
సాక్షి, చెన్నై: ప్రముఖ ఆన్లైన్ గేమ్ పబ్జీపై నిషేధం విధించాలని తమిళనాడు ముస్లిం లీగ్ (టీఎన్ఎంఎల్) డిమాండ్ చేసింది. ఈ గేమ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపించింది. ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం టీఎన్ఎంఎల్ ఫిర్యాదు చేసింది. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల ఆగ్రహానికి ఈ గేమ్ కారణమవుతోంది. విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమైన ‘బ్లూ వేల్ చాలెంజ్’ గేమ్ మాదిరిగానే... ఇది కూడా పవిత్ర స్థలం ‘కాబా’ను పోలిన ఓ చిత్రాన్ని చెడుగా చూపిస్తూ ఆగ్రహానికి గురిచేస్తోంది...’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముస్లింలంతా ఈ గేమ్ను తమ మొబైల్లో డిలీట్ చేస్తూ ‘‘బాయ్కాట్ పబ్జీ’’ పేరుతో ప్రచారం చేపట్టాలని టీఎన్ఎంఎల్ పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment