పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి
న్యూఢిల్లీ : పార్లమెంటు ఉభయ సభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో లోక్సభలో భారతదేశంలో వ్యవసాయరంగం పరిస్థితిపై చర్చకు కొద్దిసేపు సమయాన్ని కేటాయిస్తారు. దీంతో పాటూ బొగ్గుగనుల ప్రత్యేక చట్టాల బిల్లు 2015, బీమారంగ చట్ట సవరణబిల్లు 2015, భూసేకరణలోని న్యాయమైన, పారదర్శక పరిహారం హక్కు , రిహాబిలిటేషన్ అండ్ రి సెటిల్ మెంట్ సవరణ బిల్లులపై చర్చ జరగనుంది. అలాగే రాజ్యసభలో ఢిల్లీ హైకోర్టు సవరణ బిల్లు చర్చకు రానుంది