defence minister
-
దక్షిణ కొరియాలో ‘మార్షల్ లా’ అంశం.. మాజీ రక్షణ మంత్రి అరెస్ట్
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు దేశంలో ఎమర్జెన్సీ విధించాలంటూ సిఫారసు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఆయన్ను ప్రశ్నించిన అధికారులు గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, కిమ్ తనకుతానుగానే సియోల్ విచారణాధికారి కార్యాలయానికి వెళ్లారని, ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు అరెస్ట్ చేశారని మీడియా అంటోంది. కిమ్ కార్యాలయంతోపాటు నివాసంలోనూ తనిఖీలు చేపట్టారని చెబుతున్నారు. ఎమర్జెన్సీ విధింపునకు దారి తీసిన పరిస్థితులపై కిమ్పై విచారణ కోసం 62 మంది సభ్యుల దర్యాప్తు బృందం ఏర్పాటైందని సీనియర్ ప్రాసిక్యూటర్ పార్క్ సె–హ్యూన్ వెల్లడించారు. గత వారం స్వల్ప కాల ఎమర్జెన్సీని, ఆ తర్వాత పార్లమెంట్ తొలగించడం తెలిసిందే. ఈ పరిణామానికి సంబంధించిన తొలి అరెస్ట్ ఇది. అధ్యక్షుడు యూన్పై శనివారం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అధికార పక్ష సభ్యుల గైర్హాజరుతో వీగిపోయింది. అయినప్పటికీ, త్వరలోనే మరోసారి అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షాలు అంటున్నాయి. మొత్తం పరిణామాలకు కేంద్ర బిందువుగా భావిస్తున్న కిమ్ మంత్రి పదవికి గురువారమే రాజీనామా చేశారు.ఇదీ చదవండి: దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఉపశమనం -
దక్షిణ కొరియాలో పొలిటికల్ ట్విస్ట్.. కీలక మంత్రి రాజీనామా
సియోల్: దక్షిణ కొరియా రాజకీయంలో కొత్త ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్న ప్రకటించి.. అనంతరం విరమించుకోవడంతో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇక, దక్షిణ కొరియా రక్షణ మంత్రి కిమ్ యోంగ్-హ్యూన్ తాజాగా రాజీనామా చేశారు. అనంతరం, అధ్యక్షుడు.. కిమ్ రాజీనామాను ఆమోదించారు. వెంటనే.. సౌదీ అరేబియాలోని రాయబారి చోయ్ బ్యూంగ్-హ్యూక్ను కొత్త మంత్రి అభ్యర్థిగా నామినేట్ చేశారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగానే ఆయన రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్పై ఆ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇది గట్టెక్కాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. కనీసం ఆరుగురు రాజ్యాంగ న్యాయమూర్తులు దీనికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. దక్షిణకొరియా పార్లమెంట్లో 300 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ అధ్యక్షుడు అభిశంసనను గట్టెక్కాలంటే 200 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ తీర్మానాన్ని శుక్రవారం లోపు ఓటింగ్కు తీసుకురావచ్చని డెమోక్రటిక్ పార్టీ శాసనసభ్యుడు కిమ్ యోంగ్-మిన్ పేర్కొన్నారు. -
రక్షణ రంగంలో సైంటిస్ట్ సూరి భగవంతం సేవలు అమోఘం
దేశ రక్షణ రంగంలో ఎనలేని సేవలు అందించిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సూరి భగవంతం 115వ జయంతి వేడుకలకు త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్ర సేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డి మాట్లాడుతూ..‘డాక్టర్ సూరి భాగవతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను ఖగోళ శాస్త్రం, సముద్ర శాస్త్రం, భౌతిక శాస్త్రం మొదలైన రంగాలలో పరిశోధనలపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు. రక్షణ రంగానికి విశేష సేవలందించారు. సైబర్ నేరాలు, గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడం, ఏఐ/ఎంఎల్ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని శాస్త్రవేత్తలకు డాక్టర్ సూరి భగవంతం అసాధారణ సహకారాలు అందించారని ప్రశంసల వర్షం కురిపించారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీ వో) మాజీ చైర్మన్ డా.జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ సూరి భగవంతం అనేక రక్షణ పరిశోధన రంగాలకు సహకరించారు. చైనా యుద్ధం తర్వాత భారత్లో లేహ్, తేజ్పూర్లో ప్రయోగశాలను, హైదరాబాద్లో డీఆర్డీఎ్ల్,ప్రయోగశాలలను స్థాపించారు. రాడార్, బెంగుళూరులోని ఎన్ఎస్టీఎల్లు, అలాగే రక్షణ సాంకేతికతలలో పని చేయడానికి 25 కంటే ఎక్కువ ల్యాబ్లను స్థాపించేలా కృషి చేశారు. సంబంధిత పరిశోధనా రంగాలపై దృష్టి సారించడం కోసం ఆ ప్రాంతంలో ప్రయోగశాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో నేటి రక్షణ సాంకేతికత, వ్యవస్థల పురోగతికి పునాది వేశారని అన్నారు. డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నారు. -
నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
లక్నో: కేంద్ర రక్షణ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ లక్నో స్థానం నుంచి రానున్న లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.నామినేషన్ దాఖలుకు ముందు, రాజ్నాథ్ సింగ్ నగరంలో రెండు కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించి, స్థానిక దక్షిణ్ ముఖి హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు ఐదవ దశ పోలింగ్ మే 20న జరగనుంది. లక్నోతో పాటు మరో పదమూడు నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.లక్నో లోక్సభ స్థానంలో 2019 ఎన్నికలలో రాజ్నాథ్ సింగ్ 6.3 లక్షల ఓట్లు సాధించి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ శత్రుఘ్న సిన్హాను ఓడించారు. అలాగే 2014లో కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై 2.72 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. -
పాకిస్తాన్కు చేతకాకపోతే మేము సిద్ధంగా ఉన్నాం: రాజ్నాథ్ సింగ్
ఢిల్లీ: ఉగ్రవాదం విషయంలో పొరుగు దేశం పాకిస్తాన్పై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్తాన్కు చేతకాకపోతే.. భారత్ సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. అంతేకానీ, ఉగ్రవాదంతో భారత్లో అస్థిర పరిచేందుకు ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని పాక్ను హెచ్చరించారు. ఈ మేరకు జరాజ్నాథ్ సింగ్ గురువారం జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘పాకిస్తాన్ అసమర్ధంగా ఉందని భావిస్తే.. ఉగ్రవాదాన్ని అంతం చేయటంలో సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉంది. భారత్లోకి ప్రవేశించి సరిహద్దులు దాటి తప్పించుకునే ఉగ్రవాదులను హతమార్చటంలో భారత్ వెనకడుగు వేయబోదు. ఉగ్రవాదులు భారత దేశంలోని శాంతికి భంగం కలిగిస్తే.. మేము పాకిస్తాన్లోకి ప్రవేశించి మరీ ఉగ్రమూకలను మట్టుపెడతాం. భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇతర దేశంపై దాడి చేయదు. పొరుగు దేశంలోని భూభాగాన్ని అక్రమించుకోదు. కానీ, ఎవరైనా భారత్లోని శాంతికి భంగం కలిగిస్తే.. ఏమాత్రం ఊరుకోం’ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇక.. ఇటీవల పాక్లో చోటుచేసుకుంటున్న ఉగ్రవాదుల మిస్టరీ హత్యల వెనక భారత్ హస్తం ఉన్నట్లు యూకేకు చెందిన ‘దీ గార్డియన్’ పత్రిక ఓ నివేదికను వెల్లడించిన విషయం తెలిసిందే. 2019 పుల్వామా దాడుల అనంతరం పాక్లోని ఉగ్రవాదులపై భారత్ దృష్టి పెట్టిందని.. ఈ విషయాన్ని ఇరుదేశాల ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి సేకరించిన సమాచారం మేరకే ఈ నివేదిక విడుదల చేసినట్లు గార్డియన్ పత్రిక వెల్లడించింది. గార్డియన్ పత్రిక ఆరోపణలపై భారత్ స్పందిస్తూ.. ‘పూర్తిగా తప్పుడు సమాచారమని, భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. టార్గెట్ హత్యలు చేయటం భారత విధానం కాదు’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ శాఖ స్పందించింది. ‘భారత్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాకిస్తాన్ దృఢమైన సంకల్పం, తమను తాము రక్షించుకునే సామర్థాన్ని చరిత్ర ధృవీకరిస్తుంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. -
రక్షణ రంగ స్వావలంబనే ఏకైక లక్ష్యం: రాజ్నాథ్
తేజ్పూర్(అస్సాం): రక్షణలో స్వావలంబన సాధన కోసమే స్వదేశీ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ స్పష్టంచేశారు. అస్సాంలో తేజ్పూర్ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రాజ్నాథ్ ప్రసంగించారు. ‘‘ భారత్ను వ్యూహాత్మక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే రక్షణరంగంలో స్వావలంబన అవసరం. అందుకే దేశీయ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇందులోభాగంగా రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించుకుంటున్నాం. ఎగుమతులను నెమ్మదిగా పెంచుతున్నాం. దశాబ్దాలుగా దిగుమతి చేసుకుంటున్న 509 రకాల రక్షణ రంగ ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారుచేయాలని నిర్ణయించి వాటి దిగుమతులను నిషేధించాం. త్వరలో మరో 4,666 రకాల రక్షణ విడిభాగాలనూ దేశీయంగానే తయారుచేయాలని ప్రతిపాదించాం. ఇది కూడా త్వరలోనే ఆచరణలోకి తెస్తాం. తొలిసారిగా స్వదేశీ రక్షణ తయారీ రంగ పరిశ్రమ రూ.1లక్ష కోట్ల మార్క్ను దాటింది. 2016–17 కాలంలో రూ.1,521 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు 10 రెట్లు పెరిగి రూ.15,920 కోట్లు దాటాయి’’ అని రాజ్నాథ్ చెప్పారు. దేశీయ రక్షణ రంగంలో ప్రధాని మోదీ కొత్త ఒరవడి తెచ్చారు’’ అన్నారు. -
అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.. రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారతదేశం 2047 సమయానికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించబడాలంటే అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగిన బలమైన సాయుధ బలగాల అవసరముందని అన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రక్షణ శాఖ అకౌంట్స్ విభాగంలో పలు డిజిటల్ సేవలను ప్రారంభించిన ఆయన త్రివిధ దళాలు తమకు అందుబాటులో ఉన్న ఆర్ధిక వనరులను వినియోగించుకుంటూ చాలా అడ్వాన్స్డ్గా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ సారాంశ్(రక్షా మంత్రాలయ అకౌంట్లు, బడ్జెట్, వ్యయం), బిశ్వాస్(బిల్లులు, పని విశ్లేషణ, ఈ-రక్షా ఆవాస్) డిజిటల్ సేవలను ప్రారంభించారు. రక్షణ శాఖ అకౌంట్స్ విభాగం 276వ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణశాఖ అకౌంట్స్ విభాగం మొత్తం శాఖకే కవచంలా వ్యవహరిస్తోందని అన్నారు. అంతర్గత నిఘా విభాగాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఎక్కడైనా అనుమానాస్పద వ్యవహారాలు చోటు చేసుకుంటే వెంటనే గుర్తించే వీలుంటుందన్నారు. దీనిద్వారా సమస్యను తొందరగా పరిష్కరించుకోవడమే కాదు, ప్రజల్లో రక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని కూడా పెంచవచ్చన్నారు. మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దబడాలంటే భార్య సాయుధ బలగాలకు అత్యంత ఆధునిక ఆయుధాలను, సామాగ్రిని అందించాల్సిన అవసరముందని అందుకు మనవద్ద ఉన్న ఆర్ధిక వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. దీనికోసం అవసరమున్న సేవలకు అందుబాటులో ఉన్న వనరుల మధ్య బ్యాలన్స్ కుదరాలని అన్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్లోని ఆయుధాలపై అధ్యయనం చేయడానికి అకౌంట్స్ శాఖలో ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇంతకాలం డీఏడీ పారదర్శకమైన, సమర్ధవంతమైన ఆర్దిక వ్యవస్థ ద్వారా దేశ రక్షణ సామర్ధ్యాన్ని పెంచిన విధానం అద్భుతమని, ఏదైనా వ్యవస్థలో అకౌంటింగ్ అనేది చాలా కీలకమైనదని రక్షణ అకౌంట్ విభాగం న్యాయబద్ధమైన రీతిలో అవసరాన్ని బట్టి వనరులను సమకూర్చుకోవాలని అన్నారు. వీలయితే సాంకేతికంగా ముందడుగు వేసే విధంగా ఐఐఎం, ఐసీఏఐ వంటి సంస్థలతో చేతులు కలపాలని తద్వారా డీఏడీ ఆర్ధిక మేధస్సు పెరుగుతుందని అన్నారు. ఇది కూడా చదవండి: ఐఎఎఫ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ -
భారత్తో సంబంధాలు కీలకమే.. కానీ: కెనడా మంత్రి
భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఖలీస్థానీ సానుభూతిపరుడు హర్దిప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్, కెనడా మధ్య చిచ్చు రాజేసిన విషయం తెలిసిందే. నిజ్జార్ హత్య వెనక భారత్ ప్రమేయం ఉండొచ్చుంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. కెనడా రక్షణశాఖ మంత్రి బిల్ బ్లెయిర్ తాజాగా కెనడా రక్షణశాఖ మంత్రి బిల్ బ్లెయిర్ మాట్లాడుతూ.. భారత్తో సంబంధాలు తమకు ముఖ్యమైనవని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కెనడా కోరుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో బ్లెయిర్ మాట్లాడుతూ.. నిజ్జార్ హత్య ఆరోపణల వ్యవహారం భారత్తో తమ బంధానికి సంబంధించి సవాలుతో కూడుకున్న సమస్యగా మారుతోందన్నారు. అదే సమయంలో చట్టాన్ని, తమ పౌరులను రక్షించడం ముఖ్యమని అన్నారు. అందుకు ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజనిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఆరోపణలే నిజమని తేలితే.. కెనడా గడ్డపై, కెనడియన్ పౌరుడి హత్య విషయంలో తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినందుకు తీవ్ర ఆందోళన నెలకొంటుందని అన్నారు. చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన కెనడాకు ఉప్పందించింది అమెరికానే నిజ్జర్ హత్య అనంతరం ఆ నిఘా సమాచారాన్ని అగ్రరాజ్యం అమెరికానే ఆ దేశానికి అందజేసిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. సదరు సమాచారాన్ని ఆధారంగా చేసుకునే కెనడా భారత్పై నేరుగా ఆరోపణలకు దిగినట్లు తెలుస్తోందని ఆ కథనం పేర్కొంది. తమ దేశంలోని భారత దౌత్యాధికారుల సంభాషణలను దొంగచాటుగా వినడం ద్వారా కెనడా నిఘా విభాగాలు ఇదే విషయాన్ని ధ్రువీకరించుకున్నట్లు కూడా భావిస్తున్నారు. -
కిమ్తో రష్యా మంత్రి భేటీ
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయుగు భేటీ అయ్యారు. ప్రాంతీయ భద్రత, సైనిక అంశాలపై ఆయనతో చర్చించినట్లు ఉ. కొరియా అధికారిక మీడియా తర్వాత వెల్లడించింది. 1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 వసంతాలు పూర్తిచేసుకుంటున్న వేళ కిమ్తో రష్యా రక్షణ మంత్రి సమావేశంకావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పాంగ్యాంగ్లో సమావేశమైన సెర్గీ, కిమ్లు పలు అంశాలపై పరస్పర ఒప్పందానికి వచ్చారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీని కిమ్ ఆయుధాల ఎగ్జిబిషన్కు తీసుకువెళ్లారు. అందులో ఉ.కొరియా ఇటీవల ప్రయోగించిన క్షిపణి వేరియంట్లను దగ్గరుండి చూపించారు. -
యూసీసీకి మతం రంగు పులమొద్దు: రాజ్నాథ్ సింగ్
జోద్పూర్: దేశంలో ఉమ్మడిపౌర స్మృతి(యూసీసీ) అమలు గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడినప్పుడల్లా ప్రతిపక్షాలు మతం కోణాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. సమాజాన్ని చీల్చే రాజకీయాలు చేయొద్దని విపక్షాలకు హితవు పలికారు. యూసీసీకి మతం రంగు పులమొద్దని సూచించారు. రాజ్యాంగం ప్రకారమే ముందుకెళ్తున్నామని, ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆయన బుధవారం రాజస్తాన్లో ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. మహిళల గౌరవాన్ని కాపాడే విషయంలో మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో, అంకితభావంతో పని చేస్తోందన్నారు. -
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కరోనా పాజిటివ్
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనా బారినపడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా టెస్టుల్లో పాజిటివ్గా తేలింది. దీంతో, రాజ్నాథ్ సింగ్.. హోం క్వారెంటైన్లో ఉన్నారు. అయితే, రాజ్నాథ్ సింగ్.. గురువారం వైమానిక దళం కమాండర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొనాల్సి ఉంది. కాగా, కోవిడ్ టెస్టులో పాజిటివ్గా తేలడంతో ఆయన ఆ ఈవెంట్కు దూరం అయినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. స్వల్పంగా కరోనా లక్షణాలతో రాజ్నాథ్ బాధపడుతున్నారని, డాక్టర్ల బృందం ఆయన్ను పరీక్షించిందని, వారి సూచన మేరకు ఆయన రెస్టు తీసుకుంటున్నట్లు ప్రకనటలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 13వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ఇక, మరణాలు కూడా ఎక్కవ సంఖ్యలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. Raksha Mantri #RajnathSingh has been tested positive for #COVID19 with mild symptoms and is now under home quarantine. He had attended Army's Commanders Conference yesterday at Manekshaw Centre. Praying for soonest recovery ! pic.twitter.com/WSe4jyPVbJ — Neeraj Rajput (@neeraj_rajput) April 20, 2023 -
లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. దివాళా తీసిన పాకిస్తాన్..
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్న విషయం తెలిసిందే. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పాల ధర రూ.250, కేజీ చికెన్ రూ.780కి చేరిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో దివాళా అంచుల్లోకి పాకిస్తాన్ వెళ్లిందని అంతా అనుకుంటున్నారు. అయితే పాక్ రక్షణ మంత్రి, పీఎంఎల్-ఎన్ నేత ఖవాజా ఆసిఫ్ ఆ దేశ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని కుండబద్దలుకొట్టారు. పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయామని ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కన్పించడం లేదన్నారు. ఇక పాక్ ప్రజలు తమకాళ్లపై తామే నిలబడాలని పిలుపునిచ్చారు. సియాల్కోట్లో ఓ ప్రైవేట్ కాలేజ్ నిర్వహించిన కాన్వొకేషన్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఖవాజా ఈ వ్యాఖ్యలు చేశారు. 'పాకిస్తాన్ అప్పుల్లో కూరుకుపోయిందని, ఆర్థిక మాంద్యంలో ఉందని ప్రజలు అంటున్నారు. అయితే ఇదంతా ఇప్పటికే జరిగిపోయింది. మనం ఇప్పుడు దివాళా తీసిన దేశంలో నివసిస్తున్నాం. ఇక సొంతంగా మనకాళ్లపైనే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది' అని ఆసిఫ్ అన్నారు. Defence Minister of Imported govt admits that Pakistan is already in default. In 10 months they have brought Pak to this sorry state - Shameless lot selling out the country & holding on to power instead of letting nation choose their ldrs thru elections. pic.twitter.com/IHbREnbAhK — Shireen Mazari (@ShireenMazari1) February 18, 2023 దేశంలో ఇలాంటి దారుణమైన పరిస్థితి రావడానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని గత పీటీఐ ప్రభుత్వమే కారణమని ఖవాజా ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్కు తిరిగితీసుకొచ్చారని ఆరోపించారు. పాకిస్తాన్ను ఉగ్రవాదులకు నిలయంగా మార్చారని కూడా ఖవాజా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖవాజా ఆరోపణలను ప్రతిపక్ష పీటీఐ పార్టీ తిప్పికొట్టింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 నెలల్లోనే దేశాన్ని దివాళా తీయించిందని ఎదురుదాడికి దిగింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2019లో పాకిస్తాన్కు 6 బిలియన్ డాలర్ల సాయం అందించింది. 2022లో వరదల తర్వాత మరో 1.1 బిలియన్ డాలర్లను సాయంగా ప్రకటించింది. కానీ దేశంలో రాజకీయ గందరగోళం మధ్య ఆర్థిక ఏకీకరణపై పాకిస్తాన్ మరింత పురోగతి సాధించడంలో విఫలమవడంతో నవంబర్లో చెల్లింపులను నిలిపివేసింది. చదవండి: ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ సీఈఓగా మేఘనా పండిట్ -
తవాంగ్ ఘర్షణ: రాజ్నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికల నడుమ తలెత్తిన ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిద ధళాల అధిపతులు, విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 9న జరిగిన ఘటనపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. సరిహద్దులో ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్లోనూ ఈ అంశంపై రాజ్నాథ్ మాట్లాడనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: భారత్-చైనా సరిహద్దు ఘర్షణ.. ప్రతిపక్షాలకు పార్లమెంట్లో గట్టి కౌంటర్ పడేనా? -
‘పీఓకే’ను తిరిగి పొందటమే లక్ష్యం!.. రక్షణ మంత్రి హింట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పీఓకే ప్రజలపై పాకిస్థాన్ అకృత్యాలకు పాల్పడుతోందని, దాని పర్యావసనాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. పీఓకేను తిరిగి చేజిక్కించుకోవటమే తమ లక్ష్యమని సూత్రప్రాయంగా వెల్లడించారు. పీఓకేలోని గిల్గిత్, బాల్టిస్తాన్ను చేరుకున్నాకే.. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి సాధించినట్లవుతుందన్నారు. 1947లో శ్రీనగర్లో భారత వైమానిక దళం అడుగుపెట్టిన రోజును పురస్కరించుకుని నిర్వహించిన శౌర్య దివాస్ కార్యక్రమంలో మాట్లాడారు. ‘జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధి ప్రయాణాన్ని ఇప్పడే ప్రారంభించాం. గిల్గిత్, బాల్టిస్తాన్ చేరుకున్నాకే మా లక్ష్యం నెరవేరుతుంది. పీఓకే ప్రజలపై పొరుగు దేశం అకృత్యాలకు పాల్పడుతోంది. దాని పర్యావసనాలు ఎదుర్కోక తప్పదు. ఉగ్రవాదం అనేది ఒక మతం కాదు. టెర్రరిస్టుల ఏకైక లక్ష్యం భారత్.’ అని పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. 2019, ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయటం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజలపై వివక్ష తొలగిపోయిందన్నారు. ఇదీ చదవండి: ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం -
డర్టీ బాంబు అంటూ రష్యా గగ్గోలు...భారత రక్షణ మంత్రితో మొర
మాస్కో: ఉక్రెయిన్ డర్టీ బాంబు ప్రయోగించనుందంటూ ఒకటే గగ్గోలు పెడుతోంది రష్యా. ఉక్రెయిన్తో సహా పాశ్చాత్య దేశాలు ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి. కానీ రష్యా మాత్రం డర్టీ బాండు ఉపయోగిస్తోదంటూ ఉక్రెయిన్పై ఆరోపణలు చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వీడియో కాల్లో చైనీస్ రక్షణ మంత్రి వీ ఫెంఘేతో ఈ విషయమై సంభాషించారు. ఆ తర్వాత బుధవారం భారత్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కూడా ఫోన్లో మాట్లాడుతూ. ...ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేసినట్లు భారత రక్షణ శాఖ పేర్కొంది. వాస్తవానికి ఈ డర్టీ బాంబు అనేది రేడియోధార్మిక, జీవ సంబంధమైన రసాయన పదార్థాలతో కూడిన బాంబు. ఇది మానవాళికి అత్యంత ప్రమాదకరమైన బాంబు దాడి. రష్యా మాత్రం పదేపదే నాటో ప్రత్యర్థులతో కలిసి ఉక్రెయిన్ డర్టీ బాంబు ఉపయోగించాలని చూస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఒకవైపు అవన్నీ అబద్ధాలు అని ఉక్రెయిన్ కొట్టిపారేస్తోంది. ఈ మేరకు మాస్కో ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ....ఉక్రెయిన్ డర్టీ బాంబు ఉపయోగించనుందన్న పక్కా సమాచారం మా వద్ద ఉంది. అటువంటి విధ్వంసకర చర్యలను నియంత్రించేలా ప్రంపంచ దృష్టికి తీసుకు రావడమే గాక అందుకు తగు చర్యలు తీసుకుంటామని నొక్కి చెప్పారు. (చదవండి: వీడియో: ఉక్రెయిన్పై అణుదాడికి అంతా రెడీ?.. పుతిన్ పర్యవేక్షణలోనే!) -
ఆర్మీ పరికరాలు , అస్త్రాలకు ఆయుధ పూజ చేసిన రాజ్ నాథ్ సింగ్
-
‘పీవోకే’ అంశంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు!
సిమ్లా: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విషయంలో 1971లో భారత్-పాక్ యుద్ధ సమయంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హిమాచల్ప్రదేశ్, కంగ్రా జిల్లాలోని బదోలిలో అమరవీరుల కుటుంబాల సంత్కరించుకునే కార్యక్రమం వేదికగా పీవోకేపై మాట్లాడారు రాజ్నాథ్. ‘1971లో పాకిస్థాన్పై యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకొని స్వర్ణోత్సవ వేడుకలను ఇటీవలే ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ యుద్ధం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఇది ఆస్తుల కోసమో, అధికారం కోసమో జరిగిన యుద్ధం కాదు, మానవత్వం కోసం పోరాడి ప్రత్యర్థిపై విజయం సాధించాం. కానీ, ఒకింత బాధగా కూడా ఉంది. పీవోకే అంశంలో అప్పట్లోనే నిర్ణయం తీసుకోవాల్సింది.’ అని పేర్కొన్నారు రాజ్నాథ్. అనంతరం హమిర్పుర్ జిల్లాలోని నదౌన్లో నిర్వహించిన కార్యక్రమంలోనూ పాలుపంచుకున్నారు. గతంలో భారత్ రక్షణ ఉత్పత్తుల దిగుమతిదారుగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 25 ఎగుమతిదారుల్లో ఒకటిగా భారత్ నిలిచిందన్నారు. 8 ఏళ్ల క్రితం రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.900 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.13,000 కోట్లు చేరిందని గుర్తు చేశారు రాజ్నాథ్. 2047 నాటికి రూ.2.7లక్షల కోట్లకు చేరుకునేలా లక్ష్యాన్ని నిర్దేషించుకున్నట్లు చెప్పారు. మానవత్వం కోణంలో భారత్ ఏదేశంపై దాడులు చేయాలేదని, ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించుకోలేదన్నారు. కానీ, భారతలో శాంతికి విఘాతం కలిగంచాలని చూస్తే ధీటైన సమాధానం ఇస్తామని శత్రుదేశాలకు హెచ్చరికలు చేశారు. పాకిస్థాన్ అక్రమిత కశ్మీర్ భారత్లో అంతర్భాగమని, అదే వైఖరికి తాము కట్టుబడి ఉన్నామంటూ ఇటీవలే రాజ్నాథ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దేశ ప్రజలు ఎంతో భక్తితో కొలుచుకునే శారదా శక్తి పీఠం అక్కడే ఉందని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్నప్పటికీ పీవోకేలో ఒక్క కుటుంబానికి కూడా ఎలాంటి నష్టం జరగనీయబోమని తెలిపారు. భారత్ పై దుష్ట పన్నాగాలు పన్నేవారికి తగిన సమాధానం ఇచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామంటూ పాకిస్థాన్కు హెచ్చరికలు పంపారు. ఇదీ చదవండి: ఔరా! ఒంటి చేత్తో నగరంలోని సైకిళ్లన్నీ మాయం చేసిన దొంగ -
ఎట్టి పరిస్థితుల్లోను అగ్నిపథ్ ను ఆపేది లేదు
-
తగ్గేదేలే.. చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: భారత్కు హాని తలపెట్టాలని చూస్తే ఎవ్వరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. తూర్పు లఢక్ విషయంలో చైనాను ఉద్దేశించి రాజ్నాథ్ ఈ మేరకు డ్రాగన్ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత అమెరికన్లు ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భారత సైనికుల వీరోచిత సేవలను ప్రశంసించారు. లఢక్ సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైన్యాన్ని ఎదుర్కొన్న భారత సైనికుల ధైర్యాన్ని ఈ సందర్భంగా రాజ్నాథ్ కొనియాడారు. భారత ప్రభుత్వం, ఆర్మీ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో తాను బహిరంగంగా చెప్పలేనని అన్నారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘భారత్’ ప్రపంచ పటంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్ను నిలువరించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఉక్రెయిన్తో యుద్ధం వేళ కొన్ని విషయాల్లో రష్యాకు భారత్ అనుకూలంగా నిలిచింది. ఈ వ్యవహారంలో భారత్పై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అమెరికాను కూడా పరోక్షంగా రాజ్నాథ్ హెచ్చరించారు. ‘జీరో-సమ్ గేమ్’ దౌత్యాన్ని భారత్ విశ్వసించదని పేర్కొన్నారు. ఇలాంటి దౌత్యాన్ని భారత్ ఎప్పటికీ ఎంచుకోదని స్పష్టం చేశారు. అలాగే, అంతర్జాతీయ సంబంధాల్లో జీరో-సమ్ గేమ్పై మాకు నమ్మకం లేదని.. విన్-విన్ ఆధారంగా మాత్రమే ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలని భారత్ కోరుకుంటుందని వెల్లడించారు. -
ఎన్నికల్లో ఓడినా.. సీఎంగా ఆయనే!
సాక్షి డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సీఎం ఎవరంటూ...గత 11 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మళ్లీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి కొనసాగుతారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం డెహ్రాడూన్లో జరిగిన బీజెపీ శాసనసభా పక్షం సమావేశం తదనంతరం రాజ్నాథ్ సింగ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీజెపీ నాయకులు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీనియర్ నాయకురాలు మీనాక్షి లేఖి తదితరలు పాల్గొన్నారు. ఈ క్రమంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ..పుష్కర్ సింగ్ ధామి శాసనసభా పక్ష నాయకుడిగా ప్రకటిస్తున్నాం. నేను ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన నాయకత్వంలో ఉత్తరాఖండ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని నేను విశ్వసిస్తున్నాను" అని పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 46 సీట్లు గెలుచుకుని వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉదంసింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా నియోజకవర్గం నుంచి పుష్కర్ సింగ్ ధామి ఓడిపోయారు. 2012, 2017లో ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన పుష్కర్ సింగ్ ధామి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6 వేల మెజార్టీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఆయన మార్చి 11న ఉత్తరాఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ భారీ విజయానికి ధామీని చేసిని కృషి బీజెపీ నాయకులు అభిమానాన్ని చూరగొంది. అదే ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రకటించేలా చేసింది. అయితే ఈ అత్యున్నత పదవీ కోసం దాదాపు అరడజను మంది పేర్లు తెరపైకి వచ్చాయి కానీ వారందరీలో పుష్కర్ సింగ్ ధామి పేరే అధికంగా వినిపించడంతో ఓడిపోయినప్పటికీ.. మళ్లీ సీఎంగా ఐదేళ్లు పదవిలో కొనసాగే ఛాన్స్ కొట్టేశారు. (చదవండి: ఆర్జేడీలో ఎల్జేడీ విలీనం) -
కేవలం 45 రోజుల్లో ఏడంతస్తుల భవనం...దేశ నిర్మాణ చరిత్రలోనే రికార్డు
న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ కోసం బహుళ-అంతస్తుల భవన నిర్మాణాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి చేసింది. ఈ ఏడంతస్తుల భవనాన్ని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(ఏడీఈ) వద్ద నిర్మించింది. దీన్ని సంప్రదాయ, ప్రీ-ఇంజనీరింగ్, ప్రీకాస్ట్ మెథడాలజీతో కూడిన హైబ్రిడ్ టెక్నాలజీతో పూర్తి చేసింది. స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్(ఏఎంసీఏ) ప్రోగ్రాం కోసం నిర్మించిన ఈ భవనాన్ని ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లు, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఏవియోనిక్స్ అభివృధికి వినియోగిస్తారు. ఈ ఐదవతరం స్వదేశీ ఏఎంసీఏ రీసెర్చ్ అండ్ డెలవలప్మెంట్ సౌకర్యాలను అందిస్తుంది. ఈ ఏడంతస్తుల భవనాన్ని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో గురువారం ప్రారంభించారు. అంతేకాదు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్కు భవనంలోనే ప్రాజెక్ట్పై ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు డిఆర్డిఓ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయన 45 రోజుల తక్కువ వ్యవధిలో కాంపోజిట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ద్వారా మౌలిక సదుపాయాలు అందిచాలని చెప్పారని అన్నారు. ఈ ప్రాజెక్ట్కి శంకుస్థాపన నవంబర్ 22, 2021న జరిగిందని, నిర్మాణం ఫిబ్రవరి 1, 2022న ప్రారంభమైందని తెలిపారు. హైబ్రిడ్ నిర్మాణ సాంకేతికతతో ఏడు అంతస్తుల శాశ్వత భవనాన్ని పూర్తి చేయడం ఒక ప్రత్యేకమైన రికార్డు అని అన్నారు. దేశ నిర్మాణ పరిశ్రమ చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. అంతేకాదు ఇది సాంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే సమయం, శ్రమను తీవ్రంగా తగ్గిస్తుందని చెప్పారు. ఈ అత్యాధునిక భవనంలో ప్రామాణిక జాతీయ భవనం కోడ్ ప్రకారం విద్యుత్ వ్యవస్థ, ఫైర్ ప్రోటెక్షన్ తోపాటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కూడా ఉంటుందని అన్నారు. ఈ భవన నిర్మాణాం అన్ని నిబంధనలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నిర్మాణంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ బృందాలు సాంకేతిక సహాయాన్ని అందించాయని తెలిపారు. (చదవండి: ఇంతకీ ఐపీఎస్ అధికారి సూట్ కేస్లో ఏముందో తెలుసా!) -
ఆ వివరణ సరిపోదన్న పాక్! ఉమ్మడి విచారణకు డిమాండ్
It is not enough to satisfy Pakistan: క్షిపణి ఘటనపై భారత రణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన ప్రకటనను పాకిస్తాన్ తిరస్కరించింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ మార్చి 9 నాటి సంఘటనలా 'బాధ్యతా రహితమైన వివరణగా పేర్కొన్నాడు. పైగా ఇది 'అత్యంత బాధ్యతారహితమైన చర్య' అని అన్నారు. భారత్ ఆదేశించిన దర్యాప్తును కూడా ఏకపక్షమైన విచారణగా ఆరోపించింది. పాకిస్తాన్ని సంతృప్తి పరచడానికి రాజ్నాథ్ సింగ్ వివరణ సరిపోదని, పైగా తిరస్కరిస్తున్నాం అని చెప్పారు. తాము ఉమ్మడి దర్యాప్తును కోరుతున్నాం అని పునరుద్ఘాటించారు. అంతేకాదు ఈ ఆయుధం వార్హెడ్ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నందున ఈ సంఘటన ప్రభావం ఒక ప్రాంతానికి పరిమితం కాదన్నారు. ఇది కేవలం ప్రమాదం అని చెబితే సరిపోదు అని తేల్చి చెప్పారు. అయితే భారత్ తన తప్పును అంగీకరించడమే కాక ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తానని కూడా తెలిపింది. పైగా తప్పులుంటే చర్యలు తీసుకుంటానని హామీ కూడా ఇచ్చింది. మరోవైపు అమెరికా కూడా ఈ విషయమై స్పందించింది. పైగా ఈ ఘటన అనుకోని ప్రమాదమని మరేం ఉద్దేశాలు లేవని భావిస్తున్నాం అని చెప్పింది కూడా. కానీ పాక్ మాత్రం ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చూడటమే కాక తన అక్కసును వెళ్లగక్కుతోంది. (చదవండి: పాక్లో భారత మిస్సైల్ ప్రమాదం.. రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన) -
క్షిపణి మిస్ఫైర్పై రాజ్యసభలో రాజ్నాథ్ సింగ్ ప్రకటన
-
మిస్సైల్ ప్రమాదం.. రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన
పాకిస్థాన్ భూభాగంలోకి భారత్ మిస్సైల్ దూసుకెళ్లిన ఘటన రచ్చ రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వంకతో పాక్, భారత్పై రెచ్చిపోయి ఆరోపణలు చేయగా.. భారత్ మాత్రం పొరపాటున జరిగిందంటూ కూల్గా తప్పు ఒప్పేసుకుంది. ఈ తరుణంలో Missile Mishap మిస్సైల్ ఘటనపై పార్లమెంట్ సాక్షిగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. మార్చి 9న రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించారు. మిస్సైల్ యూనిట్లో రోజూవారీ తనిఖీలు నిర్వహిస్తుండగా.. పొరపాటున ఒక మిస్సైల్ దూసుకెళ్లింది. తర్వాతే అది పాక్ భూభాగంలో పడిందని తెలిసింది. ఈ ఘటన జరగడం విచారకం. కానీ, ఎలాంటి నష్టం జరగనందుకు సంతోషం. పాక్ ఆరోపిస్తున్నట్లు ఈ ఘటనను.. మేం తమాషాగా చూడట్లేదు. మా ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే పొరపాటు ఎలా జరిగిందోత తెలుసుకునేందుకు.. అత్యున్నత విచారణకు ఆదేశించాం. విచారణ జరిగితే.. అసలు కారణం ఏంటో తెలిసేది’’ అని రాజ్నాథ్ తెలిపారు. ఈ ఘటనతో భారత క్షిపణి వ్యవస్థపై అనుమానాలు అక్కర్లేదన్న రక్షణ మంత్రి.. అది అత్యంత సురక్షితమైనదని సభకు హామీ ఇచ్చారు. ‘‘మా భద్రతా విధానాలు, ప్రోటోకాల్లు అత్యధిక క్రమాన్ని కలిగి ఉంటాయి. ఎప్పటికప్పుడు సమీక్షించబడతాయి. మన సాయుధ దళాలు సుశిక్షితమైనవి అని స్పష్టం చేశారు. We give highest priority to safety&security of our weapon system. If any shortcoming found in this context, it'll immediately be rectified. I'd like to assure the House that our missile system is highly reliable & safe. Our safety procedure & protocols are high level: Defence Min pic.twitter.com/4miUumF5Na — ANI (@ANI) March 15, 2022 2005 ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల క్షిపణి పరీక్షలు గనుక నిర్వహిస్తే.. మూడు రోజుల ముందు తెలియజేయడంతో పాటు, ఇరు దేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా, నష్టం జరగకుండా నిర్ణీత వ్యవధిలోనే ఆ పరీక్షలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కానీ, గత బుధవారం సాయంత్రం సిస్రా(హర్యానా) వైపు నుంచి సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్ సరిహద్దులో కూలింది. మియా చన్ను సమీపంలో అది పడిపోయిందని, ఇది పాకిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించడమే అని భారత్పై ఆగ్రహం వెల్లగక్కింది పాకిస్థానీ వైమానిక దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని పాక్ ఆరోపణల తర్వాత భారత్ వివరణ ఇచ్చుకుంది. భారత్ చెప్పింది కదా పాక్ భూభాగంలోకి మిస్సైల్ దూసుకెళ్లిన ఘటనపై అమెరికా స్పందించింది. అది ప్రమాదం అని భారత్ చెప్పింది కదా.. పైగా దర్యాప్తునకు ఆదేశించింది. మరేం ఉద్దేశాలు ఉండకపోవచ్చనేం భావిస్తున్నాం. ఇంతకు మించి ఈ పరిస్థితుల్లో ఏం చెప్పలేం. అని భద్రతా కార్యదర్శి నెడ్ ప్రైస్ మీడియాకు తెలిపారు. -
మహిళ కాళ్లు మొక్కిన రాజ్నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం పరమవీర చక్ర పొందిన కల్నల్ హోషియార్ సింగ్ భార్య ధన్నోదేవి పాదాలను తాకారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ హాజరుకాగా అందులో ఈ ఘటన చోటు చేసుకుంది. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత సైనికులు అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిరస్మరణీయ విజయానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 50వ వార్షికోత్సవాన్ని న్యూఢిల్లీలో విజయ్ పర్వ్ సమపన్ సమరోహ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి 1971 యుద్ధంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బంగ్లాదేశ్ ముక్తిజోద్ధులు, భారత యుద్ధ అనుభవజ్ఞులతో స్నేహపూర్వకంగా కలిసి వారితో సంభాషించారు. ‘భారత సాయుధ దళాలు వారి పరాక్రమ పోరాటంలో ధైర్యవంతులైన ముక్తిజోద్ధులతో కలిసి పనిచేశాయి. యుద్ధ అనుభవజ్ఞుడైన కల్నల్ హోషియార్ సింగ్ను 1971 యుద్ధంలో ధైర్యాన్ని ప్రదర్శించినందుకు దేశంలోని అత్యున్నత సైనిక గౌరవమైన పరమవీర చక్రతో సత్కరించారు, ఇది బంగ్లాదేశ్ విముక్తికి దారితీసిందని’ తెలుపూతూ ట్వీట్ చేశారు. Had a warm interaction with the Bangladeshi Muktijoddhas and the Indian war veterans who fought against injustice in 1971 war. The Indian Armed Forces worked together with the courageous Muktijoddhas in their valiant struggle.#SwarnimVijayParv pic.twitter.com/R6LnbUzeZC — Rajnath Singh (@rajnathsingh) December 14, 2021 -
‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ జల ప్రవేశం.. ప్రత్యేకతలివే..
ముంబై: విశాఖపట్నం అంటే సముద్ర తీరంలోని ఓ నగరం గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఓ యుద్ధ నౌక కూడా విశాఖపట్నం పేరిట నిర్మితమైంది. విశాఖ నగర ప్రాధాన్యత తో పాటు చరిత్ర ఆధారంగా నేవీ ఓ యుద్ధ నౌకకు విశాఖపట్నం నామకరణం చేసింది. ఈ యుద్ధనౌక ప్రాధాన్యతలను ఇటీవల తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైఎస్ అడ్మిరల్ ఆజేంద్ర బహదూర్ సింగ్ తాడేపల్లిలో సీఎం జగన్మోహన్రెడ్డికి కూడా వివరించారు. ఆదివారం ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ‘విశాఖపట్నం యుద్ధనౌక’ను ప్రారంభించారు. ఈ యాంటీ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక రక్షణ రంగంలో కీలక భూమిక పోషించనుంది. చదవండి: క్రికెట్కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్లో నలిగిన ఆటగాళ్లు విశాఖ నగరానికి రక్షణ రంగానికి ఎంతో అనుబంధం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి విశాఖ నగరంపై శత్రుదేశాల దృష్టితో పాటు ఈ నగరం కేంద్రంగా శత్రు దేశాలు ఎదుర్కోడానికి భారత్ రక్షణ దళం కూడా ప్రత్యేక స్థావరాలు కొనసాగించింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో కైలాసగిరి.. యారాడ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేక సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అరకులో పద్మాపురం గార్డెన్స్ నుంచి సైనికులకు కూరగాయలు ప్రత్యేకంగా సరఫరా చేసేవాళ్లు. 1971లో పాకిస్తాన్పై భారత్ విజయం సాధించడంలో విశాఖ కేంద్రంగా కొనసాగుతున్న తూర్పు నౌకాదళం ప్రధాన భూమిక పోషించింది. దీనికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దశలో విశాఖ నగర ఖ్యాతి ప్రాధాన్యతను గుర్తిస్తూ నావికాదళం ఇటీవల విశాఖపట్నం అని పేరు పెట్టింది. 2011 జనవరి 18 నుంచి రూపకల్పన జరిగిన ఈ యుద్ధనౌక డైరెక్టర్ ఆఫ్ నావెల్ డిజైన్. ఇండియన్ నేవీ సంయుక్తంగా యుద్ధనౌక రూపకల్పన డిజైన్ చేసింది గంటకు 30 నాటికా మైళ్ల వేగంతో ప్రయాణం చేసే యుద్ధనౌక ఏకదాటిగా నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసే సామర్థ్యం పూర్తిగా 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ విశాఖపట్నం మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక సముద్రంలో ట్రయిల్ రన్ పూర్తిచేసుకుని రక్షణ రంగంలో సేవలకు సిద్ధమైంది. ముంబైలో రూపొందిన ఈ యుద్ధనౌకను గత నెల 31వ తేదీన తూర్పు నౌకాదళ అధికారులకు అప్పగించారు. ఈ దశలో ఈ యుద్ధ నౌక విశాఖ కేంద్రం సేవలు అందించనుంది. సీఎం వైఎస్ జగన్ విశాఖ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన దశలో ఆ నగరం పేరిట యుద్ధనౌక రూపొందడం గొప్ప విషయంగా ప్రజలు భావిస్తున్నారు. దీన్ని లాంఛనంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు ప్రారంభించడంపై విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
చైనాను దీటుగా ఎదుర్కొంటాం
టోక్యో: అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్లో తొలిసారిగా ఆసియా పర్యటనకు వచ్చారు. జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిట్సు మోతెగి, రక్షణ మంత్రి నోబూ కిషిలతో మంగళవారం ముఖాముఖి చర్చలు జరిపారు. ఆసియాలో చైనా బలప్రయోగం, దూకుడు చర్యల్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆ సమావేశంలో ఇరు దేశాల మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛయుత వాతావరణం నెలకొనడానికి అమెరికా తానే ముందుండి ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. చైనా, దాని మిత్రపక్షమైన ఉత్తర కొరియాల నుంచి ఎవరైనా సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటే ఆ దేశాలకు బైడెన్ ప్రభుత్వం అండగా ఉంటుందని విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ చెప్పారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాలపై తీవ్రంగా విమర్శించిన మంత్రులిద్దరూ బుధవారం దక్షిణ కొరియా నేతలతో చర్చలు జరపనున్నారు. ఇరుదేశాలకు చెందిన మంత్రులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం ఏకపక్షంగా తీసుకుంటున్న చర్యల్ని తీవ్రంగా ఖండించారు. -
అమెరికాతో రక్షణ సహకారం బలోపేతం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో పర్యటిస్తున్న అమెరికా రక్షణ మంత్రి డాక్టర్ మార్క్ ఎస్పర్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం సమావేశమయ్యారు. పలు రంగాల్లో రక్షణ సహకారం మరింత పెరిగేలా తమ చర్చలు ఫలవంతంగా సాగాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇరు దేశాల రక్షణ సంబంధాలు, పరస్పర సహకారం మరింత బలోపేతమయ్యాలా సంప్రదింపులు జరిపామని స్పష్టం చేశారు. కాగా, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి డాక్టర్ మార్క్ ఎస్పర్లు సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. వీరు ఇరువురూ మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో సమావేశం కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తోనూ సమావేశమవుతారు. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో అమెరికా మంత్రుల భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి : చైనా సరిహద్దులో ఆయుధ పూజ -
మిలటరీ రవాణాకు 44 వంతెలు ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతాలలో సైనిక రవాణాను సులభతరం చేసేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) ఆధ్వర్యంలో నిర్మించిన 44 వంతెనలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని వంతెలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వైరస్ కారణంగా దేశం ఇప్పటికే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో చైనా, పాకిస్తాన్లు భారత్ సరిహద్దులలో వివాదాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పశ్చిమ, ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లోని భారత సాయుధ దళాలకు సైనిక, పౌర రవాణాకు ఈ నిర్మాణాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఉద్రిక్తంగానే సరిహద్దు.. రాజ్నాథ్ ప్రకటన) రవాణా అందుబాటులో లేని ఆ ప్రాంతాల్లో ఏడాది పొడవునా సాయుధ దళాల సిబ్బందిని అధిక సంఖ్యలో మోహరిస్తున్నందున ఈ వంతెనల నిర్మాణాలు వారికి ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. దేశ రక్షణకు పాటు పడే సాయుధ దళాలకు, సైన్యానికి మౌలిక సదుపాయలను అందించేందుకు ప్రాజెక్టులను నిర్మించడంలో మోదీ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటూనే దేశ సరిహద్దుల వద్ద పరిస్థితులను ప్రధాని మోదీ మెరుగుపరుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: దేశ రక్షణలోకి 'స్మార్ట్'గా...) -
ఫైటర్ మినిస్టర్
మహిళల రక్షణకు దేశాలు. దేశాల రక్షణకు మహిళలు.ప్రపంచం సురక్షితం అవుతోంది. రఫేల్ స్ట్రాంగ్ వెపన్. రఫేల్ని మించిన శక్తి.. ఉమన్. డిఫెన్స్లోకి వెపన్. డిఫెన్స్ మినిస్టర్గా ఉమన్. మహిళకు సాధికారమే..దేశానికి సార్వభౌమాధికారం. ఏ తల్లయినా బిడ్డని గాల్లోకి ఎగరేసి పట్టుకోవడం చూశామా? సాధారణంగా అలా తండ్రి చేస్తాడు! ఆడిస్తాడే కానీ.. ఫ్యాన్ తగులుతుందా, తల వెళ్లి పైకప్పుకు తాకుతుందా అని చూసుకోడు. మహిళల చేతుల్లో దేశాలు ఎందుకని అంత సురక్షితంగా ఉంటాయీ అంటే.. ఇదిగో.. వాళ్ల లాలన, పాలన పురుషులు పిల్లల్ని కాపుకాసే తీరుకు భిన్నంగా.. భద్రతతో కూడి ఉంటాయి. ఆ మహిళలు ప్రధానులే అయినా, రక్షణమంత్రులే అయినా. అందుకే కావచ్చు, దేశ చరిత్రలోనే తొలి పూర్తిస్థాయి మహిళా రక్షణ మంత్రిగా మూడేళ్ల క్రితం నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినప్పుడు నెలకొన్న ఉత్తేజమే గురువారం హర్యానాలోని అంబాలాలో భారత వైమానిక దళంలోకి ఫ్రాన్స్ నుంచి తెప్పించిన రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశ పెడుతున్నప్పుడు ఆ దేశ మహిళా రక్షణ శాఖ మంత్రి ఫ్లారెన్స్ పార్లీ కూడా ఉండటం పునరుత్తేజం అయింది. నిర్మలా సీతారామన్ నేటికీ రక్షణ మంత్రిగా ఉండి ఉంటే.. రెండు దేశాల మహిళా రక్షణ శాఖల మంత్రుల సమక్షంలో రఫేల్ను లాంఛనంగా ఎక్కుపెట్టడం అన్నది స్త్రీ శక్తికి సంకేతంగా నిలిచిన ఒక అపూర్వ సందర్భం కూడా అయి ఉండేది. సీతారామన్ 2017 సెప్టెంబరులో రక్షణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త మంత్రివర్గంలో ఆర్థికశాఖ మంత్రి అయ్యారు. ఫ్లారెన్స్ పార్లీ 2017 జూన్ నుంచీ ఫ్రాన్స్ రక్షణశాఖ మంత్రిగా ఉన్నారు. ఫ్రాన్స్తోపాటు ప్రస్తుతం 21 దేశాలకు మహిళలు రక్షణ మంత్రులుగా ఉన్నారు! పూర్వపు మంత్రులను కూడా తీసుకుంటే ఈ జాబితా వందకు పైగానే ఉంటుంది. ప్రత్యేకంగా రక్షణ శాఖను చేపట్టిన మహిళలతో పాటు, రక్షణ శాఖను కూడా తామే నిర్వహిస్తున్న ప్రధానులూ ఇందులో ఉన్నారు. భారతదేశ తొలి మహిళా రక్షణ శాఖ మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీనే అయినప్పటికీ ప్రధానిమంత్రిగా ఉంటూ ఆమె ఆ శాఖను చేపట్టారు తప్ప, ప్రత్యేకంగా కాదు. తొలిసారి 1975 నవంబర్ 30 నుంచి 1975 డిసెంబర్ 20 వరకు ఇరవై ఒక్క రోజులు, రెండోసారి 1980 జనవరి 14 నుంచి, 1982 జనవరి 15 వరకు రెండేళ్లు ఆమె రక్షణశాఖ బాధ్యతలను నిర్వహించారు. రక్షణ శాఖకు పూర్తిస్థాయి తొలి మహిళా మంత్రి మాత్రం నిర్మలా సీతారామనే. రఫేల్ యుద్ధ విమానాలు సరిగ్గా సమయానికి (చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య) మన సైనిక బలగాల్లో చేరాయి. ఈ ప్రత్యేక తరుణంలో ఫ్లారెన్స్ పార్లీ మాట్లాడిన రెండు మాటలు కూడా ఒక మహిళా మంత్రి మాత్రమే మాట్లాడగలరు అన్నంత స్నేహశీలంగా ఉన్నాయి. ఆమె ప్రసంగం లో ఎక్కడా కూడా రఫేల్ని వాళ్లు అమ్మినట్లు, మనం కొనినట్లు లేదు. ‘‘ఇది రెండు దేశాల విజయం’’ అన్నారు. 57 ఏళ్ల ఫ్లారెన్స్ పార్లే రక్షణ శాఖ మంత్రి అయే ముందు వరకు ఫ్రెంచ్ నేషనల్ రైల్వే కంపెనీ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అంతకన్నా పూర్వం ‘ఎయిర్ ఫ్రాన్స్’కు డిప్యూటీ జనరల్ డైరెక్టర్. రాజకీయాల్లోకి రాక ముందు పౌర సేవల అధికారిగా, వ్యాపార నిపుణురాలిగా సేవలు అందించారు. పారిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ స్టడీస్ అండ్ ది నేషనల్ స్కూల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ చేశారు ఫ్లారెన్స్. 21 దేశాలకు ‘రక్షణ’ మహిళలు బంగ్లాదేశ్ (షేక్ హసీనా), దక్షిణాఫ్రికా (నొసివివె మపిసా న్క్వాకులా), నికారగువా (మార్తా ఎలినీ రూయిజ్ సెవిల్లా), కెన్యా (రేచల్ ఓమామో), ఉత్తర మాసిడోనియా (రాడ్మిల్లా సేకెరిన్స్కా), అల్బేనియా (ఆల్టా క్షాకా), సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (మ్యారీ నోల్ కొయారా), నెదర్లాండ్స్ (ఆంక్ బిజ్లెవెల్డ్), స్పెయిన్ (మార్గరీటా నోబెల్స్), జింబాబ్వే (ఓప్పా ముచింగురి), మాల్దీవులు (మారియా అహమ్మద్ దీదీ), స్విట్జర్లాండ్ (వయోలా ఆమ్హెర్డ్), గాబన్ (రోస్ క్రిస్టీన్ రపోండా), సాలమన్ దీవులు (లనెల్ తనంగడ), ఆస్ట్రేలియా (లిండా రేనాల్డ్స్), డెన్మార్క్ (ట్రైన్ బ్రామ్సెన్), జర్మనీ (అన్నెగ్రెట్ క్రాంప్ క్యారెన్బేయర్), ఆస్ట్రియా (క్లాడలియా టేనర్), లెబనాన్ (జైనా అకార్), దక్షిణ సూడాన్ (ఏంజెలీనా టెనీ), ఫ్రాన్స్ (ఫ్లారెన్స్ పార్లీ). -
త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్)తో పాటు త్రివిధ దళాల అధిపతులతో శుక్రవారం సమావేశమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరైన ఈ భేటీలో నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి పరిస్థితిని సమీక్షించారు. తూర్పు లడఖ్లో సుదీర్ఘంగా సాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వి మధ్య గురువారం మాస్కోలో కీలక భేటీ అనంతరం రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో సరిహద్దు వెంబడి పరిస్థితితో పాటు చైనా విదేశాంగ మంత్రితో విదేశాంగ మంత్రి జై శంకర్ చేపట్టిన చర్చల సారాంశాన్ని సమీక్షించారు. భారత్-చైనా సైనిక కమాండర్ల స్ధాయి చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు ఐదు సూత్రాల ప్రణాళికను అనుసరించడంపై గురువారం ఇరు దేశాలు అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఒప్పందాలు, ప్రొటోకాల్స్ అన్నిటికీ కట్టుబడాలని, ఉద్రిక్తతలు పెంచే చర్యలకు దూరంగా ఉంటూ శాంతి సామరస్యం కొనసాగేలా చూడాలని పంచసూత్ర ప్రణాళికలో నిర్ణయించారు. మరోవైపు తూర్పు లడఖ్లో డ్రాగన్ సేనలు భారీగా మోహరించడంతో భారత దళాలూ అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలను దీటుగా తిప్పికొట్టేందుకు సన్నద్ధమయ్యాయి. ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నా ఇరు దేశాల మధ్య సైనిక కమాండర్ల స్ధాయి చర్చలు చుషుల్లో శుక్రవారం కొనసాగాయి. చదవండి : భారత్, చైనా మధ్య ‘యుద్ధాటకం’ -
దురాక్రమణ దుస్సాహసం
మాస్కో: పరస్పర విశ్వాసపూరిత వాతావరణం, దురాక్రమణ రహిత విధానం, అంతర్జాతీయ నిబంధనల అమలు, శాంతియుతంగా విభేదాల పరిష్కారం.. తదితర విధానాలను అవలంబించడం ద్వారానే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధ్యమవుతాయని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెన్ఘీ సమక్షంలోనే రాజ్నాథ్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తూర్పు లద్దాఖ్లోని భారత్ సరిహద్దుల్లో తరచుగా దురాక్రమణ దుస్సాహసానికి పాల్పడుతున్న చైనాకు పరోక్ష సందేశంగా దీనిని భావిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం జరిగిన ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్నాథ్ పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన దురాక్రమణ విధాన దుష్ఫలితాలను ఈ సందర్భంగా రాజ్నాథ్ ఎస్సీఓ సభ్య దేశాలకు గుర్తు చేశారు. ఎస్సీఓలో భారత్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో సుమారు 40% ఉంటుంది. సుమారు గత నాలుగు నెలలుగా తూర్పు లద్దాఖ్లో దురాక్రమణలకు ప్రయత్నిస్తూ చైనా భారత్ను కవ్విస్తున్న విషయం తెలిసిందే. ఐదు రోజుల క్రితం పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా విఫల యత్నం చేసింది. ‘రెండో ప్రపంచ యుద్ధం ముగిసి, ఐక్యరాజ్య సమితి ఏర్పడి ఈ సంవత్సరంతో 75 ఏళ్లు అవుతుంది. శాంతియుత ప్రపంచం లక్ష్యంగా ఐరాస ఏర్పడింది. ఏకపక్ష దురాక్రమణలకు వ్యతిరేకంగా, దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించాలని స్పష్టం చేస్తూ ఐరాస రూపుదిద్దుకుంది’అని రాజ్నాథ్ ఎస్సీఓ సమావేశంలో పేర్కొన్నారు. అన్ని రకాలైన ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద సహాయక చర్యలను భారత్ విస్పష్టంగా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా సైబర్ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఎస్సీఓ ‘రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ (ర్యాట్స్)’చేపట్టిన చర్యలను భారత్ ప్రశంసిస్తోందన్నారు. అతివాద, ఉగ్రవాద ప్రచారాన్ని తిప్పికొట్టే దిశగా ఎస్సీఓ తీసుకున్న నిర్ణయాలను భారత్ స్వాగతిస్తోందన్నారు. అంతర్జాతీయంగా స్వేచ్ఛాయుత, పారదర్శక, సమ్మిళిత రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా రాజ్నాథ్ స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఆ ప్రాంతంలోని అన్ని దేశాలతో భారత్కు సత్సంబంధాలున్నాయన్నారు. శాంతియుతంగా విభేదాలను పరిష్కరించుకోవాలని ఆయా దేశాలను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ‘పీస్ మిషన్’పేరుతో ఉగ్రవాద వ్యతిరేక వార్షిక సదస్సును చేపట్టడంపై రష్యాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ విభేదాలను విస్మరించి ఒక్కటి కావాలని రాజ్నాథ్ పిలుపునిచ్చారు. అఫ్గానిస్తాన్ పరిస్థితిపై ఆందోళన అఫ్గానిస్తాన్లో అంతర్గత భద్రత పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని రాజ్నాథ్ పేర్కొన్నారు. ‘అఫ్గాన్ నియంత్రణలో, అఫ్గాన్ నేతృత్వంలో సాగే సమ్మిళిత శాంతి ప్రక్రియకు భారత్ సహకారం అందించడం కొనసాగిస్తుంది. అఫ్గానిస్తాన్ ప్రజలు, ఆ దేశ ప్రభుత్వం ఈ దిశగా చేస్తున్న కృషికి మద్దతునిస్తుంది’అని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరిలో అఫ్గాన్ తాలిబన్లతో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందం అనంతరం అఫ్గానిస్తాన్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. భారత్, చైనా రక్షణ మంత్రుల భేటీ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ముందడుగు మాస్కో: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో మాస్కోలో భారత, చైనా రక్షణ మంత్రుల మధ్య కీలక భేటీ జరిగింది. మాస్కోలోని ప్రముఖ హోటల్లో శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్, చైనా రక్షణ మంత్రి వీ ఫెన్ఘీ సమావేశమయ్యారు. చర్చల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలో రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, రష్యాలో భారత రాయబారి వెంకటేశ్ వర్మ కూడా ఉన్నారు. ఈ సమావేశాన్ని సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించే దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా భావిస్తున్నారు. తూర్పు లద్దాఖ్లోని సరిహద్దుల్లో ఈ సంవత్సరం మేలో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు ప్రారంభమైన తరువాత ఇరు దేశాల మధ్య కీలక మంత్రిత్వ స్థాయి ముఖాముఖి చర్చలు జరగడం ఇదే ప్రథమం. గతంలో విదేశాంగ మంత్రి జై శంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఫోన్లో చర్చించారు. కానీ, వారిద్దరి మధ్య ముఖాముఖీ భేటీ జరగలేదు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్నాథ్, వీ ఫెన్ఘీ రష్యాకు వెళ్లిన విషయం తెలిసిందే. చైనా అభ్యర్థన మేరకే రెండు దేశాల రక్షణ మంత్రుల సమావేశం జరిగిందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
రక్షణ దిగుమతుల నిషేధం : చారిత్రక ప్రకటన ఇదేనా!
సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం విరుచుకుపడ్డారు. రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం గురించి రాజ్నాథ్ ఆడంబర వ్యాఖ్యలు చేసి ఆపై నీరుగార్చే ప్రకటన చేశారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఉదయం మెరుపులు ఉంటాయని హామీ ఇచ్చిన రక్షణ మంత్రి ఆపై నిట్టూర్పుతో ముగించారని వరుస ట్వీట్లలో చిదంబరం పేర్కొన్నారు. రక్షణ పరికరాలను కేవలం రక్షణ మంత్రిత్వ శాఖే దిగుమతి చేసుకుంటోందని దిగుమతి ఆంక్షలు ఏమైనా కేవలం ఆ ఒక్క శాఖకే వాటి ప్రభావం పరిమితమని చిదంబరం వ్యాఖ్యానించారు. దిగుమతి ఆంక్షలనేది పెద్ద మాటని అన్నారు. చదవండి : ‘అలా చేస్తే.. చైనా ఆక్రమణలు తొలగిస్తారా? తాము ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న పరికరాలను ఇక్కడే తయారుచేసేందుకు ప్రయత్నించి రెండు నుంచి నాలుగేళ్లలో దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని రక్షణ మంత్రి చెప్పుకొచ్చారని అన్నారు. రాజ్నాథ్ సింగ్ ఆదివారం వెల్లడించిన చారిత్రక ప్రకటనలో పసఏమీ లేదని, ఇది కేవలం మంత్రి తన కార్యదర్శులకు జారీ చేసే శాఖాపరమైన ఉత్తర్వు మాత్రమేనని చిదంబరం ఎద్దేవా చేశారు. కాగా, 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ట్విటర్ ద్వారా తెలిపారు. 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేందుకే రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఆయుధాలతో పాటు ఇతర రక్షణ వస్తువులు ఇక మీదట దేశీయంగానే తయారవనున్నాయి. ఇది భారత రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజనాథ్ తెలిపారు. -
రాజ్నాథ్ సింగ్ లద్దాఖ్ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదం ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్లోని లేహ్ ప్రాంతాన్ని పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నారావనే పాల్గొంటారు. పర్యటనలో భాగంగా మంత్రి సీనియర్ సైనిక అధికారులతో భేటీ కానున్నారు. అదే విధంగా వివాదస్పద ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో రాజ్నాథ్సింగ్ తెలుసుకోనున్నారు. ఇక భారత్- చైనా మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి భద్రతాపరమైన పరిస్థితులపై ఆయన ఉన్నత స్థాయిలో సమీక్షించడం కోసం తూర్పు లద్దాఖ్ సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. (మరిన్ని భేటీలు అవసరం) చైనా తన ఆర్మీకి చెందిన రెండు విభాగాలను వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించినట్లు భారత ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం అందించిన నేపథ్యంలో ఈ పర్యటన ఖరారు కావటంపై ఆసక్తి నెలకొంది. ఇక సరిహద్దు వివాదం పరిష్కారం దిశగా భారత్, చైనాల మధ్య మంగళవారం జరిగిన సైనికాధికారుల మూడో విడత సమావేశం అసంపూర్తిగా ముగిసిందని, వివాదం సమసిపోయేందుకు మరిన్ని భేటీలు అవసరమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. (‘భారత్ చర్యలను చైనా ఊహించలేదు’) -
'వారి త్యాగం మనోవేదనకు గురి చేసింది'
ఢిల్లీ : లడక్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్- చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలో 20 మంది సైనికుల మృతి చెందిన ఘటనపై దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ' వారి ప్రాణత్యాగం నన్ను మనోవేదనకు గురి చేసింది. సైనికుల త్యాగాలను, ధైర్యాన్ని దేశం ఎన్నడూ మరిచిపోదు. గాల్వన్ దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు ఇదే నా ప్రగాడ సానుభూతి . క్లిష్ట సమయంలో దేశం అంతా కలిసికట్టుగా ఉంది. భారతీయ బ్రేవ్హార్ట్స్ పట్ల గర్వంగా ఉంది. గాల్వన్లో సైనికులు చనిపోవడం బాధాకరం. సరిహద్దు విధుల్లో మన సైనికులు అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించారు. అత్యున్నత స్థాయిలో సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారంటూ' ట్వీట్ చేశారు.(సరిహద్దు ఘర్షణ : రాజ్నాథ్ మరోసారి కీలక భేటీ) The loss of soldiers in Galwan is deeply disturbing and painful. Our soldiers displayed exemplary courage and valour in the line of duty and sacrificed their lives in the highest traditions of the Indian Army. — Rajnath Singh (@rajnathsingh) June 17, 2020 మంగళవారం గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్- చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ఇప్పటివరకు కల్నల్ సహా 20 మంది భారత సైనికులు మరణించగా, తాజాగా మరో నలుగురి జవాన్ల పరిస్థితి విషమంగా మారడంతో భారత్- చైనా సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా దేశ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా రాజ్నాథ్ మరోసారి విదేశాంగ మంత్రి జై శంకర్, త్రివిద దళాల అధిపతులతో పాటు హోం మంత్రితో సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దులో జరిగిన ఘర్షణలో మృతుల వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గాల్వన్ లోయ ప్రాంతంలో ఇండియా-చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణపై కీలక సమావేశం జరగనుంది. -
‘ఏ పద్ధతిలోనైనా సరే.. పాక్ ఎన్నటికీ గెలవదు’
సాక్షి, ముంబై : భారత్తో ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేమని భావించిన పాకిస్తాన్, ఉగ్రవాదుల ద్వారా పరోక్ష యుద్ధం చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. శనివారం పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన సైనికాధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పాకిస్తాన్ ఉగ్రవాదం ద్వారా భారత్పై పరోక్ష యుద్దం చేస్తోంది. కానీ ఏ పద్ధతిలోనైనా సరే. పొరుగు దేశం ఎన్నటికీ మనపై గెలవజాలదని వెల్లడించారు. -
రాజ తేజసం
బెంగళూరు: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రయాణించారు. ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపి ఎంతో థ్రిల్కి లోనయ్యారు. తేజస్లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రి రాజ్నా›థే. బెంగళూరులోని హాల్ ఎయిర్పోర్టు నుంచి గురువారం దాదాపుగా 30 నిమిషాల సేపు తేజస్ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టిన ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తేజస్లో ప్రయాణం చాలా హాయిగా, సౌకర్యంగా ఉంది. ఎంతో థ్రిల్ పొందాను. నా జీవితంలో ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుంది అని రాజ్నాథ్ చెప్పారు. రాజ్నాథ్ వెంట ఎయిర్ వైస్ మార్షల్ ఎన్ తివారీ ఉన్నారు. తేజస్లో పైలట్ వెనక సీట్లో కూర్చొని రాజ్నాథ్ ప్రయాణించారు. 68 ఏళ్ల వయసున్న రాజ్నాథ్ స్వదేశీ యుద్ధ విమానం కావడం వల్లే తాను ఇందులో ప్రయాణించే ధైర్యం చేశానని చెప్పారు పైలట్ అవతారం అరగంటసేపు యుద్ధ విమాన ప్రయాణంలో ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపారు. పైలట్ ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ విమానాన్ని రాజ్నాథ్ నియంత్రించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది. రాజ్నాథ్ విమానాన్ని నడిపిన విషయాన్ని డీఆర్డీఓ చీఫ్ డా. జీ. సతీష్ రెడ్డి వెల్లడించారు. దీనికి రాజ్నాథ్ స్పందిస్తూ తాను చేసింది ఏమీ లేదని పైలెట్ తివారీ చెప్పింది చెప్పినట్టుగా చేశానని నవ్వుతూ వెల్లడించారు. తేజస్ వైపు ప్రపంచ దేశాల చూపు.. యుద్ధ విమానంలో ప్రయాణించిన తర్వాత విలేకరుల సమావేశంలో రాజ్నాథ్ మాట్లాడారు. హాల్, డీఆర్డీఓతో పాటుగా ఈ యుద్ధ విమానం తయారీ కోసం పని చేసిన ఇతర సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. ‘యుద్ధ విమానాల తయారీ విషయంలో మనం ఎంతో అభివృద్ధి చెందాం. మనమూ యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. ఆగ్నేయాసియా దేశాలు ఎన్నో తేజస్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి’అని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రక్షణ బాధ్యతల్లో రాజ్నాథ్
న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా, నూతన నేవీ చీఫ్ కరంబీర్ సింగ్లతో రైసినా హిల్స్లోని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, త్రివిధ దళాల పనితీరుపై వేర్వేరు నివేదికలు సిద్ధం చేయాలని వారికి సూచించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, రక్షణ కార్యదర్శి సంజయ్ మిత్రా, సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్రివిధ దళాల్లో సుదీర్ఘకాలంగా సుప్తావస్థలో ఉన్న ఆధునీకరణను వేగవంతం చేయడంతో పాటు వారి పోరాట సంసిద్ధతకు భరోసా ఇవ్వడం, అలాగే చైనాతో సరిహద్దు వద్ద శాంతి నెలకొల్పటం, చైనా నుంచి వచ్చే ఎలాంటి వ్యతిరేకతనైనా ఎదుర్కోడానికి అవసరమైన సైనిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటివి రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ముందున్న అత్యంత కీలక సవాళ్లు. -
రక్షణమంత్రిగా రాజ్నాధ్సింగ్ బాధ్యతలు
-
జవాన్ల తల్లులకు నిర్మలా సీతారామన్ పాదాభివందనం
-
వైరల్: అమర జవాన్ల తల్లులకు పాదాభివందనం
డెహ్రాడూన్ : పుల్వామా ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్ల తల్లులకు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ పాదాభివందనం చేశారు. ఉత్తరాఖండ్, డెహ్రాడూన్లో సోమవారం జరిగిన ‘శౌర్య సమ్మాన్ సమరోహ్’ కార్యక్రమంలో రక్షణ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర జవాన్ల తల్లులను, సతీమణులను ఆమె ఘనంగా సన్మానించారు. వారిని శాలువతో సత్కరించారు. అనంతరం జవాన్ల తల్లులకు పాదాభివందనం చేసి వారిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. పాదాలకు నమస్కరించేందుకు మంత్రి కిందకు వంగుతుండడంతో అవాక్కైన కొందరు తల్లులు వారించినా నిర్మలా సీతారామన్ పట్టించుకోలేదు. అమరవీరుల తల్లులకు మంత్రి ఇస్తున్న గౌరవాన్ని చూసిన అధికారులు, కార్యక్రమానికి హాజరైన వారు కరతాళ ధ్వనులతో అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్ అంశంపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడంపై మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ.500 కోట్లరూపాయలనే మంజూరు చేసిందని, కానీ నరేంద్రమోదీ ప్రభుత్వం గత మూడేళ్లలో రూ.35వేల కోట్లు ఆర్మీ మాజీ ఉద్యోగులకు అందజేసిందన్నారు. అమరుల స్మారక స్థూపంపై కూడా విమర్శలు చేయడం తగదని ప్రతిపక్షాలకు సూచించారు. గత 60 ఏళ్లుగా స్మారకస్థూపాన్ని నిర్మించలేకపోయారని, నాలుగు పెద్ద యుద్దాలు జరిగినా ఒక్క స్మారక స్థూపాన్ని నిర్మించలేదని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతిఒక్కరికి ఈ స్థూపం అంకితమన్నారు. -
చీకటిగా ఉన్నందుకే.. ఈయనను పెట్టుకుని మాతో యుద్ధమా?!!
బాలాకోట్లోని ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడుల నేపథ్యంలో ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం అలుముకుంది. మంగళవారం భారత్ జరిపిన దాడులను ఎదుర్కోలేక పాక్ యుద్ధ విమానాలు తోక ముడిచిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు 12 మిరాజ్- 2000 విమానాలు రంగంలోకి దిగి.. దాయాది దేశానికి హెచ్చరికలు జారీ చేశాయి. అయితే ఈ మెరుపు దాడుల అనంతరం విదేశాంగ మంత్రి ఖురేషీతో కలిసి.. పాక్ రక్షణ శాఖ మంత్రి పర్వేజ్ ఖటక్ పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో పాక్ వాయుదళాన్ని వెనకేసుకొచ్చిన ఆయనను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటువంటి రక్షణ మంత్రిని పెట్టుకుని పాక్ భారత్పై యుద్ధానికి సిద్ధమవుతోందా అంటూ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. చీకటిగా ఉంది అందుకే! ‘పాక్ వాయుదళం ఎల్లప్పుడు సిద్ధంగానే ఉంటుంది. అయితే మెరుపు దాడులు జరిగిన సమయంలో చీకటిగా ఉంది. అందుకే ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. కేవలం ఈ కారణంగానే వాళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం వారికి స్పష్టమైన ఆదేశాలిచ్చాం’ అని సర్జికల్ స్ట్రైక్స్ గురించి పర్వేజ్ మాట్లాడినట్లుగా ఉన్న వీడియోను... ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు... ‘ మెరుపు దాడులపై పాక్ రక్షణ మంత్రి స్పందన చూడండి. పాక్ వైమానిక దళం సిద్ధంగానే ఉందట. కానీ చీకటి ఉన్నందువల్లే ఇలా జరిగిందట. ఇలాంటి మంత్రిని పెట్టుకుని వాళ్లు భారత్పై యుద్ధానికి సిద్ధమవుతున్నారు అని ఓ నెటిజన్ వ్యంగమాడగా... ‘ భారత వైమానిక దళం టామోటాలు జారవిడుస్తోందని పాపం పాక్ వైమానిక దళం భావించినట్లుంది. లేదంటేనా అమ్మతోడు...’ అంటూ మరో వ్యక్తి హాస్యోక్తులు విసిరాడు. Pak Defence Min response : " Our Air Force were ready but it was DARK". Hahahahhahahahahhaha seriously ? This is defence minister ? And they want to attack India. #IndiaStrikesBack #PulwanaRevenge — Abhijeet Srivastava (@Abhijeet_92) February 26, 2019 #JustForLaughs 😄 Tauba Tauba these tomatoes! pic.twitter.com/ukkN1ymlXh — Rajeev Chandrasekhar 🇮🇳 (@rajeev_mp) February 26, 2019 @AniqaNisar According to Pak Defence Minister, Pak Air Force was ready to retaliate, but they failed to do so due to darkness! Appreciate the honesty & frankness of the minister which is essential for improving Indo Pak relation! — NARENDRA NARAYAN (@NARENDRANARAYAN) February 26, 2019 -
‘మరో జన్మంటూ ఉంటే అక్కడే పుడతా’
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మంగుళూరులో జన్మించిన ఫెర్నాండెజ్ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి కేబినెట్లో రక్షణ మంత్రిగా పనిచేశారు. ఎన్నో దేశాలు పర్యటించిన ఫెర్నాండెజ్ వియత్నాం దేశం పట్ల అమితమైన అభిమానం చూపేవారు. వారి నిబద్ధతను మెచ్చుకునేవారు. అంతేకాక వియత్నాన్ని సందర్శించిన భారతదేశ తొలి రక్షణశాఖ మంత్రి కూడా ఆయనే. (జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూత) అటల్ బిహారి వాజ్పేయి కేబినెట్లో రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటక ప్లాంటర్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్కి హాజరయ్యారు ఫెర్నాండెజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇలా చెప్పుకోవడానికి నేనేం సిగ్గు పడటం లేదు. మరో జన్మంటూ ఉంటే వియత్నాంలో జన్మించాలని ఉంది. నమ్మిన దాని కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వారు సిద్ధంగా ఉంటార’న్నారు. (‘ఫెర్నాండెజ్ అంటే ఇందిర కూడా భయపడేది’) అంతేకాక తాను వియత్నాంలో పర్యటించినప్పుడు.. అమెరికా, చైనా, ఫ్రాన్స్ దేశాలతో ఉన్న వివాదాల కారణంగా దాదాపు 30 లక్షల మంది వియత్నాం వాసులు చంపబడ్డారని తెలిసినప్పుడు తాను ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చారు. ‘తలసరి ఆదాయంలో వియాత్నం ఇప్పటికి మనకంటే వెనకబడే ఉంది... కానీ ఇన్ని అవరోధాలను ఎదుర్కొని నిలబడగలిగింది’ అని ప్రశంసించారు. రాబోయే 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పుడు వినూత్న ఆలోచనలు చేసే దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క వియాత్నం మాత్రమేనని అప్పట్లో ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. -
‘నిర్మలా సీతారామన్కి ఇదే ఆఖరి రోజు’
డెహ్రడూన్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను చంపేద్దామంటూ వాట్సాప్లో సందేశాలు పంపుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 66, ఐటీ యాక్ట్ కింద వారి మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాల ప్రకారం.. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తరాఖండ్లోని పిథోర్ఘర్ జిల్లాలో మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. రక్షణ మంత్రి పర్యటన నేపథ్యంలో కొందరు ఆమెను అంతమొందించాలంటూ ఓ వాట్సాప్ గ్రూప్లో సందేశాలు పంపుకుంటున్నట్లు ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం తెలిసింది. అప్రమత్తమైన పోలీసులు సదరు వాట్సాప్ గ్రూప్లో వచ్చిన సందేశాలను పరిశీలించారు. ‘వాటిలో నేను సీతారామన్ని కాల్చేస్తాను. రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు’ అంటూ ఓ ఇద్దరు వ్యక్తులు పంపుకున్న సందేశాలు ఉన్నాయి. ఈ మెసేజ్లు ఆధారంగా పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని వారి మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తాగిన మైకంలో వారు ఇలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏదీ ఏమైనప్పటికి దీన్ని మాత్రం చిన్న విషయంగా భావించటం లేదని పోలీసులు తెలిపారు. అందుకే వీరిద్దరికి గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. అంతేకాక సదరు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కోసం కూడా వెదుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వడానికి సిద్ధమే!
సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న సికింద్రాబాద్లోని బైసన్ పోలో మైదానాన్ని తెలంగాణ ప్రభుత్వాన్నికి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. బైసన్ పోలో మైదానంలో సచివాలయం నిర్మించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని అడిగిందని, తమ దగ్గర నుంచి తీసుకున్న భూమికి బదులుగా వేరేచోట భూమి ఇస్తే చాలు అని ఆమె అన్నారు. అయితే బైసన్ పోలో మైదానంపై కొందరు కోర్టుకు వెళ్లారని, కోర్టులో విషయం ఎటూ తేలకముందు తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని, కోర్టు వివాదం సమసిపోయాక స్థలం ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో తమ స్థలాలు ఎక్కడ అడిగినా ఇచ్చేస్తున్నామని తెలిపారు. తమిళనాడులో రక్షణ శాఖ స్థలానికి ఖరీదు కట్టి డబ్బులిస్తామన్నారని, డబ్బుతో తమకు పని కాదని, తీసుకున్న స్థలానికి బదులుగా స్థలమే కావాలని తెలిపారు. కంటోన్మెంట్ రోడ్లపై.. ‘దేశవ్యాప్తంగా 62 కంటోన్మెంట్లలో రహదారుల మూసివేతపై సుదీర్ఘంగా చర్చలు జరిపాం. మాకు అనేక మంది ఎంపీలు ఈ అంశంపై విజ్ఞప్తులు చేశారు. మా పరిశీలనలో మొత్తం మూసేసిన 850 రోడ్లలో 119 రోడ్లను సరైన నిబంధనలు పాటించకుండా మూసేశారని తేలింది. ఎంపీల విజ్ఞప్తుల్లో తప్పు లేదని మాకు అనిపించింది. ఆ రోడ్లను వెంటనే తిరిగి తెరవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. ఇందులో 80 రోడ్లు పూర్తిగా తెరుచుకోగా, మరో 15 పాక్షికంగా తెరుచుకున్నాయి. మిగతా 24 రోడ్లు ఇంకా తెరుచుకోలేదు’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. -
‘పాక్కు దీటుగా బదులిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్థాన్కు ధీటైన బదులిస్తామని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రంజాన్ నేపథ్యంలో సరిహద్దు వ్యవహారంపై ఆమె మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్తో చర్చల అంశంపై ఆమె స్పందించారు. ‘ ఓవైపు సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. మరోపక్క చర్చలంటే కుదిరే పని కాదు. ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి కుదరవు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించి శాంతి వాతావరణం నెలకొంటేనే చర్చలు. అలా కాదని ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ధీటైన జవాబిస్తాం. సరిహద్దులను సురక్షితంగా ఉంచటం మా బాధ్యత. భారత్ కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి కట్టుబడి ఉంది. అంతేగానీ కవ్వింపు చర్యలను ఉపేక్షించబోదు’ అని ఆమె పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో భారత్ -రష్యా సహకారంపై ఆమె స్పందించారు. ‘రక్షణ రంగంలో భారత్ -రష్యా సహకారం, సంబంధాలు చాలా ధృడమైనవి. రాఫెల్ జెట్స్ కొనుగోళ్ళలో ఎటువంటి కుంభకోణం జరగలేదు. ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది. యూపీఏ హయాంలో ఆయుధాల కొరత ఉండేది. 2013-14 లో 87 వేల కోట్లకు గాను 79వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ, ప్రస్తుతం భద్రతా బలగాలకు ఆయుధాల కొరత లేదు. 2017-18లో 86488 కోట్ల కేటాయింపులకు గాను 90460 ఖర్చు చేశాం. అవసరమైన ఆయుధాలు కొనే అధికారాన్ని సులభతరం చేశాం’ అని ఆమె వివరించారు. కంటోన్మెంట్ల రోడ్ల గురించి.. ‘దేశంలోని 62 కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై పలు విజ్ఞప్తులు అందాయి. టీఆర్ఎస్(తెలంగాణ) సహా పలు పార్టీల ప్రతినిధులతో చర్చించాం. మిలటరీ, సివిల్ సొసైటీతో సమావేశాలు నిర్వహించాం. రోడ్ల మూసివేతపై ఎంపీలు చేసిన విజ్ఞప్తిలో అర్ధముంది. ఇప్పటిదాకా 850రోడ్లు మూసివేయబడ్డాయి. 119 రోడ్లు నిబంధనలు పాటించకపోవటంతో మూసేశారు. 80 రోడ్లను మళ్ళీ తెరిపించాం. 15 రోడ్లను పాక్షికంగా తెరిచాం. 24 ఇంకా మూసివేసే ఉన్నాయి ’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. -
500 అమెరికా క్షిపణులతో వచ్చినా...
మాస్కో : అణ్వాయుధ దేశాల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. ఒక దేశానికి మించి మరొక దేశం అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తున్నాయి.అగ్రదేశాల మధ్య ఈ పోటీ మరింత తీవ్రంగా ఉంది. తాజాగా రష్యా సర్మట్ ఖండాంతర క్షిపణిని రెండోసారి పరీక్షించింది. ఈ ప్రయోగం ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని క్షిపణి చేరుకున్నట్లు రష్యా రక్షణ శాఖ మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్క సర్మట్ క్షిపణిని అడ్డుకోవడానికి 500 అమెరికా ఏబీఎస్ క్షిపణులు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఏకకాలంలో 10 టన్నుల పేలోడ్(సాధరణ, అణు పదార్థాలు)ను సర్మట్ మోసుకెళ్లగలదని వివరించారు. ప్రయోగం అనంతరం దాదాపు 20 మాక్ల వేగాన్ని(ధ్వని వేగానికి 20 రెట్లు) ఒక సెకన్ కాలంలో అందుకుంటుందని చెప్పారు. దేశ రక్షణకు 2021 నుంచి సర్మట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. -
వదంతులు నమ్మకండి : పరీకర్
పనాజి : మాజీ రక్షణ శాఖ మంత్రి, గోవా సీఎం మనోహర్ పరీకర్ తన ఆరోగ్యం బాగానే ఉందని.. వదంతులను నమ్మవద్దని గోవా ప్రజలకు విఙ్ఞప్తి చేశారని స్పీకర్ ప్రమోద్ సావంత్ తెలిపారు. చికిత్స కోసం అమెరికా వెళ్లిన.. పరికర్ తనతో ఫోన్లో మాట్లాడారని, రెండవ దశ చికిత్స ప్రారంభమైందని చెప్పారని సావంత్ పేర్కొన్నారు. పాలనా అంశాల గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. పరీకర్ ఆరోగ్యంపై ఆందోళన వద్దని కోరారు. ప్రాంకియాటైటిస్తో బాధ పడుతున్న పరీకర్ మొదట ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. గత నెల 17న బడ్జెట్ సమావేశం ఉన్నందున గోవాకు వెళ్లిన పరీకర్ ఆరోగ్యం మళ్లీ దెబ్బతినడంతో ముంబైకి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో అధునాతన చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లారు. -
చైనా రక్షణమంత్రిగా మిస్సైల్ ఎక్స్పర్ట్!
బీజింగ్: ప్రపంచంలో చైనాను మరింత శక్తిమంతంగా నిలిపేలా.. సమర్థవంతంగా, సేవా దృక్పథంతో పనిచేసేలా కొత్త మంత్రి వర్గాన్ని చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఏర్పాటుచేశారు. నలుగురు ఉప ప్రధానులతో పాటు 26 మంత్రిత్వ శాఖలు, కమిషన్లతో కూడిన కొత్త కేబినెట్కు చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. భారత్ సహా పలు సరిహద్దు దేశాలతో విభేదాల నేపథ్యంలో క్షిపణి రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ వై ఫెంఘేను రక్షణ శాఖ మంత్రిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాలో సైనిక ఆధునికీకరణ, పునర్వ్యవస్థీకరణకు ఆయన కృషి చేశారు. ఇక ఉప ప్రధాని ల్యూ హీ చైనా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత అతి పెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో 30 ఏళ్ల అనంతరం 2016లో వృద్ధి రేటు మందగించింది. చెన్ వెన్కింగ్కు అంతర్గత భద్రత వ్యవహారాలు అప్పగించగా.. సంస్కరణ వాదిగా పేరొందిన యీ గ్యాంగ్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్గా నియమితులయ్యారు. 15 ఏళ్లుగా గవర్నర్గా ఉన్న ఝౌ స్థానంలో గ్యాంగ్కు ఈ అవకాశం దక్కింది. విదేశాంగ మంత్రికి స్టేట్ కౌన్సిలర్ పదవి చైనా అత్యున్నత దౌత్య పదవి అయిన స్టేట్ కౌన్సిలర్గా విదేశాంగ మంత్రి వాంగ్ యిను నియమించారు. భారత్తో సరిహద్దు వివాదంలో చైనా ప్రతినిధిగా చర్చలకు ఆయన నాయకత్వం వహించనున్నారు. చైనాలో విదేశాంగ మంత్రి కన్నా స్టేట్ కౌన్సిలర్ పదవి పెద్ద ర్యాంకు. ఇటీవల కాలంలో చైనాలో ఏకకాలంలో రెండు పదవులను నిర్వహిస్తున్న మొదటి వ్యక్తి వాంగ్ కావడం గమనార్హం. -
రావత్ వ్యాఖ్యలతో నాకేం సంబంధం?
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించాల్సిందిగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను మీడియా కోరగా.. ఆమె తిరస్కరించారు. ప్రస్తుతం ఆమె యూపీలో నిర్వహిస్తున్న ఇన్వెస్టర్ల సమ్మిట్లో పాల్గొంటున్నారు. శుక్రవారం ఉదయం ఆమెను పలకరించిన మీడియా ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై వివరణ కోరింది. ‘ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు. వారు చేసే వ్యాఖ్యలతో నాకేం సంబంధం? నేనెందుకు స్పందించాలి? ఆ అవసరం కూడా నాకు లేదు’ అని ఆమె మీడియాకు బదులిచ్చారు. అస్సాంలోని చాలా జిల్లాల్లో అక్రమ ముస్లిం వలసదారులు వస్తున్నారని, వీరి కారణంగా బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని రాజకీయ పార్టీ ఆలిండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) బలం పుంజుకుంటోందని, బీజేపీ కన్నా వేగంగా ఆ పార్టీ ఎదుగుతోందని బిపిన్ రావత్ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏఐయూడీఎఫ్ అనే పార్టీ ఉంది. దీన్ని పరిశీలిస్తే, బీజేపీ ఇన్నేళ్ళలో ఎదిగినదాని కన్నా ఎక్కువగా ఈ పార్టీ ఎదుగుతోంది. ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలోనే ఈ సమస్యకు పరిష్కారం దాగుంది’’ అని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా... అందులో రాజకీయాలు, మతపరమైన ఉద్దేశాలేవీ లేవని ఇండియన్ ఆర్మీ గురువారం ప్రకటించింది. మరోవైపు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రావత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. -
డోక్లాంలో రక్షణ మంత్రి
సాక్షి, గ్యాంగ్టక్ : డోక్లాం, సిక్కింలో పర్యటిస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ఆదివారం నాథూలా పాస్ను పరిశీలించారు. ఈ సమయంలో సరిహద్దు కంచె దగ్గర పహారా కాస్తున్న చైనా సైనికులు ఆమెను ఫొటోను తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇదే విషయాన్ని ఆమె ట్వీట్ ద్వారా తెలిపారు. సిక్కి, అరుణాచల్ ప్రదేశ్లోని కీలక ప్రాంతాలను ఆమె ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రోడ్డు మార్గం ద్వారా నాథూలా పాస్కు చేరుకున్నారు. అక్కడే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాథూలా పాస్ చేరుకున్న రక్షణమంత్రికి ఈస్ట్రన్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ ఆభయ్ కృష్ఱ గార్డ్ ఆనర్ ద్వారా గౌరవించారు. నాథూలా పాస్ నుంచి డోక్లాం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దును ఆమె ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం సిక్కింలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని పరిశీలించారు. Upon arrival Smt @nsitharaman is accorded with a Guard of Honor at Nathu-la pic.twitter.com/UdVGnAyRh1 — Raksha Mantri (@DefenceMinIndia) 7 October 2017 Smt @nsitharaman interacts with the Vice Chief of Army Staff and other senior army official at the BPM Hut at Nathu-la pic.twitter.com/NKruYI7SbZ — Raksha Mantri (@DefenceMinIndia) 7 October 2017 -
వ్యూహాత్మక ప్రాంతాల్లో రక్షణమంత్రి పర్యటన
శ్రీనగర్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సియాచిన్ బేస్ క్యాంప్ను పర్యటించారు. జమ్మూకశ్మీర్లో రెండోరోజు పర్యటనలో భాగంగా ఆమె దేశ రక్షణపరంగా కీలక వ్యూహాత్మక ప్రాంతాలు అయిన లేహ్, లడఖ్, సియాచిన్ ప్రాంతాలను సందర్శించారు. అలాగే సియాచిన్ బేస్ క్యాంప్లో అమరవీరులకు నిర్మలా సీతారామన్ నివాళులు అర్పించారు. అనంతరం లేహ్లో బ్రిడ్జిను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్...సైనికులకు దసరా శుభాకాంక్షలు తెలిపినట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రక్షణ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ జమ్మూకశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. రక్షణమంత్రితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నారు. -
రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించిన నిర్మల
-
రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించిన నిర్మల
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖా మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు స్వీకరించారు. నిజానికి బుధవారమే ఆమె బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నప్పటికీ ఎందుకనో కార్యక్రమం వాయిదా పడింది. ఇక గురువారం ఉదయం సౌత్ బ్లాక్ లో ఉన్న తన ఛాంబర్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మరో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా హాజరయ్యారు. ఇటీవల కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు రక్షణ శాఖ పగ్గాలను మోదీ అప్పగించిన విషయం తెలిసిందే. స్వతంత్ర్య భారతావనికి ఆమె రెండో మహిళా రక్షణ శాఖా మంత్రి. కాగా, ఇందిరాగాంధీ(ప్రధానిగా ఉన్న సమయంలో తాత్కాలిక బాధ్యతలు) తర్వాత పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టిన తొలి మహిళగా నిర్మలా సీతారామన్ గుర్తింపు పొందారు. నిర్మలా సీతారామన్ బయోడేటా... తమిళనాడులోని ముధురై లో 1959 ఆగష్టు 18న ఆమె జర్మించారు. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూఢిల్లీ లోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్యూ) లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆపై ఇండో-యూరోపియన్ టెక్స్టైల్ ట్రేడ్ పై దృష్టిసారించిన ఆమె ఆ అంశంలోనే పీహెచ్డీ చేశారు. లండన్ లోని అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోషియేషన్ లో ఆర్థిక విభాగంలో సహయకురాలికి ఆమె విధులు నిర్వహించారు. ఆపై ప్రైస్ వాటర్హౌజ్ కు సీనియర్ మేనేజర్ గా పని చేశారు. అదే సమయంలో ఆమె బీబీసీ అంతర్జాతీయ సేవా విభాగంలో పని చేశారు కూడా. తిరిగి ఇండియాకొచ్చాక హైదరబాద్ లోని సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ సర్వీస్ విభాగానికి డిప్యూటీ డైరక్టర్ గా సేవలు అందించారు. అటుపై నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సభ్యురాలిగా(2003-05) ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే మహిళా సాధికారకత పలు ప్రసంగాలు ఆమె వినిపించారు. 2008లో బీజేపీలో చేరిన ఆమె జాతీయ కార్యవర్గ సంఘంలో సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2010 మార్చి లో అధికార ప్రతినిధిగా పార్టీ నియమించటంతో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె చివరకు 2014 మే 26న కొలువుదీరిన కేబినెట్ లో కేంద్ర వాణిజ్య శాఖ(స్వతంత్ర్య హోదా) మంత్రిగా ఆమె బాధ్యతుల స్వీకరించారు. చివరకు ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి విస్తరణలో నిర్మలా సీతారామన్ రక్షణ శాఖ కు ప్రమోట్ అయ్యారు. వ్యక్తిగత జీవితం... జేఎన్యూలో తన సహచర విద్యార్థి అయిన పరకాల ప్రభాకర్ ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సీతారామన్ @nsitharaman పేరిట ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు పోస్టులు అప్ డేట్ చేస్తుంటారు. -
'ఆనందంతో మాటలు రావట్లేదు'
-
రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ రాజీనామా
కాబూల్: అఫ్గానిస్తాన్ రక్షణ మంత్రి అబ్దుల్లా హబీబీ, ఆర్మీ చీఫ్ కదమ్ షా షహీమ్ సోమవారం తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆమోదించినట్లు అధ్యక్ష భవనం ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తర అఫ్గాన్లోని మజర్ ఈ షరీఫ్ నగర సమీపంలో సైనిక స్థావరంపై శుక్రవారం తాలిబాన్లు దాడికి తెగబడి 100 మందికి పైగా సైనికులను పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తులైన అఫ్గాన్ ప్రజలు..రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్, ఇతర అధికారుల రాజీనామాకు పట్టుబట్టారు. దీంతో వారు సోమవారం పదవుల నుంచి వైదొలుగుతూ రాజీనామా చేశారు. అమెరికాలోని సిగార్ వాచ్డాగ్ సంస్థ నివేదిక ప్రకారం ఆఫ్గానిస్తాన్ సైనికుల మరణాలు 35శాతం పెరిగాయి. ఒక్క 2016లోనే సుమారు 6500 మంది సైనికులు, పోలీసులు వేరు వేరు ఘటనలు, దాడుల్లోమరణించారు. -
‘రిపీటయిందో.. ఇక మీ డిఫెన్స్ ధ్వంసమే’
జెరూసలెం: సిరియాకు ఇజ్రాయెల్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఒకసారి చేసిన తప్పును మరోసారి చేసేందుకు ప్రయత్నిస్తే ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి అవిగ్దార్ లైబర్మాన్ నేరుగా హెచ్చరించారు. ఇటీవల సిరియా తమ యుద్ధ విమానాలను కూల్చివేసే ప్రయత్నం చేసిందని, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను తమ యుద్ధ విమానాలపైకి ప్రయోగించిందని ఆయన గుర్రుమన్నారు. ‘మరోసారి సిరియా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టంను మా విమానాలపైకి ప్రయోగిస్తే మేం ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఆ వ్యవస్థను ధ్వంసం చేసి పారేస్తాం’ అని లైబర్మాన్ ఘాటుగా హెచ్చరించారు. -
పరీకర్ విధానాలే కొనసాగుతాయి: జైట్లీ
న్యూఢిల్లీ: రక్షణ మంత్రిగా తాను అదనపు బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆశాఖ మంత్రిగా మనోహర్ పరీకర్ అమలు చేసిన విధానాలనే కొనసాగిస్తానని ఆర్థికమంత్రి జైట్లీ స్పష్టం చేశారు. రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మనోహర్ పరీకర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్తున్న నేపథ్యంలో ఆశాఖ బాధ్యతలను మంగళవారం అరుణ్జైట్లీ చేపట్టారు. గతంలోనూ 2014 మే నుంచి నవంబర్ వరకు జైట్లీ రక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. పరీకర్ తన విధుల్ని ఎక్కడ విడిచి పెట్టారో అక్కడి నుంచి తాను కొనసాగిస్తానన్నారు. -
రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం రక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. నిరాబండరంగా జరిగిన కార్యక్రమంలో రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మనోహర్ పరీకర్ రాజీనామా చేయడంతో రక్షణ మంత్రి పదవి ఖాళీ అయింది. గోవా ముఖ్యమంత్రిని చేపట్టేందుకు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పరీకర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఆమోదించారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2014, మే 26 నుంచి అదే ఏడాది నవంబర్ 9 వరకు రక్షణ మంత్రి బాధ్యతలు చేపట్టారు. -
కొత్త రక్షణ మంత్రి ఎవరో తెలుసా?
రక్షణ శాఖ మంత్రిత్వ పదవికి మనోహర్ పారికర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. రక్షణ శాఖ బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు కూడా మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అరుణ్ జైట్లీయే రక్షణ మంత్రిగా ఉండేవారు. ఆ తర్వాత తనకు పనిభారం ఎక్కువైందని, ఏదో ఒక శాఖ తీసేయాలని జైట్లీ కోరడంతో.. పారికర్ను గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి మరీ తీసుకొచ్చారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఒక్క మనోహర్ పారికర్ను తప్ప వేరెవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టినా వీలుకాని పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ లాంటివి గతంలోనే లక్ష్మీకాంత్ పర్సేకర్ను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ పార్టీ కూడా మనోహర్ పారికర్ సీఎంగా వస్తామంటే బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమని తెలిపింది. దాంతో.. ఏరికోరి రక్షణ శాఖకు తీసుకున్న పారికర్ను మళ్లీ సొంత రాష్ట్రానికి ప్రధాని పంపేశారు. చాలాకాలంగా గోవా ఆహారం తినకపోవడంతో తాను సన్నబడ్డానని ఎన్నికల ప్రచారం సమయంలో పారికర్ వ్యాఖ్యానించారు. దానికి అర్థం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చని కూడా ఆయన మీడియాతో అన్నారు. అప్పుడు చెప్పినట్లే ఇప్పుడు మళ్లీ సొంత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెళ్లిపోతున్నారు. కాగా, పారికర్ను అసెంబ్లీకి పంపేందుకు వీలుగా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా రాజీనామా చేశారు. ఆయన ఎన్నికైన మాపుసా స్థానం నుంచే పారికర్ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. డిసౌజాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఢిల్లీకి పంపుతారని అంటున్నారు. -
రక్షణశాఖ మంత్రిపదవికి పారికర్ రాజీనామా
న్యూఢిల్లీ : కేంద్ర రక్షణశాఖ మంత్రి పదవికి మనోహర్ పారికర్ సోమవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పీఎంవోకు పంపించారు. కాగా గోవా ముఖ్యమంత్రిగా పారికర్ మంగళవారం సాయంత్రం అయిదు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. అయితే ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారన్న ప్రశ్నకు పారికర్ సమాధానం దాటవేశారు. అయితే కేబినెట్ కూర్పు పూర్తయిందని, దీనిపై మీడియాకు తామే సమాచారం ఇస్తామన్నారు. కాగా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తగిన మెజార్టీ సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సహా ఆరుగురు మంత్రులు ఓటమి చవిచూడటంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 13 సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇతరులు 10 సీట్లు గెల్చుకున్నారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా గోవా ఫార్వర్డ్ పార్టీ (ముగ్గురు ఎమ్మెల్యేలు), ఏంజీపీ(ముగ్గురు ఎమ్మెల్యేలు)తో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతు ప్రకటించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలతో సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పారికర్ సీఎంగా రావాలని కోరడంతో బీజేపీ అధిష్టానం సూచన మేరకు పారికర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన గతంలో గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు గత ఎన్నికల్లో పార్టీని గెలిపించిన పారికర్ను 2014 కేంద్ర రక్షణశాఖలోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
రక్షణ మంత్రిగా ఆ రోజు వణికిపోయాను: పారికర్
పనాజీ: ఆయనలో దేశభక్తి మెండు. ముక్కుసూటిగా పనిచేసే తత్వం అని చెప్తారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా అందులో ఓ నిబద్ధత కనబరుస్తారనే పేరు కూడా ఇప్పటికే ఉంది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయవంతంగా పనిచేశారు కూడా.. అలాంటి ఆయనకు దేశానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించినప్పుడు మాత్రం కాస్తంత వణుకుపుట్టిందట.. నేనా.. ఆ బాధ్యతలు నిర్వర్తించగలనా అని అనుమానపడ్డారంట. ఆయన మరెవరో కాదు.. ప్రస్తుతం భారత రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న మనోహర్ పారకర్.. గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు బీజేపీ అధికారంలోకి వచ్చాక రక్షణశాఖ బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో ఆ రోజు తనకు జరిగిన అనుభవాన్ని ఆయన సోమవారం పంచుకున్నారు. విజయ్ సంకల్ప్ ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించినప్పుడు తాను వణికిపోయానని, ఆ విషయం తెలియకుండా దాచేందుకు గంబీరంగా ముఖాన్ని చూపించడానికి ప్రయత్నించానని అన్నారు. ‘నేను ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆ రోజు ఆ నగర అనుభవం ఎదురైంది. మీ అందరి ఆశీస్సులతో రక్షణ మంత్రి అయ్యాను. వాస్తవానికి నాకు అప్పుడు ఏమీ తెలియదు. ఆర్మీలో ఉండే ర్యాంకులపై కూడా నాకు అవగాహన లేదు. బాధ్యతలు తీసుకుంటున్న వణికి పోయాను. కానీ, ముఖాన్ని గంభీరంగా చూపించేందుకు ప్రయత్నించాను. వాస్తవానికి ఆర్మీలో అధికారులకు ఉండే ర్యాంకుల విధానం కూడా నాకు తెలియదు. గోవాకు 1961లో పోర్చుగీసు వారి నుంచి భారత సేన విముక్తి కలిగించింది. అలాగే, 1965, 71లో యుద్ధాలు చూశాం. కార్గిల్ యుద్ధ సమయంలో నేను నినాదాలు ఇచ్చేవాడిని. కానీ, ఇప్పుడు నాముందుకు యుద్ధ క్షేత్రం వచ్చింది. యుద్ధం అంటే ఏమిటో కూడా తెలియదు.. దానికి ఎలా సన్నద్ధమవుతారో కూడా తెలియదు. నేను మాత్రం మన సైన్యానికి ఒకటే చెప్పాను. ఎవరైన దాడికి దిగితే వారిపై ప్రతి దాడి చేసేందుకు మీకు పూర్తి స్వేచ్ఛ ఉందని’ అని పారికర్ అన్నారు. భారత సైన్యం చాలా గొప్పగా శత్రు సేనలను వెంటాడుతోందని చెప్పారు. -
అణ్వస్త్రాలపై రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
భారతదేశం వద్ద అణ్వస్త్రాలు ఉన్నా.. వాటిని ముందుగా తాము ఎవరిపైనా ఉపయోగించబోమంటూ ఇన్నాళ్లూ ఒక స్వీయ నియంత్రణ పాటిస్తున్నాం. కానీ అసలు అలా ఎందుకు చేతులు కట్టుకుని కూర్చోవాలని ప్రశ్నించి.. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సంచలనం రేపారు. ఒకవైపు భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో రక్షణ మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ''మనం చేతులు కట్టుకుని ఎందుకు కూర్చోవాలి? బాధ్యాయుతమైన అణ్వస్త్ర దేశంగా ఉంటామని, దాన్ని బాధ్యతారహితంగా ఉపయోగించబోమని మాత్రమే చెప్పాలన్నది నా ఉద్దేశం. ఇది నా ఆలోచన'' అని పరిక్కర్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ అంశంపై ఇవన్నీ కేవలం తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, ప్రభుత్వ అభిప్రాయం కాదని ఆ తర్వాత ఆయన స్పష్టం చేశారు. రక్షణ శాఖ కూడా ఆ తర్వాత చేసిన ఒక ప్రకటనలో.. పారిక్కర్ చేసినవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రమే తప్ప అధికారికం కాదని తెలిపింది. ముందుగా అణ్వస్త్రాలు ఉపయోగించకూడదన్న విధానానికే భారతదేశం కట్టుబడిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. 1998లో నిర్వహించిన అణు పరీక్షల తర్వాత.. ముందుగా తాము అణ్వస్త్రాలను ఉపయోగించబోమన్నది తన విధానంగా భారతదేశం ప్రకటించింది. తాను చేసిన ఈ వ్యాఖ్యలపై తర్వాత ఎలా ప్రచారం జరుగుతుందో కూడా పరికర్ నవ్వుతూ చెప్పారు. భారతదేశం తన అణు విధానాన్ని మార్చేసుకుందని మీడియాలో వచ్చినా వస్తుందని ఆయన అన్నారు. ఇది ప్రభుత్వ విధానంలో మార్పు కాదని, ఒక వ్యక్తిగా తాను మాత్రమే అలా భావిస్తున్నానని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్కు ముందువరకు పాకిస్థానీ రక్షణ మంత్రి తరచు భారతదేశం మీద అవసరమైతే అణు దాడికి కూడా వెనుకాడేది లేదని బెదిరించేవారని, కానీ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు అలాంటి బెదిరింపు ఒక్కటి కూడా రాలేదని.. దాన్ని బట్టి చూస్తే మనం ఏమైనా చేయగలమని అర్థమవుతోందని కూడా పారికర్ అన్నారు. -
పాకిస్థాన్కు దీటైన సమాధానం: పారికర్
పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నా.. వాళ్లకు భారత సైన్యం దీటైన సమాధానం ఇస్తోందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. పాకిస్థానీ సైన్యం జరిపిన కాల్పుల్లో తాజాగా ఒక జవాను మరణించిన నేపథ్యంలో ఆయనిలా చెప్పారు. గత ఐదారేళ్లుగా వందల సంఖ్యలో కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అయితే.. ఇప్పుడు వాళ్లు ఎన్నిసర్లు వచ్చినా మళ్లీ అన్నిసార్లు మనం గట్టి జవాబు ఇస్తున్నామని ఆయన అన్నారు. కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరీ సెక్టార్లో పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాకు చెందిన సుదీష్ కుమార్ (24) అనే సిపాయి ప్రాణాలు కోల్పోయాడు. దానికి బదులుగా భారత దళాలు కూడా కాల్పులు జరిపాయని మనోహర్ పారికర్ తెలిపారు. సెప్టెంబర్ 29వ తేదీన భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత.. ఇప్పటివరకు 25 సార్లు పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
దాడికి సూత్రధారి ఎవరు?
ఉడీలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతీయుల గుండెలన్నీ ఒక్కసారిగా భగభగ మండిపోయాయి. ప్రతీకార జ్వాలలు రగులుకున్నాయి. పాకిస్థాన్ పీచమణచాల్సిన సమయం ఇదేనని మాజీ సైనికులు కూడా గర్జించారు. కానీ.. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఆశించిన స్పందన రాలేదు. జవాన్ల త్యాగాలు వృథాగా పోనివ్వబోమని మాత్రమే ప్రధానమంత్రి చెప్పారు. అయితే.. అప్పటికే తెరవెనక జరగాల్సింది అంతా జరిగిపోతోంది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ప్రధానమంత్రికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎక్కడా తెరమీద కనిపించలేదు. తెర వెనకనుంచే ఇద్దరూ వ్యూహరచనలో మునిగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పారికర్ - దోవల్.. వీళ్లిద్దరూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నమ్మిన బంట్లు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తాను తలపెట్టిన ఆర్థిక సంస్కరణలను సరిగ్గా అమలుచేయడానికి మన్మోహన్ సింగ్ను ఎలా ఎంచుకుని తీసుకొచ్చారో.. అలాగే నరేంద్రమోదీ ప్రధాని పదవి చేపట్టిన వెంటనే అప్పటివరకు గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ను కూడా రక్షణ మంత్రిగా అలాగే తీసుకొచ్చారు. మరోవైపు అప్పటివరకు యూపీఏ హయాంలో పెద్దగా ప్రాధాన్యం లభించని అజిత్ దోవల్ను కూడా జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. 2014 మే 26న మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, 30వ తేదీన దోవల్ ఎన్ఎస్ఏ పదవిలో నియమితులయ్యారు. అప్పటి నుంచి ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆయన హస్తం ఉండని సందర్భం లేదు. ఎవరీ దోవల్.. ఏం చేశారు అజిత్ దోవల్.. 1968 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. కేరళ కేడర్లో చేరిన ఈయన, 2004-05 సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా వ్యవహరించారు. 1980లలో మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలో దోవల్ ఆ సంస్థలోకి చొరబడి, దాని అగ్రకమాండర్లు ఆరుగురిని మట్టుబెట్టారు. దాంతో ఎంఎన్ఎఫ్ ఉనికి దాదాపు నిర్వీర్యం అయిపోయింది. ఇక పాకిస్థాన్లో గూఢచారిగా ఏడు సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఒక భిక్షగాడి వేషంలో కూడా తిరిగేవారని అంటారు. పాకిస్థాన్లో భారత గూఢచారులు పట్టుబడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. చిత్రహింసలు పెట్టి మరీ చంపేస్తారు. అది తెలిసి కూడా ఏకంగా ఏడేళ్ల పాటు అక్కడే ఉండి వాళ్ల రహస్యాలను తెలుసుకున్న ఘనత దోవల్కు ఉంది. ఇక భారత సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించిన సమయంలో దోవల్ ముందుగానే స్వర్ణదేవాలయంలోకి వెళ్లిపోయారు. అక్కడ ఆయన పాకిస్థానీ గూఢచారిగా నటించి, ఉగ్రవాదుల ప్లాన్లు అన్నీ తెలుసుకుని, వాటిని సైన్యానికి అందించారు. కుక్కే పారే లాంటి కశ్మీరీ ఉగ్రవాదులను ఆయా ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా మార్చేశారు. ఇటీవలే ఎన్ఎస్ఏగా బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది కాలానికే ఇరాక్ నుంచి 45 మంది భారతీయ నర్సులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహీంద రాజపక్స ఓటమి వెనక ఉన్నది కూడా అజిత్ దోవలే! రాజపక్స భారతదేశానికి తలనొప్పిగా మారి, చైనాకు అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దాంతో తర్వాతి ఎన్నికల్లో ఆయన నెగ్గడానికి ఏమాత్రం వీల్లేదని భావించిన దోవల్.. అక్కడకు వెళ్లి ఏం మాయ చేశారో గానీ, మైత్రిపాల సిరిసేన తదుపరి అధ్యక్షుడయ్యారు. ఒకప్పుడు రాజపక్సకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే సిరిసేనను ఆయనపై రెచ్చగొట్టి పోటీకి నిలబెట్టింది కూడా దోవలే. అంతేకాదు.. మాజీ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను పోటీ చేయొద్దని కోరి.. ఒప్పించారు కూడా. దాంతో రాజపక్స ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసి.. సిరిసేనను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు! -
ఎక్కడో పొరపాటు జరిగింది: రక్షణ మంత్రి
-
ఎక్కడో పొరపాటు జరిగింది: రక్షణ మంత్రి
న్యూఢిల్లీ: ఉడీ తరహా దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు. మాటలు చెప్పడానికి కంటే చేతల్లో చేసి చూపించడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. ఏదో పొరపాటు కారణంగానే ఉడీ దాడికి అవకాశం ఏర్పడివుంటున్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. పొరపాటును సరిదిద్దుకుంటామని, భవిష్యత్ లో ఇలాంటి దాడులు జరగకుండా చూసుకుంటామన్నారు. ‘మొత్తానికి ఎక్కడో పొరపాటు జరిగింది. నేను వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదు. ఇది చాలా సున్నిత విషయం. జరిగిన పొరపాటును సరిదిద్దుకుని పునరావృతం కాకుండా చూసుకుంటాం. ఎక్కడ పొరపాటు జరిగిందనేది కచ్చితంగా కనుక్కుంటాం. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామ’ని పరీకర్ అన్నారు. తప్పులు చేయకుండా ఉండడం, వందశాతం కచ్చితత్వంతో పనిచేయడం తన జీవన విధానమని చెప్పారు. ఉడీ తరహా దాడులు మళ్లీమళ్లీ జరగబోవని దేశ ప్రజలకు హామీయిచ్చారు. జమ్మూకశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై ఆదివారం విదేశీ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది సైనికులు వీర మరణం పొందగా, 20 మంది వరకు గాయపడ్డారు. -
మిస్సింగ్ విమానంపై రక్షణమంత్రి సమీక్ష
-
మోదీ ఆ మాట చెప్పగానే.. అక్కడ నుంచి జారుకున్నా
పనాజీ: కేంద్ర కేబినెట్లో చేరాలని ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి ఆఫర్ చేసినపుడు, కేంద్ర మంత్రి కావడం రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కు ఇష్టంలేదట. ఆ సమయంలో గోవా ముఖ్యమంత్రిగా ఉన్న పారికర్.. మోదీ ఆఫర్ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించారు. పనాజీలో జరిగిన గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ 60వ జన్మదిన వేడుకల్లో పారికర్ ఈ విషయాలను స్వయంగా చెప్పారు. ‘2014 అక్టోబర్ 26న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశాను. గోవా మైనింగ్ సమస్యలు ప్రస్తావించి, రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరగా మోదీని అంగీకరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కేంద్ర కేబినెట్లోకి మీరు ఎందుకు చేరరాదు? అన్ని నన్ను ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్ మంత్రి పదవి అంటే నాపై బాంబు వేయడం వంటిదనిపించింది. ఆలోచిస్తానని మోదీకి చెప్పి అక్కడ నుంచి జారుకున్నా. రెండు, మూడు నెలలు ఢిల్లీకి వెళ్లరాదని నిర్ణయించుకున్నా. అయితే ఐదారు రోజుల్లోనే మోదీ మళ్లీ గుర్తు చేశారు. కేంద్రానికి వెళ్లాలని నవంబర్ 6న నిర్ణయించుకున్నా. అదే నెల 8న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా’ అని గోవా ముఖ్యమంత్రి నుంచి కేంద్ర రక్షణ మంత్రి వరకు తన ప్రయాణం గురించి పారికర్ వెల్లడించారు. పారికర్ రక్షణ మంత్రిగా వెళ్లడంతో ఆయన స్థానంలో గోవా ముఖ్యమంత్రిగా పర్సేకర్ను నియమించారు. -
దోపిడీదొంగలు వస్తున్నారు.. జాగ్రత్త!
గోవా ఎన్నికల్లో తాము పోటీ చేస్తామంటూ చెబుతున్న ఆమ్ ఆద్మీ పార్టీపై రక్షణ మంత్రి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఘాటుగా విమర్శలు చేశారు. ఢిల్లీ నుంచి కొంతమంది దోపిడీదారులు గోవాకు వస్తున్నారని, గోవాను దోచుకోడానికే వాళ్లు వస్తున్నారని, వాళ్లతో గోవా వాసులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ‘‘కొంతమంది ఢిల్లీవాలాలు ఢిల్లీని దోచుకున్న తర్వాత గోవాను కూడా దోచుకోవాలని చూస్తున్నారు. ఓ అవకాశం కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. వాళ్లు కాకపోతే.. వాళ్ల ప్రైవేటు సెక్రటరీలు దోచుకుంటారు. ఆ ప్రైవేటు సెక్రటరీలు కమీషన్ల కోసమే చూస్తారు’’ అంటూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన ముఖ్యకార్యదర్శి రాజేంద్ర కుమార్పై కూడా విమర్శలు చేశారు. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ జన్మదినం సందర్భంగా జరిగిన సభలో పారికర్ మాట్లాడారు. గోవా సంపద మీద చాలా మంది కళ్లు ఉన్నాయని.. అందువల్ల గోవా వాసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాను ఇక్కడికొస్తే బీజేపీని ఓడించాలన్న వాళ్ల కుట్రలు భగ్నమవుతాయని.. అందుకే తాను వస్తున్నానంటే వాళ్లకు కడుపు మంట అని అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవాలో ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ రెండుసార్లు పర్యటించారు. -
మాట తడబడిన రక్షణ మంత్రి
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి వచ్చిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట తడబడ్డారు. పొరపాటున కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన సంబోధించారు. దాంతో వేదికపై ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్తో పాటు ఇతర నేతలు కూడా ఖంగుతిన్నారు. తెలంగాణలో వాస్తుపాలన సాగుతోందని.. ఇక్కడ బీజేపీ ఎదిగేందుకు చాలా అవకాశం ఉందని పారికర్ అన్నారు. టీఆర్ఎస్ యథేచ్ఛగా ఫిరాయింపులకు పాల్పడుతోందని, ఇప్పుడు ఆ పార్టీలో చేరినవాళ్లంతా చివరి ఏడాదిలో మళ్లీ తిరుగుముఖం పట్టడం ఖాయమని పారికర్ చెప్పారు. రాష్ట్రపార్టీతో కొంత సమాచార లోపం జరిగిందని.. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గోవాలో 0.4 శాతం ఓటింగు ఉన్న పరిస్థితి నుంచి అధికారంలోకి వచ్చామని, తెలంగాణలో ఇప్పటికే 14 - 15 శాతం ఓటింగ్ ఉందని పారికర్ చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని, ఆ తర్వాతే ప్రజలు అధికారంలో కూర్చోబెడతారని సూచించారు. -
కొన్ని తీర్పులు అర్థరహితం
రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ పణజి: న్యాయవ్యవస్థ ఇచ్చిన కొన్ని ఆదేశాలు అర్థరహితమైనవని.. వాటికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏదీ లేదని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ విమర్శించారు. ఆయన సోమవారం పణజిలో ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించి, అనంతరం మాట్లాడారు. ‘‘ఎటువంటి శాస్త్రీయ ప్రాతిపదికా లేకుండా అర్థరహిత ఆదేశాలు ఇవ్వటం జరుగుతోంది. శాస్త్రాన్ని అర్థం చేసుకోని కొందరు మనుషులు దానికి భాష్యం చెప్పటం మొదలుపెట్టారు. భారత్లో కొందరు పెట్టుబడులు పెట్టడం ఆపివేశారు.. ఎందుకంటే కోర్టు నిర్ణయాలు తాము అర్థం చేసుకోగల పరిధిని దాటిపోయి ఉన్నాయని అంటున్నారు. ‘‘కాలుష్యం కలిగిస్తున్న డీజిల్ వాహనాలను నిషేధించవచ్చని మేం అర్థం చేసుకోగలం. కానీ.. కాలుష్యం కలిగించని లేదా పెట్రోల్ వాహనం కన్నా తక్కువ కాలుష్యకారకమైన వాహనాలను నిషేధించటంలో అర్థం ఏమిటి?’’ అని వ్యాఖ్యానించారు. -
'ఆ వార్తలు అవాస్తవం.. ఇప్పట్లో రిటైరవ్వను'
న్యూఢిల్లీ: తాను రాజకీయాల నుంచి రిటైరవుతున్నట్టు వచ్చిన వార్తలను రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ తోసిపుచ్చారు. ఇప్పట్లో రాజకీయాల నుంచి తప్పుకోబోనని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించిన తర్వాతే తిరిగి గోవాకు వెళుతానని ఆయన చెప్పారు. డిసెంబర్ 13న 60వ ఏటా అడుగుపెడుతున్న నేపథ్యంలో రాజకీయాల నుంచి రిటైరవ్వాలని భావిస్తున్నట్టు పారికర్ చెప్పారని వార్తలు వచ్చాయి. మూడుసార్లు గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన పారికర్ ఈ వార్తలపై ట్విట్టర్లో స్పందించారు. 'సాధారణంగా 60 ఏళ్ల వయస్సులో ప్రజలు తమ వృత్తి నుంచి రిటైరవ్వాలని భావిస్తారు. నేను కూడా గతంలో ఇలా ఆలోచించి ఉండవచ్చు. కానీ కేంద్రంలో నాపై ఉంచిన పెద్ద బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంది. ఆ బాధ్యతలను నిర్వర్తించిన తర్వాత నేను తిరిగివెళ్తాను' అని ఆయన ట్వీట్ చేశారు. రక్షణశాఖ మంత్రిగా పారికర్ మరో నెలలో ఏడాది పూర్తి చేసుకోనున్నారు. భద్రతా దళాల ఆధునీకరణ, భారీ ఆయుధ సేకరణను పారదర్శకంగా, వేగంగా పూర్తిచేయాల్సిన బృహత్ బాధ్యత పారికర్పై ఉంది. -
మంత్రిగారికి రాజకీయ వైరాగ్యం!
ఆయన ఐఐటీ బాంబేలో చదివిన ఉన్నత విద్యావంతుడు. ముఖ్యమంత్రిగా పనిచేసి, తర్వాత కేంద్రంలో కీలకమైన రక్షణ శాఖ చేపట్టారు. ఆ పదవి చేపట్టి సరిగ్గా ఏడాది అయ్యిందో లేదో.. అప్పుడే రాజకీయ వైరాగ్యం ప్రకటిస్తున్నారు. ఒక్కసారి పదవి వచ్చిందంటే.. 'జుట్టు పట్టుకుని బయటకీడ్చినా చూరు పట్టుకుని వేలాడి.." అన్నట్లు కుర్చీకి అతుక్కుపోయి ఉండే నాయకులున్న ఈ రోజుల్లో తనకు 60 ఏళ్లు నిండగానే రిటైర్ అవుదామని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆయనే గోవా మాజీ సీఎం, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్. పనజిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ డిసెంబర్ 13తో తనకు 60 ఏళ్లు నిండుతాయని, దాంతో రెండు మూడేళ్ల క్రితం నుంచే తాను రిటైర్మెంట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టానని చెప్పారు. 2012లో గోవా ముఖ్యమంత్రి అయిన పారిక్కర్ను 2014 నవంబర్ నెలలో మోదీ సర్కారులో రక్షణ మంత్రిగా తీసుకున్న విషయం తెలిసిందే. గోవా లాంటి చిన్న రాష్ట్రంలో నాయకత్వ లక్షణాలున్న వాళ్లను వెతికి పట్టుకోవడం చాలా కస్టం అయిపోతోందని పారిక్కర్ వ్యాఖ్యానించారు. తాను ఎక్కడున్నా, తన దృష్టి మాత్రం ఎప్పుడూ గోవామీదే ఉంటుందని, గోవా ప్రభుత్వం తప్పుదారి పడితే, దాన్ని మళ్లీ సరైన దారిలోకి తెస్తానని అన్నారు. ఈ విషయంపై గోవా వాసులకు గ్యారంటీ కూడా ఇస్తానని నొక్కిచెప్పారు. -
ఫేస్బుక్లో మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు
టొరంటో: కెనడా రక్షణ మంత్రికీ జాతి వివక్ష తప్పలేదు. కెనడా కొత్త రక్షణ మంత్రి హర్జీత్ సజ్జన్ను ఉద్దేశిస్తూ ఓ సైనికుడు సోషల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కెనడా సైనిక దళాలు విచారణ ప్రారంభించాయి. హర్జీత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సైనికుడి పేరు, ఏ వ్యాఖ్యలు చేశారన్న వివరాలను వెల్లడించేందుకు సైన్యం నిరాకరించింది. అయితే మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలను ఫేస్బుక్లో పోస్ట్ చేసినట్టు విచారణ కమిటీ సభ్యుడొకరు తెలిపారు. ఫేస్బుక్లో ఫ్రెంచి భాషలో రాసిన ఈ కామెంట్స్ను వెంటనే తొలగించారు. కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతికి చెందిన హర్జీత్ సజ్జన్ నియమితులైన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ డీఆర్డీవోకి అబ్దుల్ కలాం పేరు
న్యూఢిల్లీ : హైదరాబాద్లోని డీఆర్డీవోకు భారతరత్న, మాజీ భారత రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. గురువారం అబ్దుల్ కలాం 84వ జన్మదినం. ఈ నేపథ్యంలో డీఆర్డీవోకి ఆయన పేరును రేపు ప్రకటించనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ బుధవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. అబ్దుల్ కలాం 1982లో డీఆర్డీవోలో చేరారు. రెండు దశాబ్దాలపాటు ఆయన ఆ సంస్థలో విధులు నిర్వహించారు. -
మేలో భారత్కు అమెరికా రక్షణ మంత్రి
వాషింగ్టన్: భారత్తో రక్షణ రంగంలో సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ మేలో భారత్కు రానున్నారు. గత జనవరిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్కు విచ్చేసి ఇరుదేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉండాలని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుదేశాలు రక్షణ రంగంలో సహకారం అందించుకునేందుకు, వాణిజ్య సంబంధాలు మెరుగుపడేందుకు కార్టర్ భారత్కు వస్తున్నట్లు శుక్రవారం పెంటగాన్ వెల్లడించింది. ఆసియా దేశాలతో మరింత మెరుగైన సంబంధాలను కొనసాగించేందుకు ఆయన వచ్చే రెండు నెలల్లో రెండుసార్లు ఆసియా పర్యటన చేయనున్నట్లు పేర్కొంది. భారత్తోపాటు జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించనున్నట్లు తెలిపింది. -
విశాఖ ప్రమాదంపై రక్షణ మంత్రి సీరియస్!
విశాఖపట్నం తీరంలో భారత నౌకాదళానికి చెందిన ఓ నౌక మునిగిపోవడం, అందులో ఐదుగురు సిబ్బంది మునిగిపోవడంపై మరింత సమగ్ర విచారణ జరిపించాలని రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ ఆదేశించారు. ఈ సంఘటనను ఆయన సీరియస్గా తీసుకున్నారు. ఐదుగురు నౌకాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం, నౌక మునిగిపోవడాన్ని ఏమాత్రం అంగీకరించేది లేదని ఆయన చెప్పారు. వాస్కోలో గోవా షిప్యార్డ్ లిమిటెడ్ నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆ నౌకను బయటకు తీసి మళ్లీ జలాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఏమైనా ఉందేమో పరిశీలించాల్సిందిగా కూడా తాను ఆదేశించానన్నారు. స్వచ్ఛమైన ఇమేజి ఉన్నంత మాత్రాన సరిపోదని, వెంటవెంటనే సమయానికి తగినట్లు నిర్ణయాలు తీసుకోవడం కూడా ఇలాంటి రంగాల్లో అత్యవసరమని యూపీఏ హయాంలో రక్షణమంత్రిగా పనిచేసిన ఏకే ఆంటోనీని ఆయన విమర్శించారు. గత ఏడెనిమిదేళ్లుగా రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన అనేక విషయాలు పెండింగులోనే ఉండిపోయాయని విమర్శించారు. -
లాలూ కూతురిపై విజయం: కేంద్రమంత్రిగా రామ్ కృపాల్ యాదవ్
రాష్ట్రీయ జనతా పార్టీ (ఆర్జేడి) తో చాలా కాలం కొనసాగిన రామ్ కృపాల్ యాదవ్ 2009 మార్చి 12 తేదిన బీజేపీలో చేరారు. గత లోకసభ ఎన్నికల్లో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసాపై సంచలన విజయం సాధించారు. 2014 నవంబర్ 09 తేదిన జరిగిన మంత్రివర్గ విస్తరణలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జననం, కుటుంబం బీహార్ రాష్ట్రంలోని పాట్నా లో 1957 అక్టోబర్ 12 తేదిన జన్మించారు. ఆయనకు భార్య కిరణ్ దేవి, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. విద్యార్హతలు బీఏ (హానర్స్) మగధ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ రాజకీయ ప్రస్థానం 1985-1986 పాట్నా మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ 1992-1993 బీహార్ విధాన మండలి సభ్యుడు 1993-1996 10వ లోకసభ సభ్యుడు 1996-1997 11వ లోకసభ సభ్యుడు 2004-2009 14వ లోకసభ సభ్యుడు 2010 జూలైలో రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక 2010 ఆగస్టులో రక్షణ శాఖ కమిటీ సభ్యుడిగా నియామకం 2010లో సెప్టెంబర్ లో బొగ్గు శాఖా మంత్రిగా సేవలు బీహార్ లోని డాక్టర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ చైర్మన్ గా వ్యవహరించారు. 1998-2005 మధ్యకాలంలో బీహార్ లోని బీహార్ ధార్మిక్ నయాస్ చైర్మన్ గా సేవలు -
మరోసారి కేంద్రమంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
హిందూ సైద్దాంతిక విధానాలు, ఆశయాలు, లక్ష్యాలున్న బీజేపీలో షియా మతస్తుడైన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జాతీయ ఉపాధ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుఢి హోదాలో, అధికార ప్రతినిధిగా పార్టీకి సేవలందిస్తున్నారు. జననం: 1957 అక్టోబర్ 15 తేదిన ఉత్తరప్రదేశ్ లో అలహాబాద్ లోని షియా ముస్లింల కుటుంబంలో జన్మించారు. ఆయనకు భార్య సీమా నఖ్వీ, ఓ కుమారుడు ఉన్నారు. విద్యాభ్యాసం: అలహాబాద్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. నఖ్వీ జీవితంలో కీలక ఘట్టాలు: 1975-77 సంవత్సరాల మధ్య అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినపుడు జైలు జీవితాన్ని అనుభవించారు. 1980లో జనతపార్టీ అభ్యర్థిగా అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేశారు. 1989లో ఆయోధ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి. 1991, 1993 లో మావ్ అసెంబ్లీకి ఎన్నిక 1998లో రాంపూర్ నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నిక 1998లో వాజ్ పేయి ప్రభుత్వ హాయంలో సమాచార, ప్రసార శాఖామంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలందించారు. 2010లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక ఇతర బాధ్యతలు: ఆర్ధిక కమిటి సభ్యుడిగా.. వాణిజ్య కమిటి సభ్యుడిగా, వక్ఫ్ బోర్డు జాయింట్ కమిటి సభ్యుడిగా ఐటీ కమిటి మెంబర్ గా రచయితగా 1991లో సైయా, 1998లో దాంగా అనే పుస్తకాల్ని రచించారు.