మణిపూర్ అఖిలపక్షానికి మోదీ ఆహ్వానం | Modi yet to give appointment: Manipur CM | Sakshi
Sakshi News home page

మణిపూర్ అఖిలపక్షానికి మోదీ ఆహ్వానం

Published Thu, Jun 2 2016 7:18 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

Modi yet to give appointment: Manipur CM

ఇంపాల్: అక్రమ వలసదారుల నిరోధానికి సంబంధించిన మూడు బిల్లులపై చర్చించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ అఖిల పక్ష ప్రతినిధి బృందానికి ఆహ్వానం పంపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఒకారమ్ ఇబోబి గురువారమిక్కడ తెలిపారు. ఈ మూడు బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ గత ఏడాదే ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులను గిరిజన తెగకు చెందిన ఓ వర్గం ప్రజలు వ్యతిరేకిస్తోంది. దీనిపై చర్చించేందుకు ప్రధాని అఖిలపక్షాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం ఒకారమ్ ఇబోబి మాట్లాడుతూ దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే ఏ బిల్లును అయినా సవరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
 
మరోవైపు ఈ బిల్లుకు వ్యతిరేకంగా, మద్దతుగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి.  గతంలో వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో 9 మంది ఆందోళనకారులు మరణించిన విషయం తెలిసిందే. ప్రధాని అపాయింట్ మెంట్ జాప్యంపై ప్రశ్నించగా ప్రధానికి దేశ, విదేశీ సమస్యలు ఎన్నో ఉంటాయని  ఇబోబి అన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement