ఐదుకోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ | PM narendramodi inaugurate the Inter-State Council in New Delhi | Sakshi
Sakshi News home page

ఐదుకోట్ల మందికి గ్యాస్ కనెక్షన్

Published Sat, Jul 16 2016 11:15 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

PM narendramodi inaugurate the Inter-State Council in New Delhi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ లో అంతర్ రాష్ట్ర మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మొత్తం 17మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అలాగే, దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో ఫూంచ్ కమిషన్ సిఫారసులు, అంతర్గత భద్రత, సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర రాష్ట్రాల సయోధ్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ అన్నారు.

దాదాపు పదేళ్ల తర్వాత అంతర్ రాష్ట్ర మండలి భేటీ అయింది. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలని అన్నారు. దేశ అభివృద్ధికి రాష్ట్రాల సహకారం అవసరం అని చెప్పారు. కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు బలపడాలని చెప్పారు. గ్యాస్ కనెక్షన్లు పెంచడం ద్వారా కిరోసిన్ వాడకం తగ్గించ వచ్చని, కిరోసిన ఆదా చేస్తే మిగిలే నిధుల్లో 75శాతం రాష్ట్రాలకు వాటాగా అందుతుందని చెప్పారు. 5కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement