ఆయనలా.. పిలవని పేరంటానికి వెళ్లలేదే : సిద్ధు | Navjot Singh Sidhu Asks Is PM Modi Jealous Of Him Over Imran Khan Oath Taking Ceremony Row | Sakshi
Sakshi News home page

నేనేం ఆయనలా.. పిలవని పేరంటానికి వెళ్లలేదు!

Published Sat, Nov 17 2018 8:19 PM | Last Updated on Sat, Nov 17 2018 8:25 PM

Navjot Singh Sidhu Asks Is PM Modi Jealous Of Him Over Imran Khan Oath Taking Ceremony Row - Sakshi

గోద్రా అల్లర్ల కేసులో చిక్కుకున్న వారి ముందు నా దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.

చండీగఢ్‌ : ‘ప్రధాని నరేంద్ర మోదీ నన్ను చూసి అసూయపడుతున్నారేమో? నేనేం ఆయనలా పిలవని పేరంటానికి వెళ్లలేదు కదా.. అయినా గోద్రా అల్లర్ల కేసులో చిక్కుకున్న వారి ముందు నా దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ పంజాబ్‌ మంత్రి, భారత మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడాన్ని బీజేపీ నేతలు విమర్శించడంపై సిద్ధు ఈ విధంగా స్పందించారు. (‘సౌత్‌ ఇండియా కన్నా పాకిస్తాన్‌ బెటర్‌’)

శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మోదీకి ఆహ్వానం అందనందు వల్లే తనపై అసూయ పడుతున్నారని, తానేం మోదీలాగా పిలవకుండానే పాక్‌ మాజీ ప్రధాని (నవాజ్‌ షరీఫ్‌) పుట్టినరోజుకు వెళ్లలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సమయంలో సిద్ధు.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలే కాకుండా సీఎం అమరీందర్‌ సింగ్‌ కూడా సిద్ధు చర్యను తప్పుబట్టారు. అయితే సిద్ధు మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement