మరోసారి కేంద్రమంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ | Profile of Mukhtar Abbas Naqvi | Sakshi
Sakshi News home page

మరోసారి కేంద్రమంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ

Published Sun, Nov 9 2014 1:52 PM | Last Updated on Thu, May 24 2018 2:09 PM

మరోసారి కేంద్రమంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - Sakshi

మరోసారి కేంద్రమంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ

హిందూ సైద్దాంతిక విధానాలు, ఆశయాలు, లక్ష్యాలున్న బీజేపీలో షియా మతస్తుడైన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జాతీయ ఉపాధ్యుడిగా ఉన్నారు.

హిందూ సైద్దాంతిక విధానాలు, ఆశయాలు, లక్ష్యాలున్న బీజేపీలో షియా మతస్తుడైన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జాతీయ ఉపాధ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుఢి హోదాలో, అధికార ప్రతినిధిగా పార్టీకి సేవలందిస్తున్నారు. 
 
జననం: 
1957 అక్టోబర్ 15 తేదిన ఉత్తరప్రదేశ్ లో అలహాబాద్ లోని షియా ముస్లింల కుటుంబంలో జన్మించారు. ఆయనకు భార్య సీమా నఖ్వీ, ఓ కుమారుడు ఉన్నారు. 
 
విద్యాభ్యాసం: 
అలహాబాద్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. 
 
నఖ్వీ జీవితంలో కీలక ఘట్టాలు:
  • 1975-77 సంవత్సరాల మధ్య అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినపుడు జైలు జీవితాన్ని అనుభవించారు. 
  • 1980లో జనతపార్టీ అభ్యర్థిగా అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేశారు. 
  • 1989లో ఆయోధ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి.
  • 1991, 1993 లో మావ్ అసెంబ్లీకి ఎన్నిక
  • 1998లో రాంపూర్ నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నిక
  • 1998లో వాజ్ పేయి ప్రభుత్వ హాయంలో సమాచార, ప్రసార శాఖామంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలందించారు. 
  • 2010లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక
  • ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక
 
ఇతర బాధ్యతలు:
  • ఆర్ధిక కమిటి సభ్యుడిగా..
  • వాణిజ్య కమిటి సభ్యుడిగా, 
  • వక్ఫ్ బోర్డు జాయింట్ కమిటి సభ్యుడిగా
  • ఐటీ కమిటి మెంబర్ గా
 
రచయితగా
1991లో సైయా, 1998లో దాంగా అనే పుస్తకాల్ని రచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement