Appointment
-
తాజా ఆటోమొబైల్ అప్డేట్స్
హ్యుందాయ్, హోండా కార్స్ వాహన ధరల పెంపుఏప్రిల్ నుంచి కొత్త ధరలు అమల్లోకి ముంబై: వాహన ధరల పెంపు కంపెనీల జాబితాల్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా(హెచ్ఎంఐఎల్), హోండా కార్స్ చేరాయి. ‘‘పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఇన్పుట్ వ్యయాలను కొంత భర్తీ చేయడానికి ధరలను సవరించాల్సి వస్తుంది. అందుకే వాహన ధరలను ఏప్రిల్ నుంచి 3% వరకు పెంచుతున్నాము’’ అని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్, సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. అమేజ్, సిటీ, సిటీ ఈ:హెచ్ఈవీ, ఎలివేట్తో సహా వేరియంట్, మోడల్ బట్టి ధరల పరిధి మారుతుందని హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్ తెలిపారు. మారుతీ సుజుకీ ఇండియా, కియా ఇండియా, టాటా మోటార్స్లు తమ వాహన ధరలు వచ్చే నెల నుంచి పెంచే యోచనలతో ఉన్నట్లు ఇప్పటికే తెలిపారు. టఫే వైస్చైర్మన్గా లక్ష్మీ వేణున్యూఢిల్లీ: ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ (టఫే) వైస్ చైర్మన్గా లక్ష్మీ వేణు నియమితులయ్యారు. ఇప్పటికే ఆమె సంస్థ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీకి ట్రాక్టర్లు, ఆటో విడిభాగాల పరిశ్రమలో గణనీయంగా అనుభవం, వ్యాపార నిర్వహణ సామర్థ్యాలు ఉన్నట్లు సంస్థ చైర్మన్ మల్లికా శ్రీనివాసన్ తెలిపారు. వ్యూహాత్మక లక్ష్యాల సాధనలో టఫే, ఐషర్ ట్రాక్టర్స్ బృందాలతో కలిసి పని చేయనున్నట్లు లక్ష్మీ తెలిపారు. బిజినెస్ టుడే ‘వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన మహిళలు‘, ఎకనమిక్ టైమ్స్ ‘యంగ్ లీడర్స్ – 40 అండర్ 40‘ జాబితాల్లో లక్ష్మీ చోటు దక్కించుకున్నారు. ఆమె సుందరం–క్లేటన్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఉబెర్ టూవీలర్ రైడర్లకు మరింత భద్రతన్యూఢిల్లీ: టూ–వీలర్ డ్రైవర్లు, రైడర్లకు మరింత భద్రత కలి్పంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు రైడ్–õÙరింగ్ సంస్థ ఉబెర్ వెల్లడించింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఉబెర్ మోటో డ్రైవర్లకు సేఫ్టీ కిట్లను అందించింది. వీటిలో హెల్మెట్లు, సేఫ్టీ స్టిక్కర్లు మొదలైనవి ఉన్నాయి. ఉబెర్ మోటో యాప్లో హెల్మెట్లు ధరించాలంటూ ప్రయాణికులకు కూడా కోరే విధంగా ఫీచర్లు ఉంటాయని సంస్థ వివరించింది. ట్రాఫిక్లోను సులభంగా వెళ్లగలిగే వెసులుబాటు, సౌకర్యం, తక్కువ ఖర్చు వంటి అంశాలు బైక్ ట్యాక్సీలకు సానుకూలాంశాలుగా ఉంటున్నాయని పేర్కొంది.ఇదీ చదవండి: ఎన్విడియాతో ఐటీ దిగ్గజాల జత -
Latest Appointments: తాజా నియామకాలు
న్యూఢిల్లీ: వాణిజ్యయ శాఖ అదనపు సెక్రటరీగా ఉన్న అజయ్ భదూని ప్రభుత్వ కొనుగోళ్ల ప్లాట్ఫామ్ (గవర్నమెంట్ ఈ–మార్కెట్/జెమ్) సీఈవోగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుత బాధ్యతలకు అదనంగా కొత్త బాధ్యతలు చేపడతారని తెలిపింది. జెమ్ పోర్టల్ను ప్రభుత్వం 2016 ఆగస్ట్ 9న ప్రారంభించడం గమనార్హం. అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు తమకు కావాల్సిన వస్తువుల కొనుగోళ్లకు వీలుగా దీన్ని అభివృద్ధి చేసింది. 1999 గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన భదూ విభిన్న రంగాల్లో విధానాల రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారు. ఇదీ చదవండి: టాటా డిస్ప్లే చిప్స్ వస్తున్నాయ్..ఆర్బీఐ ఈడీగా అజిత్ రత్నాకర్ముంబై: గణాంకాలు, సమాచార నిర్వహణ, ఆరి్థక సుస్థితర శాఖలో ప్రధాన సలహాదారుగా సేవలందిస్తున్న అజిత్ రత్నాకర్ జోషి ఇకపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ శాఖతోపాటు సైబర్ రిస్క్ మేనేజ్మెంట్లో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన జోషీకి ఆర్బీఐ తాజాగా పదవోన్నతి కలి్పంచింది. జోషీ హైదరాబాద్లోని బ్యాంకింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ సభ్యులుగా సైతం పనిచేశారు.అంతేకాకుండా స్థూల ఆరి్థక గణాంకాలు, విధాన సవాళ్లకు సంబంధించిన సంకలనాలపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్లు, కమిటీలలోనూ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. నాగ్పూర్ యూనివర్శిటీ నుంచి స్టాటిస్టిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఐఐటీ మద్రాస్ నుంచి మానిటరీ ఎకనామిక్స్లో పీహెచ్డీ చేశారు. -
‘కొత్త ‘సీఈసీ’ నియామకం రాజ్యాంగ విరుద్ధం’
న్యూఢిల్లీ:నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్కుమార్ నియామక ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ముఖ్య నేత ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. ‘సీఈసీగా జ్ఞానేష్కుమార్ నియామక నిర్ణయం తొందరపడి చేశారు. సీఈసీ నియామక ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రాతినిథ్యం లేకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం తొందరపడి ఈ నియామకం చేపట్టింది.ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సీఈసీ నియామక ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించడంపై బుధవారం(ఫిబ్రవరి)19 సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈలోపే కొత్త సీఈసీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు పరిశీలన లేకుండా సీఈసీని నియమించాలనే తొందరపాటు కేంద్ర ప్రభుత్వ చర్యలో కనిపిస్తోంది.ఎన్నికల ప్రక్రియను బీజేపీ ఎంత నాశనం చేస్తోందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చర్యల వల్ల నకిలీ ఓటర్ల జాబితా, బీజేపీ అనుకూల ఎన్నికల షెడ్యూల్,ఈవీఎంల ట్యాంపరింగ్పై అనుమానాలు బలపడతాయి’అని కేసీ వేణుగోపాల్ తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, కొత్త సీఈసీగా జ్ఞానేష్కుమార్ సోమవారమే నియమితులైన విషయం తెలిసిందే. -
AP: వివాదాస్పదమైన దేవాదాయ కమిషనర్ నియామకం
సాక్షి,విజయవాడ: దేవాదాయ శాఖ కమిషనర్ నియమాకం వివాదాస్పదమైంది. దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్గా కూటమి ప్రభుత్వం తాజాగా రామచంద్రమోహన్కి బాధ్యతలు అప్పగించింది. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్కి కమిషనర్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నాన్ ఐఏఎస్ అధికారికి దేవాదాయశాఖ కమిషనర్గా బాధ్యతలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ అధికారిని కాదని రామచంద్రమోహన్కి బాధ్యతలు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దేవాదాయశాఖలో ఏడీసీ 1 గా ఉన్న అధికారిని పక్కనపెట్టి రామచంద్రమోహన్కి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడమేంటని ఇతర అధికారులు చర్చించుకుంటున్నారు.తీవ్రమైన అవినీతి ఆరోపణలు,కేసులు ఉన్న రామచంద్రమోహన్ దుర్గగుడి ఈవోగా కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకే వ్యక్తికి ఇన్ని బాధ్యతలు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది.సామాజికవర్గం ఎఫెక్ట్తోనే రామచంద్రమోమన్కి కీలక పోస్టు దక్కిందన్న మరో ప్రచారం కూడా జరుగుతోంది. -
కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగాం: మంత్రి పొన్నం
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా సెక్రటేరియట్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించనుంది.ప్రభుత్వం తరపున ఆహ్వాన ప్రతికను అందించేందుకు ఇప్పటికే కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్తో పాటు బీజేపీ కేంద్ర మంత్రులు ప్రభుత్వం తరపున ఆహ్వానాన్ని అందించేందుకు వారి సమయం కోరినట్లు మంత్రి పొన్నం చెప్పారు.కాగా,సెక్రటేరియట్లో తెలంగాణతల్లి విగ్రహ ఏర్పాటు స్థలంపై బీఆర్ఎస్ తొలినుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి రాజీవ్గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోట తెలంగాణతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణతల్లి విగ్రహంలో చేసిన మార్పులపైనా బీఆర్ఎస్ గుర్రుగా ఉంది. -
వైట్హౌస్ స్టాఫ్ చీఫ్గా సూజీ వైల్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వైట్హౌస్కు తొలి అధికారి నియామకాన్ని ప్రకటించారు. తన ప్రచార మేనేజర్ సూజీ వైల్స్ను వైట్హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా నియమిస్తున్నట్లు గురువారం వెల్లడించారు. 67 ఏళ్ల వైల్స్ అమెరికా చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. ‘అమెరికా చరిత్రలో గొప్ప రాజకీయ విజయాన్ని సాధించడానికి సూజీ వైల్స్ నాకు సాయపడ్డారు. 2016లో, 2020లో, ఇప్పుడు నా ప్రచారంలో అంతర్భాగంగా ఉన్నారు. ఆమె కఠినమైన, తెలివైన, సృజనాత్మకమైన వ్యక్తి. అమెరికా చరిత్రలో తొలి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్గా సూజీని నియమించడం గౌరవంగా భావిస్తున్న’ అని ట్రంప్ వెల్లడించారు. ఇది గొప్ప వార్తని ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ హర్షం వ్యక్తం చేశారు. ప్రచారంలో కీలక పాత్ర పోషించిన సూజీ వైట్హౌస్లోనూ అంతే కీలకంగా పనిచేస్తారని తెలిపారు. ఎవరీ సూజీ వైల్స్?సూజీ వైల్స్.. నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎ ఫ్ఎల్) ఆటగాడు, స్పోర్ట్స్ బ్రాడ్కాస్టర్ పాట్ సమ్మరల్ కుమార్తె. 1957 మే 14న జన్మించిన ఆమె.. న్యూయార్క్ రిపబ్లికన్ జాక్ కెంప్ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో వైట్హౌస్లో తన కెరీర్ను ప్రారంభించారు. 1980లలో రోనాల్డ్ రీగన్ అధ్యక్ష ప్రచార బృందంలో చేరారు. ఇది జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్ష ప్రమేయానికి నాంది పలికింది. రీగన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం తరువాత పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఆమె ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడ ఆమె ఇద్దరు జాక్సన్విల్లే మేయర్లకు సలహాదారుగా పనిచేశారు. వ్యాపారవేత్త అయిన రిక్ స్కాట్ గవర్నర్గా గెలిచేందుకు తోడ్పడ్డారు. 2012లో ఉటా గవర్నర్ జాన్ హంట్స్మన్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అదే ఆమెకు మరోమారి వైట్హౌస్కు బాటలు వేసింది. 2016లో డోనాల్డ్ ట్రంప్ ప్రచార బృందానికి నాయకత్వం వహించారు. ఆ తరువాత 2018లో ఫ్లోరిడా గవర్నర్గా రాన్ డిశాంటిస్ గెలుపులోనూ సూజీ కీలక పాత్ర పోషించారు. ఇదీ చదవండి: ముంచింది బైడెనే.. -
నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
సాక్షి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ గురువారం ఈ విషయం ‘ఎక్స్’లో వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్తో సంప్రదించి నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జస్టిస్ ఖన్నా నియామకం నవంబర్ 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కొత్త సీజేఐ వచ్చే నెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన స్వల్పకాలమే పదవిలో ఉంటారు. 2025 మే 13న పదవీ విరమణ చేయనున్నారు. అంటే కేవలం ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్గా నమోదయ్యారు. వేర్వేరు కోర్టుల్లో పనిచేశారు. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో అదే కోర్టులో శాశ్వత జడ్జిగా చేరారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ చైర్మన్గా సేవలందించారు. వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నేషనల్ లీగల్ సరీ్వసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, భోపాల్లోని నేషనల్ జ్యుడీíÙయల్ అకాడమీ గవరి్నంగ్ కౌన్సిల్ సభ్యుడిగానూ పనిచేస్తున్నారు. కీలక తీర్పులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పలు కీలక తీర్పులు వెలువరించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలకు(ఈవీఎంలు) సంబంధించి వీవీప్యాట్లలోని 100 శాతం ఓట్లను లెక్కించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్ను 2024లో కొట్టివేసిన డివిజన్ బెంచ్కు ఆయన నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచి్చన ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరి్టకల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2023లో తీర్పు ఇచి్చన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. వివాహ బంధం పూర్తిగా విఫలమైన సందర్భాల్లో దంపతులకు నేరుగా విడాకులు మంజూరు చేసే అధికారం ఆరి్టకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉందని 2023లో స్పష్టంచేశారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు కార్యాలయం వస్తుందంటూ 2019లో మరో కీలక తీర్పు వెలువరించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్పర్సన్గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధ
సాక్షి, విజయవాడ: ఏపీపీఎస్సీ ఛైర్పర్సన్గా రిటైర్డ్ ఐపీఎస్ ఎఆర్ అనురాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి ఎపీపీఎస్సీ చైర్మన్గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ గత ఏడాది అక్టోబర్ నెలాఖరున అనురాధ పదవీ విరమణ చేశారు. గతంలో ఏపీ ఇంటిలిజెన్స్ డీజీగా, విజిలెన్స్ డీజీగా, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పలు కీలక శాఖలు ఆమె నిర్వహించారు.ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ను జులై నెలలో కూటమి ప్రభుత్వం బలవంతపు రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. అయితే, గత మూడు నెలలుగా చైర్మన్ లేకుండా ఏపీపీఎస్సీ ఉంది. చైర్మన్ లేకపోవడంతో జులై 28 న జరగాల్సిన గ్రూప్-2, అలాగే సెప్టెంబర్ 2 నుంచి పది వరకు నిర్వహించాల్సిన గ్రూప్-1ను చంద్రబాబు సర్కార్ వాయిదా వేసింది. ఏడాది పాటే ఏపీపీఎస్సీ చైర్మన్గా అనురాధ ఉండనున్నారు. చైర్మన్ పదవికి గరిష్ట వయస్సు 62 ఏళ్లు కావడంతో అనూరాధకి ఏడాది పాటే పనిచేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్ -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్.. గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాలరెడ్డి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్రెడ్డి నియమితులయ్యారు.వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆయన ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పలు అంశాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: చంద్రబాబు పాపాలు కడిగేందుకే పూజలు: పేర్నినాని -
దసరాకు ‘కేబినెట్’ ధమాకా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. దసరా పండుగ సమయంలో కొత్త మంత్రులను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. కేబినెట్ విస్తరణకు అడ్డంకులు తొలగినట్టేనని, ఈసారి మంత్రివర్గ విస్తరణ ఖాయమని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే నెల 5వ తేదీ తర్వాత ఎప్పుడైనా కొత్త మంత్రులు కొలువుదీరనున్నారని నేతలు చెబుతున్నారు. ఎవరెవరికి చాన్స్ ఇవ్వాలన్న దానిపై మరోమారు చర్చలు జరిపి ఖరారు చేయనున్నట్టు వివరిస్తున్నారు.బెర్తుల కోసం పోటాపోటీనిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో గరిష్టంగా సీఎం సహా 18 మందికి మంత్రివర్గంలో చోటు ఉంటుంది. ప్రస్తుతం సీఎంతోపాటు 11 మంది మంత్రులు ఉన్నారు. దీనితో మరో ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించే వెసులుబాటు ఉంది. వీటి కోసం తీవ్ర పోటీ నెలకొంది. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. తమకంటే తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కేబినెట్లో ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచే కాకుండా.. మిగతా జిల్లాల నుంచి కూడా డజను మందికి పైగా ఎమ్మెల్యేలు తమకు కేబినెట్ బెర్త్పై ఆశతో ఉన్నారు.ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి పరిశీలిస్తే.. మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి (రంగారెడ్డి), జి.వివేక్, జి.వినోద్, కె.ప్రేమ్సాగర్రావు (ఆదిలాబాద్), పి.సుదర్శన్రెడ్డి (నిజామాబాద్), దానం నాగేందర్, అమీన్ అలీఖాన్ (హైదరాబాద్) మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బాలు నాయక్ (నల్లగొండ), వాకిటి శ్రీహరి (మహబూబ్నగర్), టి.జీవన్రెడ్డి (కరీంనగర్) కూడా కేబినెట్ బెర్త్ కోసం ఒత్తిడి చేస్తున్నారు. వీరికితోడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే కె.మదన్మోహన్రావు, ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం తదితరులు కూడా సామాజిక వర్గాల ప్రాతిపదికన చాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.సామాజిక సమీకరణాలే ప్రాతిపదికగా..కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న దానిపై అధిష్టానం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపింది. పీసీసీ అధ్యక్ష పదవికి, కేబినెట్ విస్తరణకు మధ్య సామాజిక వర్గాల వారీగా లెక్కలు కుదరకపోవడంతో నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేతను నియమించడంతో మిగతా సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం మంత్రిమండలిలో ఏడుగురు ఓసీ వర్గానికి చెందినవారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్టీ నేత ఉన్నారు. కులాల వారీగా చూస్తే నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. ప్రస్తుతం రెడ్లకే చెందిన మరో నేతకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వనున్నట్టు అంచనా. మాదిగ, ఎస్టీ (లంబాడా), బీసీ సామాజిక వర్గాలకు కూడా ఒక్కో బెర్త్ కేటాయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మిగతా రెండు పదవులు ఎవరికన్నది పార్టీ వెసులుబాటు ప్రకారం కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.ఇతర పదవుల భర్తీ కూడా..వివిధ వర్గాలకు మంత్రివర్గంలో స్థానంతోపాటు అసెంబ్లీలో చీఫ్ విప్, విప్ పదవులు కూడా ఇచ్చే చాన్స్ ఉంది. వీటితోపాటు కీలకమైన ఆర్టీసీ, మైనింగ్, ఎంఐడీసీ, మూసీ డెవలప్మెంట్ వంటి కీలక కార్పొరేషన్లకు ఎమ్మెల్యేలను చైర్మన్లుగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై సామాజిక వర్గాల కోణంలో నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. ఆయనతోపాటు సీఎం రేవంత్, సీనియర్ మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు ఢిల్లీ వెళ్లి.. అధిష్టానంతో చర్చించనున్నట్టు సమాచారం. మొత్తమ్మీద దసరా పండుగకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ.. రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఆసక్తి రేకెత్తిస్తోంది. -
ఎయిర్ఫోర్స్ తదుపరి చీఫ్ అమర్ప్రీత్సింగ్
న్యూఢిల్లీ:ఇండియన్ ఎయిర్ఫోర్స్ తదుపరి చీఫ్గా ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ నియమితులయ్యారు.అమర్ప్రీత్సింగ్ ప్రస్తుతం ఎయిర్ఫోర్స్ వైస్ చీఫ్గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎయిర్ఫోర్స్ చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్న వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలో ముగియనుంది.దీంతో అమర్ప్రీత్ సింగ్ ఎయిర్ఫోర్స్ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం(సెప్టెంబర్21) ఒక ప్రకటన విడుదల చేసింది. 1964 అక్టోబరు 27న జన్మించిన ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ,డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.1984 డిసెంబర్లో ఎయిర్ఫోర్స్లో ప్రవేశించారు.దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్లో అత్యంత అనుభవజ్ఞుడైన ఫ్లైయర్గా, ప్రయోగాత్మక టెస్ట్ పైలట్గా అమర్ప్రీత్సింగ్ గుర్తింపు పొందారు.ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.ఇదీ చదవండి.. భారత వృద్ధికి కీలక చర్చలు : పియూష్ గోయెల్ -
మరో మూడు జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. మరో మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులుగా శత్రుచర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.ఇదీ చదవండి: ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్కాగా, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా ఆదాల ప్రభాకర్రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, (ఎమ్మెల్సీ), నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఖలీల్ అహ్మద్ నియమితులయిన సంగతి తెలిసిందే. -
రెండు నియోజకవర్గాలకు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు నియామకాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రెండు నియోజకవర్గాలకు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ల నియామకం జరిగింది.వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిలను నియమించారు.కాగా, ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా, అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. -
నేపాల్ కొత్త ప్రధానిగా కె.పి శర్మ ఓలి
కఠ్మాండు: నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి ఆదివారం(జులై 14) నియమితులయ్యారు. మాజీ పీఎం పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలిన విషయం తెలిసిందే.పార్లమెంటులోని ప్రతినిధుల సభలో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయారు. ఈ క్రమంలోనే కె.పి.శర్మ ఓలి (72) నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్, మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ)ల కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 165 మంది సభ్యుల (సీపీఎన్-యూఎంఎల్- 77, ఎన్సీ- 88) సంతకాలను ఓలి సమర్పించారు. దీంతో కొత్త ప్రధానిగా ఓలిని దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నియమించారు. ఓలితో పాటు మంత్రివర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇప్పటికే ఓలి, దేవ్బాల మధ్య అధికారాన్ని పంచుకోవడంపై ఒప్పందం కుదిరింది. తొలి 18 నెలలు ఓలి ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసేవరకూ దేవ్బా ప్రధానిగా కొనసాగుతారు.ఓలికి దేశ ప్రధానిగా రెండుసార్లు పనిచేసిన అనుభవం ఉంది. -
లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, విప్ నియామకం.. ఎవరంటే?
న్యూఢిల్లీ: లోక్సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపీ గౌరవ్ గొగొయ్ను తిరిగి నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎక్స్(ట్విటర్)లో ఆదివారం(జులై14) వెల్లడించారు.గతంలోనూ గౌరవ్ గొగొయ్ పార్టీ లోక్సభపక్ష ఉపనేతగా బాధ్యతలు నిర్వహించారు. లోక్సభలో పార్టీ చీఫ్విప్గా 8సార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ మెంబర్ కొడికున్నిల్ సురేశ్ను నియమించారు. వీరికి తోడు సీనియర్నేతలు మాణిక్యం ఠాగూర్, ఎండీ జావెద్లకు లోక్సభలో విప్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ లోక్సభ స్పీకర్కు ఒక లేఖ రాశారు. లోక్సభలో పార్టీ కొత్తగా నియమించిన ఉపనేత, చీఫ్విప్, విప్ల పేర్లను లేఖలో తెలిపారు. ప్రతిపక్షనేత రాహుల్గాంధీ మార్గదర్శకత్వంలో లోక్సభలో ప్రజావాణిని బలంగా వినిపిస్తామని కేసీవేణుగోపాల్ ట్వీట్లో పేర్కొన్నారు. -
అతడికి మాత్రమే ఆ అర్హత.. గౌతం గంభీర్ భార్య నటాషా పోస్ట్ వైరల్(ఫొటోలు)
-
సమాచార కమిషనర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాచార కమిషనర్ల కోసం దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. జూన్ 29వ తేదీ లోపు ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. సీఎస్ శాంతకుమారి నోటిఫికేషన్ విడుదల చేశారు.తెలంగాణ ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ TSIC.GOV.IN ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. -
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
న్యూఢిల్లీ: ఎంపీ స్వాతి మలివాల్కు మే13వ తేదీ సీఎం కేజ్రీవాల్ అపాయింట్మెంట్ లేదని సీఎం సహాయకుడు బిభవ్కుమార్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ రోజున ఆమె సీఎం ఇంటి వద్ద భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు. మలివాల్పై 13న సీఎం ఇంట్లో దాడి జరిగిన కేసులో కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కుమార్ను ఢిల్లీ పోలీసులు శనివారం(మే17) అరెస్టు చేశారు.బిభవ్ అరెస్టయిన వెంటనే ఆయన న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా బిభవ్కుమార్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఎంపీ స్వాతిమలివాల్ సీఎం ఇంటికి వచ్చినరోజుకు సంబంధించి సోషల్మీడియాలో సర్క్యులేషన్లో ఉన్న వీడియోలను కోర్టుకు సమర్పించారు. అసలు స్వాతి మలివాల్పై సీఎం ఇంట్లో ఎలాంటి దాడి జరగలేదని తెలిపారు. -
ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా.. నియమించిన ‘ఈసీ’
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్కుమార్ గుప్తాను ఎన్నికల కమిషన్(ఈసీ) నియమించింది. సోమవారం(మే6) సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని గుప్తాను ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రనాథ్రెడ్డిని ఆదివారం ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏపీ చీఫ్ సెక్రటరీ(సీఎస్) ముగ్గురు సీనియర్ అధికారులతో జాబితాను పంపగా అందులో నుంచి హరీష్కుమార్గుప్తాను డీజీపీగా ఈసీ నియమించింది. -
జూన్లో జాబ్ల జాతర
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్, పోస్టింగ్లు ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పార్ల మెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్ల జాతరకు లైన్క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9వేల ఉద్యో గాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేటగిరీలో దాదాపు 2వేలకు పైబడి ఉద్యోగాలున్నాయి. వీటికి కూడా జీఆర్ఎల్ విడుదల చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఇలా పలు విభాగాల్లో దాదాపు 5వేల ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్పీఎస్సీ తెప్పించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లాస్థాయిలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీల్లో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాలను సైతం రూపొందిస్తోంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్ రెండోవారంకల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఆలోపు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం తొలగిపోనుంది. దీంతో టీఎస్పీఎస్సీ తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. జూన్ మూడోవారం నుంచి నియామక పత్రాల పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గురుకుల పోస్టుల్లో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన దాదాపు 1500 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్ కోడ్ ముగియగానే జూన్ మొదటివారం తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఫిబ్రవరి నుంచే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నియామక పత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా పోలీస్శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్సులు, గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీల్లో దాదాపు 33వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్ఈఐఆర్బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా భర్తీ చేసినవే. మూడు బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తయితే... టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ మూడు బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తోంది. -
AP: పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం
సాక్షి, విజయవాడ: ఏపీలో మూడు జిల్లాలకు కలెక్టర్లు, 5 జిల్లాలకు ఎస్పీలను నియామకం జరిగింది. ఇటీవల బదిలీ చేసిన అధికారుల స్థానంలో ఎన్నికల కమిషన్ నియామకాలు చేపట్టింది. ఈ రోజు రాత్రి 8 గంటల లోపు విధుల్లోకి చేరాలని ఈసీ తెలిపింది. ►కృష్ణ కలెక్టర్గా డీకే బాలాజీ ►అనంతపురం కలెక్టర్గా వినోద్ కుమార్ ►తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్ ►ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్ ►పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్ ►చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు ►అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దర్ ►నెల్లూరు ఎస్పీగా అరిఫ్ హఫీజ్ ►గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి బదిలీ -
టీ.కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ సెగ్మెంట్లకు ఇంఛార్జీలను ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. టీ.కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలు భవనగిరి-కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నాగర్ కర్నూల్- జూపల్లి కృష్ణారావు ఖమ్మం-పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నల్గొండ ఉత్తమ్కుమార్రెడ్డి వరంగల్-రేవూరి ప్రకాశ్రెడ్డి మహబూబాబాద్-తుమ్మల నాగేశ్వర్రావు నిజామాబాద్- సుదర్శన్రెడ్డి ఆదిలాబాద్-సీతక్క కరీంనగర్- పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి-శ్రీధర్బాబు హైదరాబాద్-ఒబెదుల్లా కొత్వాల్ సికింద్రాబాద్-కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహబూబ్నగర్-సంపత్, చేవెళ్ల-వేం నరేందర్రెడ్డి మల్కాజ్గిరి-మైనంపల్లి హన్మంతరావు మెదక్- కొండా సురేఖ జహీరాబాద్-దామోదర రాజనర్సింహ -
అంతా నిబంధనల మేరకే
న్యూఢిల్లీ: ఇద్దరు నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం నిబంధనల మేరకే జరిగిందని కేంద్రం పేర్కొంది. ఈ ప్రక్రియ హడావుడిగా జరిగిందన్న ఆరోపణలను తోసిపుచి్చంది. ఈసీల ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేకపోవడాన్ని సమరి్థంచుకుంది. ఎంపిక కమిటీలో న్యాయవ్యవస్థ ప్రాతినిధ్యమే ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి ప్రాతిపదిక కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ సుప్రీంకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈసీల ఎంపిక కమిటీ నుంచి సీజేఐని మినహాయించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో ఈ కేసులో తదుపరి విచారణ గురువారం జరగనుంది. -
ఈసీల నియామకం.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టవద్దని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం(మార్చ్ 15) విచారించనుంది. ఫిబ్రవరిలో ఎన్నికల కమిషనర్ అనూప్చంద్ర పాండే రిటైర్ అవడం, ఇటీవలే మరో ఎన్నికల కమిషనర్ అరుణ్గోయెల్ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడంతో లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషన్లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ రెండు ఖాళీలను నింపేందుకు ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఈ వారంలోనే సమావేశమవనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏడీఆర్ వేసిన పిటిషన్ను లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రి, లోక్సభలో ప్రతిపక్షనేత సభ్యులుగా ఉంటారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) కమిటీలో సభ్యుడిగా ఉండగా కొత్త చట్టంలో ఆయన స్థానంలో కేంద్రమంత్రికి అవకాశం కల్పించారు. అయితే ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పించిన తర్వాత తొలిసారి ఈసీలను కేంద్రం ఎంపిక చేస్తుండటంతో ఏడీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు చెప్పనుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, లోక్సభ ఎన్నిలకు త్వరలో షెడ్యూల్ వెలువడనుండగా ఎన్నికల కమిషనర్ అరుణ్గోయెల్ ఇటీవల ఆకస్మికంగా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. సీఈసీతో ఉన్న విభేదాల కారణంగానే గోయెల్ తన పదవికి రాజీనామా చేశారన్న ప్రచారం జరిగింది. అరుణ్గోయెల్ ఆకస్మిక రాజీనామాతో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇదీ చదవండి.. ఈసీ కసరత్తులు చివరికి ఎల్లుండే షెడ్యూల్ -
డిప్యూటీ సీఎం పదవులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: డిప్యూటీ సీఎం పదవులపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ పదవులపై రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోయినప్పటికీ డిప్యూటీసీఎంల నియామకం చట్ట విరుద్ధం కాదని చీఫ్ జస్టిస్ డీవైచంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పేర్కొంది. డిప్యూటీ సీఎంల నియామకాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన ఓ రాజకీయ పార్టీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని కోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. ‘కొన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నారు. మంత్రి వర్గంలోని సీనియర్ లీడర్లకు ప్రాధాన్యం ఇవ్వడానికి లేదా సంకీర్ణంలోని పార్టీలకు సముచిత స్థానం కల్పించడానికి డిప్యూటీ సీఎంలను అపాయింట్ చేస్తున్నారు. పేరుకు డిప్యూటీ సీఎం అని పిలిచినప్పటికీ ఆయన కూడా మంత్రి వర్గంలో ఒక మంత్రే. డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగంలోని ఏ నిబంధనను ఉల్లంఘించడం లేదు’అని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు ఉండటం గమనార్హం. ఇదీ చదవండి.. తమిళనాడు సర్కారుకు గవర్నర్ షాక్ -
TS: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ను ఎంపిక చేస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు. వారం రోజుల క్రితం ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్కు ప్రభుత్వం పంపింది. దావోస్ పర్యటనకు ముందు పేర్లను గవర్నర్కు పంపగా, నిన్న గవర్నర్ తో భేటీ సందర్భంగా ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చింది. ఇవాళ లేదా రేపు గవర్నర్ అధికారిక ప్రకటన చేయనున్నారు. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్గా ఎం. మహేందర్రెడ్డిని నియామకం ఖరారైంది. మాజీ డీజీపీ అయిన మహేందర్రెడ్డి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీఎస్పీఎస్సీ సభ్యులుగా రిటైరర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రాంమోహన్రావు నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టింగ్ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ పేరును గవర్నర్కు పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్ ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు. ఇదీ చదవండి: బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..! -
టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రక్షాళనకు అడుగులు పడ్డాయి. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. కాగా, దాదాపు నెలరోజులుగా పెండింగ్లో ఉన్న చైర్మన్ జనార్ధన్రెడ్డి, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీలో చైర్మన్తో పాటు 10 సభ్యులుంటారు. కానీ గత ప్రభుత్వం చైర్మన్, ఆరుగురు సభ్యులను మాత్రమే నియమించింది. వీరిలో ఒక సభ్యుడు పదవీ విరమణ పొందగా..ఐదుగురు కొనసాగుతూ వచ్చారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కె.రవీందర్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు. రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన మరుక్షణమే టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని డిసెంబర్ 27న సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడ్తామని, నిరుద్యోగులెవరూ ఆందోళనకు గురికావద్దని అన్నారు. తాజాగా నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పరిధిలో దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇదీ చదవండి: సంక్రాంతి ఎఫెక్ట్: విజయవాడ హైవేపై కదలని వాహనాలు -
YSRCP: మూడు అనుబంధ విభాగాలకు సహాధ్యక్షుల నియామకం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అనుబంధ విభాగాలను మరింత విస్తృతం చేసింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో YSRCP మూడు అనుబంధ విభాగాలకు రాష్ట్ర సహాధ్యక్షుల నియామకం జరిగింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సహాధ్యక్షులుగా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, సేవాదళ్ విభాగం రాష్ట్ర సహాధ్యక్షులుగా డా.కట్టి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సహాధ్యక్షులుగా బసిరెడ్డి సిద్ధారెడ్డి నియమితులయ్యారు. సిద్ధారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన సిద్ధారెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తనపై నమ్మకముంచి తనకు కీలకమైన బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, పార్టీ ప్రచార బాధ్యతలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని సిద్ధారెడ్డి తెలియజేశారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఇప్పటికే ఆర్. ధనుంజయ్రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బసిరెడ్డి సిద్ధారెడ్డి, YSRCP రాష్ట్ర ప్రచారకమిటీ సహాధ్యక్షులు గుర్రంపాటి దేవేందర్రెడ్డి, YSRCP పంచాయతీ రాజ్ విభాగం సహాధ్యక్షులు కట్టి వెంకటేశ్వర్లు, YSRCP సేవాదళ్ విభాగం సహాధ్యక్షులు ఇదీ చదవండి: జగన్ పదునైన ప్రశ్నలు.. ఇంకేం ఇద్దరూ గప్చుప్! -
Winter Parliament Session 2023: సీఈసీ, ఈసీల నియామకానికి ప్రధానమంత్రి ప్యానెల్!
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన కీలక బిల్లును లోక్సభ గురువారం ఆమోదించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్మెంట్, కండీషన్స్ ఆఫ్ సరీ్వస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు–2023ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. స్వల్పకాలిక చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును ఈ నెల 12న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే బిల్లును తీసుకొచి్చనట్లు అర్జున్రామ్ మేఘ్వాల్ లోక్సభలో చర్చ సందర్భంగా ప్రకటించారు. ఈసీసీ, ఈసీల సరీ్వసు నిబంధనలకు సంబంధించి 1991 నాటి చట్టంలో కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తూ కొత్త బిల్లును రూపొందించినట్లు తెలియజేశారు. ప్రతిపాదిత కొత్త చట్టం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. సీఈసీ, ఈసీల నియామకానికి చట్టాన్ని తీసుకొచ్చేవరకూ ముగ్గురు సభ్యులతో ఒక ప్యానెల్ ఏర్పాటు చేయాలని ఈ ఏడాది మార్చి నెలలో ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించిందని అన్నారు. ఈ ప్యానెల్లో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని పేర్కొందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే బిల్లును తయారు చేసినట్లు స్పష్టం చేశారు. రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల విభజనకు అనుగుణంగా రూపొందించామని అన్నారు. అలాగే సీఈసీ, ఈసీల హోదా, వేతనాలకు సంబంధించిన సవరణలను కూడా బిల్లులో పొందుపర్చారు. బిల్లులో ఏముంది? ► ప్రస్తుతం సీఈసీ, ఈసీలను కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమిస్తున్నారు. ► సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీఈసీ, ఈసీల నియామకం ఇకపై ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్యానెల్ పరిధిలోకి రానుంది. అంటే కార్యనిర్వాహక వర్గమే సీఈసీ, ఈసీలను నియమిస్తుంది. ► బిల్లు చట్టంగా మారిన తర్వాత సీఈసీ, ఈసీల నియామకం కోసం కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో సెర్చ్ కమిటీని ఏర్పాటు ఏయాల్సి ఉంటుంది. ఇందులో ఇద్దరు కేంద్ర కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. సీఈసీ, ఈసీల నియామకం కోసం ఐదుగురి పేర్లతో షార్ట్లిస్టు తయారు చేసి సెలక్షన్ కమిటీకి పంపించాలి. ► ఆ తర్వాత ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక కేంద్ర మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ ఎన్నికల సంఘం సభ్యులను ఎంపిక చేస్తుంది. ► ఒకవేళ లోక్సభలో ప్రతిపక్ష నేత లేకపోతే సభలోని ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిని సెలక్షన్ ప్యానెల్లో సభ్యుడిగా నియమిస్తారు. ► సెర్చ్ కమిటీ సూచించిన షార్ట్లిస్టులో లేని పేర్లను కూడా పరిగణనలోకి తీసుకొనే అధికారం ప్యానెల్కు ఉంటుంది. ► సవరించిన బిల్లు ప్రకారం.. సీఈసీ, ఈసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమాన హోదా లభిస్తుంది. ► సీఈసీ, ఈసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా వేతనం చెల్లిస్తారు. ► అధికారిక విధులు నిర్వర్తించే క్రమంలో సీఈసీ, ఈసీలకు కోర్టు కేసుల నుంచి రక్షణ కలి్పస్తూ సవరణ బిల్లులో కొన్ని అంశాలు చేర్చారు. ► సీఈసీ సిఫార్సు లేకుండా ఈసీలను పదవి నుంచి తొలగించడానికి వీల్లేదు. ► సుప్రీంకోర్టు జడ్జిని పదవి నుంచి తొలగించడానికి ఉపయోగించే ప్రక్రియనే సీఈసీ విషయంలోనూ ఉపయోగించాలి. ► సెక్రెటరీ ర్యాంకు లేదా సమాన హోదా ఉన్నవారిని మాత్రమే సీఈసీ, ఈసీలుగా నియమించాలి. ► సీఈసీ, ఈసీలపై గతంలోనే కేసులు ఉంటే.. వారు పదవుల్లో ఉన్నంతకాలం ఆయా కేసుల్లో విచారణ కొనసాగించకూడదు. గతంలో సీఈసీ రాజీవ్ కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన స్పెషల్ సెషన్స్ జడ్జిని తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పదవుల్లో ఉన్న సీఈసీ, ఈసీలపై విచారణ కొనసాగించకూడదన్న నిబంధననను బిల్లులో చేర్చారు. -
నూతన సీపీలు, ఎస్పీల నియామకంపై డీజీపీ కసరత్తు.. హైదరాబాద్ సీపీ రేసులో ఉన్నది వీరే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, ఓ శాఖ కార్యదర్శి, మరో శాఖ డైరెక్టర్, ఇంకో శాఖ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది. వీరిలో 18 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలకు శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని ఆంక్షలు విధించింది. బదిలీ అయిన అధికారులు సత్వరమే బాధ్యతల నుంచి తప్పుకొని తమ తర్వాతి స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మూడు శాఖలకు కొత్త ముఖ్య కార్యదర్శులతోపాటు బదిలీ వేటుపడిన 20 మంది అధికారుల స్థానంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా కొత్త అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది ఈ క్రమంలో నూతన సీపీలు, ఎస్పీల నియామకంపై డీజీపీ అంజనీకుమార్ కసరత్తు ప్రారంభించారు. సీఈసీకి పంపే లిస్ట్ను డీజీపీ సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సీపీ రేసులో మహేష్ భగవత్, షికా గోయల్, శివధర్రెడ్డి, కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, నాగిరెడ్డి, సజ్జనార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముగ్గురి పేర్లతో సీఈసీకి ప్రభుత్వం లిస్ట్ పంపనుంది. ప్రతి పోస్టుకు ముగ్గురు పేర్లతో జాబితాను ప్రభుత్వం పంపనుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఆయా పోస్టుల్లో ఈసీ ఎంపిక చేయనుంది. రాష్ట్ర సర్కార్ పంపిన ముగ్గురి జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు ఉంటే ఈసీ తిరస్కరించే అవకాశం ఉంది. మళ్లీ కొత్తగా పేర్లు ప్రతిపాదన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరనుంది. ఈసీ ఫైనల్ చేసిన తర్వాత ఆయా నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. -
గవర్నర్ పేరుతో టీడీపీ దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్ట్.. రిమాండ్పై ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో టీడీపీ నేతలు గవర్నర్ పేరుతో రకరకాల ప్రచారాలకు తెరలేపారు. గవర్నర్ తమకు అపాయింట్మెంట్ ఇచ్చారని, కలవడానికి తమ నేతలు వెళుతున్నారని ప్రకటనలు విడుదల చేశారు. శనివారం సాయంత్రం 7 గంటలకు గవర్నర్ తమ పార్టీనేతలకు అపాయింట్మెంట్ ఇచ్చారని తెలిపారు. తర్వాత కొద్దిసేపటికి అపాయింట్మెంట్ మరునాటికి మారిందని టీడీపీ వర్గాలు మాట మార్చాయి. వాస్తవానికి శనివారం గవర్నర్ విశాఖపట్నంలో ఉన్నారు. ఆ విషయం తెలిసి కూడా టీడీపీ జనాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించింది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు గవర్నర్ను కలుస్తున్నట్లు ప్రచారం చేశాయి. కానీ.. అది కూడా జరగలేదు. మరోవైపు ఎల్లో మీడియా ఒకడుగు ముందుకు వేసి చంద్రబాబు అరెస్ట్ పట్ల గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని, తనకు తెలియకుండా ఎలా జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారనే ప్రచారానికి దిగాయి. శనివారం సాయంత్రం చంద్రబాబు అరెస్ట్పై వివరణ ఇవ్వాలని గవర్నర్ సీఐడీ అధికారులను కోరారని, వాళ్లు ఫైళ్లు పట్టుకుని పరుగులు పెడుతున్నారని వార్తలు ప్రసారం చేశాయి. చివరకు అవన్నీ ఎల్లో మీడియా పుకార్లేనని తేలింది. కోర్టులో ఉత్కంఠ నెలకొన్న తరుణంలో కావాలని రకరకాల ప్రచారాలకు తెరలేపి ప్రజల్లో గందరగోళం సృష్టించారు. -
బీజేపీ ఇన్చార్జీ కమిటీల నియామకం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీ వివిధ కమిటీల నియామకాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే కొన్ని కమిటీలను ఏర్పాటు చేయగా తాజాగా 17 లోక్సభ స్థానాలకు ‘పార్లమెంట్ ప్రభారీలు’ (ఇన్చార్జీలు), 33 జిల్లాలకు ఇన్చార్జీలను నియమించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆయా కమిటీల సభ్యలను నియమించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ప్రభారీలు వీరే... ఆదిలాబాద్–అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దపల్లి–విశ్వవర్ధన్రెడ్డి, కరీంనగర్–పి.గంగారెడ్డి, నిజామాబాద్–వెంకటరమణి, జహీరాబాద్–బద్దం మహిపాల్రెడ్డి, మెదక్–ఎం.జయశ్రీ, మల్కాజిగిరి–ఎ.పాపారావు, సికింద్రాబాద్–దేవకి వాసుదేవరావు, హైదరాబాద్–గోలి మధుసూదన్రెడ్డి, చేవెళ్ల–పి,సుగుణాకరరావు, మహబూబ్నగర్–వి.చంద్రశేఖర్, నాగర్కర్నూల్– ఎడ్ల ఆశోక్రెడ్డి, నల్లగడొండ–చాడ శ్రీనివాసరెడ్డి, భువనగిరి–అట్లూరి రామకృష్ణ, వరంగల్–వి.మురళీథర్గౌడ్, మహబూబాబాద్–ఎన్.వెంకటనారాయణరెడ్డి, ఖమ్మం–కడగంచి రమేశ్. జిల్లా ఇన్చార్జీలు వీరే... ఆదిలాబాద్–బద్దం లింగారెడ్డి, నిర్మల్–ఎం. మల్లారెడ్డి, కొమురం భీమ్–ఎం.మహేశ్బాబు, నిజామాబాద్–కళ్లెం బాల్రెడ్డి, కామారెడ్డి–ఎర్ర మహేశ్, కరీంనగర్– మీసాల చంద్రయ్య, జగిత్యాల– చంద్రశేఖర్, పెద్దపల్ల–రావుల రాంనాథ్, రాజన్న సిరిసిల్ల–జి.మనోహర్రెడ్డి, సంగారెడ్డి–జె.రంగారెడ్డి, మెదక్–డా.ఎస్.మల్లారెడ్డి, రంగారెడ్డి రూరల్–పి.అరుణ్ కుమార్, వికారాబాద్–వి.రాజవర్ధన్రెడ్డి, మేడ్చల్ అర్బన్–గిరిమోహనశ్రీనివాస్, మేడ్చల్ రూరల్– వి.నరేందర్రావు, నల్లగొండ–ఆర్.ప్రదీప్కుమార్, యాదాద్రి– జె.శ్రీకాంత్, మహబూబ్నగర్ కేవీఎల్ఎన్ రెడ్డి, వనపర్తి–బోసుపల్లి ప్రతాప్, నాగర్కర్నూల్–టి.రవికుమార్, గద్వాల–బి.వెంకటరెడ్డి, నారాయణపేట–కె.జంగయ్య యాదవ్, హనుమకొండ–అడ్లూరి శ్రీనివాస్, వరంగల్– కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, భూపాలపల్లి–ఎస్.ఉదయ్ ప్రతాప్, జనగామ–యాప సీతయ్య, మహబూబాబాద్–బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, ములుగు– ఎ.వెంకటరమణ, ఖమ్మం–ఎస్.విద్యాసాగర్రెడ్డి, కొత్తగూడెం–ఆర్.రుక్మరాజు, గోల్కొండ–గోషామహల్–ఎస్.నందకుమార్యాదవ్, మహంకాళి–సికింద్రాబాద్–నాగూరావు నామాజీ, హైదరాబాద్ సెంట్రల్– టి.అంజన్కుమార్గౌడ్. -
15 తర్వాతే సమగ్ర నోటిఫికేషన్!
ప్రశ్నపత్రాల కూర్పు ఎవరికి? టీఆర్టీ పరీక్ష నిర్వహణ పబ్లిక్ సర్విస్ కమిషన్కు ఇవ్వడమా? ఎస్సీఈఆర్టీకి ఇవ్వడమా? అనే అంశంపై అధికారులు చర్చించారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తే పబ్లిక్ సర్విస్ కమిషన్ పరిధిలోకి తెచ్చే వీలుందని, ఆఫ్లైన్ విధానమైతే ఎస్సీఈఆర్టీకి అప్పగించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఎస్సీఈఆర్టీకి ఇవ్వడమే సరైన నిర్ణయమని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) విధివిధానాల రూపకల్పనపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సమక్షంలో ఉన్నతాధికారులు సోమవారం ఈ అంశంపై చర్చించారు. ఒకటీ రెండు రోజుల్లో వీటిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. ప్రతి జిల్లాలోనూ డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఏర్పాటు, వాటికి ఇవ్వాల్సిన అధికారాలపై అధికారులు చర్చించినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. టీఆర్టీని రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో డీఎస్సీలకు పరిమిత అధికారాలు మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమన్వయం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు పరీక్ష నిర్వహణ ప్రక్రియ మొత్తం రాష్ట్రస్థాయిలోనే కేంద్రీకృత వ్యవస్థలో నిర్వహించే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. అవసరమైతే రాష్ట్రస్థాయి పరీక్ష నిర్వహణకు ప్రత్యేక సమన్వయ కర్తలను నియమించాలని భావిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో టీఆర్టీ పరీక్షకు చట్టపరమైన అడ్డంకులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం సూచించింది. దీంతో విధివిధానాల తయారీలో న్యాయ కోవిదుల సలహాలు కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ సెపె్టంబర్ 15 తర్వాతే వెలువడే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆన్లైనా? ఆఫ్లైనా? పరీక్ష నిర్వహణ మొదలుకొని, నియామక ప్రక్రియ వరకూ ఎవరి బాధ్యత ఏమిటనే దానిపై తొలుత వెలువడే ప్రభుత్వ జీవోలోనే స్పష్టత ఇవ్వాలని వాకాటి కరుణ అధికారులకు సూచించారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో పరీక్షల్లో ఏది ప్రయోజనం అనే అంశాన్నీ చర్చించారు. ఆన్లైన్ విధానంలో కొన్ని సమస్యలు వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు. టీఆర్టీ పరీక్ష భాషా పండితులకు, సబ్జెక్టు టీచర్లకు, ఎస్టీజీటీలకు విడివిడిగా నిర్వహిస్తారు. టీఆర్టీకి దరఖాస్తు చేసే వారి సంఖ్య దాదాపు 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ పరీక్ష విధానంలో ప్రశ్నపత్రం కూర్పు సమస్యలకు తావిస్తుందనే సందేహాలున్నాయి. ఒకేరోజు 4 లక్షల మందికి కంప్యూటర్ బేస్డ్గా పరీక్ష నిర్వహణ కష్టమని.ఒక్కో జిల్లాకు రెండు సెషన్స్ పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. అదే ఆఫ్లైన్లో అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు పరీక్ష నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల ఫలితాల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పోస్టులు, వెయిటేజీపై ఇంకా అస్పష్టత సమగ్ర నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 తర్వాతే వెలువడే వీలుందని అధికారులు అంటున్నారు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి? సబ్జెక్టుల వారీగా ఎన్ని ఉన్నాయి? రిజర్వేషన్ల వారీగా పోస్టుల విభజన, బ్యాక్లాగ్ పోస్టుల సంఖ్యపై ముందుగా స్పష్టత రావాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎస్జీటీలకు, ఎస్ఏలకు ఉండే అర్హతలపైనా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు టెట్ అర్హులకు ఇవ్వాల్సిన వెయిటేజీ పైనా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమగ్ర నోటిఫికేషన్ వెలువడేందుకు మరికొంత సమయం పట్టే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. -
YSRCP: జిల్లా నూతన కార్యవర్గాల నియామకం
సాక్షి, తాడేపల్లి: అన్ని జిల్లాలకు కొత్త కార్యవర్గాలను నియమిస్తూ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ సహా మొత్తం కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నూతన నియామకాలను చేపట్టినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ►అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ►అనకాపల్లి జిల్లా-బొడ్డేట ప్రసాద్ ►అనంతపురం-పైల నరసింహయ్య ►అన్నమయ్య జిల్లా-ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ►బాపట్ల-ఎంపీ మోపిదేవి వెంకటరమణ ►చిత్తూరు-ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ ►కోనసీమ-ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ►తూర్పు గోదావరి- ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ►ఏలూరు-ఎమ్మెల్యే ఆళ్ల నాని ►గుంటూరు-డొక్కా మాణిక్య వరప్రసాద్ ►కాకినాడ-ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ►కృష్ణా-ఎమ్మెల్యే పేర్ని నాని ►కర్నూలు-ఎమ్మెల్యే బీవై. రామయ్య, మేయర్ ►నంద్యాల-ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ►ఎన్టీఆర్ జిల్లా- ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ►పల్నాడు జిల్లా- ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ►పార్వతీపురం మన్యం- శత్రుచర్ల పరీక్షిత్ రాజు ►ప్రకాశం-జంకె వెంకటరెడ్డి ►నెల్లూరు- ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ►సత్యసాయి జిల్లా- ఎమ్మెల్యే ఎం. శంకరనారాయణ ►శ్రీకాకుళం- ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, ►తిరుపతి జిల్లా- నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ►విజయనగరం-మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జడ్పీ చైర్మన్ ►వెస్ట్ గోదావరి- ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ►వైఎస్సార్ జిల్లా : కె.సురేష్ బాబు, మేయర్ -
సమాచార కమిషనర్ల నియామకంపై తెలంగాణ హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ పై సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధాన, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామన్న ప్రభుత్వం.. ప్రధాన సమాచార కమిషనర్ కోసం 40 దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టుల కోసం 273 దరఖాస్తులు వచ్చాయని, సమాచార కమిషనర్ల నియామకం కోసం ఎంపిక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. సమాచార కమిషనర్ల ఎంపిక కోసం నాలుగు వారాల గడువును ఉన్నత న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. దీంతో సమాచార కమిషనర్ల నియామకంపై విచారణ నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. చదవండి: తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జిపై ససెన్షన్ వేటు -
సీఈసీ నియామకంలో సీజేఐకు అధికారం లేనట్టే
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియంపై విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదాస్పద బిల్లును మోదీ సర్కార్ గురువారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది. ఆయన స్థానంలో కేబినెట్ మంత్రికి స్థానం కల్పించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల సంఘంపై కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి. కేంద్రం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చే వరకు ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు లతో కూడిన త్రిసభ్య కమిటీ సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపడుతుందని గత మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీజేఐను తప్పించి కేబినెట్ మంత్రిని చేర్చడం వివాదానికి దారితీసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీసు) బిల్లు, 2023ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసిన కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీయే సీఈసీ, ఈసీలను ఎంపిక చేస్తుంది. కాంగ్రెస్, ఆప్ ఇతర విపక్ష పార్టీ సభ్యుల ఆందోళనల మధ్య ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సుప్రీం తీర్పుని లెక్క చేయరా ? సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వుల్ని నీరు కార్చేలా ఈ బిల్లు ఉందని విపక్షాలు విమర్శించాయి. కమిటీ నుంచి సీజేఐని తప్పించడం అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలపై ఇది ప్రభావం చూపిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులేమైనా బీజేపీకి నచ్చకపోతే వాటిని లెక్క చేయదని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం మొత్తాన్ని ప్రధాని మోదీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఆరోపించారు. కమిటీలో ఇద్దరు బీజేపీకి చెందినవారే ఉంటే నిష్పాక్షికంగా కమిషనర్ల ఎంపిక ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఈసీలో ఖాళీ కేంద్ర ఎన్నికల కమిషన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీ ఏర్పడనుంది. ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేకి 65 ఏళ్లు నిండనుండడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేస్తారు. 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది రోజుల ముందే ఆయన పదవీ విరమణ చేస్తారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలి. తాము చెప్పినట్టు వినే కమిషనర్ను నియమించుకొని ఎన్నికల కమిషన్ను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్రం ఇదంతా చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించే వారు. -
ఏపీలో 175 నియోజకవర్గాలకు రిటర్నింగ్ ఆఫీసర్లు నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులిచ్చారు. నియోజకవర్గంలోని ఆర్డీవో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ప్రాజెక్ట్ డైరెక్టర్లలో ఒకరిని రిటర్నింగ్ ఆఫీసర్లుగా నియమించారు. వీరినే నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా నియమించారు. మండలాలకు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, మునిసిపల్ కమిషనర్లలో ఒకరిని నియమిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. చదవండి: మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’ -
సిబ్బంది నియామకానికి ప్రత్యేక నోటిఫికేషన్
చివ్వెంల (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా కోర్టులో సిబ్బంది నియామకానికి ప్రత్యేక నోటిఫికేషన్ వేసేలా చూస్తానని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ జి.రాధారాణి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టును ఆమె సందర్శించారు. కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించి మొక్క నాటారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. కోర్టులో అదనంగా రెండు ఫ్లోర్లు నిర్మించాలని, సిబ్బందిని నియమించాలని, కోర్టులో పెండింగ్లో ఉన్న 7 వేల కేసుల పరిష్కారానికి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఫ్యామిలీ కోర్టు, లేబర్ కోర్టును మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొండ్రాల అశోక్ పోర్టుఫోలియో కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ, సూర్యాపేట జిల్లా కోర్టుకు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఏ సమస్య ఉన్నా జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రధాన న్యాయమూర్తి తన దృష్టికి తీసుకువస్తారని చెప్పారు. సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్, సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీవాణి, హుజూర్నగర్ సీనియర్ సివిల్ జడ్జి కె.శ్యాంకుమార్, జూనియర్ సివిల్ జడ్జిలు కామిశెట్టి సురేశ్, జె.ప్రశాంతి, శ్యాంసుందర్, మారుతి ప్రసాద్, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోలేబోయిన నర్సయ్య యాదవ్ పాల్గొన్నారు. -
ఏసీబీకి చేతికి చిక్కిన వీసీ.. ఇంతకూ తొలగించే అధికారం ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ఏసీబీ వలలో చిక్కిన తర్వాత రాజ్యాంగ పరమైన అనేక అంశాలపై విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి వీసీ నియామకం, తొలగింపుపై పూర్తి అధికారాలు గవర్నర్కు మాత్రమే ఉంటాయి. నియామకానికి సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా, తొలగింపు విషయంలో మాత్రం ఏ అధికారం ఉండదని నిబంధనలు పేర్కొంటున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలోనూ వీసీ ఈ అంశాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కాలేజీ విద్య కమిషనర్కు తనను ప్రశ్నించే అధికారమే లేదని ఆయన అన్నట్టు మీడియాలో వచ్చింది. ఆ త ర్వాత కూడా తనను తీసివేసే అధికారం ప్రభుత్వాని కి ఎక్కడుందనే వాదన పరోక్షంగా వీసీ లేవ నెత్తారు. ఇదే క్రమంలో యూనివర్సిటీ పాలన వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేయడం, తాజాగా ఓ వ్యవహారంలో ఏసీబీ ప్రత్యక్షంగా వీసీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం ఈ ఎపిసోడ్లో కొత్త మలుపు. ఇప్పు డు జరగబోయేదేంటనేది హాట్ టాపిక్గా మారింది. వీసీ నియామకం ఎలా...? ఏదైనా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ను నియమించేటప్పుడు ముందుగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ ప్రక్రియ కోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇందులో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు, వీసీ నియామకం జరిగే విశ్వవిద్యాలయం నుంచి ఒకరిని ఈ కమిటీలో చేరుస్తారు. యూజీసీ ఎవరినైనా నిపుణుడిని సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యాశాఖ కార్యదర్శి సభ్యుడిగా ఉంటారు. యూనివర్సిటీ తరపున పదవీ విరమణ చేసిన నిపుణుడైన మాజీ వీసీని సాధారణంగా చేరుస్తారు. నోటిఫికేషన్ తర్వాత వచ్చే దరఖాస్తులను కమిటీ పరిశీలించి, ముగ్గురి పేర్లను గవర్నర్కు పంపుతుంది. ఇందులోంచి గవర్నర్ ఒకరిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత గవర్నర్ నియామకానికి సంబంధించిన నియామకపు ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి ఇస్తారు. తొలగింపు ఎలా? గవర్నర్ నియమించిన వైస్ చాన్స్లర్ ప్రభుత్వానికి ఇష్టం లేదనుకుంటే రెండింట మూడొంతుల అసెంబ్లీ మెజారిటీ తీసుకుని వీసీ తొలగింపు ఉత్తర్వులు ఇవ్వొచ్చు. ఇక్కడ కూడా అసెంబ్లీ నిర్ణయాన్ని గవర్నర్కు పంపాల్సి ఉంటుంది. నేరుగా గవర్నర్కు కూడా వీసీని కారణాలు లేకుండా తొలగించే అధికారం ఉండదు. అయితే, తెలంగాణ యూనివర్సిటీ వీసీ వివాదం భిన్నమైంది. ఇలాంటి సంక్లిష్ట సమస్య గతంలో ఎప్పుడూ ఎదురవ్వలేదు. ఏసీబీ దాడి చేయడంపైనా పలు ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. ఇలా దాడి చేయాలన్నా, ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలా? అనే విషయమై ఉన్నతాధికారులు ముందుగా న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. వీసీ వేతనం తీసుకుంటున్నాడు కాబట్టి, ప్రజా సేవకుడిగానే చూడాలని నిపుణులు తెలిపారు. కాబట్టి ఏసీబీ చట్టం పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు. ఏసీబీ దాడి, అరెస్టు జరిగిన తర్వాత వీసీని కూడా సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విచారణ పూర్తయి నేరం రుజువైతే శాశ్వతంగా తొలగించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని చెబుతున్నారు. కాకపోతే ప్రతీ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళా్లల్సిన అవసరం ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
‘టీఎస్పీఎస్సీ’ సభ్యుల నియామకంపై సర్కార్కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుల నియామకంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించారా? లేదా? అన్నది పునః పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మూడు నెలల్లో కసరత్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆరుగురి నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రశ్న ప్రస్తుత దశలో అవసరం లేదని అభిప్రాయపడింది. అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 108ను రద్దు చేయలేమని తేల్చి చెప్పింది. ఆ ఆరుగురి నియామకం ప్రభుత్వ తాజా కసరత్తుకు లోబడి ఉంటుందని చెప్పింది. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం ఎలాంటి ఎంపిక ప్రక్రియ నిర్వహించకపోవడం మాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమిస్తూ 2021, మే 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో చేసింది. అయితే నియామకం అయిన వారిలో ఆరుగురు సభ్యులు ధన్సింగ్, బండి లింగారెడ్డి, సుమిత్రా ఆనంద్ తనోబా, కారం రవీందర్రెడ్డి, అరవిల్లి చంద్రశేఖర్రావు, ఆర్ సత్యనారాయణ నిబంధనల మేరకు అర్హులు కాదని పేర్కొంటూ హైదరాబాద్ చెందిన ప్రొఫెసర్ వినాయక్రెడ్డి 2021లో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం 80పేజీల కీలక తీర్పు వెల్లడించింది. ఆరుగురి నియామక తీరును హైకోర్టు తప్పుబట్టింది. ’ఇష్టం వచ్చినవారికి ఎంపిక చేయడం కాదు’ రాజ్యాంగంలోని అధికరణ 316 ప్రకారం చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించి ఎలాంటి అర్హతలు, విధానాన్ని పేర్కొనకపోయినప్పటికీ కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్, సభ్యుల పదవులకు తగ్గట్టుగా అర్హత, సామర్థ్యం ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉన్నత రాజ్యాంగ పదవుల్లో నియామకాలు చేపట్టేముందు వారి పూర్వాపరాలను విచారించడంతోపాటు నిశితంగా పరిశీలన జరపాల్సి ఉందని తెలిపింది. రాజ్యాంగంలోని అధికరణ 316 ప్రకారం కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం చేసే అధికారం గవర్నర్కు ఉందని, నియామక విధానం లేనంత మాత్రాన ప్రభుత్వం తన విచక్షణాధికారంతో ఇష్టం వచ్చినవారికి ఎంపిక చేయడం కాదని వ్యాఖ్యానించింది. నిబంధనల మేరకే నియామకమన్న న్యాయవాది ‘సభ్యులపై వ్యక్తిగతంగా ఎవరికీ అభ్యంతరాలు లేవు. నియామకాలు చట్ట విరుద్ధం. నియమితులైన వారిలో రమావత్ ధన్సింగ్ జీహెచ్ఎంసీలో ఈఎన్సీగా పదవీ విరమణ పొందారు. లింగారెడ్డి ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సుమిత్ర ఆనంద్ జెడ్పీ స్కూల్లో తెలుగు టీచరు. ఎ.చంద్రశేఖర్రావు ఆయుర్వేదిక్ డాక్టర్. రవీందర్రెడ్డి రిటైర్డు డిప్యూటీ తహసీల్దార్. ఆర్.సత్యనారాయణ ఎమ్మెల్సీగా సేవలందించారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర సివిల్ సర్వీసెస్లో ఫస్ట్ క్లాస్ గెజిటెడ్ పోస్టుల్లో పని చేసిన వారే అర్హులు’అని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. -
దాని గురించి మాట్లాడను! 'అదంతా మైండ్గేమ్': న్యాయశాఖ మంత్రి
కేంద్ర న్యాయశాఖ మంత్రి కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఈ మేరకు రిజిజ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియమాకానికి సంబంధించి ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న సుప్రీం కోర్టు కొలీజియంకి సంబంధించిన సిఫార్సులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కొలీజియం ఇష్యూ అంతా మైండ్గేమ్గా అభివర్ణించారు. దీనిపై తాను మాట్లాడనని కూడా చెప్పారు. ఈ మేరకు అరుణాచల్ ప్రదేశ్లో 4జీ సేవల కోసం 254 మైబెల్ టవర్లను అంకితం చేసే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రిజిజు మాట్లాడుతూ..కఠినమైన భూభాగాలను కలిగిన సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత స్థానికులకు ప్రధాన సమస్యగా ఉందన్నారు. రిజిజు అరుణాచల్ ప్రదేశ్లోని తపిర్ గావో లోక్సభకు ప్రాతినిధ్యం వహస్తున్నారు. కాగా, ఆయన కొలీజియంని మన రాజ్యాంగానికి విరుద్ధమైనదిగా కూడా పిలివడం గమనార్హం. (చదవండి: ఇది నిజం మాట్లాడినందుకు చెల్లిస్తున్న మూల్యం! రాహుల్ గాంధీ) -
టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్పర్సన్గా మానసి టాటా.. ఎవరీ మానసి?
సాక్షి,ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్పర్సన్గా విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె మానసి టాటా నియమితు లయ్యారు. ఆమె తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ అకాలమరణం తరువాత, కంపెనీ JV కంపెనీల బోర్డులో డైరెక్టర్ అయిన మానసి టాటాను టయోటా కిర్లోస్కర్ ఆటో విడిభాగాల (TKAP) వైస్ చైర్పర్సన్గా నియమించింది. తక్షణమే వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ గురువారం ప్రకటించింది. మానసి టాటా ఇప్పటికే టయోటా కిర్లోస్కర్ మోటార్లో డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. అలాగే కంపెనీ కార్పొరేట్ నిర్ణయాలు ,వ్యూహాత్మక కార్యకలాపాలలో కీలకంగా ఉన్నారని కంపెనీ ఒకప్రకటనలో తెలిపింది. ఇంక్లూజివ్ థినింగ్ , పీపుల్ సెంట్రిక్ ఔట్లుక్"ని తీసుకొచ్చి, భారతీయ ఆటో పరిశ్రమపై ఆమెకున్న పదునైన అవగాహనతో పాటు, 'అందరికీ మాస్ హ్యాపీనెస్' అందించడంలో కంపెనీ నిబద్ధతను ఆమె నియామకం మరింత బలోపేతం చేస్తుందని టొయోటా కిర్లోస్కర్ మోటార్ సీఎండీ మసకాజు యోషిమురా అన్నారు" మానసి టాటా అమెరికాలోని రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు. కేరింగ్ విత్ కలర్ అనే ఎన్జీవో ద్వారా కర్ణాటకలోని మూడు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలపై పనిచేస్తున్నారు ఆమె 2019లో నోయెల్ టాటా (రతన్ టాటా సవతి సోదరుడు)కుమారుడు నెవిల్లే టాటాను వివాహం చేసుకున్నారు. కిర్లోస్కర్ సామ్రాజ్యం ఐదోతరం ప్రతినిధిగా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా మానసి తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ గతేడాది నవంబర్లో గుండెపోటుతో కన్నుమూశారు. డిసెంబరులో, కిర్లోస్కర్ సిస్టమ్స్ కంపెనీ యొక్క JV కంపెనీలైన టయోటా ఇండస్ట్రీస్ ఇంజిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కిర్లోస్కర్ టయోటా టెక్స్టైల్ మెషినరీ ప్రైవేట్ లిమిటెడ్ (KTTM), టయోటా మెటీరియల్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (TMHIN), DNKI బోర్డులో మానసి టాటాను డైరెక్టర్గా నియమించింది. -
..‘ఎస్ సర్’లే సీఈసీలా?!
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పలు కీలక సందేహాలు లేవనెత్తింది. ‘‘కేంద్రంలో అధికారంలో ఉండే ప్రతి పార్టీ ఎలాగోలా దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని భావిస్తుంది. అందుకోసం అన్ని విషయాల్లోనూ తను చెప్పిన దానికి ‘ఎస్ సర్’ అనేవారినే సీఈసీగా నియమించుకునే ఆస్కారముంది’’ అని పేర్కొంది. ప్రస్తుత నియామక వ్యవస్థ అందుకు వీలు కల్పిస్తోందంటూ న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆక్షేపించింది. ఓవైపు ఈ అంశంపై తమ విచారణ కొనసాగుతుండగానే ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ను ఎలా నియమిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీని వెనక వేరే రహస్య ఉద్దేశాలేమీ లేవు కదా అంటూ నిలదీసింది. ‘‘సీఈసీ, ఈసీల నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై గత గురువారం నుంచి మేం విచారణ జరుపుతున్నాం. ఓవైపు అది కొనసాగుతుండగానే కేంద్ర సర్వీసులో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారిని ముందస్తుగా రిటైర్ చేయించి మరీ ఈసీగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. గోయల్ నియామక ఫైలును పరిశీలన నిమిత్తం మాకు సమర్పించండి’’ అని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ఆర్.వెంకటరమణి ఇందుకు తీవ్రంగా అభ్యంతరాలు వెలిబుచ్చినా వాటిని తోసిపుచ్చింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈసీలు, సీఈసీ నియామకాలకు కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అవి బుధవారం రోజంతా కొనసాగాయి. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలంటే అందులోకి నియామకాలను తొలి దశలోనే పూర్తిస్థాయిలో తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై ధర్మాసనానికి, కేంద్రం తరఫున వాదించిన ఏజీ వెంకటరమణికి మధ్య సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి 1991 నాటి చట్టం పూర్తి రక్షణ కల్పిస్తోందని ఏజీ వాదించారు. ‘దినేశ్ గోస్వామి కమిటీ నివేదిక ఆధారంగా పార్లమెంటు ఆమోదించిన చట్టమిది. కాబట్టి దాని రూపకల్పన వెనక సరైన ఆలోచన చేయలేదని చెప్పలేం. సీఈసీ, ఈసీల జీతభత్యాలు, పదవీకాలం తదితరాలన్నింటికీ రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. కనుక ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరమేదీ లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శి స్థాయిల్లో ఉన్న అధికారులను ఎలక్షన్ కమిషనర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అమల్లో ఉన్న విధానం ప్రకారం వారిలో సీనియర్ అధికారి సీఈసీగా నియమితులవుతారు’’ అని వివరించారు. ‘‘మేం ఆనవాయితీని పాటిస్తున్నాం. అలాగాకుండా సీఈసీ నియామకానికి జాతీయ స్థాయిలో ఎన్నికలు పెట్డం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ వ్యవస్థ సరిగా పని చేయడం లేదని చెప్పడం తమ ఉద్దేశం కాదని ధర్మాసనం పేర్కొంది. అందుకు పారదర్శక వ్యవస్థ ఉండాలన్నది మాత్రమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. ‘‘కేంద్రం ఒకవేళ తమ భావజాలమే ఉన్న, తాము చెప్పిన దానికల్లా తలూపే వ్యక్తిని సీఈసీగా నియమిస్తే? అందుకే సీఈసీ నియామక ప్రక్రియపై మేం మరింతంగా దృష్టి సారించాలనుకుంటున్నాం. అందులో సీజేఐనీ చేరిస్తే బాగుంటుంది’’ అని పేర్కొంది. గోయల్పై వాదోపవాదాలు ఈసీగా గోయల్ నియామకంపై వాడివేడి వాదనలు సాగాయి. ఓవైపు ఈ కేసులో విచారణ జరుగుతుండగానే కేంద్రం హడావుడిగా ఆయనను నియమించిందని పిటిషనర్ అనూప్ బరన్వాల్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘గోయల్ గురువారం దాకా కేంద్రంలో కార్యదర్శి స్థాయి అధికారిగా కొనసాగారు. ఉన్నట్టుండి ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చి శుక్రవారానికల్లా ఈసీగా నియమించారు’’ అని గుర్తు చేశారు. తనకు తెలిసినంత వరకూ వీఆర్ఎస్ ఆమోదానికి మూడు నెలలు పడుతుందని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గోయల్ ఆయన నియామక ఫైలును సమర్పించాలన్న ఆదేశించారు. దీనిపై ఏజీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘విచారణ జరుగుతున్నది ఈసీలు, సీఈసీ నియామకాలకు సంబంధించిన విస్తృతమైన అంశం మీద. అలాంటప్పుడు ప్రశాంత్ భూషణ్ తెరపైకి తెచ్చిన ఈ వ్యక్తిగత నియామకాన్ని ఎలా పరిశీలనకు తీసుకుంటారు? దీనికి నేను తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నా. విచారణ మధ్యలో ఇలా నియామక ఫైలును కోర్టు చూడటంపై చాలా అభ్యంతరాలున్నాయి’’ అన్నారు. వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మేం విచారణ మొదలు పెట్టిన తర్వాత నవంబర్ 19న గోయల్ నియామకం జరిగింది. దానికి కారణమేమిటో తెలుసుకోవడానికే ఫైలు చూడాలనుకుంటున్నాం. నియామకం పూర్తిగా నిబంధనలకు లోబడే జరిగిందని మీరంటున్నారు. దాన్నే మేం పరిశీలించదలచాం. నియామకంలో అక్రమాలేవీ జరగని పక్షంలో మీరు భయపడాల్సిందేముంది? రేపట్లోగా సంబంధిత ఫైలును మా ముందుంచాల్సిందే’’ అని స్పష్టం చేసింది. ‘‘ఫైలును సమర్పిస్తారా, లేదా? దాన్ని బయట పెట్టొద్దనుకుంటుంటే అదే విషయం చెప్పండి. మీరు (ఏజీ) గనక బిజీగా ఉంటే ఫైలును మాకు సమర్పించాల్సిందిగా ఇంకెవరికైనా పురమాయించండి’’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. ఈసీగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన గోయల్ 2025లో రాజీవ్కుమార్ రిటైర్మెంట్ అనంతరం సీఈసీ కానున్నారు. ఆయన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా డిసెంబర్ 31 దాకా పదవిలో కొనసాగాల్సి ఉండగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు. మనకిప్పుడో శేషన్ కావాలి! సీఈసీ, ఈసీల నియామకం విషయంలో రాజ్యాంగం మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నాయంటూ మంగళవారం విచారణ సందర్భంగా ధర్మాసనం అసహనం వెలిబుచ్చడం తెలిసిందే. ఇదో అవాంఛిత పోకడ అంటూ ఆక్షేపించింది. వారి నియామకానికి ఎలాంటి ప్రక్రియనూ ఆర్టికల్ 324 నిర్దేశించని విషయాన్ని గుర్తు చేసింది. ఇందుకోసం చట్టం చేయాలని రాజ్యాంగం నిర్దేశించినా 72 ఏళ్లుగా ఆ పని చేయలేదంటూ తప్పుబట్టింది. ‘‘2004 నుంచి ఒక్క సీఈసీ కూడా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు. ఇక పదేళ్ల యూపీఏ పాలనలో ఏకంగా ఆరుగురు సీఈసీలు మారారు. ప్రస్తుత ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలనలో ఏకంగా 8 మంది మారారు’’ అంటూ ఆక్షేపించింది. గట్టి వ్యక్తిత్వమున్న టి.ఎన్.శేషన్ వంటివారు సీఈసీగా రావాలని తాము కోరుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ప్రధానిపై ఆరోపణలొస్తే.. సీఈసీ చర్యలు తీసుకోగలరా? ప్రధాని స్థాయి వ్యక్తితో సీఈసీ తలపడాల్సిన పరిస్థితి తలెత్తితే? అందుకాయన సిద్ధపడతారా, ససేమిరా అంటారా? మీకేమనిపిస్తోంది? ప్రధానిపై సీఈసీ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే... ఆయన ఏ చర్యలూ తీసుకోలేదనుకుందాం. అప్పుడది వ్యవస్థ పూర్తిగా కుప్పకూలినట్టు కాదా? అందుకే సీఈసీకి రాజకీయ ప్రభావం నుంచి సంపూర్ణ రక్షణ తప్పనిసరి. – సుప్రీంకోర్టు ధర్మాసనం సీఈసీ, ఈసీలను పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలి. అప్పుడే వాళ్లు స్వతంత్రంగా పని చేయగలరు. ఇది జరగాలంటే సీఈసీ ఎంపికలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా భాగస్వామిని చేయాలి. అప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకుంటూ ఒత్తిళ్లకు అతీతంగా బాధ్యతలు నెరవేర్చగలుగుతుంది. – సుప్రీం ధర్మాసనం -
చైనాకు 2 రోజులు.. భారత్కు రెండేళ్లు.. మరీ ఇంత వ్యత్యాసమా?
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులు పర్యాటక వీసా రావాలంటే దాదాపు రెండేళ్లకుపైగా వేచి ఉండాల్సిందే. అయితే.. చైనా వంటి దేశాల ప్రజలకు ఆ సమయం రెండు రోజులుగానే ఉండటం గమనార్హం. పర్యాటక వీసా పొందాలనుకునే ఢిల్లీ వాసులు అపాయింట్మెంట్ కోసం సుమారు 833 రోజులు వేచి చూడాలి. అలాగే ముంబయి ప్రజలకు 848 రోజులుకుపైగా వేయింట్ లిస్ట్ ఉన్నట్లు అమెరికా ప్రభుత్వ వెబ్సైట్ సూచిస్తోంది. అయితే.. బీజింగ్కు రెండు రోజులు, ఇస్లామాబాద్కు 450 రోజులు సమయం పడుతోంది. విద్యార్థి వీసాల కోసం వెయిటింగ్ టైమ్ ఢిల్లీ, ముంబైవాసులకు 430 రోజులుగా ఉంది. ఆశ్చర్యకరంగా విద్యార్థి వీసాల విషయంలో పాకిస్థాన్కు కేవలం ఒకే రోజు సమయం ఉంది. అలాగే చైనాకు రెండు రోజులు పడుతోంది. ఢిల్లీ వాసులకు 833 రోజులుగా చూపిస్తున్న అమెరికా వెబ్సైట్ అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ అంశాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ వద్ద లేవనెత్తారు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, ప్రపంచవ్యాప్తంగా సమస్య ఉందని తెలిపారు బ్లింకెన్. కరోనా కారణంగానే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. భారత్ నుంచి వచ్చే వీసా దరఖాస్తుల సమస్యను పరిష్కరించేందుకు తగిన ప్రణాళిక చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. కరోనా సమయంలో తక్కువ దరఖాస్తులు రావటం వల్ల సిబ్బందిని తొలగించటమూ ప్రస్తుత సమస్యకు ఒక కారణంగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కరోనా తర్వాత పర్యటక, విద్యార్థి వీసాల దరఖాస్తులు భారీగా పెరిగినట్లు వెల్లడించాయి. భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే నిపుణులు, విద్యార్థులు, పర్యటకుల కోసం అమెరికా ఎంబసీ వివిధ రకాల వీసాలను జారీ చేస్తుంది. ఇందుకోసం దరఖాస్తుదారులకు వీసా అపాయింట్మెంట్కు పట్టే సమయాన్ని అమెరికా ఎంబసీ వెబ్సైట్లో పొందుపరుస్తుంటుంది. అయితే, ఆయా ఎంబసీ, కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూలను నిర్వహించే సిబ్బంది తదితర అంశాలను బట్టి ఈ సమయాన్ని ప్రతివారం అప్డేట్ చేస్తుంది. తాజాగా వీసా కోసం నిరీక్షణ సమయాన్ని అమెరికా అధికారిక వెబ్సైట్లో పరిశీలించగా ఢిల్లీ ఎంబసీ నుంచి పర్యటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు వారు అపాయింట్మెంట్ కోసం 833 రోజులు వేచి ఉండాల్సిన ఉంటుందని తెలియజేస్తోంది. అలాగే.. మిగతా వివరాలు పరిశీలిద్దాం. బీజింగ్వాసులకు కేవలం 2రోజుల వెయిటింగ్ టైమ్ ఇదీ చదవండి: డ్రగ్స్ ముఠాలపై సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’.. 175 మంది అరెస్ట్ -
పేటీఎం బాస్గా శర్మ నియామకాన్ని ఆమోదించొద్దు
న్యూఢిల్లీ: పేటీఎం ఎండీ, సీఈవోగా విజయ్ శేఖర్ శర్మ పునర్ నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ ఇన్స్టిట్యూషనల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ (ఐఐఏఎస్) కీలక సూచన చేసింది. లిస్టెడ్ కంపెనీలు వాటాదారుల ముందు ఓటింగ్కు పెట్టే తీర్మానాలపై ఈ సంస్థ తన సలహా, సూచనలు చేస్తుంటుంది. పేటీఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మాధుర్ దియోరా పారితోషికానికి వ్యతిరేకంగా సూచన చేసింది. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, ప్రెసిడెంట్, గ్రూపు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా దియోరా నియామకానికి (2022 మే 20 నుంచి ఐదేళ్లపాటు) అనుకూలంగా సూచించింది. ‘‘వన్ 97 కమ్యూనికేషన్స్(పేటీఎం) షేరు ఐపీవో ఇష్యూ ధర రూ.2,150 నుంచి 63.6 శాతం పడిపోయింది. ఇది వాటాదారుల సంపదను హరించివేసింది. 2021–22 సంవత్సరంలో రూ.1,200 కోట్ల నగదు నష్టాలను ప్రకటించింది. 2022–23 మొదటి త్రైమసికంలోనూ నష్టాలు ఎక్కువగానే ఉన్నాయి. కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తానంటూ విజయ్ శేఖర్శర్మ గతంలో పలుమార్లు ప్రకటించారు. కానీ, అవేవీ ఆచరణలో కనిపించలేదు. కనుక కంపెనీకి నిపుణులతో కూడిన బోర్డు ఉండాలని మేము నమ్ముతున్నాం’’అని ఐఐఏఎస్ తన నివేదికలో పేర్కొంది. పదవీకాలంపై ఆందోళన విజయ్ శేఖర్ శర్మ రొటేషన్ పద్ధతిలో రిటైర్ కావాల్సిన అవసరం లేకపోవడం పట్ల ఐఐఏఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఎండీగా పదవీకాలం తర్వాత శర్మ నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో కొనసాగేట్టు అయితే బోర్డులో శాశ్వతంగా ఉండొచ్చు’’అని పేర్కొంది. బీఎస్ఈ సెన్సెక్స్ కంపెనీల సీఈవోలతో పోలిస్తే అతడి పారితోషికం ఎక్కువగా ఉందని తెలిపింది. దీనిపై పేటీఎం సీనియర్ ఉద్యోగి ఒకరు స్పందిస్తూ.. ప్రాక్సీ సంస్థలు తమ సేవలు తీసుకుంటున్న క్లయింట్లకు కేవలం సూచనలు మాత్రమే చేస్తాయన్నారు. -
కొత్త జిల్లాలకు డీఈవోల నియామకం
సాక్షి, అమరావతి: కొత్తగా ఏర్పాటైన జిల్లాలన్నిటికీ విద్యాశాఖ అధికారులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో క్యాడర్ సంఖ్యకు సంబంధించి కూడా జీవో విడుదల చేసింది. ప్రస్తుతం డీఈవోలుగా ఉన్న వారికి స్థానచలనంతో పాటు కొత్తగా అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ ఈవో, సీటీఈ ప్రిన్సిపాల్, డిప్యూటీ డైరెక్టర్లకు డీఈవోలుగా బాధ్యతలు అప్పగించారు. -
పాస్పోర్టు అపాయింట్మెంట్ల కుదింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పాస్పోర్టు దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్లను 50 శాతానికి కుదిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు లఘు కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలు, ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాలు సూపర్ స్పైడర్లుగా మారకూడదనే ఉద్దేశంతో ఈ నెల 31 వరకు 50 శాతం అపాయింట్మెంట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నామన్నారు. నిలిపివేసిన అపాయింట్మెంట్లలో మెడికల్, అత్యవసర ప్రయాణాలు ఉంటే సరైన డాక్యుమెంట్లతో పాస్పోర్టు కార్యాలయంలో సంప్రదిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. పాస్పోర్టు కార్యాలయంలోని ప్రజా విచారణ కేంద్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. (క్లిక్: 2 గంటల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..) -
సీఎంఎస్ ఇన్ఫోలో మహిళా డైరెక్టర్లు
న్యూఢిల్లీ: క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ తాజాగా ఇద్దరు మహిళా డైరెక్టర్లను నియమించుకుంది. కార్పొరేట్ పాలన నిబంధనలకు అనుగుణంగా స్వతంత్ర డైరెక్టర్ల హోదాలో మంజు అగర్వాల్, ఎస్.వసంత్ కారన్జ్కర్లను ఎంపిక చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్టెక్ విభాగాలలో వీరికి సీనియారిటీ ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో బోర్డులో మహిళా డైరెక్టర్ల సంఖ్య మూడుకు చేరినట్లు తెలియజేసింది. ఆరుగురు సభ్యుల బోర్డుకు చైర్పర్శన్, నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామలా గోపీనాథ్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ సుపరిపాలన విషయంలో కంపెనీ పాటిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలకు తాజా ఎంపికలు నిదర్శనాలని సీఎంఎస్ ఇన్ఫో పేర్కొంది. తద్వారా ముగ్గురు లేదా అంతకుమించి మహిళా డైరెక్టర్లు కలిగిన ఎన్ఎస్ఈ టాప్–10 శాతం లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించినట్లు వివరించింది. బ్యాక్గ్రౌండ్..: అగర్వాల్ ఎస్బీఐలో 34ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. దేశ, విదేశాలలో రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్, కస్టమర్ సర్వీసులు, వ్యూహాలు, నిర్వహణ తదితర విభాగాలలో విధులు చేపట్టారు. ఇక వసంత్ కారన్జ్కర్ కన్జూమర్ లెండింగ్ సంస్థ పేసెన్స్కు సహవ్యవస్థాపకురాలిగా వ్యవహరించారు. బిజినెస్, వృద్ధి, నిర్వహణ విభాగాలకు అధికారిణిగా బాధ్యతలు నిర్వహించారు. పేయూ క్రెడిట్ ఇండియాకు చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. పేసెన్స్ పురోగతి సాధించాక పేయూ ఇండియాకు చెందిన నాస్పెర్స్కు విక్రయించారు. -
‘భోజనమాత’పై వివక్ష.. దళిత మహిళ వండిన ఆహారం మాకొద్దు
డెహ్రడూన్: కుల వివక్ష ఇప్పటికీ ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఘటన ఉత్తరాఖండ్లోని చంపావత్ జిల్లా సుఖిందాంగ్లో చోటుచేసుకుంది. దళిత మహిళ వండిన ఆహారాన్ని తినడానికి అగ్రవర్ణ పిల్లలు నిరాకరించారు. దాంతో పాఠశాల బాధ్యులు ఆమెను తొలగించి మరో వివక్షాపూరిత చర్యకు పాల్పడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం వండి, వడ్డించే మహిళలను ఉత్తరాఖండ్లో ‘భోజనమాత’గా సంబోధిస్తారు. కొద్దిరోజుల కిందట ఈ బడిలో భోజనమాత పోస్టు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అగ్రవర్ణ మహిళ కూడా ఇంటర్వ్యూకు వచ్చినా ఆమెను కాదని దళిత మహిళను ఎంపిక చేయడంపై పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత సదరు మహిళ వండిన ఆహారాన్ని తినడానికి పిల్లలు నిరాకరించారు. మొత్తం 66 మంది పిల్లల్లో 40 మంది పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానివేసి ఇంటి నుంచి లంచ్ బాక్స్లు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. దీంతో దళిత మహిళను తొలగించి ఆమె స్థానంలో మరొకరికి తాత్కాలికంగా నియమించారు పాఠశాల బాధ్యులు. అయితే చంపావత్ జిల్లా విద్యాధికారి పి.సి.పురోహిత్ వాదన మాత్రం భిన్నంగా ఉంది. దళిత మహిళ నియామకంలో నిబంధనలను పాటించలేదని, ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేయకుండానే సదరు మహిళను భోజనమాతగా నియమించారని పురోహిత్ చెప్పుకొచ్చారు. అందుకే ఆమె నియామకాన్ని రద్దు చేశామని చెప్పారు. (చదవండి: మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం) -
ప్రధాని అపాయింట్మెంట్ కేసీఆర్ అడగలేదు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలవడానికి వీలుగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యాలయం లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలే దని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. అయితే గత సెప్టెంబర్ 1వ తేదీన అపా యింట్మెంట్ కోసం విజ్ఞప్తి వచ్చిందని, దాంతో అదే నెల 3వ తేదీన అపాయింట్మెంట్ ఇవ్వడం, సీఎం కేసీఆర్ వారిని కలవడం జరిగిం దని గుర్తు చేశాయి. నీటి పంపకాలు, వరి ధాన్యం కొను గోలుపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవ డానికి ఢిల్లీ వెళ్తామని, అవసరమైతే తాను ప్రధానిని కలు స్తానని గత శనివారం సీఎం విలేకరుల సమా వేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఆ మరు సటి రోజే ఢిల్లీ బయ ల్దేరి వెళ్లిన సీఎం బుధవా రం సాయంత్రం హైదరా బాద్ తిరిగి చేరు కున్నారు. అయితే నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. మోదీని, అమిత్ షాను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇచ్చా యి. ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ తమకు ఎలాంటి వర్తమానం అందలేదని తెలిపాయి. -
ఫలించని నిరీక్షణ.. ప్రధానితో ఖరారు కాని సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు, నదీ జలాల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా, ఇతర కేంద్ర మంత్రులతో చర్చించేందుకు నాలుగు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఎవరినీ కలవకుండానే హైదరాబాద్ తిరిగివెళ్లారు. ధాన్యం కొనుగోలు విషయంలో వార్షిక పరిమితిని ముందుగానే ప్రకటించే అంశంపై ప్రధానితో చర్చించాలని భావించినా ఆయన నిరీక్షణ ఫలించలేదు. ఉత్తరప్రదేశ్లో అభివృధ్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, వ్యవసాయ చట్టాల రద్దు అంశాలపై కేబినెట్ భేటీ, వచ్చే పార్లమెంట్ సమావేశాల సన్నద్ధత నేపథ్యంలో ప్రధానితో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నందున డిసెంబర్ రెండు లేక మూడో వారంలో ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీ వచ్చి మోదీని కలిసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇక నదీ జలాల అంశం, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర జల శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తోనూ ముఖ్యమంత్రి భేటీ కావాల్సి ఉన్నా, షెకావత్ రాజస్థాన్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వీలుపడలేదు. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్తో సీఎం సమావేశమవుతారని భావించినా అలాంటిదేమీ జరగలేదు. 26న వచ్చే స్పష్టతను బట్టి కార్యాచరణ ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు మాత్రం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయుష్ గోయల్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొంత సానుకూలత వ్యక్తమయ్యింది. ఈ వానాకాల సీజన్కు సంబంధించి గతంలో నిర్ణయించిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కన్నా కొంత అధికంగా సేకరించేందుకు ప్రయత్నిస్తామని గోయల్ చెప్పారు. అదే సమయంలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని స్పష్టం చేశారు. యాసంగిలో కొనే పంటలపై వ్యవసాయ శాఖతో చర్చించి 26 నాటికి స్పష్టత ఇస్తామని చెప్పిన నేపథ్యంలో.. దానిని బట్టి ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలావుండగా అన్ని రాష్ట్రాల పౌర సరఫరాల శాఖల మంత్రులతో గోయల్ గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇందులో దేశవ్యాప్తంగా వరి ధాన్యం ఉత్పత్తి, వినియోగం, కేంద్రం కొనుగోలు, వన్నేషన్–వన్రేషన్ అంశాలపై చర్చించనున్నారు. -
రిటైరైనవారు ప్రభుత్వ సలహాదారులా?
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ఉన్నతోద్యోగులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించడమేమిటని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎక్కువ మొత్తంలో జీతాలు ఇస్తూ మళ్లీ వారిని నియమించడం వల్ల దుబారా ఖర్చు తప్ప ఏమీ ఉండదని ఆ సంస్థ పేర్కొంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. కీలకమైన పోస్టుల్లో పాత వారినే నియమించడంతో ఎక్కువ మొత్తంలో జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొందరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను పదవీ విరమణ తర్వాత సలహాదారులుగా నియమించడం చూస్తుంటే వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవారనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. వీరే కాక రెవెన్యూ, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగిస్తున్నారని, ఇది సమర్థనీయం కాదని అన్నారు. సలహాదారులు, వారి సిబ్బందిపై ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేయడమంటే ప్రజా ధనాన్ని వృథాచేయడమేని స్పష్టం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరారు. చదవండి: తనిఖీల వీడియో వైరల్: ‘సోషల్మీడియాను గుడ్డిగా నమ్మొద్దు’ -
ఢిల్లీలో చంద్రబాబుకు షాక్.. అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, షా
-
ఢిల్లీలో చంద్రబాబుకు షాక్.. అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, షా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో గత్తర లేపుతానంటూ వెళ్లిన చంద్రబాబు నాయుడుకి భారీ షాక్ తగిలింది. చంద్రబాబు ఢిల్లీ టూర్ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. టీడీపీ అధ్యక్షుడిని కేంద్ర పెద్దలు, జాతీయ మీడియా పట్టించుకోలేదని సమాచారం. రెండు రోజులుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం పడిగాపులుగాస్తున్నప్పటికి చంద్రబాబుకు చుక్కెదురైనట్లు తెలిసింది. కశ్మీర్ పర్యటన ముగించుకుని అమిత్ షా ఢిల్లీకి వచ్చినప్పటికి.. చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. పార్టీ పరిస్థితి దయనీయంగా మారడంతో బీజేపీ అండ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. కానీ గతంలో అమిత్ షా కుటుంబంతో తిరుమలకు వస్తే.. ఆయన కాన్వాయ్పై చంద్రబాబు రాళ్లు వేయించిన ఘటనను బీజేపీ మరచిపోలేదు. అంతేకాక నరేంద్ర మోదీని ఉగ్రవాది అని సంభోదించడాన్ని కూడా కాషాయ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. రెండున్నరేళ్లయినా చంద్రబాబు కుట్రను బీజేపీ పెద్దలు మర్చిపోలేదు. (చదవండి: ఎందుకు దాడిచేశారో చెప్పాల్సింది) ఇప్పుడు చంద్రబాబు కల్లబొల్లి కబుర్లను బీజేపీ, జాతీయ మీడియా పట్టించుకోవడం లేదని తెలిసింది. ఏపీ డ్రగ్స్కు అడ్డాగా మారుతోందని రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఢిల్లీలో ఉన్న చంద్రబాబును కలవాలని టీడీపీ నేతలు జాతీయ మీడియాకు పదే పదే ఫోన్లు చేస్తున్నారట. అయినప్పటికి వారు బాబును పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం. (చదవండి: Twitter: చంద్రబాబుపై వల్లభనేని వంశీ వ్యంగ్యాస్త్రాలు ) ఇటు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ దొరక్క, అటు జాతీయ మీడియా పట్టించుకోకపోవడంతో చంద్రబాబు వెనుదిరిగారు. ఆర్టికల్ 356 అంటూ హడావిడి చేద్దామనుకున్న చంద్రబాబు వ్యూహం తుస్సుమనడమే కాక జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రతిష్ట ఎంతలా దిగజారిందో మరోసారి బహిర్గతం అయ్యింది. చదవండి: ఏపీ పరువు తీయడానికే బాబు ఢిల్లీ టూర్ -
అన్నీ పరిశీలించాకే జడ్జీల నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: అనుభవం, అర్హత, ప్రభుత్వం నుంచి సేకరించిన వివరాలు ఇలా అన్నింటినీ పరిశీలించాకే హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకం నిర్దిష్ట ప్రక్రియ మేరకు జరుగుతుందని, హైకోర్టు కొలీజియం అన్ని వివరాలు పరిశీలించాకే సిఫారసు చేస్తుందని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్రెడ్డిని న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదనను సవాల్ చేస్తూ బి.శైలేష్ సక్సేనా అనే న్యాయవాది దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ జస్టిస్ సంజయ్ కిషన్కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం సక్సేనాకు రూ.5 లక్షల జరిమానా విధించింది. చట్టపరమైన ప్రక్రియ దుర్వినియోగం గత ఆగస్టు 17న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం... తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ వెంకటేశ్వర్రెడ్డి సహా ఆరుగురు న్యాయమూర్తుల నియామకంపై హైకోర్టు కొలీజియం చేసిన సిఫారసును ఆమోదించిన విషయం విదితమే. కాగా న్యాయమూర్తిగా వెంకటేశ్వర్రెడ్డిని నియమించాలన్న ప్రతిపాదనకు సంబంధించి కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, హైకోర్టు రిజిస్ట్రార్ (నిఘా, పాలన)లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ సక్సేనా 2020లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సక్సేనా పిటిషన్ను సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. ‘ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ వెంకటేశ్వర్రెడ్డిపై పిటిషనర్ పలు ఆరోపణలు చేశారు. అయితే పిటిషనర్పై పలు ఫిర్యాదులు ఉన్నాయనే అంశాన్ని మేం పరిగణనలోకి తీసుకున్నాం. ఈ మేరకు నాడు రిజిస్ట్రార్ జనరల్గా ఉన్న జస్టిస్ వెంకటేశ్వర్రెడ్డి చేసిన ఫిర్యాదుతో హైకోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలో చట్టపరమైన ప్రక్రియను పిటిషనర్ దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించాం. సుప్రీంకోర్టు అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ వెల్ఫేర్ ఫండ్కు నాలుగు వారాల్లోగా రూ.5 లక్షలు జమ చేయాలని ఆదేశిస్తూ రిటి పిటిషన్ కొట్టేస్తున్నాం..’అని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. -
మణిపూర్ కొత్త గవర్నర్గా లా గణేషన్
ఇంఫాల్: మణిపూర్ కొత్త గవర్నర్గా లా గణేషన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 20న గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న నజ్మా హెప్తుల్లా స్థానంలో లా గణేషన్ ఎంపికయ్యారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన లా గణేషన్ బీజేపీ పలు కీలక పదవులు నిర్వహించారు. చదవండి: యూపీ మాజీ సీఎం కల్యాణ్సింగ్కు ప్రధాని మోదీ నివాళి President Ram Nath Kovind appoints La Ganesan as the Governor of Manipur. — ANI (@ANI) August 22, 2021 -
సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరిన సినీ పెద్దలు
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ కోసం టాలీవుడ్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు మంత్రి పేర్ని నానికి ఫోన్ చేసి సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరారు. కాగా, గతంలో థియేటర్ల ఎలక్ట్రిసిటీ బిల్లులపై పరిశ్రమకు అనుకులంగా సీఎం జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. దాంతో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున తదితరులు సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్కు ధన్యవాదాలు తెలియజేశారు. -
వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు వీరే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులను 25 మందిని నియమించినట్టు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ♦పి.మురళీమోహన్(అరకు) ♦ఆర్.చిరంజీవి(శ్రీకాకుళం) ♦కె.నిరంజనరావు(విజయనగరం) ♦కె.కృష్ణ(విశాఖపట్నం) ♦జె.ఆనంద్(అనకాపల్లి) ♦పి.శ్రీనివాస్(కాకినాడ) ♦కె.త్రినాథరావు(అమలాపురం) ♦ఎస్ఎంఎస్ హుస్సేన్(రాజమండ్రి) ♦వి.డేవిడ్రాజు(నరసాపురం) ♦డీవీ రామాంజనేయులు(ఏలూరు) ♦కేఎం ప్రసాద్(మచిలీపట్నం) ♦సీహెచ్ విష్ణువర్ధన్రావు(విజయవాడ) ♦వి.రాజశేఖర్రెడ్డి(గుంటూరు) ♦కె.కోటేశ్వరరావు(నర్సరావుపేట్) ♦ఎ.శ్రీనివాస్రావు(బాపట్ల) ♦వై.వెంకటేశ్వర్లు(ఒంగోలు) ♦కె.రామసుబ్బయ్య(నంద్యాల) ♦పి.సువర్ణరెడ్డి(కర్నూల్) ♦జి.ఉమాపతిరావు(అనంతపురం) ♦ఎ.కృష్ణమూర్తి(హిందూపురం) ♦జీవీ రాఘవరెడ్డి(కడప) ♦వై.మురళీధర్రెడ్డి(నెల్లూరు) ♦దొరబాబు అలియాస్ ముని బాలసుబ్రమణ్యం(తిరుపతి) ♦ఏబీ సుదర్శన్రెడ్డి(రాజంపేట్) ♦జి.సూర్యప్రతాప్రెడ్డి(చిత్తూరు) -
రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ లేఖ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఏడాదిన్నరగా రెగ్యులర్ వైస్ చాన్స్లర్లు(వీసీ) లేరని, వెంటనే వీరి నియామకానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేఖ రాసినట్లు తెలిసింది. ఇటీవల వీసీలతో నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే వీలైనంత త్వరగా వీసీలను నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2019 నాటికే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ, తెలుగు విశ్వవిద్యాలయం, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ పోస్టులు ఖాళీ అయ్యాయి. అదే ఏడాది జూలైలో ఈ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, 984 దరఖాస్తులు వచ్చాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నియామకాల్లో జాప్యంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సెర్చ్ కమిటీల సమావేశాలు త్వరగా నిర్వహించాలని, వీసీల నియామకాలూ వేగంగా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
కోటక్ బ్యాంక్ ఎమ్డీ ఉదయ్ కోటక్కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎమ్డీగా ఉదయ్ కోటక్ నియామాకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. మరో మూడేళ్ల పాటు ఉదయ్ కోటక్ ఈ పదవిలో కొనసాగుతారు. కోటక్ ఇప్పటికే గత 17 సంవత్సరాలుగా కోటక్ మహీంద్రా బ్యాంక్ అధిపతిగా పనిచేశారు. ప్రకాష్ ఆప్టేను పార్ట్టైమ్ ఛైర్మన్గా, దీపక్ గుప్తాను జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా తిరిగి నియమించడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చిందని కోటక్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. 2021 జనవరి నుంచి ఈ నియామకాలు అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. (జియోకు వ్యతిరేకంగా విష ప్రచారం!) (చదవండి : స్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్గా సోనూ సూద్) -
స్టాఫ్నర్సు నియామకాల్లో అక్రమాలు
వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్టాఫ్నర్సు అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారు. లోకల్ అభ్యర్థులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలన్న నిబంధనను తుంగలో తొక్కి మెరిట్ లిస్ట్ తయారు చేశారు. నాన్లోకల్ అభ్యర్థులకు ఉద్యోగాలు కట్టబెట్టి జిల్లా అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారు. ఫలితంగా అర్హుత ఉండీ ఉద్యోగాలు దక్కని వారంతా లబోదిబోమంటున్నారు. అనంతపురం హాస్పిటల్: స్టాఫ్నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియలో జిల్లా అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఆరోగ్యశాఖ, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉండే పోస్టుల నియామకాలు, ప్రొవిజినల్ మెరిట్ లిస్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో మన జిల్లా అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. వివిధ శాఖల ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా అర్హులకు మొండిచేయి చూపారన్న విమర్శలున్నాయి. పొరుగు జిల్లాలైనా వైఎస్సార్, కర్నూలులో లోకల్, నాన్లోకల్ కేటగిరిలో పోస్టులను పక్కాగా భర్తీ చేస్తుంటే ‘అనంత’లో మాత్రం నిబంధనలకు నీళ్లొదిలారు. కాంట్రాక్టు పోస్టుల భర్తీకి... కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పీహెచ్సీలు, సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ, ఏరియా ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన స్టాఫ్నర్సు పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇటీవల ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. లోకల్ కాకపోయినా... ఈ నెల 14న 92 స్టాఫ్నర్సు పోస్టుల మెరిట్ లిస్టును డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్నాథ్ విడుదల చేశారు. మొదటి 28 పోస్టులు అన్రిజర్వ్ కేటగిరికి కేటాయించారు. మరో రెండు పోస్టులు పీహెచ్ – హెచ్హెచ్ (వికలాంగులు)కు కేటాయించారు. ఇక మిగతా 62 పోస్టులు స్థానికంగా ఉండే వారికి కేటాయించాలి. కానీ వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎ.అమరావతి (జాబితాలో 28వ నంబర్)కి పోస్టింగ్ ఇచ్చారు. అర్హుల జాబితాలోనూ ఈమెను లోకల్గానే చూపించారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ (సీరియల్ నెంబర్ 64 )ను అర్హుల జాబితాలో లోకల్గా చూపించారు. ఇదే విధంగా మరో నలుగురు నాన్లోకల్ వారిని లోకల్గా చూపించి పోస్టులను కేటాయించారు. ఆరోగ్యశాఖలోనూ... ఈ నెల 5న డీఎంహెచ్ఓ కార్యాలయంలో స్టాఫ్నర్సులకు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టులు కేటాయించారు. మొత్తం 77 పోస్టులను భర్తీ చేశారు. అందులో వైఎస్సార్ జిల్లా గాలివీడుకు చెందిన కే.శైలజ (మెరిట్ నంబర్ 43) వర్కింగ్ ప్లేస్గా చూపించి పోస్టింగ్ కేటాయించారు. అలాగే మదనపల్లికి చెందిన ఉమాదేవి (సీరియల్ నంబర్ 65 ) , కర్నూలు జిల్లాకు చెందిన టి.సునీత (సీరియల్ నంబర్ 68)ను లోకల్ కేటగిరిలో చూపించారు. మెరిట్, ఫైనల్ మెరిట్ లిస్టుల్లో అభ్యర్థి ఏ ఊరు అనే అంశాన్ని కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. అదేబాటలో వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ పోస్టుల భర్తీలోనూ వైద్య కళాశాల డీఎంహెచ్ఓ, వైద్య విధానపరిషత్ అధికారులు అనుసరిస్తున్న వైఖరిని అవలంభిస్తుండం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మెరిట్ జాబితా ఎంపికపై అవగాహన లేకపోవడంతో పాటు కొందరు అధికారుల అనుయాయులకు పోస్టులు కట్టబెట్టడానికే ఈ అడ్డగోలు బాగోతానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని జిల్లా అభ్యర్థులు కోరుతున్నారు. 92 పోస్టులకు 39 మంది హాజరు అనంతపురం హాస్పిటల్: డీసీహెచ్ఎస్ కార్యాలయంలో డీసీహెచ్ఎస్ రమేష్నాథ్ ఆధ్వర్యంలో గురువారం స్టాఫ్నర్సు పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించారు. 92 పోస్టులకు గానూ కేవలం 39 మంది అభ్యర్థులు మాత్రమే హాజరుకావడం గమనార్హం. అభ్యర్థుల మెరిట్ లిస్టు ప్రాతిపదికన స్థానాలను కేటాయించారు. అనంతరం డీసీహెచ్ఎస్ రమేష్నాథ్ అభ్యర్థులకు ఆర్డర్ కాపీలను అందజేశారు. భర్తీ చేయాల్సిందిలా.. స్టాఫ్నర్సు పోస్టుల భర్తీలో 70 శాతం స్థానికులతోనే భర్తీ చేయాలి. 30 శాతం మాత్రం నాన్లోకల్ తో పాటు స్థానికులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉంది. భర్తీ చేసిందిలా... 70 శాతం లోకల్ కేటగిరీలోనే నాన్లోకల్ వారికి అవకాశమిచ్చి ఉద్యోగాలిచ్చారు. ఫలితంగా జిల్లాకు చెందిన అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. నాన్ లోకల్లోనూ మెరిట్ పక్కన పెట్టి జాబితా తయారు చేశారు. తప్పులుంటే సరిచేస్తాం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పోస్టుల భర్తీ జరుగుతుంది. స్టాఫ్నర్సు పోస్టుల్లో స్థానిక అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్న విషయంపై మరోసారి జాబితాను పరిశీలిస్తాం. ఏవైనా తప్పులు జరిగి ఉంటే సరిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోనూ ఇలాంటి సమస్య తలెత్తితే సరి చేసేలా చర్యలు తీసుకున్నాం. – సిరి , జాయింట్ కలెక్టర్ -
పరేష్ రావల్కు కీలక పదవి
సాక్షి, న్యూఢిల్లీ : విలక్షణ నటుడు పరేష్ రావల్ను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చీఫ్గా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు. పరేష్ రావల్కు నూతన బాధ్యతలను కట్టబెట్టినట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నిర్ధారించారు. పరేష్ నియామకం పట్ల నటుడికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఈ నియామకంతో కళాకారులు, విద్యార్ధులకు మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు దశాబ్ధాలకు పైగా తన సినీ ప్రస్ధానంలో పరేష్ రావల్ జాతీయ ఫిల్మ్ అవార్డు సహా పలు అవార్డులు అందుకున్నారు. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2014లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. సినిమాలతో పాటు నాటక రంగంలోనూ పరేష్ రావల్ చురుకుగా ఉండేవారు. సినిమాల కంటే నాటకాలనే తాను అమితంగా ప్రేమిస్తానని ఆయన గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. చదవండి : అబ్దుల్ కలాం ఫిక్స్ -
టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటన రద్దు!
సాక్షి, అమరావతి: శాసన మండలి రద్దుపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు తలపెట్టిన ఢిల్లీ పర్యటన రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి మండలి రద్దుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే, వారికి ఢిల్లీలో ఎవరి అపాయింట్మెంట్ ఇవ్వలేదని సమాచారం. ఈ కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19వ తేదీ నుంచి చేపట్టాలనుకున్న ప్రజాచైతన్య యాత్రలపైనా తర్జనభర్జన పడుతున్నారు. తమ పార్టీకి చెందిన వారిపై ఐటీ దాడులు జరగటం, రూ.రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడికావడంతో ఆందోళనలో ఉన్న టీడీపీ నేతలు యాత్ర నిర్వహించాలా వద్దా అనే దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలిసింది. ఒకవేళ యాత్ర చేసినా నియోజకవర్గాల్లో తూతూమంత్రంగా చేయాలని సూచించినట్లు సమాచారం. -
టీడీపీ ఎమ్మెల్సీలకు అమిత్ షా ఝలక్
సాక్షి, విజయవాడ : ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్సీలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఊహించని షాక్ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. శాసనమండలి రద్దు నిర్ణయంపై అమిత్ షాను కలవాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ పర్యటన ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్సీలకు పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందింది. అయితే అమిత్ షా అపాయింట్మెంట్ దొరకకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అపాయింట్మెంట్ మాత్రమే ఖరారైంది. దీంతో ఇక చేసేదేమీలేక టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. మండలి రద్దుకు సహకరించాలని కోరుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. (మండలి రద్దును ఆమోదించండి) -
నెలాఖరున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో సంస్థాగత ఎన్నికలకు ఫుల్స్టాప్ పడినట్లే కనిపిస్తోంది. ఇటు పార్టీ పదవుల్లో నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. జాతీయ పార్టీ అధ్యక్షుడి నియామకం పూర్తయిన నేపథ్యంలో జిల్లాల్లో అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇక ఎన్నికలుండే అవకాశం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. వచ్చే వారం రోజుల్లో జిల్లా కమిటీలకు అధ్యక్షులను నియమించేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ముందస్తు షెడ్యూల్ ప్రకారం బూత్, గ్రామ, మండల, జిల్లా కమిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆపై రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు, అనంతరం జాతీయ అధ్యక్షుడి నియామకం ఉండాల్సి ఉం ది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం మండల కమిటీలకు కూడా పూర్తి స్థా యిలో ఎన్నికలు జరగలేదు. మరోవైపు జాతీయ అధ్యక్షుడి నియమా కం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు కాకుండా సంప్రదింపులు జరిపి నియామకాలు చేపట్టేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తె లిసింది. దీంతో వచ్చే వారం రోజుల్లో అన్ని మండలాలకు, జిల్లాలకు కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. వీలైతే ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియమించే అవకా శం ఉందని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు కె.లక్ష్మణ్తోపాటు ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ ప్రయత్నాల్లో ఉన్నా రు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు.. ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అ ధ్యక్ష పదవిని ఎవరికిస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్వైపే జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. -
ఢిల్లీలో పవన్ కల్యాణ్ నిరీక్షణ
సాక్షి, ఢిల్లీ: బీజేపీ నేతలతో అపాయింట్ ఖరారు కాకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం హడావుడిగా ఢిల్లీకి బయలుదేరిన పవన్... బీజేపీ నేతలను కలుస్తారంటూ జనసేన ప్రచారం చేసింది. జేపీ నడ్డా తో పాటు హోంమంత్రి అమిత్షాలను కలుస్తారంటూ జనసేన లీకులు ఇచ్చింది. ఎవరితోనూ అపాయింట్మెంటు లభించకపోవడంతో ఆయన నిన్నటి నుంచి ఢిల్లీలోనే నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడింది. గత పర్యటనలోనూ పవన్ కల్యాణ్ ఇదే పరిస్థితి చవిచూశారు. -
సెర్చ్ కమిటీ సైలెంట్.. !
సాక్షి, కరీంనగర్ : రెగ్యులర్ వీసీ నియామకానికి ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీ సైలెంట్ అయిందా..? అనే ప్రశ్నకు శాతవాహన యూనివర్సిటీ వ్యాప్తంగా అవుననే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం రాష్ట్రంలో గల వివిధ యూనివర్సిటీల వీసీల పదవీకాలం ముగియడంతో అన్ని యూనివర్సిటీలకు ఐఏఎస్ అధికారులను ఇన్చార్జీలుగా నియమించారు. శాతవాహనకు మాత్రం గతంలోనే ఐఏఎస్ అధికారి ఇన్చార్జి వీసీగా ఉండడంతో తిరిగి ఆయననే కొనసాగించారు. శాతవాహన యూనివర్సిటీకి వీసీని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం గత నెలలో ముగ్గురితో కూడిన సెర్చ్ కమిటీని వేశారు. ఈ కమిటీ వీసీ పోస్టుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అందులో ముగ్గురిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. ఈ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసి నెల రోజులు కావస్తున్నా నేటికి వీసీ నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదని విద్యావేత్తల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇన్చార్జి పాలన నుంచి విముక్తి ఎన్నడో..? యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఐదుగురు వీసీలుగా పని చేయగా వీరిలో ఇద్దరు పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. ఆరేళ్ల పాటు వీరి పాలన కొనసాగింది. తర్వాత నాలుగేళ్లపాటు ముగ్గురు ఇన్చార్జి వీసీలతోనే నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం వీసీగా ఉన్న హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులును 30 ఆగస్టు 30, 2017న ప్రభుత్వం నియమించింది. ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్లినా, కీలక నిర్ణయాలు, సాధారణ పనులకు యూనివర్సిటీ అధికారులు హైద్రాబాద్కు పరుగులు తీయాల్సి వస్తోంది. అలాగే అక్కడ ఆయన సమయం కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీంతో శాతవాహనకు కొత్త వీసీని నియమించాలనే నిర్ణయానికి వచ్చి దరఖాస్తులు ఆహ్వానించారు. కాని సెర్చ్ కమిటీ వేశాక కూడా ప్రక్రియ ఎందుకు ముందుకు సాగడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. నియామక ప్రక్రియలో జాప్యం వీసీ నియామక ప్రక్రియలో సెర్చ్ కమిటీ నియామకం కీలకం. శాతవాహన యూనివర్సిటీకి గత నెల 20 తేదిన ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమిస్తూ జీవో జారీ చేసింది. ఇందులో శాతవాహన ఈసీ నామినీగా మాజీ జెఎన్టీయూ హైద్రాబాద్కు వీసీ ప్రొఫెసర్ రామేశ్వర్రావును, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నామినీగా యూజీసీ మెంబర్, భగత్పూల్సింగ్ మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సుష్మయాదవ్, రాష్ట్ర ప్రభుత్వ నామినీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ ఐఏఎస్ అధికారి సోమేష్కుమార్ను నియమించారు. . ఇన్ని రోజులు గడిచినా ఈ ప్రక్రియలో జాప్యంపై విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు. వీసీని నియమిస్తేనే ఖాళీగా ఉన్న పోస్టులు నియామకాలు జరుగుతాయని నిరుద్యోగులు సైతం ఆశపడుతున్నారు. ప్రభుత్వం తొందరగా వీసీని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
జిల్లాకు నూతన ప్రధాన న్యాయమూర్తి
సాక్షి, విజయనగరం : జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గుట్టల గోపి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి జిల్లా జడ్జి ఇ.భీమారావు నుంచి ఆయన చార్జి తీసుకున్నారు. ఇంతవరకు ఇక్కడ పనిచేసిన జిల్లా జడ్జి ఆలపాటి గిరిధర్ను కర్నూలు బదిలీ చేసిన విషయం తెలిసిందే. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన గోపిని అదనపు జిల్లా న్యాయమూర్తులు వై.హేమలత, ఇ.భీమారావు, ఇతర న్యాయమూర్తులు రాంబాబు, లక్ష్మీరాజ్యం ఆయన ఛాంబర్లో కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు టి.వి.శ్రీనివాసరావు, కార్యదర్శి టి.బ్రహ్మాజీ, సంయుక్త కార్యదర్శి వై.హరికృష్ణ, కోశాధికారి జి.రాంబాబు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి న్యాయవాదుల సంఘ భవనానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. -
కొత్త వీసీ వచ్చేనా?
సాక్షి, భైంసా(నిర్మల్) : రాష్ట్రవ్యాప్తంగా 10 యూనివర్సిటీలకు వీసీ(వైస్చాన్స్లర్)లను నియమించేందుకు విద్యా శాఖ కసరత్తు ఆరంభించింది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి రెగ్యూలర్ వీసీ నియమిస్తారని ఇక్కడ చదివే విద్యార్థులు ఆశిస్తున్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ పదవీకాలం గతనెలలో ముగిసింది. మరో ఏడు యూనివర్సిటీల్లోనూ వీసీల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త వీసీ ల నియామకంపై విద్యాశాఖ కసరత్తు ఆరంభించి ప్రభు త్వం ముందుంచింది. శాతవాహన యూనివర్సిటీతో పాటు బాసరలోని ట్రిపుల్ఐటీకి ఇప్పటి వరకు వీసీలనే నియమించలేదు. కొత్తగా వీసీల నియామకం కోసం అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఈ సమయంలో బాసరకు రెగ్యూలర్ వీసీ నియమిస్తారని అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ ఇన్చార్జీనే.. తెలంగాణ రాష్ట్ర ఇంటర్బోర్డు కార్యదర్శి అశోక్ బాసర ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్నారు. గత ఐదున్నరేళ్లుగా ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీలతోనే నెట్టుకొస్తున్నారు. శాశ్వతంగా బాసర ట్రిపుల్ఐటీకి వీసీ నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్కు ఇడుపులపాయ, నూజివీడు, తెలంగాణకు బాసర ట్రిపుల్ఐటీలు దక్కాయి. ప్రత్యేక విద్యాలయాలు కావడంతో ప్రభు త్వం విశ్వవిద్యాలయాలకు హోదా కల్పించి విద్యాలయ ప్రగతికి పాలనాపరంగా అడ్డంకులు ఉండకూడదని స్వయం ప్రతిపత్తి కల్పించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటికీ ఇక్కడ రెగ్యూలర్ వీసీ నియమించలేదు. గతంలో ఉస్మానియా వీసీగా పనిచేసిన సత్యనారాయణను ఇన్చార్జీగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన పనిచేసిన అనంతరం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్కు వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వీసీగా అశోక్ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ రెగ్యూలర్ వీసీ నియాయమకంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఏళ్లుగా బాసర ట్రిపుల్ఐటీకి వీసీ నియామకం జరగకపోవడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బాధ్యతలు స్వీకరించిన వారు పూర్తిస్థాయి వీసీ కాకపోవడంతో పరిమితులకు లోబడి పనిచేస్తున్నారు. విద్యాలయాల నిర్వహణను పర్యవేక్షించే గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల పరిధిలోనే తన నిర్ణయాలను అమలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఐదేళ్లుగా ఇన్చార్జి వీసీతోనే విద్యాలయ నిర్వహణ కొనసాగుతోంది. సాధించిన కొలువులు... 2008లో ప్రారంభమైన బాసర ట్రిపుల్ఐటీలో ఎంతో మంది పేద విద్యార్థులు కొలువులు సాధించారు. ఆరేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు 2014 నుంచి చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో కొలువులు సాధించారు. 2014లో 309 మంది విద్యార్థులు 2015లో 336 మంది, 2016లో 478 మంది, 2017లో 362 మంది, 2018లో ఇప్పటి వరకు 282 మంది విద్యార్థులు కొలువులు సాధించారు. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన విద్యార్థులు వార్షికవేతనం రూ. 12లక్షల నుంచి రూ.16 లక్షల వరకు పొందుతున్నారు. ఏటా ప్రవేశాలు... గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించే దిశగా పదో తరగతి ఉత్తీర్ణత కాగానే ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జీపీఏ కేటగిరీ వారీగా సీట్లను కేటాయిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, మండలాలు, జిల్లాలు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కౌన్సెలింగ్కు ఆహ్వానిస్తారు. ఏటా కౌన్సెలింగ్లో హాజరైన విద్యార్థులు ప్రవేశాలు పొంది కళాశాలలో ఆరేళ్ల సమీకృత విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడి విద్యావిధానం, వసతులు ప్రారంభంలో బడ్జెట్ తదితర విషయాలను పరిశీలించేందుకు 2018లో ప్రభుత్వం అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి ట్రిపుల్ఐటీని సందర్శించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్న విషయాన్ని గుర్తించి రాష్ట్రంలో మరో మూడు చోట్ల ట్రిపుల్ ఐటీలను ప్రారంభించేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టింది. -
నూతన సీఐసీగా సుధీర్ భార్గవ
న్యూఢిల్లీ: నూతన ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా కేంద్ర ప్రభుత్వం సుధీర్ భార్గవను నియమించింది. ఈయనతో పాటు మరో నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చేపట్టింది. భార్గవ సీఐసీ సమాచార కమిషనర్గా చేశారు. ప్రధాన సమాచార కమిషనర్తో కలిపి మొత్తం 11 మంది ఉండాల్సిన ఈ కమిషన్లో ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. ఐఎఫ్ఎస్ అధికారి అయిన యశ్వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్ఎస్ అధికారి వనజా ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ నీరజ్ కుమార్ గుప్తా, మాజీ లా సెక్రటరీ సురేశ్ చంద్రలను సమాచార కమిషనర్లుగా నియమిస్తూ సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఈ ఏడాదే ప్రభుత్వోద్యోగులుగా పదవీ విరమణ పొందారు. ఇటీవల ప్రధాన సమాచార కమిషనర్ ఆర్.కె.మాథుర్తో పాటు ముగ్గురు సమాచార కమిషనర్లు శ్రీధర్ ఆచార్యులు, యశోవర్ధన్ ఆజాద్, అమితవ భట్టాచార్య పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడున్న ఇతర ముగ్గురు కమిషనర్లు వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నియామకాల్లో పారదర్శకత ఏది?: మాడభూషి సాక్షి, న్యూఢిల్లీ: సీఐసీ నియామకాల్లో పారదర్శకత పాటించాలని మాజీ సీఐసీ మాడభూషి శ్రీధరాచార్యులు కోరారు. కేవలం పరిపాలన రంగానికి చెందిన అధికారులనే కాకుండా ఇతర రంగాలకు చెందిన వారినీ కమిషనర్లుగా నియమించాలన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి, లోక్సభలో ప్రతిపక్ష నేత ఖర్గేకు లేఖలు రాశారు. సీఐసీ సభ్యుల ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత సభ్యులు. సీఐసీ సభ్యుల ఎంపిక సమాచార హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నందునే పలువురు కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యా(పిల్)లు దాఖలు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘సీఐసీ కమిషనర్లుగా కేవలం పరిపాలన వర్గాల వారినే ఎందుకు నియమిస్తున్నారు? న్యాయం, సామాజిక సేవ, మీడియా, జర్నలిజం, సైన్స్, టెక్నాలజీ తదితర రంగాల వారినీ నియమించాలన్న సమాచార హక్కు చట్ట నిబంధనలను ఎందుకు పాటించరు? ఇటీవల నియమించిన నలుగురినీ బ్యూరోక్రాట్ల నుంచే ఎందుకు ఎంపిక చేశారు?’ అని ప్రశ్నించారు. సీఐసీతోపాటు రాష్ట్రాల సమాచార హక్కు కమిషన్(ఎస్ఐసీ)లలో సకాలంలో నియామకాలు చేపట్టాలన్న నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. -
రాణాకు నో చెప్పిన ఆర్బీఐ
సాక్షి,ముంబై: సీఎండీ నియామకం అంశంలో ప్రయివేటురంగ బ్యాంకు ఎస్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి తన నిర్ణయాన్ని తేల్చి చెప్పింది. తాను ముందు ఆదేశించినట్టుగానే సీఈవో, ఎండీగా రాణా కపూర్ పదవి నుంచి వైదొలగాల్సిందేనని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1నాటికి బ్యాంకు కొత్త సీఎండీ నియామాకం చేపట్టాలని పేర్కొంది. ఆర్బీఐ మరోసారి తన నిర్ణయాన్ని దృఢంగా ప్రకటించడంతో బ్యాంకు సీఎండీ మరింత కాలం కొనసాగాలని భావించిన రాణా కపూర్కు ఎదురుదెబ్బ తప్పలేదు. బ్యాంకు ఉన్నతాధికారిగా కపూర్ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాల పాటు పొడిగించాలని గతంలోనే వాటాదారులు కోరినప్పటికి ఆర్బీఐ ఆర్బీఐ నిరాకరించింది. 2019, జనవరి 31నాటికి కొత్త సీఎండీని ఎంపిక చేయాలని సెప్టెంబరు24న ఆదేశించింది. అయితే రాణా కపూర్ పదవీ కాలాన్ని కనీసం మరో మూడు నెలలు పొడిగించాలని , ఈ పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడానికి మరింత సమయం కావాలని ఆర్బీఐని ఎస్బ్యాంకు కోరింది. అలాగే కపూర్ వారసుడి ఎంపిక కోసం సెర్చ్, సెలక్షన్ కమిటీని కూడా డైరెక్టర్ల బోర్డ్ నియమించింది. తాజాగా ఈ అభ్యర్థనను కూడా ఆర్బిఐ తిరస్కరించింది. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రగాడ
హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రగాడ నాగేశ్వరరావు నియమితులయ్యారు. నాగేశ్వరరావు విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గానికి చెందిన వారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాగేశ్వరరావును పార్టీ కార్యదర్శిగా నియమించడమైందని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిన్న(సోమవారం) ఓ ప్రకటన వెలువడింది. -
‘వివాద’ కళాపరిషత్
చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్న రీతిలో ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవహారాలు సాగుతున్నాయి..విశ్వవిఖ్యాతి గాంచిన ఆంధ్ర విశ్వకళాపరిషత్.. వరుస వివాదాలతో ప్రతిష్ట కోల్పోతోంది.. ఉన్నత విద్యామండలి నిబంధనలను కాదని.. ఈ విశ్వవిద్యాలయంలో నియామకాలు, పదోన్న తులు కొందరి ఇష్టారాజ్యంగా సాగిపోతున్నాయి. తమకు నచ్చిందే చేస్తామన్న ధోరణిలో ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు.మొన్నటికి మొన్న వర్సిటీ ఆగ్రో ఎకనమిక్స్ కేంద్రం డైరెక్టర్ నియామకం వివాదాస్పదమైంది. అన్ని విధాలా అర్హుడైన అర్థశాస్త్రవిభాగాధిపతి ఆచార్య పుల్లారావుకు ఆ పదవి ఇవ్వకుండా నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు.ఇప్పుడేమో.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సడ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ) ప్రిన్సిపల్ నియామకంపైనా వివాదాలు ముసురుకున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి జూనియర్ను అందలం ఎక్కించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నియమాలు వ్యక్తులను బట్టి మారిపోతున్నాయి. రాజు తలచుకుంటే.. అన్న రీతిలో ఉన్నతాధిరులు తలచుకుంటే చాలు నిబంధలనలు గాలికి కొట్టుకుపోతున్నాయి. తమకు నచ్చిందే న్యాయమనే రీతిలో ఇక్కడి అధికారుల వ్యవహార శైలికి పలు పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఇటీవల వర్సిటీ ఆగ్రో ఎకనమిక్స్ సెంటర్ డైరెక్టర్ నియామకం వివాదాస్పదమైంది. అర్థశాస్త్ర విభా గాధిపతి ఆచార్య పుల్లారావుకు ఆ పదవిని ఇవ్వకుండా నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. పాత విధానాన్ని కాదని కొత్త సంప్రదాయానికి తెర తీసి అధికారులు విమర్శలపాలయ్యారు. తాజాగా ఇదే వర్సిటీ పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్(ఐఏఎస్ఈ)ప్రిన్సిపల్ నియామకం సైతం వివాదాస్పదమైంది. నిబంధలను పక్కన పెట్టి ఆచార్య శివప్రసాద్ను ఆ పదవిలో నియమించారు. సీనియర్లను కాదని.. ఐఏఎస్ఈ ప్రిన్సిపల్గా పనిచేసిన ఆచార్య రంగనాథన్ పదవీ కాలం గత నెల 30న ముగిసింది. ఆయన తర్వాత వర్సిటీ విద్యా విభాగం, ఐఏఎస్ఈలలో సీనియర్ ఆచార్యునికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. దీనికి భిన్నంగా వర్సిటీ అధికారులు కొత్త విధానానికి తెర తీశారు. ముగ్గురి పేర్లతో ప్యానల్ సిద్ధం చేశారు. సీనియారిటీ ఆధారంగా ఆచార్య నిమ్మ వెంటకరావు, ప్రస్తుత విద్యా విభాగాధిపతి ఆచార్య గారలచ్చన్న, ఆచార్య శివప్రసాద్ల పేర్లను వరుస క్రమంలో చేర్చారు. సీనియారిటీ ప్రకారం మొదటి స్థానంలో ఉన్న ఆచార్య నిమ్మ వెంకటరావును ప్రిన్సిపల్గా నియమించాలి. కానీ మూడో స్థానంలో ఉన్న ఆచార్య శివప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ కావడం.. వెంటనే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. ఒక్కసారికే అవకాశం.. దాన్ని కాదని.. ఆచార్య శివప్రసాద్ గతంలో ఐఏఎస్ఈ ఇన్చార్జి ప్రిన్సిపాల్గా కొంత కాలం పనిచేశారు. ఇటీవల వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఒక నియమం పెట్టుకున్నారు. ఒక పర్యాయం విభాగాధిపతి, ప్రిన్సిపల్ పదవి చేపట్టిన వారికి మరోసారి అవకాశం ఇవ్వరాదని నిర్ణయించారు. వారు పెట్టుకున్న నియమమే ఇప్పుడు అమలుకు నోచుకోలేదు. అందరికీ పరిపాలనా బాధ్యతలు అందాలనే ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టారు. దీని ప్రకారం చూసినా ఆచార్య శివప్రసాద్ ఇప్పటికే ఒక పర్యాయం ప్రిన్సిపల్గా పని చేసినందున ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వనవసరం లేదు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇటీవల ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పనిచేస్తున్న ఆచార్య కె.గాయత్రీ దేవి రెక్టార్గా పదోన్నతి పొందారు. వెంటనే సీనియారిటీ ప్రకారం ఆచార్య కె.రామమోహనరావు ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. ఆచార్యులు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచిన సమయంలో ఆచార్య సీహెచ్.వి రామచంద్రమూర్తి, ఆచార్య సుందరరావు, ఆచార్య ఎ.సుబ్రహ్మణ్యంలు ప్రిన్సిపల్స్గా తిరిగి బాధ్యతలు చేపట్టి కొనసాగారు. అప్పుడు కూడా సీనియారిటీ ప్రకారం వీరికి రెండో పర్యాయం ప్రిన్సిపల్గా బాధ్యతలు అప్పగించారు. నేడు ఈ విధానాన్ని కాదని ప్యానల్ విధానంలో ప్రిన్సిపల్ను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందని ఆచార్యులు ప్రశ్నిస్తున్నారు. అమలుకు నోచుకోని తీర్మానం గతేడాది జరిగిన అకడమిక్ సెనేట్ సమావేశంలో ఏయూలో ఉన్న విద్య విభాగం, ఐఏఎస్ఈలను విలీనం చేస్తూ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్గా ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఏడాది కావస్తున్నా ఆ తీర్మానాన్ని అమలు చేయలేదు. రసాయన శాస్త్ర విభాగాలను కలుపుతూ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ, భాష శాస్త్ర విభాగాలను కలుపుతూ ఒకే విభాగంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదలు వచ్చాయి. ఇవి కూడా కాగితాలకే పరితం అవుతున్నాయి. -
74 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య డైరెక్టరేట్ పరిధి లోని బోధనాసుపత్రుల్లో 74 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరిగింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఖాళీగా ఉన్న 225 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకోసం శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఇప్పటికే సివిల్ సర్జన్లుగా పనిచేస్తున్న డాక్టర్లను సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్కు ఆహ్వానించారు. 25 స్పెషాలిటీలకు 350 మందిని కౌన్సెలింగ్కి పిలిచారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో 45, గాంధీలో 9, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో 28, నిజామాబాద్ జీఎంసీలో 18, సిద్దిపేట జీఎంసీలో 10, ఆదిలాబాద్ రిమ్స్లో ఏడు పోస్టులతోపాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న నల్లగొండ జీఎంసీ కోసం 49, సూర్యాపేట జీఎంసీ కోసం 44 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల అవసరముంది. అనస్థీషియా, అనాటమీ, ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషాలిటీలకు అర్హులైన డాక్టర్ల కొరత ఉంది. ప్రస్తుతం 74 పోస్టులు భర్తీ కాగా మిగిలిన వాటిని డిప్యుటేషన్ లేదా కాంట్రాక్టు పద్ధతిలో నియమించనున్నారు. ప్రస్తుతం ఎంపి క చేసిన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చారు. -
దొరకని సీఎం అపాయింట్మెంట్
-
అపాయింట్మెంట్ ఇప్పిస్తే రూ.కోటి ఇస్తా
సిరిసిల్ల: ముఖ్యమంత్రి కేసీఆర్తో తనకు 48 గంటల్లో అపాయింట్మెంట్ ఇప్పిస్తే బిచ్చమెత్తెనా వాళ్లకు రూ.కోటి ఇస్తానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు శివారులోని కిష్టారావుపల్లిలో హత్యకు గురైన తండ్రి, కొడుకులు సావనపెల్లి ఎల్లయ్య, శేఖర్ కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీఎంను కలిసేందుకు పదిసార్లు లేఖలు రాశానని, వందలసార్లు అప్పీలు చేశానని చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగితే నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసింది తానేనని గుర్తు చేశారు. సీఎంను కలిసే అర్హత తనకు లేదా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా సమీక్షలు లేక దళితులు అన్యాయాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి,హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలు పదవులకు నియామకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా డా.మనోజ్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులుగా కె.ఇందిర, ఎం.జాహ్నవి, కార్యదర్శిగా నిమ్మల లలిత నియమితులైనట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రోటెం స్పీకర్ ఎవరు?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్ ఎవరు అనే విషయం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పదవికి బీజేపీ నేత ఎంపికవుతారా లేక కాంగ్రెస్ నేత ఎన్నికవుతారా అనేది కీలక చర్చగా మారింది. ఇప్పటికే ఉన్న అంచనాల ప్రకారం కాంగ్రెస్కు చెందిన ఆర్వీ దేశ్ పాండే తాత్కాలిక స్పీకర్గా ఎంపికయితే.. బలపరీక్ష నిరూపించుకునే సమయంలో యడ్యూరప్పకు మరో తలనొప్పి తప్పదా అనే చర్చ కూడా తీవ్రంగా నెలకొంది. అంతేకాదు శనివారం నాటి ఫ్లోర్ టెస్ట్లో ఫలితం టై అయిన సందర్భంలో తాత్కాలిక స్పీకర్ ఓటు నిర్ణయాత్మకం కానుంది. ఈ నేపథ్యంలో ప్రోటెం స్పీకర్ ఎంపిక హాట్ టాపిక్గా నిలిచింది. చట్టప్రకారం అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే తాత్కాలిక స్పీకర్గా ఎంపికవుతారు. అయితే సీనియారిటీ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన దేశేపాండే తాత్కాలిక స్పీకర్గా ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ నియామకాన్ని గవర్నర్ చేపడతారు. తాత్కాలిక ప్రాతిపదికన లేదా, అసెంబ్లీ స్పీకర్ ఎంపిక పూర్తయ్యేదాకా ఆయన పదవిలో ఉంటారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ప్రోటెం స్పీకర్ చేపడతారు. ఇది ఇలా ఉంటే కర్ణాటక శాసన సభ సెక్రటేరియట్ గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్ వీ దేశ్ పాండ్ పేరును తాత్కాలిక స్పీకర్ గా గవర్నర్ కు సిఫారసు చేసింది. మరోవైపు ప్రో-టెం స్పీకర్గా ఎంపిక అయ్యే అర్హత తనకే వుందని కాంగ్రెస్ నేత దేశ్పాండే చెబుతున్నారు. తానే ఈ పదవికి ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. సుప్రీం ఎలాగూ సీక్రెట్ ఓటింగ్పై స్పష్టత ఇచ్చింది కనుక వాయిస్ ఓట్, లేదా ఓట్ల విభజన ద్వారా బలనిరూపణ ఉండే అవకాశం ఉందన్నారు. దేశ్పాండే 1983 నుండి ఎన్నికలలో తొమ్మిది సార్లు పోటీ చేస్తే ఎనిమిది సార్లు విజయం సాధించారు. ఇక ఈ వరుసలో బీజేపీకి చెందిన ఉమేష్ విశ్వనాథ్ కట్టి కూడా రెండవ సీనియర్గా రేసులో ఉన్నారు. 1985 నుండి ఎనిమిదిసార్లు ఎన్నికల్లో పాల్గొనగా ఏడుస్లారు అసెంబ్లీకి ఎంపికయ్యారు. కాగా ఇప్పటికే సుప్రీం ఆదేశాలతో ఖంగుతున్న బీజేపీకి కాంగ్రెస్ సీనియర్ దేశ్పాండే తాత్కాలిక స్పీకర్గా ఎంపికయితే మరో ఎదురు దెబ్బ తప్పదనీ యడ్యూరప్ప బల నిరూపణ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాత్కలిక స్పీకర్ ఎంపికపై చర్చించేందుకు కర్ణాటక గవర్నర్ రాజ్యాంగ నిపుణులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
హైదరాబాద్: వైఎస్సార్సీపీలో కొత్తగా నియామకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం అర్భన్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా అనంతవెంకట్రామిరెడ్డిని, హిందూపురం పార్లమెంటు వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా నదీంఅహ్మద్ను, అలాగే అనంతపురం పార్లమెంటు వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా తలారి రంగయ్యను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. -
కార్పొరేషన్లకు సభ్యుల నియామకం
అమరావతి: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు సభ్యులను నియమిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో కార్పొరేషన్కు నాలుగు నుంచి ఆరుగురు వరకు సభ్యులను నియమించారు. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ ఇర్రిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ గ్రంధాలయ సంస్థ, ఏపీ షీప్ అండ్ గోట్ ఫెడరేషన్లకు సభ్యులను కేటాయించారు. ఎన్నికలు దగ్గర సమయంలో టీడీపీలో అసంతృప్తులను చల్లబరిచేందుకు కార్పొరేషన్ల నియామకం చేపడుతోన్నట్లు కనిపిస్తోంది. -
అపాయింట్మెంట్ కోసం అడుక్కుంటున్నాడు
వైఎస్సార్ జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జాతీయ నాయకుల అపోయింట్మెంట్ కోసం అడుక్కుంటూ తిరుగుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఎద్దేవా చేశారు. కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, అంజద్ బాషా, రవీంద్రనాధ్ రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు 5 కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. కేవలం ఫోటో షూట్ కోసం ఢిల్లీ టూర్కి వెళ్లారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసి జాతీయ పార్టీల నాయకులు నవ్వుకుంటున్నారని చెప్పారు. విజయ్ మాల్యాను కలిసారా లేదా అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ విసిరితే ఇంత వరకు దానిపై స్పందన లేదని మండిపడ్డారు. ముందుగా చెప్పిన విధంగా రేపు వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకి రాజీనామా చేస్తున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాము ఉన్నందుకు గర్విస్తున్నామని తెలిపారు. చంద్రబాబును చూసి జాతీయ నాయకులు, ప్రజలు పారిపోతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల దగ్గర పడుతుండటంతో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు నాటకాలు ఆడటం మొదలెట్టాయని విమర్శించారు. అధికారం లోకి వచ్చాక ఒక్క హమీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజలను మోసం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రతి జిల్లాని హైదరాబాద్ చేస్తా అని చెప్పి..ఇంత వరకు కనీసం పట్నం కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత ఏ ఒక్కరికీ లేదని, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏపార్టీతో నైనా కలిసి పోరాడుతామని ఈ సందర్భంగా తెలిపారు. -
టీసీఎస్ నియామకాల్లో 20% విదేశాల్లోనే..
న్యూఢిల్లీ: దేశ ఐటీ దిగ్గజం టీసీఎస్ గడిచిన 12 నెలల కాలంలో నియమించుకున్న మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం విదేశీయులు కావడం గమనార్హం. వీసా పరమైన సమస్యల నేపథ్యంలో ఐటీ కంపెనీలు విదేశాల్లో నియామకాలపై దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. గడిచిన డిసెంబర్ త్రైమాసికం వరకే చూసినా టీసీఎస్ సుమారు 3,000 మందిని విదేశాల్లో ఉద్యోగులుగా తీసుకుంది. ‘‘మొత్తం మీద గత ఏడాది కాలంలో 59,700 మందిని ఉద్యోగులుగా నియమించుకున్నాం. ఇందులో 1,2700 మంది విదేశాల్లోనే ఉన్నారు. ఉద్యోగుల్లో స్థానికులకు ప్రాధాన్యం అన్న తమ చొరవ ఏ విధంగా కొనసాగుతుందున్నదానికి ఇదే ప్రతీక’’ అని టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ అన్నారు. అయితే, ఏ దేశంలో ఎంత మందిని తీసుకున్నదనే వివరాలను టీసీఎస్ బయటకు వెల్లడించలేదు. -
నేడు ప్రధానితో సీఎం భేటీ
సాక్షి, అమరావతి/ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎట్టకేలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం 10.40 గంటలకు ప్రధానితో సమావేశమయ్యేందుకు ఆయన కార్యాలయం చంద్రబాబుకు సమయం కేటాయించింది. మోదీతో భేటీ కోసం సీఎం ఏడాది నుంచి ఎదురు చూస్తున్నారు. అపాయింట్మెంట్ కోరినా మోదీ ఇవ్వడం లేదంటూ టీడీపీ నేతలు చాలా రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎంపీలు ప్రధానిని కలినప్పుడు ఈ వ్యవహారాన్ని ప్రస్తావించారు. చంద్రబాబుకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంగీకరించి మోదీ 12వ తేదీన సమయం ఇచ్చారు. కాగా సీఎం చంద్రబాబు గురువారం రాత్రి 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. గతంలో ప్రయత్నాలన్నీ నిష్ఫలం చంద్రబాబుతో ముఖాముఖి సమావేశానికి మోదీ దాదాపు ఏడాదిన్నర నుంచి అవకాశం ఇవ్వకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీని కలిసేందుకు బాబు చేసిన ప్రయత్నాలు ఫలప్రదం కాలేదు. ప్రధానిని కలిసేందుకు బాబు పలుమార్లు యత్నించినాఅవి నిష్ఫలమే అయ్యాయి.దీంతో బాబును కలిసేందుకు మోదీ ఎందుకు ఇష్టపడడం లేదన్న విషయం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుపై ఫిర్యాదుల పరంపర రాజధాని నిర్మాణంసహా రాష్ట్రంలో జరుగుతున్న పలు అవినీతి వ్యవహారాలపై ప్రధాని మోదీకి ఫిర్యాదులందడంతో ఆయన బాబుకు ప్రాధాన్యం ఇవ్వట్లేదనే వాదన వినిపించింది. అమరావతి పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇష్టారాజ్యం, రాష్ట్రంలో ఏమీ జరక్కపోయినా ఏదో అద్భుతం చోటుచేసుకుంటోందంటూ అసత్యాలు ప్రచారం చేస్తుండడంపై రాష్ట్ర బీజేపీ నేతలతోపాటు పలువురు మోదీకి నివేదికలు ఇచ్చారు. దీనికితోడు రాజకీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఎన్డీఏలో ఉంటూనే మూడో ఫ్రంట్ కోసం చంద్రబాబు తెరవెనుక ప్రయత్నాలు చేశారనే ప్రచారం నేపథ్యంలో బాబును మోదీ దూరం పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సీపీఐ అగ్రనేతలు రాజా, నారాయణలు మోదీని కలిశారు. ఆ తర్వాత వెంటనే టీడీపీ ఎంపీలు బీజేపీ ఎంపీలను వెంటబెట్టుకుని వెళ్లి మోదీ అపాయిం ట్మెంట్ తమకూ ఇవ్వాలని కోరడంతో ఇచ్చారు. ఆ సమయంలో తమ అధినేత బాబుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని టీడీపీ ఎంపీలు కోరడంతో ప్రధాని అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. నేడు పుణేలో ‘మినీ పోలవరం’ సందర్శన మహారాష్ట్రలోని పుణేలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీ ఆర్ఎస్)లో ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మినీ పోలవరం ప్రాజెక్టును బాబు శుక్రవారం పరిశీలిం చనున్నారు. శుక్రవారం ప్రధానితో భేటీ ముగిశాక ప్రత్యేక విమానంలో సీఎం పుణేకు చేరుకుంటారు. -
వరించేదెవరినో..!
♦ రెండు జిల్లాల టీడీపీ అధ్యక్షుల నియామకంపై ఉత్కంఠ ♦ పార్టీ పదవులపై తొలగని ప్రతిష్టంభన ♦ పోటీలో పలువురు నాయకులు ♦ ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నం సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండు జిల్లాల టీడీపీ అధ్యక్షుల నియామకం విషయంలో కొంత ఉత్కంఠ నెలకొంది. ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న నేతలు జిల్లా విడిపోయిన తర్వాత పార్టీ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొంతకాలంగా రెండు జిల్లాలకు విడివిడిగా కమిటీలు వేస్తారని ప్రచారం జరగడంతో ఆయా జిల్లాల నాయకులు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో టీడీపీ ప్రభ తీవ్రస్థాయిలో తగ్గిపోవడంతోపాటు అనేక మంది ముఖ్య నేతలు అధికార పార్టీలోకి వలస వెళ్లారు. దీంతో జిల్లాలో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురైంది. గత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక్క సత్తుపల్లి స్థానాన్ని గెలుపొందిన ఆ పార్టీ.. ఆ తర్వాత ఖమ్మంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క స్థానాన్ని సైతం గెలుచుకోలేకపోయింది. జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన టీడీపీ ఇప్పుడు తన ఉనికి చాటుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా విడిపోయి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలుగా ఏర్పడింది. ఈ క్రమంలో వామపక్ష పార్టీలతో సహా అనేక రాజకీయ పక్షాలు కొత్త జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే టీడీపీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు నూతన కమిటీల ఏర్పాటుకు కొంతకాలంగా కసరత్తు చేస్తున్నా.. ఆయా జిల్లాల అధ్యక్ష పదవులపై ఏకాభిప్రాయం కొరవడటం, అనేక మంది ఈ పదవి కోసం పట్టుపడుతుండటంతో ఈ నియామకాన్ని చేపట్టకుండా అధిష్టానం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. చర్చోపచర్చలు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన తుళ్లూరి బ్రహ్మయ్య కొనసాగుతుండగా.. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశంపై పార్టీలో చర్చోపచర్చలు జరిగినా ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న తుళ్లూరి బ్రహ్మయ్యనే మరోసారి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించాలని పార్టీలోని కొందరు ముఖ్య నేతలు టీడీపీ అధిష్టానానికి సిఫార్సు చేయగా.. మరికొందరు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించి.. ప్రస్తుత ఖమ్మం జిల్లాకు చెందిన సమర్థుడైన నాయకుడికి ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చింది. అలాగే ఆది నుంచి పార్టీలో కొనసాగుతూ.. విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయం పాలకవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న పార్టీ సీనియర్ నేత, మధిరకు చెందిన వాసిరెడ్డి రామనాథం పేరును జిల్లాలోని పలువురు ముఖ్య నేతలు ప్రతిపాదించారు. ఆయనతోపాటు పార్టీ మహిళా నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, ఏలూరి శ్రీనివాసరావు సైతం ఈ పదవిని ఆశిస్తున్నారు. దీంతో వీరిలో ఎవరి పేరు ఖరారు చేయాలో ఒక పట్టాన తేల్చుకోలేక.. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసిన టీడీపీ అధిష్టానం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్షుల ఎంపికను మాత్రం వాయిదా వేసింది. వాసిరెడ్డి రామనాథంకు పదవి ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేని పక్షంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీలోని మరికొందరు ముఖ్యులు అధిష్టానాన్ని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం హోరాహోరీగా పోరు సాగుతోంది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి కోనేరు సత్యనారాయణ(చిన్ని) తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తుండగా.. పినపాక నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కొల్లేటి భవానీ శంకర్ అదేస్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లు తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. అయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్షుల ఎంపిక వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించిందనే భావన పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. టీడీపీ పరిస్థితి జిల్లాలో కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది. పార్టీ జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయడంపై పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్నిబట్టి తమ రాజకీయ భవిష్యత్ను నిర్ణయించుకునేందుకు అనేక మంది సీనియర్ నేతలు సమాయత్తం అవుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే టీడీపీ ఉభయ జిల్లాల్లోనూ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
డబ్యూటీఓలో భారత రాయబారి దీపక్
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ–వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)లో భారత రాయబారి(భారత శాశ్వత ప్రతినిధి)గా టెలికం కార్యదర్శి జె.ఎస్. దీపక్ నియమితులయ్యారు. 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన దీపక్ ఉత్తరప్రదేశ్కు చెందినవారు. 2010లో స్పెక్ట్రమ్ ఈ–వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.1.06 లక్షల కోట్లు విజయవంతంగా రావడానికి ఈయనే ముఖ్య కారణం. ఐఐఎం, అహ్మదాబాద్లో ఎంబీఏ చదివిన దీపక్ వాషింగ్టన్ డీసీకి చెందిన పాలసీ ప్రాజెక్ట్కు కన్సల్టెంట్గా పనిచేశారు. -
ఉన్నవారికే పనిలేదు...కొత్తగా ముగ్గురు!
రత్నగిరిపై కొత్తగా ఏఈఈలను నియమించిన సర్కారు కాంట్రాక్ట్ పద్ధతిని నెలకు రూ.30 వేల వేతనం ముగ్గురికీ ఏటా రూ.పది లక్షల అదనపు భారం అన్నవరం :తాదూర కంత లేదు..మెడకో డోలు అన్న చందంగా అన్నవరం దేవస్థానం ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకే పెద్దగా పనిలేని స్థితిలో మరో ముగ్గురు ఏఈఈలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కొక్కరికీ రూ.30 వేలు వేతనం చెల్లించేలా కాంట్రాక్ట్ పద్ధతిపై ముగ్గురిని నియమించినట్టు ఈఓ కే నాగేశ్వరరావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ద్వారా వారిని ఎంపిక చేసిందని తెలిపారు. ఈ ముగ్గురిలో దేవరకొండ సత్యచైతన్య, గాలి సురేష్ను సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో, పీ వేంకటేశ్వర్లును ఎలక్ట్రికల్ విభాగంలో నియమించారు. ఖర్చు తప్ప ఒరిగేదేమిటి? దేవస్థానం ఇంజినీరింగ్ విభాగంలో ప్రస్తుతం ఒక ఈఈ, ఇద్దరు డీఈఈలు, ఐదుగురు ఏఈఈలు ఉన్నారు. నాలుగేళ్లుగా దేవస్థానంలో చేపట్టిన నిర్మాణ పథకాలు పెద్దగా ఏమీ లేవు. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టిన పనులు మినహా తరువాత చేపట్టిన పనులంటూ ఏమీ లేవు. దేవస్థానం స్థలాల చుట్టూ గోడలు కట్టడం, చదును చేయడం వంటి పనులు మాత్రమే చేస్తున్నారు. సత్యగిరి మీద స్మార్త, ఆగమ పాఠశాల పనులు మాత్రం కొనసా...గుతూ ఉన్నాయి. యాగశాల, అన్నదాన భవనం, తదితర నిర్మాణాలలో కొన్ని దాతల కోసం ఎదురుచూస్తుండడంతోను, మరికొన్ని పనులకు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరో ముగ్గురు ఏఈఈల వల్ల దేవస్థానానికి ఖర్చు తప్ప ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అంజద్బాషాకు అత్యున్నత పదవి
కడప కార్పొరేషన్: కడప శాసనసభ్యులు షేక్ బెపారీ అంజద్బాషాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవి లభించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయన్ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2005 ఎన్నికల్లో కార్పొరేటర్గా రాజకీయాల్లోకి ప్రవేశించిన అంజద్బాషా, 2014లో కడప నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి 45వేల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన కొన్నాళ్లకే పార్టీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడ్డారు. జిల్లాలో ప్రప్రథమంగా ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. అంజద్బాషాకు అత్యున్నత పదవి లభించడంపై పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం– అంజద్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తానని ఎమ్మెల్యే అంజద్బాషా అన్నారు. పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకముంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. ప్రజాధనంతో జాతీయ పార్లమెంటరీ సదస్సు నిర్వహించి, అందులో పాల్గొనేందుకు వచ్చిన రోజాను నిర్బంధించి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. మహిళలపై సీఎంకు, స్పీకర్కు ఉన్న చిన్నచూపు వారి మాటల్లోనే తెలిసిపోతోందని దుయ్యబట్టారు. కడపలో పట్టపగలే టీడీపీ గూండాలు కార్పొరేటర్పై దాడి చేయడం వారి అరాచకాలకు పరాకాష్ట అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే టీడీపీ యత్నాలు సాగనీయబోమని హెచ్చరించారు. -
లభించని కడియం అపాయింట్మెంట్..
కలవలేకపోయిన కోదండరాం సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యు కేషన్లో (బీఎడ్) ప్రవే శాల కోసం రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించే విషయమై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో చర్చించేందుకు బుధవారం సచివాలయానికి వచ్చిన టీజే ఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు మంత్రి అపాయింట్మెంట్ లభించలేదు. బీఎడ్ కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో సచివాలయానికి బయలుదేరిన ఆయన ఫోన్లో కడియం శ్రీహరి పేషీకి ఫోన్ చేసి, అపాయింట్మెంట్ కావాలని కోరారు. అయితే అప్పటికే డిప్యూటీ సీఎం.. వీసీల సమావేశంలో ఉండటంతో అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఆ తరువాత సచివాల యంలోని ఉప ముఖ్యమంత్రి పేషీకి బీఎడ్ కాలేజీ ప్రతినిధులు వచ్చి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. అప్పుడూ వీసీల సమావేశంలోనే కడియం ఉండ టంతో కలిసేందుకు అవకాశం కుదరలేదు. దీంతో కోదండరాం సచివాలయంలోని ఇతర విభాగాల అధికారులను వేరే సమస్యలపై కలిసి వెళ్లిపోయారు. -
వైఎస్సార్సీపీ పదవుల్లో నియామకం
రాష్ట్ర, జిల్లా కమిటీల్లో పదవులు కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల్లో మరికొందరు నేతలకు స్థానం కల్పించారు. ఈ మేరకు ఆయా పదవుల్లో నియామకానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ వివరాలను బుధవారం రాత్రి ప్రకటించింది. కాకినాడకు చెందిన మచ్చా లోకేష్వర్మను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నియమించారు. అలాగే ఇటీవలే పార్టీలో చేరిన కాకినాడకు చెందిన మత్స్యకార నాయకుడు మచ్చా గంగాధరరావును పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శిగా నియమించారు. రాజమహేంద్రవరం మహిళా విభాగం అధ్యక్షురాలిగా మర్తిలక్ష్మిని నియమించారు. కాగా జిల్లాలోని ముమ్మిడివరం మండలానికి సంబంధించి మరికొంతమందికి కూడా పదవుల్లో నియమించారు. తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన అధ్యక్షులుగా మల్లాడి భైరవమూర్తి, పిన్నమరాజు వెంకటపతిరాజు, నల్లా నరసింహమూర్తి నియమితులయ్యారు. ముమ్మిడివరం నగర పంచాయతీ అధ్యక్షుడిగా బొంతు సత్యశ్రీనివాస్ను నియమించారు. -
జిల్లా రెవెన్యూ అధికారుల నియామకం
నల్లగొండ : నూతన జిల్లాల్లో ఖాళీగా ఉన్న రెవెన్యూ అధికారుల పోస్టుల్లో ప్రభుత్వం కొత్తవారిని నియమించింది. వివిధ జిల్లాల్లో రెవెన్యూ అధికారులుగా పనిచేస్తున్న వారిని కొత్త జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల విభజన సమయంలో కొత్త జేసీలు, కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం డీఆర్ఓ నియామకాలు చేపట్టలేదు. దీంతో ఇప్పటి వరకు ఆ స్థానాల్లో ఇన్చార్జి అధికారులు పనిచేస్తున్నారు. నియామకాల్లో భాగంగా జిల్లా పరిషత్ సీఈఓ రావుల మహేందర్రెడ్డిని యాదాద్రి జిల్లా డీఆర్ఓగా బదిలీ చేశారు. ఈయన స్వస్థలం ఆలేరు. మహేందర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం యాదాద్రి జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఎన్.కీమ్యా నాయక్ను నల్లగొండ డీఆర్ఓగా నియమించారు. ఈయన గతంలో మోత్కూరు మండలం తహసీల్దార్గా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్డీఓగా పనిచేస్తున్న పి.యాదిరెడ్డిని సూర్యాపేట జిల్లా డీఆర్ఓగా నియమించారు. ఈయన స్వస్థలం నల్లగొండ మండలం అప్పాజిపేట. ఇక నల్లగొండ నుంచి బదిలీ అయి వెయిటింగ్లో ఉన్న ఏజేసీ ఎస్. వెంకట్రావ్ను నిర్మల్ జిల్లా డీఆర్ఓగా నియమించారు. ఇన్చార్జి సీఈఓగా అంజయ్య..? జెడ్పీ సీఈఓగా రావుల మహేందర్ రెడ్డి 2014 ఫిబ్రవరిలో జిల్లాకు వచ్చారు. 22 మాసాల కాలంలో సీఈఓ విధులతో పాటు మెప్మా పీడీ, డీపీఓగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తించారు. సీఈఓగా జెడ్పీ పాలన యంత్రాంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేశారు. సీఈఓ స్థానంలో కొత్తవారిని నియమించేంత వరకు డీఆర్డీఓ రింగు అంజయ్యను ఇన్చార్జి సీఈఓగా నియమించనున్నట్లు తెలిసింది. నిన్నటివరకు ఇన్చార్జి డీఆర్ఓగా పనిచేసిన ఆయన ఆ స్థానంలో కొత్త వారిని ప్రభుత్వం నియమించింది. దీంతో ఖాళీ అయిన సీఈఓ పోస్టుకు అంజయ్యను ఇం చార్జిగా నియమించే అవకాశం ఉంది. -
అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం పడిగాపులు
– ఆర్బీఎస్కే ఉద్యోగుల ఎదురుచూపులు కర్నూలు(హాస్పిటల్): మీరు ఉదయమే వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్లండి అని వైద్య ఆరోగ్యశాఖ నుంచి మెసేజ్ రావడంతో అభ్యర్థులు హుటాహుటిన ఉదయం 9 గంటలకే కార్యాలయం చేరుకున్నారు. కానీ కార్యాలయ ఉద్యోగులు నింపాదిగా 11 గంటలకు చేరుకున్నారు. బయట అధిక సంఖ్యలో అభ్యర్థులు ఉండటాన్ని చూసీ చూడనట్లు వెళ్లారు. మరోవైపు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే డీఎంహెచ్వో ఊళ్లో లేరని తెలిసింది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. వీరికి సరైన సమాచారం ఇచ్చేవారు లేక సాయంత్రం 4 గంటల వరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఆర్బీఎస్కే స్కీమ్ కింద మొబైల్ హెల్త్టీంలలో పనిచేసేందుకు ఇటీవల నియామకాలు చేపట్టారు. ఇందులో అల్లోపతి వైద్యులు 40, ఆయుర్వేద 20, హోమియోపతి 20 వైద్యులతో పాటు 40 మంది ఫార్మాసిస్టులు, 40 మంది ల్యాబ్టెక్నీషియన్లు, 40 మంది ఏఎన్ఎంలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ సుదీర్ఘకాలం ప్రక్రియ చేపట్టి నియామకాలు చేపట్టింది. ఎట్టకేలకు నాలుగు రోజుల క్రితం నియామకాలు పొందిన వారికి కౌన్సిలింగ్ ద్వారా వారు పనిచేసే చోటును కల్పించారు. మంగళవారం ఉదయమే వస్తే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని చెప్పారు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు వచ్చినా మధ్యాహ్నం 12 గంటలైనా సమాధానం చెప్పేవారు కనిపించలేదు. చివరకు ఒంటిగంటకు ఓ ఉద్యోగి వచ్చి మీరు భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు వస్తే అప్పుడు చెబుతామంటూ పంపించేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు భోజనం కోసమని వెళ్లారు. అధికారులు ఏ విషయమై తెలపకుండా గంటల తరబడి కార్యాలయం వద్దే ఉంచుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులకు మీరు ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళితే మళ్లీ సమాచారం పంపిస్తామంటూ పంపించి వేశారు. -
రేపు టీఆర్ఎస్ కమిటీల నియామకం!
-
రేపు టీఆర్ఎస్ కమిటీల నియామకం!
• తెలంగాణ భవన్లో ప్రకటించనున్న సీఎం కేసీఆర్ • ఇప్పటికే జిల్లా, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఖరారు సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత కమిటీలను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించనున్నారు. పొలి ట్బ్యూరో మినహా పార్టీకి చెందిన అన్ని స్థాయిల కమిటీలను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర స్థాయి కమిటీపై కసరత్తు కొనసాగుతోందని.. దానిని కూడా పూర్తిచేసి తెలంగాణ భవన్లో సంస్థాగత కమిటీలను వెల్లడిస్తారని పేర్కొంటున్నాయి. వాస్తవానికి తొలుత జిల్లా కమిటీల అధ్యక్షులను మాత్రమే ప్రకటించి, తర్వాత ఒక్కొక్కటిగా కమిటీలను ప్రకటించాలని భావించారు. శనివారం జిల్లా కమిటీలు, జిల్లా అనుబంధ సంఘాల కమిటీలను నియమిస్తారని భావించారు. కానీ జిల్లా కమిటీలతో పాటు రాష్ట్ర స్థాయి కమిటీలనూ ప్రక టించాలని కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. దీంతో శనివారం ప్రకటన వాయిదా పడిందని తెలుస్తోంది. అంతేగాకుండా రాష్ట్ర స్థాయి కమిటీల కూర్పుపై సీఎం కసరత్తు కొనసాగుతుండటం కూడా కారణమంటున్నారు. రాష్ట్ర కమిటీకి ప్రాథమిక రూపం ఇచ్చేందుకు మంత్రులు కె. తారకరామారావు, జగదీశ్రెడ్డి, ఎంపీ బి. వినోద్కుమార్ తొలుత కొంత కసరత్తు చేశారని చెబుతున్నారు. మొత్తంగా కమిటీకి సీఎం తుదిరూపు ఇవ్వనున్నారు. పొలిట్ బ్యూరో మినహా అన్ని స్థాయిల కమిటీలను సోమవారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వివరించాయి. జిల్లా కమిటీలపై స్పష్టత వచ్చాకే.. వాస్తవానికి జిల్లా క మిటీలపై పూర్తి స్పష్టత వచ్చాకే పార్టీ నాయకత్వం రాష్ట్ర కమిటీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆయా జిల్లాల అధ్యక్షుల నియామకంపై తుది నిర్ణయానికి వచ్చాక కూడా ఒకటి రెండు జిల్లాల్లో నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థి, యువజన విభాగాల విషయంలో పోటీ ఏర్పడిందంటున్నారు. నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావుగౌడ్లు ఈ విభాగాలకోసం తమ అనుయాయుల పేర్లను రెండేసి చొప్పున ఇవ్వడంతో ఎటూ తేలలేదని చెబుతున్నారు. ఇక జిల్లా అధ్యక్షుల విషయంలో సామాజిక సమీకరణాల మేరకే, అన్ని వర్గాలకు అవకాశం దక్కేలా నిర్ణయం తీసుకోవాలని భావించడం వల్ల కూడా కమిటీల రూపకల్పనలో ఒకింత ప్రతిష్టంభన నెలకొందంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఎస్సీ వర్గాలకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని చూసినా నాయకులు దొరకని పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాళ్లూరి వెంకటేశ్వర్లు పేరు దాదాపు ఖరారైనా.. పోటీ కొనసాగుతోందని చెబుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే జలగం వెంకట్రావులు తమ వారికోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో ఆదివారం సాయంత్రంలోగా పలు మార్పులు జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. -
మిస్త్రీకి దొరకని జైట్లీ అపాయింట్మెంట్..
• గొడవలో ప్రస్తుతానికి • తలదూర్చకూడదని ప్రభుత్వం నిర్ణయం! న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఆధిపత్య పోరులో ప్రస్తుతానికి జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి తన వాదన వినిపించడం కోసం సైరస్ మిస్త్రీ ఆయన అపాయింట్మెంట్ అడిగారు. దీనికి జైట్లీ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో అటు మిస్త్రీ, ఇటు రతన్ టాటా... ఎవరినీ ప్రస్తుతానికి కలవకూడదని ఆర్థిక మంత్రి నిర్ణయించినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘నాయకత్వ పోరులో ప్రభుత్వం ప్రస్తుతానికి వేలుపెట్టకూడదని భావిస్తోంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లేదా కోర్టులకు ఈ వివాదం చేరేవరకూ మంత్రులెవరూ మిస్త్రీ, టాటాలను కలిసే అవకాశం లేదు. ఒకరిపక్షాన నిలిచిందన్న ముద్ర పడకుండా ఉండటమే దీనికి ప్రధానకారణం. ఒకవేళ న్యాయపోరాటం మొదలైతే వివాదంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, టాటా-మిస్త్రీ వివాదంలో చోటుచేసుకుంటున్న సంఘటనలను నిశితంగా గమనిస్తున్నామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. -
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్గా మళ్లీ జిమ్ యాంగ్ కిమ్
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్గా మళ్లీ జిమ్ యాంగ్ కిమ్ నియమితుల య్యారు. ఈయన పదవీ కాలం వచ్చే ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమౌతుంది. కాగా జిమ్ యాంగ్ కిమ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఐదేళ్లపాటు కొనసాగుతారు. ‘బ్యాంక్ అధ్యక్షుడిగా వరుసగా రెండవసారి ఎన్నిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తాను. అంతర్జాతీయంగా పేదరిక నిర్మూలనకు అవిశ్రాంతంగా శ్రమిస్తాను’ అని కిమ్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లందరూ కిమ్ను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. కాగా కిమ్ 2012లో బ్యాంక్ ప్రెసిడెంట్గా నియమితులైనప్పుడు 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం, వర్ధమాన దేశాల్లోని వ్యక్తుల ఆదాయాన్ని పెంచడం అనే రెండు లక్ష్యాలను బ్యాంకుకు నిర్దేశించారు. -
గవర్నర్ అపాయింట్ మెంట్ దొరకడం లేదు: టీటీడీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు గత 15 రోజులుగా ప్రయత్నిస్తున్నా ఆయన అపాయింట్మెంట్ దొరకడం లేదని టీటీడీపీ పేర్కొంది. ప్రజా సమస్యల పరిష్కారానికి గవర్నర్ కార్యాలయాన్ని కూడా వేదికగా భావిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలకు అడగ్గానే అపాయింట్మెంట్ ఇస్తున్న గవర్నర్ కార్యాలయం... టీడీపీకి ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న రాజకీ య పార్టీలకు అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో సముచితస్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. -
అంతా సర్కారే చూసుకుంటుంది:వీసీలు
► హైకోర్టు తీర్పు నేపథ్యంలో వీసీల స్పందన సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన వైస్ చాన్స్లర్లు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. విశ్వవిద్యాలయాలకు చేపట్టిన వీసీల నియామకాలు చెల్లవని గత గురువారం హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్సిటీల నూతన వీసీలు విధుల్లో కొనసాగుతారా? వైదొలుగుతారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పుతో సంబంధం లేకుండా వీసీలు మాత్రం రోజువారీ విధుల్లో తలమునకలయ్యారు. గత నెల 25న నియామకమైన జేఎన్టీయూహెచ్ వీసీ డాక్టర్ వేణు గోపాల్ రెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ సీతారామారావు అదే రోజు బాధ్యతలు స్వీకరించారు. వీసీల నియామకాలు చెల్లవని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వీసీల్లో నర్మగర్భంగా ఆందోళన మొదలైంది. ‘తమను ప్రభుత్వమే నియమించింది. నియామకాలు కూడా పారదర్శకంగా జరిగాయి. నిబంధనలకు అనుగుణంగానే పదవులను అలంకరించాం. కోర్టు ఏం తీర్పు చెప్పినా ప్రభుత్వమే ఆ వ్యవహారాన్ని చూసుకుంటుంది. అసలు ఆ విషయాన్ని మేం పట్టించుకోవడం లేదు. మేం ప్రస్తుతం విధుల నిర్వహణ పైనే దృష్టి సారించాం. మాకొచ్చే ఇబ్బందేం లేదు’ అని ఓ వర్సిటీ వీసీ ధీమావ్యక్తం చేశారు. ‘కోర్టులంటే అందరికీ గౌరవమే. అయితే వీసీల నియామకాలు చెల్లవని కోర్టు ఇచ్చిన తీర్పు కాపీలు అందలేదు. అలాగని ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ మాకు చేరలేదు. ప్రస్తుతమైతే వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం’ అని మరో వర్సిటీ వీసీ పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల చట్టాలను సవరించి ఇచ్చిన జీఓలకు అనుగుణంగా వీసీను నియమించారు. అసలు ఆ జీఓలే చెల్లవు. అటువంటప్పుడు వీసీ నియామకాలు ఏమాత్రం చెల్లుబాటు కాబోవు. బహుశా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అక్కడ స్టే విధిస్తే.. కొన్నాళ్లు నూతన వీసీలు తమ పదవుల్లో కొనసాగుతారు. లేదంటే పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది’ అని ఓ మాజీ వీసీ వివరించారు. మరోపక్క కనీస అర్హతలు లేకున్నా.. వీసీలుగా నియమితులైన వారు మరింత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. వీసీగా నియమితులు కావాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్గా పదేళ్ల అనుభవం ఉండాలి. కానీ పలువురు వీసీలు ఐదేళ్ల అనుభవం ఉన్నా వీసీలుగా నియమితులయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని పలువురు వీసీలను అడగగా.. ‘నగరంలో ఉన్న వర్సిటీలకు నూతన వీసీలుగా కొనసాగుతున్న వారందరికీ ప్రొఫెసర్గా పదేళ్ల పైబడే అనుభవం ఉంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు’ అని పేర్కొన్నారు. మొత్తం మీద నాలుగు వారాల తర్వాత నూతన వీసీలు కొనసాగుతారా? పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. -
తాండూరు మైన్స్ ఏడీగా రాంచంద్రయ్య
సెలవులో వెళ్లిన ఏడీ జయరాజ్ తాండూరు : గనుల శాఖ తాండూరు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా రాంచంద్రయ్య నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గనుల శాఖ ఏడీగా పని చేస్తున్నారు. యాలాల మండలం విశ్వనాథ్పూర్ ఇసుక తవ్వకాల వ్యవహారంలో వివాదంగా మారిన నేపథ్యంలో తాండూరు ఏడీ జయరాజ్పై కలెక్టర్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జయరాజ్ సెలవుపై వెళ్లగా.. ఆయన స్థానంలో తాండూరు ఏడీగా రాంచంద్రయ్యకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గనుల శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన రెండు రోజుల్లో ఆయన తాండూరు ఏడీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ఆయన ఇక్కడ ఏడీ పని చేశారు. ఇదిలా ఉండగా ‘గనులు లూటీ’ శీర్షికతో శనివారం సాక్షితో ప్రచురితమైన ప్రత్యేక కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఏడీ రాంచంద్రయ్యను ఉన్నతాధికారులు ఆదేశించారు. చెక్పోస్టు వద్ద నామమాత్రపు తనిఖీలు, పెద్దేముల్, తాండూరు మండలాల్లో అక్రమ మైనింగ్ వ్యవహారాలు, జరిమానాల వసూలు తదితర అంశాలపై ఏడీ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా ఫోన్లో ఆయన సాక్షితో మాట్లాడుతూ పెద్దేముల్లో సుద్ద, తాండూరు మండలాల్లో నాపరాతి అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యాలాలలో ఇసుక తవ్వకాల అనుమతులపై గనుల శాఖ విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారన్నారు. టీఏ ఇచ్చిన నివేదికలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయా? లేదా? అనేది విచారణలో తేలుతుంద చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ నిర్ధేశించిన లక్ష్యం మేరకు రాయల్టీ వచ్చిందన్నారు. సిబ్బంది కొరత వల్ల పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. చెక్పోస్టు వద్ద తనిఖీలు పటిష్టం చేస్తామన్నారు. -
క్రీడా కార్యదర్శి నియామకమెప్పుడో?
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి నియామకం లోపభూయిష్టంగా మారింది. రెండేళ్లకోసారి జరిగే నియామకం విషయంలో తాత్సారం జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా నిబంధనల ప్రకారం జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(పీడీ)లు మాత్రమే జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శులుగా నియమించాలనే నిబంధనను తెచ్చింది. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖ ఒక నిర్ణయానికి రాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కార్యదర్శిని ఈనెల 15వ తేదీలోపు నియమించాలని డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి గత నెల 30వ తేదీన ఆదేశాలు వచ్చినా దాని గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. సీనియర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కు మాత్రమే ఈ పదవిని ఇవ్వాలని నిబంధనలు సూచిస్తున్నాయి. సీనియర్లుగా భావిస్తున్న కొందరు పీడీలు ఈ పదవి వద్దనుకుంటే.. సర్వీసు ఉన్నంత కాలం తిరిగి ఈ పోస్టులో కొనసాగలేరు. జిల్లాలో 65 మంది మాత్రమే ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్(పీడీ)లు ఉన్నారు. పీఈటీలు 220 మంది ఉన్నారు. ఇప్పటివరకు జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో పనిచేసే వారిని మాత్రమే నియమించేవారు. కానీ.. తాజాగా జిల్లావ్యాప్తంగా సీని యర్ పీడీనే నియమించాలనే నిబంధన ఉండటంతో.. ఐదుగురు సీనియర్ పీడీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో పోస్టుకు ఆసక్తి కనబరుస్తున్న వారు ఒక్కరు మాత్రమే ఉన్నట్లు సమాచారం. పదోన్నతి కల్పిస్తే తాము కూడా అర్హుల జాబితాలో ఉండే వారమని కొందరు పీఈటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, కార్యదర్శి పోస్టును ఎన్నిక ద్వారా నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్యదర్శి పోస్టులో నియామకమయ్యే వారు కోటరీకి లోబడే ఏ నిర్ణయమైన తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఉన్న పీఈటీ వర్గాల్లో ఏదో ఒక వర్గాన్ని ఎంపిక చేసుకుని.. పని చేసుకోవాల్సి ఉంటుంది. తమకు అనుకూలంగా ఉండని కార్యదర్శికి నిర్వహణ బాధ్యతలు చేపట్టడం కష్టంగా మారుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాయింట్ కలెక్టర్ నేరుగా పాఠశాలల క్రీడా నిర్వహణలో పాలుపంచుకుంటే.. అన్ని వర్గాలు సక్రమంగా పని చేస్తాయనే వాదన వినిపిస్తోంది. ప్రతి ఏటా జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలు జరిగే సమయాల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు కనీసం ఇటువైపు కూడా చూడరనే విమర్శలున్నాయి. ఈసారి జేసీ చైర్మన్ గా వ్యవహరించడంతో క్రీడలు విజయవంతంగా జరుగుతాయని జిల్లాలోని సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు అంటున్నారు. -
టీ పీసీసీ అధికార ప్రతినిధిగా జగ్గారెడ్డి
సంగారెడ్డి మున్సిపాలిటీ: మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన జగ్గారెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ అరంగ్రేటం చేసి అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా పనిచేశారు. ఇటీవల పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిని రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తన పై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతం కోసం పనిచేయడమే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ సంస్థాగత పదవుల నియామకం
♦ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పి.శ్రీలక్ష్మి ♦ యువజన, విద్యార్థి విభాగాల పర్యవేక్షకుడిగా కోలగట్ల సాక్షి,హైదరాబాద్: ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పదవుల్లో పలువురిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి(ఏలూరు) నియమితులయ్యారు. రాష్ట్ర యువజన, విద్యార్థి విభాగాల పర్యవేక్షణ బాధ్యతలను ఎమ్మెల్సీ, విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామికి అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతిని పాతపట్నం నియోజకవర్గం సమన్వయకర్తగా, కావటి శివ నాగ మనోహర్ నాయుడును గుంటూరు జిల్లా పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. కర్నూలు జిల్లా నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గుండం సూర్యప్రకాష్ రెడ్డి(బనగానపల్లి), రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా పోచా.శీలారెడ్డి(బనగానపల్లి), జిల్లా ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు యాదవ్(కర్నూలు), జిల్లా అధికార ప్రతినిధిగా సిద్ధారెడ్డి రామ్మోహన్రెడ్డి(బనగానపల్లి), జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా జి.అయ్యపురెడ్డి(బనగానపల్లి)లు నియమితులయ్యారు. ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా సలగాల అమృతరావు(చీరాల), జిల్లా విద్యార్థి విభాగం సహాయ కార్యదర్శిగా పెర్లి రిచ్చి(చీరాల), కార్యవర్గసభ్యులుగా చీరాలకు చెందిన యామర్తి అజైల్ రాయ్, దాసరి వినోద్, కాగిత సందీప్, నల్లమేకల రాజేష్ యాదవ్, బండి బాలశంకరరావులు నియమితులయ్యారు. వేటపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా కొలుకుల వెంకటేశ్, విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడిగా కుంచాల ఏడుకొండలరెడ్డి, చీరాల మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఆట్ల రూపేంద్రరెడ్డి, చీరాల పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షురాలిగా బిళ్ల వినీత్నలు నియమితులయ్యారు. శ్రీకాకుళం జిల్లా నుంచి పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా శిర్ల రామారావు(శ్రీకాకుళం), నందిగాం మండల పార్టీ అధ్యక్షుడిగా బొమ్మిలి లక్ష్మీనారాయణ(టెక్కలి), ఇచ్ఛాపురం పట్టణ శాఖ అధ్యక్షుడిగా కళ్ళ దేవరాజ్లను నియమించారు. -
కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు
ప్రజలకు సంబంధించిన అంశాలపై కలిసే ప్రయత్నం చేశాం: కోదండరాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు సంబంధించిన వివిధ అంశాలపై సూచనలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు చిత్తశుద్ధితో పోరాటం చేసినట్టుగానే... ఇప్పుడు రాష్ట్ర వికాసం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధి, వికాసం, సంక్షేమం లక్ష్యమని జేఏసీ ఆవిర్భావం నుంచి తాము చెబుతున్నామన్నారు. కావాలంటే తాము చెప్పిన మాటలను మరోసారి చూసుకోవాలని సూచించారు. ‘‘వివిధ ప్రజాసంఘాలతో జేఏసీ నిర్మాణమైంది. జేఏసీ లేకుంటే మంత్రులంతా ఎందుకు విమర్శలు చేస్తున్నారు? మంత్రులంతా మాట్లాడుతున్నారంటే జేఏసీ ఉన్నట్టే కదా..’’ అని వ్యాఖ్యానించారు. ప్రజల వికాసానికి, అభివృద్ధికి సంబంధించిన చర్చ చాలా ముఖ్యమన్నారు. ‘‘ప్రజలు లేకుంటే మేం లేం.. మీరు(ప్రభుత్వం) లేరు. ప్రజలు, అభివృద్ధి, సంక్షేమం అవసరం లేకుంటే చెప్పండి. జేఏసీని ఎవరు ఏర్పాటు చేసినా తెలంగాణ వచ్చేదాకా రాష్ట్రం కోసం, తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి కోసం పనిచేయాలని అనుకున్నాం. జేఏసీ వెనుక ప్రజలే ఉన్నారు’’ అని స్పష్టంచేశారు. ప్రజా సంఘాలుగా ఒత్తిడి తేవడం గతంలోనూ ఉంది.. ఇప్పటిదాకా తానే ఒకరికి చెప్పానని, తనకు వేరొకరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదని కోదండరాం స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలు, అందుకు అవసరమయ్యే కార్యాచరణ చుట్టే పనిచేస్తామన్నారు. ప్రజా సంక్షేమాన్ని రాజకీయ జెండాగా మార్చడానికి ప్రయత్నం చేస్తామన్నారు. రాజకీయ ప్రయోజనాలేమీ ఇందులో లేవని, ప్రజా ప్రయోజనాలే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా సంఘాలుగా ప్రజల కోసం పనిచేయడం ప్రపంచంలోనే వినూత్న ప్రయోగమన్నారు. ప్రజాసంఘాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం గతంలోనూ తెలంగాణలో ఉందని పేర్కొన్నారు. రాజకీయ ప్రక్రియను తక్కువ చేయడం లేదని, అది సక్రమంగా పనిచేయాలని కోరుతున్నామన్నారు. రాజకీయ ప్రక్రియ సరిగా పనిచేయకుంటే ప్రశ్నిస్తామని స్పష్టంచేశారు. వర్సిటీ సమస్యలపై త్వరలో సెమినార్ యూనివర్సిటీలకు వీసీలు లేరని, టీచింగ్ స్టాఫ్ లేదని కోదండరాం అన్నారు. యూనివర్సిటీల సమస్యలపై ఓయూలో త్వరలోనే ఒక సెమినార్ను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రైవేటు విద్యాసంస్థల నియంత్రణకు తాము వ్యతిరేకం కాదని, అయితే పోలీసులతో పర్యవేక్షణ పనికిరాదన్నారు. భూసేకరణ చట్టాలపై అవగాహన, వివరణ లేకపోవడంతో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు అవగాహన కల్పించడానికి గజ్వేల్లో సెమినార్ను నిర్వహిస్తామని తెలిపారు. 2013 చట్టానికి సంబంధించి, ప్రాజెక్టుల్లో అనుసరించాల్సిన అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. చట్టంలోనే మెరుగైన నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. ఇలాంటి కేసులు చేసిన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నామన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్తాం.. సింగరేణి ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్తామని కోదండరాం తెలిపారు. సింగరేణి సీఎండీని కూడా కలుస్తామన్నారు. హైకోర్టు విభజన జరగలేదని, న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా ఉంటామన్నారు. ‘‘న్యాయం కోసం చేసే పోరాటానికి న్యాయమూర్తులు అండగా ఉంటామన్నారు. కరువుపై జిల్లాల్లో చేసిన అధ్యయనం, కరువు పరిస్థితులపై నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చారు. కరువుపై ఒక మాన్యువల్, దానికి చట్టబద్దత కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు’’ అని కోదండరాం పేర్కొన్నారు. స్టీరింగ్ కమిటీ సమావేశంలో వివిధ ప్రజాసంఘాలకు చెందిన నేతలు పి.రఘు, పి.ప్రహ్లాద్, పిట్టల రవీందర్, భైరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. నాకు ప్రజల భాషే వచ్చు మంత్రులతో సహా తమపై విమర్శలు చేస్తున్న వారికి తానేం చెప్పాలని కోదండరాం ప్రశ్నించారు. వారు మాట్లాడుతున్న భాష తనకు రాదని, కేవలం ప్రజల భాష మాత్రమే వచ్చునన్నారు. ‘‘మా డిక్షనరీ చాలా చిన్నది. ప్రజాసంఘంగానే పనిచేస్తాం. ప్రజా సంఘంగానే ఉంటాం. ప్రజల కోసం పనిచేస్తున్నందుకే మాపై కొంతమందికి ఆగ్రహం వచ్చినట్టుంది. కొందరికి ఆగ్రహం వస్తే మా పని ఆపం కదా’’ అని అన్నారు. గ్రామస్థాయి నుంచి జేఏసీని నిర్మాణం చేసి, బలోపేతం చేస్తామని చెప్పారు. ఎన్ని అవాంతరాలు, దాడులు ఎదురైనా ప్రజల కోసం చేస్తున్న తమ ప్రయాణం ఆగదన్నారు. మూసివేసిన పరిశ్రమల పునరుద్ధరణ కోసం పని చేస్తామని చెప్పారు. హిందూస్థాన్ కేబుల్ పరిశ్రమను, నిజాం షుగర్స్ను ప్రభుత్వమే పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగుల జీతాలు పెంచారని, వారికి బకాయిలు, హెల్త్కార్డులు ఇవ్వాలని కోరారు. జేఏసీ ఇచ్చే సూచనలు బాగుంటే స్వీకరించాలి తప్ప ఇంతలా విమర్శలు అవసరం లేదని కోదండరాం సూచించారు. -
మణిపూర్ అఖిలపక్షానికి మోదీ ఆహ్వానం
ఇంపాల్: అక్రమ వలసదారుల నిరోధానికి సంబంధించిన మూడు బిల్లులపై చర్చించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ అఖిల పక్ష ప్రతినిధి బృందానికి ఆహ్వానం పంపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఒకారమ్ ఇబోబి గురువారమిక్కడ తెలిపారు. ఈ మూడు బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ గత ఏడాదే ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులను గిరిజన తెగకు చెందిన ఓ వర్గం ప్రజలు వ్యతిరేకిస్తోంది. దీనిపై చర్చించేందుకు ప్రధాని అఖిలపక్షాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం ఒకారమ్ ఇబోబి మాట్లాడుతూ దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే ఏ బిల్లును అయినా సవరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ బిల్లుకు వ్యతిరేకంగా, మద్దతుగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. గతంలో వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో 9 మంది ఆందోళనకారులు మరణించిన విషయం తెలిసిందే. ప్రధాని అపాయింట్ మెంట్ జాప్యంపై ప్రశ్నించగా ప్రధానికి దేశ, విదేశీ సమస్యలు ఎన్నో ఉంటాయని ఇబోబి అన్నారు. -
కేజ్రీవాల్ డిగ్రీని తవ్వేందుకు ఐపీఎస్ బస్సీ
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సభ్యుడిగా ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీని కేంద్రం నియమించడం పట్ల సోషల్ మీడియా మంగళవారం తనదైన శైలిలో తీవ్రంగా మండిపడింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమారు అరెస్టు వ్యవహారంలో బస్సీ వ్యవహరించిన తీరు ప్రధానంగా వివాదాస్పదమైన విషయం తెల్సిందే. కేంద్రంలోని బీజేపీ నాయకులకు ఒత్తాసు పలికే బస్సీ పాటియాల కోర్టులో కన్హయ్య కుమార్పై జరిగిన దాడిని కూడా అడ్డుకోలేకపోయారు. పైగా యూనివ ర్శిటీలో జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చిన విద్యార్ధులకు పాకిస్తాన్ టైస్టు హఫీజ్ సయాద్ మద్దతు కూడా ఉందంటూ ఓ నకిలీ మెయిల్ను సృష్టించి అభాసుపాలు కూడా అయ్యారు. అలాంటి వ్యక్తిని భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీసు సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు తదితర ముఖ్యమైన సర్వీసులకు అభ్యర్థులను ఎంపికచేసే యూపీఎస్సీ సభ్యుడిగా నియమించడం ఏమిటంటూ ట్విట్టర్లో పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో విభేదిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నిజంగా ఐఆర్ఎస్ చదివారా? లేదా తెలుసుకునేందుకుగాను పాత ఫైళ్లను వెతికించడం కోసమే ఆయన్ని యూపీఎస్సీ సభ్యుడిగా నియమించారు అని ఒకరు....చేతకాని చెత్త బ్యూరోక్రట్లను ఎంపిక చేయడం కోసమే నియమించారని కొందరు వ్యాఖ్యానించారు. యూపీఎస్సీలో కూడా హిందూత్వ ఎజెండాను అమలు చేయడం కోసమని కొందరు, 2016కు యూపీఎస్సీ టాపర్ బస్సీయేనని ఒకరిద్దరు వ్యాఖ్యానించారు. తిమ్మిని బమ్మి చేయడం కోసం బస్సీ రాకను పురస్కరించుకొని అప్పుడే యూపీఎస్సీలో ఫొటోషాప్, వీడియో టేప్ల ఎడిటింగ్ తరగతులను ప్రారంభించారని మరొకరు వ్యంగ్యోక్తులు విసిరారు. ఒక చైర్మన్ పది మంది సభ్యులుండే యూపీఎస్సీలో సభ్యుడి పదవి కాలం ఆరేళ్లయినప్పటికీ 60 ఏళ్ల బస్సీ ఐదేళ్ల పాటే ఆ పదవిలో కొనసాగుతారు. ఎందుకంటే అందులో పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు. అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం 1977 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ బస్సీ. -
మార్కెట్ ‘కార్యదర్శుల’ బదిలీలు
♦ ఇతర జిల్లాలకు పోస్టింగ్లు ♦ పలువురికి పదోన్నతులు.. ♦ కొత్త కార్యదర్శుల నియామకం తాండూరు: జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులకు స్థానచలనం కలిగింది. రెండు రోజుల క్రితం కార్యదర్శులను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో మార్కెట్ కమిటీలకు కొత్త పాలకమండళ్లు కొలువుదీరనున్న నేపథ్యంలో కార్యదర్శులు బదిలీ కావడం గమనార్హం. బదిలీ అయిన వారి స్థానంలో కొత్త కార్యదర్శుల నియామకం కూడా వెంటనే ఉన్నతాధికారులు పూర్తి చేశారు. దీర్ఘకాలికంగా ఒకేచోట పని చేయడంతో బదిలీ చేశారు. ఇక పలు మార్కెట్లలో ఖాళీగా పోస్టులను భర్తీ చేశారు. పలువురు కార్యదర్శులకు పదోన్నతులు కల్పించారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా పనిచేసిన వెంకట్రెడ్డిని కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు ఇటీవల బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇబ్రహీంపట్నం గ్రేడ్-2 కార్యదర్శి ఏ.చంద్రశేఖర్కు ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ తాండూరుకు బదిలీ చేశారు. ఇక తాండూరులో మూడోశ్రేణి కార్యదర్శిగా పని చేస్తున్న కే.సురేందర్రెడ్డికి రెండో శ్రేణి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ నల్గొండ జిల్లా చండూరు మార్కెట్ కమిటీకి బదిలీ చేశారు. రెండేళ్లుగా తాండూరులో ఖాళీగా ఉన్న సహాయ కార్యదర్శి పోస్టును అధికారులు భర్తీ చేశారు. నల్గొండ జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీలో సూపర్వైజర్గా కొనసాగుతున్న వహిద్ను పదోన్నతిపై తాండూరు సహాయ కార్యదర్శిగా నియామకం చేశారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఏ.శ్రీనివాస్ మూడు నెలల క్రితం మెదక్ జిల్లా సిద్దిపేటకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా నారాయణపేట్ మార్కెట్ కమిటీ నుంచి ఎం.శ్రీనివాస్ను నియమించారు. మర్పల్లి కార్యదర్శి వీరభద్రయ్య ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో మెదక్ జిల్లా జహీరాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి నాగేశ్వర్రావును నియామకం చేశారు. మర్పల్లి ఇన్చార్జి కార్యదర్శిగా కొనసాగుతున్న శంకర్పల్లి మార్కెట్ కమిటీ కార్యదర్శి మల్లేశంను మెదక్ జిల్లా చేగుంటకు, శంకర్పల్లికి మెదక్ జిల్లా నర్సాపూర్ కార్యదర్శి వెంకటయ్య బదిలీ చేస్తూ మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తాండూరు ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా నియామకం అయిన ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ కార్యదర్శి ఏ.చంద్రశేఖర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన తాండూరు మార్కెట్ కమిటీని సందర్శించారు. స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. చండూరుకు బదిలీ అయిన సురేందర్రెడ్డి స్థానంలో మాత్రం అధికారులు ఎవరికీ పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. -
టీపీసీసీకి దొరకని కేసీఆర్ అపాయింట్మెంట్
♦ పాలేరులో పునరాలోచన విజ్ఞప్తితో కలిసే యత్నం ♦ సమయం లేదంటూ తిరస్కరించిన సీఎం సాక్షి, హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికలో పోటీపై పునరాలోచన చేయాలని కోరేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అపాయింట్మెంట్ కోరిన టీపీసీసీకి నిరాశ ఎదురైంది. సీఎం కేసీఆర్ను కలిసేందుకు సోమవారం టీపీసీసీతోపాటు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరిత, వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. సమయం లేదంటూ తిరస్కరించారు. తెలంగాణ కోసం, పాలేరు నియోజకవర్గ ప్రజల కోసం రాంరెడ్డి వెంకటరెడ్డి చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని పాలేరులో టీఆర్ఎస్ పోటీపై పునరాలోచన చేయాలని వెంకటరెడ్డి సతీమణి సుచరిత ఇప్పటికే సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. అనంతరం స్వయంగా సీఎం కేసీఆర్ను కలసి ఈ విజ్ఞప్తి చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. కానీ ఈ విజ్ఞప్తిని కేసీఆర్ తిరస్కరించినట్టు టీపీసీసీ నేతలు వెల్లడించారు. సీఎం కేసీఆర్కు సమయం లేదని, కలవడానికి వీలు కాదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సమాధానమిచ్చినట్లు తెలిపారు. -
పాలి‘ట్రిక్స్’పై మేయర్ అసహనం
♦ పట్టాభి నియామకంపై సీనియర్ల గుర్రు ♦ సీఎంకు ఫిర్యాదు చేయాలనే యోచన ♦ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీనే పరువు తీస్తున్నారు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ రాజకీయాలపై తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పెత్తనం పేట్రేగుతుండటంపై మేయర్ కోనేరు శ్రీధర్ తీవ్ర అసహనంతో ఉన్నారు. కార్పొరేషన్ వ్యవహారాల ఇన్చార్జిగా తాజాగా పట్టాభిని నియమించడంపై గుర్రుగా ఉన్నారు. మూడింట రెండు వంతుల మెజార్టీ ఉన్న కౌన్సిల్లో అధిష్ఠా నం పాలి‘ట్రిక్స్’తో అభాసుపాలవుతున్నామనే ఆవేదం చెందుతున్నట్లు సమాచారం. ఇటీవలే పార్టీ సీనియర్ కార్పొరేటర్లతో మేయర్ భేటీ అయిన సందర్భంలో పట్టాభి నియామక విషయం చర్చకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. బయటి వ్యక్తులకు పెత్తనం అప్పగించడం వల్ల తన చైర్ వీక్ అవుతోందనే అభిప్రాయాన్ని మేయర్ వ్యక్తం చేసినట్లు భోగట్టా. తూర్పు, సెంట్రల్ నియోజకవర్గ పాలి‘ట్రిక్స్’పై మేయర్ అసహనం ఎమ్మెల్యేలు నేరుగా కమిషనర్తో మాట్లాడి కార్పొరేషన్లో తమకు కావాల్సిన పనుల్ని గప్చుప్గా చక్కబెట్టేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. డెప్యూటీ మేయర్, ఫ్లోర్లీడర్, డెప్యూటీ ఫ్లోర్లీడర్ పదవుల మార్పునకు సంబంధించి అధిష్ఠానం చేస్తున్న ప్రచారంతో పార్టీ డామేజ్ అవుతోందనే అభిప్రాయాన్ని మేయర్ వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎదురీత.. నగరపాలక సంస్థ రాజకీయాల్లో మేయర్ ఎదురీత సాగించాల్సి వస్తోంది. అధికారుల నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉంది. కమిషనర్ జి.వీరపాండియన్ పనితీరు బాగోలేదంటూ మేయర్ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కలెక్టర్తోనే ఎక్కువ సమయం గడపడంతో కార్పొరేషన్లో పనులు సకాలంలో పూర్తి కావడం లేదన్నది ఆయన వాదన. ఇదే విషయాన్ని ఒక సందర్భంలో కలెక్టర్ బాబు.ఏ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కమిషనర్ వ్యవహారశైలిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు భోగట్టా. ఎస్టేట్స్, రెవెన్యూ, టౌన్ప్లానింగ్ అధికారుల వ్యవహారశైలిపై మేయర్ అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తే రూ.కోట్లు ఆదాయం పెరుగుతోందనే అభిప్రాయాన్ని ఆయన తరుచూ వ్యక్తం చేస్తుంటారు. పార్టీ నాయకుల వ్యవహార శైలి, కార్పొరేషన్ పాలి‘ట్రిక్స్’పై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలనే యోచనలో మేయర్ ఉన్నట్లు వినికిడి. అల్లరి చేస్తోంది అధిష్ఠానమే.. దర్గా భూముల తీర్మానం మార్పు, కనకదుర్గ లే అవుట్కు ‘పచ్చ’జెండా ఊపడం వంటి వ్యవహారాల్లో టీడీపీ అవినీతి మకిలి అంటించుకుంది. మేయర్ చైర్ను లక్ష్యం చేసి ఆయన ప్రత్యర్థుల పావులు కదిపారు. ఈ రెండు సందర్భాల్లో కూడా అధిష్టానం వ్యవహరించిన తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందనేది మేయర్ అభిప్రాయం. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశాల్లో సైతం రచ్చ చేశారని సన్నిహితుల వద్ద మేయర్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఓ సీనియర్ కార్పొరేటర్ శ్రీధర్ను మారుస్తున్నారంటూ ప్రచారం నిర్వహించడంపై మేయర్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం వైఖరి వల్లే అతను దుష్ర్పచారం చేస్తున్నారనే అభిప్రాయాన్ని సహచర కార్పొరేటర్ల వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నో సాధించిన తనపై విషప్రచారం చేయడం సరికాదనే ఆవేదన వెలిబుచ్చినట్లు సమాచారం. -
మంత్రిగారిని ఎక్కడ కలవాలి?
విశ్లేషణ కేంద్ర మంత్రిగారిని కలవాలని ఉంది. ఎక్కడ ఏవిధంగా కలవవచ్చు. ముందుగా అపాయింట్మెంట్ లేకుండానే కలవవచ్చా? సామాన్యులను కలిసే వేళలను ఏవైనా నిర్ధారించారా? అపాయింట్మెంట్ తీసుకోవడానికి మార్గ మేమిటి? ఎవరిని సంప్రదించాలి? అని హేమంత్ ధాగే మన న్యాయశాఖ మంత్రిని సమాచార హక్కు దరఖాస్తు ద్వారా అడిగాడు. అటువంటి సమా చారమేమీ లేదు. ఎప్పటికప్పుడు ఎవరయినా కలవాలని అనుకుంటే మంత్రి గారి లభ్యతను బట్టి అపాయింట్మెంట్ ఇస్తారు అని కేంద్ర న్యాయ వ్యవహారాల విభాగం ప్రత్యుత్తరం ఇచ్చింది. ఇది అరకొర సమాచారం. నిజానికి చెప్పిందేమీ లేదు. అసలు మంత్రిని కలిసే హక్కు పౌరుడికి లేదా? ఉంటే ఏ విధంగా కలిసే అవకాశాలు ఉంటాయో తెలియజెప్పే బాధ్యత మంత్రిగారికి లేదా వారి కార్యాలయానికి లేదా? మంత్రిగారి ప్రయివేటు కార్యదర్శిని అడిగిన సమా చారాన్ని మంత్రిత్వ శాఖ ఏవిధంగా ఇస్తుంది? ఇరుపక్షాల వారు రెండో అప్పీలు విచారణ రోజు రాలేదు. అయినా దరఖాస్తు లోతుగా పరిశీలించి చట్టం ప్రకారం సమాచారం ఇవ్వాలో కూడదో తేల్చవలసిన బాధ్యత కమిషన్ పైన ఉంది. చట్టం కింద పబ్లిక్ అథారిటీ మంత్రిని గుర్తించవచ్చా? ఒకవేళ అథారిటీ అయితే మంత్రి సమాధానం ఇవ్వవలసిన బాధ్యత ఉందా? మంత్రి అనే అధికార పీఠం రాజ్యాంగం సృష్టించింది. ఆర్టికల్ 74 ప్రకారం రాష్ర్టపతికి సలహా ఇవ్వడానికి ఒక మంత్రి వర్గం ఉండాలి. ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిని రాష్ర్టపతి నియమిస్తారు. రాష్ర్టపతి ఇష్టపడినంతకాలమే మంత్రి పదవిలో కొనసాగుతాడు. పార్లమెంటు ఆమోదించిన చట్టం 1954 ప్రకారం ఎంపీకి జీతాలు ఇస్తారు. మంత్రికి కూడా. రాష్ట్రాలకు సంబంధించి 163, 164 ఆర్టికల్స్ రాష్ర్ట మంత్రులకు ఈ విధమైన నియమావళినే రూపొందించాయి. ఈ నియమాలన్నీ సెక్షన్ 2(హెచ్) పబ్లిక్ అథారిటీ నిర్వచనానికి అనుగుణంగా ఉన్నాయి. ఆర్టికల్ 75(3) ప్రకారం మంత్రివర్గానికి సమిష్టి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నిర్ణయాలకు పరిమితమవుతుంది. కాని ఒక్కో మంత్రి తనకు ఇచ్చిన శాఖలకు అధిపతిగా ఉంటారు. ఆ శాఖలో నిర్ణయాలకు మంత్రే బాధ్యత వహించవలసి ఉంటుంది. ప్రభుత్వ విధులను అధికారాలను ప్రభుత్వ నిధులను నిర్ణయించేది మంత్రి. కనుక కేంద్ర రాష్ర్ట మంత్రివర్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క పబ్లిక్ అథారిటీ అవుతారు. మంత్రిగారికి సరైన సిబ్బంది సౌకర్యాలు లేవు కనుక పబ్లిక్ అథారిటీగా సహ చట్టం కింద సమాధానాలు ఇవ్వాలనడం సమంజసం కాదనే వాదన చెల్లదు. మంత్రులకు సహాయక సిబ్బంది, వ్యక్తిగత సహాయకులుగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వమే ఇస్తుంది. ప్రభుత్వమే కార్యాలయాన్ని అధికారిక నివాసాన్ని కల్పిస్తుంది. ఒకే వ్యక్తిగా ఉన్నప్పటికీ అటార్నీ జనరల్ ప్రభుత్వ అథారిటీ అయినప్పుడు, మంత్రి కూడా అథారిటీ అయి తీర వలసి ఉంటుంది. మంత్రులంతా పబ్లిక్ అథారిటీలేనని 2015 సెప్టెంబర్ 25న మహారాష్ర్ట సమాచార కమిషన్ నిర్దేశించింది. వేలకోట్ల రూపాయల ప్రజానిధిని ఖర్చుచేసే నిర్ణయాలు తీసుకునే అధికారమున్న మంత్రి పబ్లిక్ అథారిటీ అవుతారు. రెండో ప్రశ్న.. మంత్రిని కలుసుకునే హక్కు పౌరులకు ఉందా? రామరాజ్యంలో తన ఇంటిముందు గంట మోగించిన వారెవరయినా రాముడు బయటకు వచ్చి వారి బాధలను విని న్యాయం చేసే వారని, మొఘల్ చక్రవర్తులు, రాజపుత్ర రాజులు దర్బారులో జనాన్ని కలుసుకునే వారని కథలు విన్నాం. కొందరు ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు కూడా జనాన్ని రోజూ ఉదయం కలిసే వారు. ఇప్పటికీ కొందరు కలుస్తూనే ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు ఎన్నికైన ఎన్ యతిరాజారావు మంత్రి పదవిలో ఉన్నా, మామూలు ఎమ్మెల్యేగా ఉన్నా జనం ఇచ్చిన విజ్ఞాపన పత్రాలు ఉత్తరాలు ఒక సూట్ కేసునిండా వెంట పెట్టుకుని అధికారులను కలుస్తూ, ఆ తరువాత సమస్య చెప్పుకున్న వ్యక్తిని పిలిచి ఆయన పని ఎంతవరకు పూర్తయిందో చెప్పేవారు. వెంట ఎప్పుడూ రెండు సూట్ కేసులు ఉండేవి. అందుకే ఆయన ఏడు సార్లు గెలిచారు. ప్రజాప్రాతినిధ్య చట్టం అనే పేరులోనే అతను/ఆమె ప్రజలకు ప్రతినిధిగా ఉండాలని స్పష్టం. మంత్రితో సమావేశ సమయం దొరకబుచ్చుకోవడం పెద్ద సమస్య. దానికి తెలిసిన వాడు ఉండాలి. లేకపోతే బ్రోకర్లు తయారవుతారు. బోలెడంత డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ఇదంతా భ్రష్టాచారం. ఇందులో మంత్రికి పాలు ఉండవచ్చు లేకపోవచ్చు. కాని ఆయన్ను కలుసుకోవడానికి పౌరుడు లంచాలు ఇవ్వకుండా సులువైన విధానాలను కల్పించడం, ముందే సమయాలను ప్రకటించడం మంత్రుల బాధ్యత. సహ చట్టం వచ్చిందే ఇటువంటి అవినీతిని నిరోధించడానికి. సామాన్యునితో సమావేశమయ్యే వేళలను మంత్రి కార్యాలయమే ప్రకటించాలి. మంత్రిత్వ శాఖ ఆ పని చేయలేదు. నెలలో ఏ రోజు ఎక్కడ జనాన్ని కలుస్తారో చెప్పాలి. లేదా ఫలానా నెలలో కలవడం లేదు అని ప్రకటించాలి. సహ చట్టం సెక్షన్ 4(1)(బి కింద ఇది ముందే తమంత తామే తెలియజేయవలసిన సౌకర్య సంబంధిత సమాచారం. కనుక కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మంత్రి ఈ బాధ్యతను నెరవేర్చి ప్రజల సమాచార హక్కును కాపాడడానికి రెండు నెలల్లో పిఐఓను నియమించాలని కమిషన్... కేబినెట్ సెక్రటరీని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ( హేమంత్ ధాగే వర్సెస్ న్యాయవ్యవహారాల శాఖ కేసులో మార్చి 12న ఇచ్చిన తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార శాఖ కమిషనర్) -
ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈగా రామ్ చంద్
బాన్సువాడ ఈఈగానే వెంకటేశ్వర్లు ఈఈ మల్లేశ్గౌడ్కు ఎస్ఈగా పదోన్నతి ఆదిలాబాద్ జిల్లా ఎస్ఈగా నియామకం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ ఇంజినీరుగా లకావత్ రామ్చంద్ నియమితులయ్యారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన రామ్చంద్ ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన సత్యనారాయణ సుమారు ఏడు నెలల కిందట దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఆయన స్థానంలో బాన్సువాడ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరుగా పని చేస్తున్న డి.వెంకటేశ్వర్లుకు ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్ఈగా, బాన్సువాడ ఈఈగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వర్లును ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పిస్తూ, ఆయన స్థానంలో వరంగల్ ఎస్ఈ రామ్చంద్ను నియమించారు. కాగా నిజామాబాద్ డివిజన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరుగా పనిచేస్తున్న మల్లేశ్గౌడ్కు ఎస్ఈగా పదోన్నతి కలిగిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈగా నియమించారు. ఈ మేరకు బుధవారం ఈ ఉత్తర్వులు వెలువడినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. -
కొత్త సీఎస్ టక్కర్
♦ నేడు పదవీ బాధ్యతల స్వీకరణ ♦ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఐవైఆర్ ♦ అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమనిధి ♦ ట్రస్టు చైర్మన్గానూ నియామకం సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టే రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సత్యప్రకాశ్ టక్కర్ నియమితులయ్యారు. 1981 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సీనియర్ అధికారి అయిన టక్కర్ను సీఎస్గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. టక్కర్ ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో టక్కర్ శనివారం సాయంత్రం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. వచ్చే ఆగస్టు వరకు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. ఆగస్టు నెలాఖరుకు పదవీ విరమణ చేస్తారు. సీనియారిటీ ప్రకారం చూస్తే ఐవైఆర్ తరువాత 1980 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అశ్వనికుమార్ పరీడా సీఎస్ అవ్వాల్సి ఉంది. అయితే బాక్సైట్ వ్యవహారంలో ప్రభుత్వంలోని ‘ముఖ్య’ నేతకు పరీడా అనుసరించిన వైఖరి నచ్చలేదు. దీనికితోడు సీఎం పదవి చేపట్టినప్పటినుంచి చంద్రబాబు చెబుతూ వస్తున్న గ్రిడ్లు, మిషన్లు, డబుల్ డిజిట్ గ్రోత్లపై టక్కర్ తొలినుంచీ ప్రెజెంటేషన్లను రూపొందించి ఆయనకు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ పదవికి టక్కర్వైపే చంద్రబాబు మొగ్గుచూపారు. ఐవైఆర్ సేవలకు గుర్తుగా... మరోవైపు నెలాఖరుకు సీఎస్గా పదవీ విరమణ చేయనున్న ఐ.వై.ఆర్. కృష్ణారావును బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. అలాగే రాష్ట్ర దేవాదాయశాఖ అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమనిధి ట్రస్టు చైర్మన్గానూ నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ శుక్రవారం రెండు జీవోలు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐవైఆర్ మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. చైర్మన్ హోదాలో ఐవైఆర్కు నెలసరి అలవెన్సులు, సిబ్బంది సంఖ్యను కూడా ఖరారు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ను ఏర్పాటు చేయించడంలో సీఎస్ హోదాలో కృష్ణారావు కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్నే కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. -
‘పైరవీ’ వీసీ!
► హెచ్సీయూ వీసీగా అప్పారావు నియామకానికి చక్రం తిప్పిన కేంద్రమంత్రి ► అనేక మంది సీనియర్లను కాదని అప్పారావుకు బాధ్యతలు ► సెర్చ్ కమిటీ తుది జాబితాలో ప్రస్తుత వీసీ పేరు చూసి ఆశ్చర్యపోయిన సీనియర్లు.. ► అతను చీఫ్ వార్డెన్గా ఉన్నప్పటికే ప్రొఫెసర్లుగా ఉన్నవారికి కూడా రాని అవకాశం ► తుది జాబితాలో సీసీఎంబీ మాజీ డెరైక్టర్ మోహన్రావు, జేఎన్టీయూ మాజీ వీసీ డీఎన్ రెడ్డి.. వారిని కాదని అప్పారావుకు చాన్స్ సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నియామకంలో కేంద్ర మంత్రి ఒకరు చక్రం తిప్పిన విషయం బయటపడింది. ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 16 మంది సీనియర్ ప్రొఫెసర్లను పక్కనబెట్టి వారందరికంటే జూనియర్ అయిన పి.అప్పారావు వైస్ చాన్స్లర్ అయ్యేలా ఆ మంత్రి తన పలుకుబడిని ఉపయోగించారు. ఆఖరుకు సెర్చ్ కమిటీ సిఫారసు చేసిన ఐదుగురిలో ఏరకంగా చూసినా అప్పారావు అర్హతలు తక్కువేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయినా ఆయనకు వీసీగా ‘అవకాశం’ వచ్చింది. ఢిల్లీ స్థాయిలో అండదండలు ఉండడం వల్లే తాను వీసీ అయ్యానని అప్పారావు పలుమార్లు తన సన్నిహితులతోను, సహచర ప్రొఫెసర్లతోనూ చెప్పుకొన్నారు కూడా. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సీయూ వైస్ చాన్స్లర్ నియామకంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఉదంతం అనంతరం హైదరాబాద్కు వచ్చిన ద్విసభ్య కమిటీ సైతం వైస్ చాన్స్లర్ నియామక ప్రకియకు సంబంధించిన ఫైల్ను పరిశీలించింది. హెచ్సీయూలో బోధనా సిబ్బంది కొందరు ఇచ్చిన సమాచారం మేరకు.. కమిటీ ఆ ఫైల్ను పరిశీలించినట్లు అత్యున్నత అధికార వర్గాలు ధ్రువీకరించాయి. మొత్తంగా వైస్ చాన్స్లర్ వ్యవహారశైలి బాగా లేకపోవడం వల్లే వర్సిటీలో విపరీత పోకడలు చోటు చేసుకున్నాయని ద్విసభ్య కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఈ కమిటీ సభ్యులు గురువారం ఢిల్లీలో మానవ వనరుల శాఖ కార్యదర్శికి తమ నివేదికను అందజేశారు. జూనియర్ అయినా.. హెచ్సీయూ వీసీ నియామకం కోసం కేంద్ర మానవ వనరుల శాఖ గతేడాది జూలైలో సెర్చ్ కమిటీని నియమించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ఇవ్వగా 190 దరఖాస్తులు వచ్చాయి. వాటన్నిటినీ వడపోసిన కమిటీ 21 మందిని జాబితాలో పెట్టింది. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 17 మంది హెచ్సీయూలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు. వారందరిలోనూ ప్రస్తుత వీసీ అప్పారావు జూనియర్ అని విశ్వవిద్యాలయ బోధనా సిబ్బంది పేర్కొంటున్నారు. ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితాలో చోటు దక్కని మరో 17 మంది కూడా అప్పారావు కంటే సీనియర్లని ఓ ప్రొఫెసర్ ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. సెర్చ్ కమిటీ ఈ వర్సిటీకి చెందిన 17 మందితో పాటు బయటి వ్యక్తులు నలుగురిని ఇంటర్వ్యూ చేసింది. చివరగా ఎవరి పేర్లు సిఫారసు చేయాలన్న విషయంలోనూ మానవ వనరుల శాఖ ఆదేశాల మేరకు సెర్చ్ కమిటీ నడుచుకున్నదని పేరు చెప్పేందుకు ఇష్టపడని సీనియర్ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. ‘‘మా పేరు లేకపోయినా ఫరవాలేదు. కానీ తుది జాబితాలో అప్పారావు పేరు చూసి మేం షాకయ్యాం. మాలో చాలా మంది కంటే ఆయన జూనియర్. ఆయన చీఫ్ వార్డెన్గా పనిచేస్తున్న రోజుల్లోనే మేం ప్రొఫెసర్గా పనిచేస్తున్నాం. ఆయన పేరు జాబితాలో ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. ఆ తరువాత తెలిసిందేమంటే కేంద్ర మంత్రి ఒకరు ఆయనకు సన్నిహిత బంధువు..’’ అని ఆయన తెలిపారు. చక్రం తిప్పిన కేంద్ర మంత్రి హెచ్సీయూ వీసీ నియామకం కోసం సెర్చ్ కమిటీ ఐదుగురి పేర్లను మానవ వనరుల శాఖకు సిఫారసు చేసింది. ఇందులో దేశంలోనే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన ‘సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ)’ డెరైక్టర్గా పనిచేసిన మోహన్రావు, ‘జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)’ మాజీ వీసీ డీఎన్ రెడ్డి ఉన్నారు. ఏరకంగా చూసినా అప్పారావు కంటే వారిద్దరూ సీనియర్లు. కానీ వారిని కాదని అప్పారావుకు వీసీ పదవి వచ్చేలా కేంద్ర మంత్రి చక్రం తిప్పారు. ఆ కేంద్ర మంత్రితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అప్పారావు నియామకానికి తన వంతు సహకారం అందించినట్లు హెచ్సీయూ ప్రొఫెసర్లు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అండదండలు ఉన్నందువల్లే అప్పారావు విశ్వవిద్యాలయంలో గొడవలను పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఏబీవీపీ అంటే వీసీకి ప్రత్యేకమైన అభిమానం లేనప్పటికీ, తన సామాజికవర్గం వారికి అన్ని రకాల అండదండలు ఇవ్వడంలో అర్హులైన ఇతరులకు అన్యాయం చేశారని ఓ సీనియర్ ప్రొఫెసర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి మానవ వనరుల శాఖకు లేఖ రాసినా ఇప్పటివరకూ వారి నుంచి ఏ రకమైన సమాచారం రాలేదన్నారు. -
'ఎవరి జోక్యం లేకుండా చూడాలి'
-
ఇక ఈజీగా డాక్టర్ల అపాయింట్మెంట్
-
సీఎం గారూ.. అపాయింట్మెంట్ ఎప్పుడిస్తారు?
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో తక్షణమే తెలియజేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శనివారం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ మాట్లాడుతూ, నాలుగు కోట్ల మంది ప్రజలను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ అంటే అన్ని వర్గాల నేతలు, ప్రజలు, పార్టీలను సమ్మెల దాకా తీసుకెళ్లేలా చేయడమా అని ప్రశ్నించారు. అధికారులతో సమీక్షల మీద సమీక్షలు చేయడమే పరిపాలన కాదని హితవు పలికారు. పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ అందేలా చేయాలని, తొలగించిన పారిశుధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని అమరవీరుల స్తూపం వద్ద వినతిపత్రం ఉంచామన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ తన పదవీ కాలంలో ప్రజల కోసం ఏకంగా క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్ ఎక్కడుంటారో ఎవరికీ అంతుబట్టదన్నారు. లక్షా ఏడు వేల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన సీఎం.. పారిశుధ్య కార్మికులను తొలగించడమేంటనీ ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్ రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు ఆదం విజయ్ కుమార్, జి.సురేష్ రెడ్డి, మైనార్టీ నేతలు ముజ్తబ అహ్మద్, హర్షద్, యువజన-ఐటీ విభాగం అధ్యక్షులు బీష్వ రవీందర్, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటక సీజేగా శుభ్రో ముఖర్జీ నియామకం
న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ శుభ్రో కమల్ ముఖర్జీ నియమితులయ్యారు.ఈ మేరకు కొలీజియం బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం కర్ణాటక సీజేగా ఉన్న ధీరేంద్రనాథ్ హరిలాల్ వాఘేలాను ఒడిషా సీజేగా బదిలీ చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. 2015, ఏప్రిల్ లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ముఖర్టీ.. జూన్ 1 నుంచి తాత్కాలిక సీజేగా కొనసాగుతున్నారు. -
జిల్లా ఇన్చార్జి మంత్రుల నియామకం
చిత్తూరు జిల్లా ఇన్చార్జిగా నారాయణ కేఈకి దక్కని అవకాశం హైదరాబాద్: జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెన్నులను సమీక్షిస్తారు. ఉద్యోగుల బదిలీలను కూడా వీరి ఆధ్వర్యంలోనే చేయనున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు ఇన్చార్జి మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ నియమితులయ్యారు. సీనియర్, ఉప ముఖ్యమంత్రి కె.ఈ. కృష్ణమూర్తిని ఏ జిల్లాకూ నియమించలేదు. వివరాలు.. పరిటాల సునీత (శ్రీకాకుళం), పల్లె రఘునాథరెడ్డి (విజయనగరం), యనమల రామకృష్ణుడు (విశాఖపట్నం), దేవినేని ఉమా మహేశ్వరరావు (తూర్పుగోదావరి), చింతకాయల అయ్యన్నపాత్రుడు (పశ్చిమగోదావరి), ప్రత్తిపాటి పుల్లారావు (కృష్ణాజిల్లా), నిమ్మకాయల చిన రాజప్ప (గుంటూరు), రావెల కిషోర్బాబు (ప్రకాశం), శిద్ధా రాఘవరావు (నెల్లూరు), పి. నారాయణ (చిత్తూరు), గంటా శ్రీనివాసరావు (వైఎస్సార్(కడప), కె.అచ్చెన్నాయుడు (కర్నూలు), కామినేని శ్రీనివాస్ (అనంతపురం). -
ఖాళీయే!
* ఐఏఎస్ల కేటాయింపు లేనట్లే ! * జేసీ, కమిషనర్లు ఇక కష్టమే * బదిలీల సందర్భంగా దక్కని ఛాన్స్ * కలెక్టర్గా రొనాల్డ్రోస్ కొనసాగింపు * జేసీ నియామకంపై వీడని సస్పెన్స్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కొంతకాలంగా జిల్లాలో ఖాళీగా ఉన్న జాయింట్ కలెక్టర్ పోస్టుతో పాటు కీలక పదవుల నియామకానికి మోక్షం కలగడం లేదు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 24 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకంలోనూ జిల్లాకు అవకాశం దక్కలేదు. నిజామాబాద్ కార్పొరేషన్కు కమిషనర్గా ఐఏఎస్ అధికారిని నియమించాల నే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మూడు నెలల కిందట జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ సైతం నిజామాబాద్ను స్మార్ట్సిటీ జాబితాలో చేర్చిన నేపథ్యంలో కమిషనర్గా ఐఏఎస్ అధికారిని నియమించనున్నట్లు ప్రకటించారు. 20 రోజుల కిందటి వరకు ఇన్చార్జ్ కమిషనర్గా వ్యవహరించిన మంగతాయారును సమగ్ర కుటుంబ సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు పలు అక్రమాలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో బదిలీ చేశారు. ఆమె స్థానంలో నియమితులైన సత్యనారాయణ విధులలో చేరలేదు. దీంతో నిజామాబాద్ ఆర్డీఓ యాదిరెడ్డి ఇన్చార్జ్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి అంతకుముందు కలెక్టర్గా ఉన్న ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ గా ఉన్న డి.వెంకటేశ్వర్రావు జూన్ 17న బదిలీ అయ్యారు. కలెక్టర్గా రొనాల్డ్రోస్కు పోస్టింగ్ ఇవ్వగా, జేసీగా మాత్రం ఎవరినీ నియమించ లేదు. సోమవారం ప్రభుత్వం 24 మంది పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పొరుగు జిల్లాలలో కొందరు కలెక్టర్లకు స్థానచలనం కల్పించడంతోపాటు ఖాళీగా ఉన్న చోట జేసీ, కార్పొరేషన్ల కమిషనర్లుగా ఐఏఎస్లను నియమించారు. జిల్లాకు మాత్రం ఎవరినీ కేటాయించ లేదు. రొనాల్డ్రోస్ కలెక్టర్గా కొనసాగనున్నారు. ఆయనను ఆంధ్రకు కేటాయించినప్పటికీ, తెలంగాణకే ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రానికి రాసిన లేఖకు సానుకూల స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం రోస్ను కొనసాగించింది. జాయింట్ కలెక్టర్, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ల నియామకంపై ఇంకా సస్పెన్స్ నెలకొంది. అడిషనల్ జేసీగా ఉన్న డాక్టర్ పి.శేషాద్రి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఆ పోస్టు కూడ ఖాళీనే. -
కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలి: జయప్రద
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.. చంద్రశేఖర్రావు అపాయింట్మెంట్ ఇప్పించాల్సిందిగా ప్రముఖ సినీనటి జయప్రద ఇరిగేషన్శాఖ మంత్రి టి. హరీశ్రావును కోరారు. శుక్రవారం హరీశ్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సందర్భం గా ఆమె ఈ విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ రాజ్భవన్కు వచ్చి గవర్నర్ నర్సింహన్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
ఆరుగురు పార్లమెంటరీ సెక్రటరీలు నియామకం
-
ఆరుగురు పార్లమెంటరీ సెక్రటరీలు నియామకం
హైదరాబాద్: రాష్ట్రంలో ఆరుగురు పార్లమెంటరీ సెక్రటరీలను నియమిస్తూ కేసీఆర్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ సెక్రటరీలుగా వి. సతీష్ కుమార్ (విద్యాశాఖ), జీ కిషోర్ కుమార్ (వైద్యశాఖ), శ్రీనివాస్గౌడ్ (రెవెన్యూ శాఖ), కోవా లక్ష్మీ (వ్యవసాయ శాఖ), జలగం వెంకట్రావ్, వినయ్ భాస్కర్లకు సీఎం కార్యాలయ శాఖలు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. వీరంతా ఆయా శాఖల మంత్రులకు అనుబంధంగా పని చేస్తారని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది. -
చినబాబు దర్శనం కోసం పడిగాపులు!
హైదరాబాద్ : చినబాబు.. నారా లోకేష్ దర్శనం కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పడిగాపులు గాస్తున్నారు. పారిశ్రామికవేత్తలతో భేటికే పరిమితమవుతున్న ఆయన.. కార్యకర్తలు, పార్టీ నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. దాంతో చినబాబు దర్శనం కోసం రోజులు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వారికి నెలకొంది. కాగా గతంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి...15 రోజుల సమయం అడిగినా లోకేష్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇటీవలే తీగల టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు పౌర సరఫరాల శాఖమంత్రి సునీత ఫోన్ చేసినా లోకేష్ స్పందించనట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీ శమంతకమణికి కూడా లోకేష్ దర్శనం కాకపోవటంతో ఆయనను కలవకుండానే వెనుదిరిగారు. కాగా చినబాబు వైఖరిపై పార్టీలో అసంతృప్తి నెలకొంది. మంత్రులకు, ఎమ్మెల్యేలకే లోకేష్ అపాయింట్మెంట్ దొరకని నేపథ్యంలో ..పార్టీ కార్యకర్తల పరిస్థితి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేముందని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
మోదీకి మైత్రీకి ఇంపార్టెన్స్
-
సీబీడీటీ కొత్త చైర్పర్సన్ అనితా కపూర్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) కొత్త చైర్పర్సన్గా అనితా కపూర్ నియమితులయ్యారు. వచ్చే యేడాది నవంబర్ వరకూ ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. సీనియర్ ఐఆర్ఎస్ అధికారి అయిన అనితా కపూర్, 1978 ఇన్కమ్ ట్యాక్స్ కేడర్కు చెందినవారు. ఇప్పటివరకూ సీబీడీటీలో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కంప్యూటరైజేషన్ అండ్ లెజిస్లేషన్ వ్యవహారాల విభాగ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేవీ చౌదరి అక్టోబర్ 31న పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో కపూర్ నియామకం జరిగింది. ఐదు స్థానాలు ఖాళీ... సీబీడీటీలో చైర్మన్తో పాటు ఆరుగురు సభ్యులు ఉంటారు. ఆదాయపు పన్ను శాఖ, ప్రత్యక్ష పన్నులకు సంబంధించి విధానాంశాల రూపకల్పన, పాలనా వ్యవహారాల నిర్ణయాల అమల్లో బోర్డ్ కీలకపాత్ర పోషిస్తుంది. కాగా ఇటీవల ఎటువంటి నియామకాలూ జరక్కపోవడంతో సీబీడీటీలో ప్రస్తుతం ఒకే ఒక్క సభ్యుడు- అరుణ్ కుమార్ జైన్ మాత్రమే పనిచేస్తున్నారు. బాధ్యతలన్నీ వీరిరువురే నిర్వర్తించాల్సి ఉంది. సిట్ సలహాదారుగా చౌదరి... కాగా సీబీడీటీ చైర్మన్గా పదవీ విరమణ చేసిన చౌదరి నల్లధనంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో ఏర్పాటయిన ప్రత్యేక విచారణా బృందానికి (సిట్) సలహాదారుగా నియమితులయ్యారు. చౌదరి ఆంధ్రప్రదేశ్కు చెందినవారవడం తెలిసిన విషయమే. -
అంతా ఏకపక్షం, ఆషామాషీ..
గోపాల సుబ్రమణియం వ్యవహారంలో మోడీ సర్కార్ తీరుపై సీజేఐ విమర్శ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం ఎంపికచేసిన నాలుగు పేర్ల ప్యానెల్నుంచి మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణియం పేరును పక్కన పెడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా మంగళవారం తీవ్రంగా విమర్శించారు. తనకు తెలియపరచడం లేదా, అనుమతి తీసుకోవడంలాంటివి ఏవీ లేకుండా ప్రభుత్వం ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందని జస్టిస్ లోధా వ్యాఖ్యానించారు. న్యాయ విభాగం స్వతంత్రత విషయంలో రాజీపడేది లేదని, అలా జరిగినట్టు తెలిసిన రోజున ఒక క్షణంకూడా తన పదవిలో ఉండజాలనని లోధా స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ చౌహాన్కు ఢిల్లీలో మంగళవారం ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశంలో లోధా మాట్లాడుతూ, తొలిసారిగా ఈ వివాదంపై నోరువిప్పారు. ఉన్నతస్థాయి రాజ్యాంగ పదవి అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకం విషయంలో ఇంత ఆషామాషీగా, నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారో తనకు అర్థంకావడంలేదన్నారు. గత నెల 28వ తేదీన తాను విదేశీపర్యటనుంచి తిరిగి వచ్చేటప్పటికి, న్యాయశాఖకు సంబంధించిన ఫైలు తన కార్యాలయానికి పంపారని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి సంబంధించి ఎంపికైన నాలుగు పేర్లలో మూడు పేర్లు ఆమోదం పొందినట్టు పైలులో ఉందని, తద్వారా గోపాల సుబ్రమణియం పేరును పక్కన పెట్టారని జస్టిస్ లోధా అన్నారు. గోపాల సుబ్రమణియం వ్యవహారంలో ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు,. లోధా వ్యాఖ్యలపట్ల ప్రభుత్వం కూడా స్పందించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే తమకు అత్యున్నత గౌరవం ఉందని పేర్కొంది. ఈ విషయంలో గత సంప్రదాయాన్ని, ఆనవాయితీని పాటించామని, న్యాయమూర్తి నియామకానికి సంబంధించి ఎంపికైన నామినీపై పునరాలోచన చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. -
ముగ్గురు మంత్రుల పీఎస్ల నియామకం నిలిపివేత
నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం అవసరమన్న సిబ్బంది శాఖ యూపీఏ మంత్రుల వద్ద పనిచేసిన వారి పునర్నియామకంపై విముఖం! న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ సహా ముగ్గురు కేంద్రమంత్రుల వ్యక్తిగత కార్యదర్శుల (పీఎస్ల) నియామకాన్ని ప్రభుత్వం నిలిపివేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. మంత్రులకు సంబంధించి వ్యక్తిగత కార్యదర్శులు, ప్రత్యేక విధిలో అధికారులు సహా వ్యక్తిగత సిబ్బంది నియామకాలన్నిటికీ కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం అవసరమని సిబ్బంది శాఖ సర్క్యులర్ జారీ చేసిన నేపధ్యంలో.. ఈ ముగ్గురు కేంద్రమంత్రుల వ్యక్తిగత కార్యదర్శుల నియామకాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. సిబ్బంది, శిక్షణ శాఖ గత నెల 26వ తేదీన అన్ని శాఖల కార్యదర్శులకూ ఈ సర్క్యులర్ను పంపించింది. అన్ని మంత్రిత్వ శాఖలూ, విభాగాలూ అన్ని నియామకాలకూ ఈ విధానాలను కచ్చితంగా పాటించాలని స్పష్టంచేసింది. రాజ్నాథ్సింగ్కు వ్యక్తిగత కార్యదర్శిగా 1995 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి అలోక్సింగ్ను ప్రతిపాదించారు. ఆయన గత యూపీఏ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ఖుర్షీద్కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఖుర్షీద్ జలవనరుల శాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అలోక్సింగ్ ఆయనకు ప్రైవేటు సెక్రటరీగానే పనిచేశారు. అలోక్సింగ్ పదవీ కాలం వచ్చే ఫిబ్రవరి 14 వరకూ ఉంది. ఈ అంశంపై సిబ్బంది శాఖ నుంచి ఎలాంటి సమాచారం లేనప్పటికీ.. గత ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖల్లో సిబ్బందిగా పనిచేసిన అధికారులను తిరిగి నియమించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సుముఖంగా లేదని ఉన్నతస్థాయి వర్గాలు చెప్తున్నాయి. అలాగే.. హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు వ్యక్తిగత కార్యదర్శిగా అభినవ్కుమార్, విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి.కె.సింగ్ వ్యక్తిగత కార్యదర్శిగా రాజేశ్కుమార్ల నియామకం కూడా సందిగ్ధంలో పడింది. అభినవ్ గత ప్రభుత్వంలో శశిథరూర్కు, రాజేశ్కుమార్ గత ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి చంద్రేశ్కుమారి కటోచ్కు వ్యక్తిగత కార్యదర్శులుగా పనిచేశారు. -
ఆర్మీ చీఫ్ నియామకంపై ఈసీ దృష్టి
న్యూఢిల్లీ: సైనిక దళాల ప్రధానాధికారి నియామక ంపై వచ్చే వారంలో ఉన్నతస్థాయి భేటీ జరగనున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం అందినట్లు శనివారం పేర్కొంది. ఇప్పటివరకు ఈ అంశం మరో రెండు రోజుల్లో చర్చ కు రావచ్చని ఓ అధికారి వెల్లడించారు. -
కేజ్రీవాల్కు దక్కని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్
గాంధీనగర్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విమర్శల వర్షం కురిపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. నాటకీయ రీతిలో శుక్రవారం మోడీతో సమావేశమయ్యేందుకు ప్రయత్నించారు. గుజరాత్లో అభివృద్ధి, గ్యాస్ ధరలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ అపాయింట్మెంట్ కోరారు. అయితే ఆయనకు మోడీ అపాయింట్మెంట్ లభించలేదు. గుజరాత్ అభివృద్ధిని పరిశీలించేందుకు పార్టీ నేత మనీష్ సిసోడియా కలసి రెండ్రోజులుగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేజ్రీవాల్ శుక్రవారం ఉదయం గాంధీనగర్ వెళ్లారు. కాగా మోడీ అధికార నివాసానికి ఐదు కిలో మీటర్ల దూరంలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం సిసోడియా మోడీ నివాసానికి వెళ్లి అపాయింట్మెంట్ కావాలని ఆయన వ్యక్తిగత కార్యదర్శిని కోరారు. ఈ విషయంలో మోడీ నిర్ణయం తీసుకుంటారని, త్వరలో సమాచారం తెలుపుతామని చెప్పారని సిసోడియా ట్వీట్ చేశారు. మోడీ రిలయన్స్ సంస్థకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అంబానీల జేబులో బొమ్మంటూ కేజ్రీవాల్ తరచూ విమర్శిస్తున్నారు. -
సర్వే’పై ఫిర్యాదాస్త్రం
‘హస్తిన’ బాటపట్టిన ఎమ్మెల్యేలు దిగ్విజయ్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపు అసంతుష్టుల జాబితాలో ఐదుగురు ఎమ్మెల్యేలు సాక్షి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి: కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణపై శివారు ఎమ్మెల్యేలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శాసనసభ్యులు ఏదొకటి తేల్చుకునేందుకు ఢిల్లీబాట పట్టారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి ‘సర్వే’కు మరోసారి టికెట్ ఇవ్వవద్దనే డిమాండ్తో పార్టీ పెద్దలను కలవాలని నిర్ణయించారు. మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు సర్వే సత్యనారాయణపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు హస్తిన వెళ్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ అపాయింట్మెంట్ను కోరుతూ లేఖ రాశారు. మాజీమంత్రి శంకర్రావు సహా ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బండారి రాజిరెడ్డి, ఆకుల రాజేందర్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఈ మేరకు డిగ్గీరాజాకు సంయుక్తంగా లేఖ రాశారు. అధికారికంగా దిగ్విజయ్ అపాయింట్మెంట్ ఖరారు కానప్పటికీ, ఆయనకు అందుబాటులో ఉండేందుకు ఎమ్మెల్యేలు శంకర్రావు, రాజిరెడ్డి ఇప్పటికే అక్కడ మకాంవేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, ఆకుల రాజేందర్ కూడా శుక్రవారం రాత్రి దేశ రాజధానికి పయనమయ్యారు. కాగా, రంగారెడ్డి జిల్లాలో పార్టీ వ్యవహారాలు, మల్కాజిగిరి పార్లమెంటరీ సీటు పరిధిలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పార్టీ పరిస్థితిని తమతో చర్చిస్తామని లేఖలో పేర్కొన్నప్పటికీ, కేంద్రమంత్రి సర్వేపై ఫిర్యాదు చేసే అంశమే ప్రధానంగా కనిపిస్తోంది. కొన్నాళ్లుగా సర్వేపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలు... ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కు ఈసారి లోక్సభ టికెట్ రాకుం డా ప్రయత్నించాలనే నిర్ణయానికి వచ్చారు. అవినీతి, గ్రూపు రాజకీయాలను కేంద్రమంత్రి ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యేలు కొంతకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. స్థానికంగా ఆయనపై ఉన్న వ్యతిరేకత కూడా తమ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందనే భయం వీరిలో నెలకొంది. -
అడ్మిన్ ఏఎస్పీల నియామకం
సాక్షి, గుంటూరు: అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా జానకి దరవత్ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఆమె సైబరాబాద్ క్రైం-2 అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్నారు. 2007 బ్యాచ్కు చెందిన జానకి తొలుత రాజమండ్రి డీఎస్పీగా పనిచేశారు. ఆ తరువాత సైబరాబాద్లో క్రైం సీఐడీ విభాగంలో పనిచేసి పదోన్నతిపై కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఓఎస్డీగా వెళ్లారు.నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన జానకి బీటెక్ కంప్యూటర్స్ చేశారు. గుంటూరులోని విద్వాన్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. అర్బన్ ఓస్డీ వెలిశెల రత్న, జానకి ఇద్దరూ ఒకే బ్యాచ్కు చెందినవారు కావటం విశేషం. రూరల్ జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా కోటేశ్వరరావు.. గుంటూరు రూరల్ జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా డి.కోటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఒంగోలు పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నారు. 1985 బ్యాచ్కు చెందిన ఆయన తొలుత మంగళగిరి రూరల్ ఎస్ఐగా పనిచేశారు. అక్కడి నుంచి తెనాలి, తాడేపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ల, గుంటూరు కొత్తపేటలో పనిచేశారు. 2000 లో సీఐగా పదోన్నతి పొంది తెనాలి అర్బన్, గుంటూరు ఈస్ట్, వెస్ట్, తాలూకా, క్రైం సీఐగా పనిచేశారు. 2008లో డీఎస్పీగా పదోన్నతిపై రాజమండ్రి సీఐడీ విభాగం, మచిలీపట్నం, గుంటూరు టౌన్, వెస్ట్ డీస్పీగా పనిచేశారు. 2011లో గుంటూరులో అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీగా చేశారు. 2012లో ఒంగోలు పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్గా బదిలీ అయ్యారు. ఇదే జిల్లాలో సుదీర్ఘకాలం సర్వీసులో ఉన్న కోటేశ్వరరావు అనేక సంచలనాత్మక కేసుల్ని ఛేదించిన అనుభవం గడించారు. ఎన్నికల సమయంలో సమర్ధ అధికారిగా పేరుతెచ్చుకున్నారు. -
దూరంగా ఉన్నా... దగ్గర కావచ్చు!
పెళ్లి అనేది ఆడపిల్ల జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. అది ఆనందంతో పాటు ఎన్నో సందేహాలను, భయాలను, కన్ఫ్యూజన్లను తీసుకొస్తుంది. నాపెళ్ళి సమయంలో నేను కూడా వీటన్నిటితో ఉక్కిరి బిక్కిరి అయ్యాను. పెళ్ళి తర్వాత నాజీవితం ఎలా ఉంటుందో... నాభర్త నన్ను అర్థం చేసుకుంటారో లేదోనన్న భయం... అక్కడ అడ్జస్ట్ అవగలనో లేదోనన్న సందేహం, అక్కడి వాళ్ళ మసస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియక కన్ఫ్యూజన్ కలిసి నన్ను కుదరుగా ఉండనివ్వలేదు. ఏదైతేనేం... వెంకట్ గారితో నా పెళ్ళి జరిగిపోయింది. నేను చిన్న కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టడం కూడా అంతే వేగంగా అయిపోయింది. వెంటనే హనీమూన్, చుట్టాలింటికి భోజనాలకు వెళ్ళడాలు వంటి వాటితో ఓ నెల రోజులు ఊపిరాడలేదు. ఆ తర్వాత మొదలైంది అత్తారింటిలో అసలైన జీవితం. మా అత్తగారు మంచిదే. కానీ ఆవిడ చెప్పింది చెప్పినట్టు పాటించాల్సిందే! లేదంటే చాలా ఫీలైపోయి ముఖం మాడ్చుకుని కూర్చునేది. ఏంటలా ఉన్నావని పొరపాటున ఏ కొడుకో అడిగాడా... ‘మీ నాన్న పోవడంతోనే నా విలువ పోయింది’ అంటూ ముక్కు చీదేది. దాంతో కొడుకులు కరిగిపోయేవారు. కట్ చేస్తే ఏముంది... ‘అమ్మను అర్థం చేసుకోండి, ఆమెను బాధపెట్టకండి’ అంటూ మాకు క్లాసులు. వంటదగ్గర్నుంచి ప్రతి విషయం గురించీ ముందే ఆజ్ఞలు జారీ చేసేసేది. ఆమె ఏది వండమంటే అదే వండాలి. ఇంట్లో లేదు కదా అని మరొటి వండితే ఇక అంతే సంగతులు. ఏదో పెద్దావిడలే అని సరిపెట్టేసుకునేదాన్ని. కానీ నా భర్తకు, నాకు ప్రైవసీ లేకపోతే మాత్ర చాలా బాధ కలిగేది. ఆయన నాకు చీర కొనుక్కొచ్చినా మొదట ఆవిడే చూడాలి. ఓసారి ఆయన అలా చూపించకుండా ఇచ్చారని నానా యాగీ చేసింది. పోనీ చూపిస్తే ఆనందపడేదా అంటే అదీ లేదు. దాంతో మా వారు పూలు తేవడానికి కూడా ధైర్యం చేసేవారు కాదు. నా మనసు చివుక్కుమనేది. మా తోడికోడళ్ళు కూడా అదోలా ప్రవర్తించేవారు. వాళ్ళకూ నా మీద కోపమేమీ లేదు. కానీ అత్తగారిని ఏమీ అనలేక నా మీద ప్రతాపం చూపించేవారు. వాళ్ళ పనులు నా మీద రుద్దడం, ఏదైనా తేడా జరిగి అత్తగారు కోప్పడితే నా మీద తోసెయ్యడం, మావారు నేనూ సన్నిహితంగా ఉంటే సెటైర్లు వేయడం చేసేవారు. ఓ ఆరునెలలు ఇవన్నీ భరించానుకానీ ఓరోజు నా ఓపిక నశించిపోయింది. ఆరోజు నా అపాయింట్మెంట్ ఆర్డర్ని మా ఇంట్లో చూపించాను. దాంతో చిన్నపాటి యుద్ధమే చెలరేగింది. తమకు మాట మాత్రమైనా చెప్పలేదని తోడికోడళ్ళు, అసలు ఉద్యోగం చేయడానికి వీల్లేదని అత్తగారు అనేసరికి నాకు తిక్కరేగినట్టైంది...‘‘నేను ఎంబీయే చేశాను, నాతెలివితేటల్ని, చదువుని వృథా చేసుకోలేను, అయినా నాభర్త ఒప్పుకున్నారు’’ అని అనేసరికి అత్తగారు భద్రకాళి అయ్యారు. ‘అంతా నీ ఇష్టమేనా, అంత పెద్దవాడివైపోయావా!’ అంటూ మావారి మీద కేకలేశారు. నన్ను అమితంగా ఆశ్చర్యపర్చిన విషయం... మావారు నన్ను సపోర్ట్ చేస్తూ ఒక్కమాట కూడా మాట్టాడకపోవడం. తర్వాత నా దగ్గరకు వచ్చి, అమ్మకిష్టం లేదు కదా, ఉద్యోగం సంగతి మరోసారి ఆలోచించు అనడం.ఇక నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైమ్ వచ్చిందని నాకు అర్థమైంది. మావారికి ఒకటే చెప్పాను. ‘నాకు మీ అమ్మగారు. అన్నా వదినలు ముఖ్యమే... కానీ అంతకంటే ముందు మీరు, నాభవిష్యత్తు ముఖ్యం, మీరు నాభవిష్యత్తుగా తోడుగా ఉంటారా లేదా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి’ అన్నాను. ఆయన కాస్త ఆలోచించే మనిషే. అందుకే నన్నేమీ అనలేదు. అలాగని ఎస్ కూడా చెప్పలేదు. మౌనంగా ఉండిపోయారు. నేను తనతో చెప్పాను...‘‘దగ్గరగా ఉండి స్ఫర్థలు పెంచుకుంటున్నాం. దూరంగా ఉండే ప్రేమలు పెంచుకుందాం, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఏమన్నా నేను సహించాను, కానీ నాకంటూ కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. వాటి గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అందుకే దూరంగా ఉండి మన బతుకు మనం బతుకుదాం, కానీ మీ వాళ్లకు మాత్రం దూరం కావద్దు, వాళ్ళ పట్ల అన్ని బాధ్యతలూ నెరవేరుద్దాం’’ అన్నాను. మావారు మొత్తానికి కన్విన్స్ అయ్యారు. అత్తగారు మా నిర్ణయాన్ని అంగీకరించలేదు. ఆయన అన్నలు, వదినలు మమ్మల్ని సపోర్ట్ చెయ్యలేదు. కానీ మేం అనుకున్న అడుగు వేశాం. అక్కడికి దగ్గర్లోనే ఇల్లు తీసుకుని వేరు కాపురం పెట్టాం. వారు న్ను ప్రోత్సహించి నాక్చిన మాట నిలబెట్టుకున్నారు. నేను కూడా ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నా జీతంలో సగభాగం ప్రతినెలా తీసుకెళ్ళి అత్తగారికిచ్చాను. పండుగలకి, పబ్బాలకి అందరికీ బట్టలు కొన్నాను. ఇంట్లో ఏ పూజనీ, శుభకార్యాన్నీ మిస్ కాలేదు. అత్తమ్మ మందుల దగ్గర్నుంచి తోడికోడళ్ళ పిల్లల పుట్టినరోజుల వరకూ దేన్నీ మర్చిపోలేదు. దాంతో మొదట కోపంగా ఉన్నవారు మెల్లగా నాకు చేరువయ్యారు. నామనసులో ఏ దురద్దేశం లేదని అర్థం చేసుకున్నారు. చనిపోయేవరకూ మా అత్తగారు అందరికీ చెప్పేవారు...‘మా చిన్నకోడలు భలే పిల్లండీ, నేనెంత అదృష్టవంతురాలినో’ అని. నేనారోజు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మనస్ఫర్థలతో మా మధ్య దూరాలు పెరిగిపోయి ఉండేది. మా వాళ్ళకూ నాకూ మధ్య పెద్ద ఆగాథం ఏర్పడి ఉండేది. నా మీద కోపంతో వాళ్ళు ... నా ఆశలు తీరలేదన్న అసంతృప్తితో నేనూ బతకాల్సి వచ్చేది. అలాగని అందరూ వేరు కాపురాలు పెట్టాలని అనడం లేదు. కానీ మీ స్పేస్ మీకు అవసరం అనిపించినప్పుడు ఓ నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడవద్దని మాత్రం చెబుతాను. అది తప్పు కాదు. ఒక్కోసారి దూరం ప్రేమల్ని, బంధాల్ని బలపరుస్తుందే తప్ప తగ్గించదు. దానికి నా జీవితమే ఓ ఉదాహరణ. - విమల, ముమ్మిడివరం, తూ.గో.జిల్లా మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే మాకు రాసి పంపించండి. బంధాలను బలపరచుకోవడానికి, అనుబంధాలను పదిలపరచుకోవడానికి మీ అనుభవాలు మరికొందరికి దారి చూపవచ్చు. మా చిరునామా: అస్త్ర, సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్,హైదరాబాద్ - 500034, మెయిల్: sakshi.asthra@gmail.com -
వైఎస్ జగన్ కు రాష్ట్రపతి అపాయింట్ మెంట్
-
రేపు రాష్ట్రపతిని కలవనున్న జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ లభించింది. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఈనెల 5న జరుగనున్న ఐపీఎస్ల పెరేడ్కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రానున్న విషయం తెలిసిందే. రేపు రాత్రి 9 గంటలకు జగన్ రాష్ట్రపతిని కలుస్తారు. ఆయనతోపాటు ఆ పార్టీ ముఖ్యనేతలు కూడా రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని జగన్ రాష్ట్రపతిని కోరతారు. -
మండ్యలో నేడు కాంగ్రెస్ ‘కృతజ్ఞతసభ’
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మండ్య పర్యటనలో తమకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్లోని ఓ వర్గంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికలు, లోక్సభ, శాసనమండలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు రాష్ర్ట ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేడు (సోమవారం) మండ్యలో ‘కృతజ్ఞత సభ’ పేరిట బృహత్ సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి సోనియాగాంధీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సోనియాగాంధీ పర్యటన సద్వినియోగం చేసుకుని సొంత పార్టీలోని రాజకీయ ప్రత్యర్థుల గురించి అన్ని విషయాలు చెప్పి కొంతమేర ప్రయోజనం పొందాలనుకున్న ఆ నాయకుల ఆశ నెరవేరేలా కల్పించడం లేదు. ఇందుకు మేడం వేదికపై ప్రసంగించడానికి మాత్రమే సమయం కేటాయించడం కారణమని ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఐదు నెలలు కావొస్తోంది. అయితే పూర్తి స్థాయి మంత్రి మండలి ఇంకా ఏర్పాటు కాలేదు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వైఖరే కారణమన్న అపవాదు ఉంది. మరోవైపు ప్రస్తుత మంత్రుల్లో కొంత మందిపై అవినీతి అరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సమాచార శాఖ మంత్రి సంతోష్ లాడ్పై అక్రమగనుల తవ్వకాలకు పాల్పడ్డారని, ఆయన్ను మంత్రి మండలి నుంచి తప్పించాలనే ఒత్తిడి పార్టీపై ఎక్కువవుతోంది. ఈ విషయాలను పరిగణన లోకి తీసుకుని మంత్రి మండలిలో సీనియర్ నాయకులకు అవకాశం కల్పించాలని మేడంకు విన్నవించడానికి కొందరు కేపీసీసీ సీనియర్ నాయకులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఫిర్యాదులు, కోరికలతో కూడిన సీల్డ్ కవ ర్లనూ వారు సిద్ధం చేసుకున్నారు. కవర్లను మేడంకు అందించి కొంత సేపు ప్రత్యేకంగా మాట్లాడాలనేది వారి వ్యూహం. మరోవైపు మండళ్ల అధ్యక్షుల ఎంపిక వంటి నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఐదు నెలల నుంచి పెండింగ్లో ఉండిపోయింది. ఈ పోస్టులపై కన్నేసిన గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు కూడా మేడంకు తమ మనసులో మాట చెప్పాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే లోక్సభ ఎన్నికలు మరికొన్ని నెలల్లోనే రానున్న నేపథ్యంలో మంత్రి మండలి విస్తరణ, మంత్రి మండలి నుంచి సభ్యులను తొలగించడం, నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయడం విషయమై నాయకులతో మాట్లాడితే లేనిపోని రాద్దాతం అవుతుందని... అంతేకాకుండా కొన్ని వర్గాల ఓట్లను కోల్పోవస్తుందని సోనియాగాంధీకి అత్యంత ఆప్తులైన కేంద్రమంత్రులు తెలిపినట్లు సమచారం. దీంతో ఇక్కడి నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడకుండా కేవలం ప్రసంగించి వెళ్లిపోవాలని సోనియాగాంధీ నిర్ణయించారు. దీంతో మేడంతో ముఖాముఖి మాట్లాడాలనుకొన్న చాలా మంది నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. అయితే ఎలాగైనా మేడంతో వ్యక్తిగతంగా మాట్లాడాలని ఆ వర్గం నాయకులు తమకు తెలిసిన దారులన్నింటిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.