రైల్వే రాబడి పెరిగింది | Railways earnings up by over 12 per cent | Sakshi
Sakshi News home page

రైల్వే రాబడి పెరిగింది

Published Wed, Apr 8 2015 2:16 PM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

రైల్వే రాబడి పెరిగింది

రైల్వే రాబడి పెరిగింది

న్యూఢిల్లీ: ఈయేడాది కూడా రైల్వే ఆదాయం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 2014-15 ఆర్థిక సంవత్సరానికి 12.16శాతం ఆదాయం పెరిగినట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపాయి. 2013-14 సంవత్సరంలో రైల్వే ఆదాయం రూ.140,761.27 కోట్లుకాగా, ఈ 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,57,880.50 కోట్ల ఆదాయం లభించింది.

ఈ ఆదాయంలో సరుకు రవాణా రైళ్ల ద్వారా వచ్చింది రూ.1,07,074.79 ఉండగా.. గతంలో ఇదే గూడ్స్ సర్వీస్పై రూ.94,955.89 కోట్ల రాబడి వచ్చింది. ఇది 12.76శాతం ఎక్కువ. ఇక ప్రయాణీకుల సర్వీసు ద్వారా కూడా గతంలో కన్నా ఎక్కువ ఆదాయమే వచ్చింది. 2014-15లో మొత్తం 42,866.33కోట్ల ఆదాయం రాగా.. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.37,478.34 కోట్ల ఆదాయంగా ఉంది.  ఇది గతంతో పోలిస్తే 14.38శాతం ఎక్కువ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement