ఓక్కి బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటన | PM Narendra Modi to visit Cyclone Ockhi-affected areas in Kerala, Tamil Nadu and Lakshadweep today: 5 points | Sakshi
Sakshi News home page

ఓక్కి బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటన

Published Wed, Dec 20 2017 1:49 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

PM Narendra Modi to visit Cyclone Ockhi-affected areas in Kerala, Tamil Nadu and Lakshadweep today: 5 points - Sakshi

లక్షద్వీప్‌లో తుపాను బాధితుల సమస్యలు వింటున్న మోదీ

తిరువనంతపురం/ చెన్నై: ఓక్కి తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. సాధ్యమైనంత మేర కేంద్రప్రభుత్వం సాయం అందిస్తుందని బాధిత రాష్ట్రాలకు ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం ముందుగా మోదీ లక్షద్వీప్‌ రాజధాని కవరట్టి చేరుకున్నారు. సహాయ, పునరావాస చర్యల కోసం రూ.150 కోట్ల సాయం అందించాలని అక్కడి ఉన్నతాధికారులు మోదీని కోరారు. అనంతరం మోదీ తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడ సీఎం పళనిస్వామితో సమావేశమయ్యారు.

రాష్ట్రానికి రూ.9,302 కోట్ల సాయం అందించాలని సీఎం పళనిస్వామి నష్టం నివేదిక అందజేశారు. అనంతరం మోదీ కేరళ రాజధాని తిరువనంతపురానికి 20కి.మీ. దూరం లో ఉన్న పూన్‌తురా అనే మత్స్యకార గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. కనిపించకుండా పోయిన మత్స్యకారులను క్రిస్ట్‌మస్‌ పండుగలోగా స్వస్థలాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు రూ.7,340 కోట్లు అందించాలని  సీఎం పినరయి విజయ్‌ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement