపర్చిన మీరాకుమార్కు మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు సొంతగా తన అభ్యర్థిని గెలిపించుకొనే బలం లేదని, దీంతో వైఎస్సార్సీపీ ఓటింగ్ కీలకమైందన్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలన్న తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. రామ్నాథ్ కోవింద్ రాజకీయ జీవితం మనువాద భావజాలం పునాదిగా ఏర్పడిందన్నారు.