
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు వరుసగా ఏడో రోజూ ఎగబాకాయి. సోమవారం లీటరుపై పెట్రోల్ 29 పైసలు, డీజిల్ 19 పైసలు పెరిగింది. దీంతో వారం రోజుల్లో లీటరుపై పెట్రోల్ రూ.1.88, డీజిల్ రూ.1.50 పెరిగినట్లయింది. 2018 నవంబర్ తర్వాత పెట్రో ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరుపై పెట్రోల్ రూ.74, డీజిల్ రూ.69కి చేరుకుంది. పెట్రోల్ ధర ఈ ఏడాది ఇదే గరిష్టం కాగా, ఇటీవలి కాలంలో డీజిల్ ధర ఇదే అత్యధికం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం పెట్రోల్, డీజిల్పై పడింది.
Comments
Please login to add a commentAdd a comment