
పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్గా మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డిని పార్లమెంట్ ల్రైబరీ కమిటీ చైర్మన్గా లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నియమించారు. లోక్సభ నుంచి ఆరుగురు, రాజ్యసభ నుంచి ముగ్గురు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. లోక్సభ నుంచి డాక్టర్ భగీరథ్ ప్రసాద్, వినోద్ చావ్డా, ఆర్.గోపాలకృష్ణన్, అభిజిత్ ముఖర్జీ సభ్యులుగా ఉండగా.. మరొక స్థానం ఖాళీగాఉంది. రాజ్యసభ నుంచి ప్రభాత్ ఝా, డాక్టర్ టి.ఎన్.సీమ, డి.పి.త్రిపాఠి సభ్యులుగా ఉన్నారు. ఇంతకుముందు డిప్యూటీ స్పీకర్ ఈ కమిటీకి ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉండేవారు. అయితే ఈ నిబంధనను సవరించారు.