గ్యాంగ్ రేప్ చేసి వీడియో షేర్ చేశారు | Teen's Gang Rape Comes to Light After Aunt Receives Video Clip | Sakshi
Sakshi News home page

గ్యాంగ్ రేప్ చేసి వీడియో షేర్ చేశారు

Published Fri, Nov 27 2015 12:06 PM | Last Updated on Sat, Sep 15 2018 5:34 PM

గ్యాంగ్ రేప్ చేసి వీడియో షేర్ చేశారు - Sakshi

ముంబై: మైనర్ బాలికను నలుగురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్ చేసి వీడియోను షేర్ చేసిన వైనం ముంబైలో కలకలం రేపింది. తోటి  విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ దృశ్యాలను వీడియో తీసి, బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చదువులో సహాయం కావాలని పిలిచి మైనర్ బాలిక(15)పై నలుగురు బాలురు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో బాధిత బాలిక  అత్త వాట్పాప్ కు షేర్ కావడంతో  విషయం వెలుగులోకి వచ్చింది.  నవంబరు 8వ తేదీన ముంబైలో జరిగిన ఈ అమానుషం దాదాపు 15 రోజుల తర్వాత  పోలీసుల దృష్టికి వచ్చింది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 15,16 ఏళ్ల వయసున్న నలుగురు అబ్బాయిలు పథకం ప్రకారం బాధిత బాలికను పిలిచారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని కంబైన్డ్ స్టడీ పేరుతో ఇంటికి పిలిచారు. ఆ తరువాత అఘాయిత్యానికి పాల్పడి, సెల్ఫోన్ లో చిత్రించారు. ఎవరికైనా చెబితే వీడియోను బహిర్గతం చేస్తామని బెదిరించారు. దీంతో అమ్మాయి మౌనంగా వుండిపోయింది. కానీ వాళ్లలో ఒకడు దాన్ని  సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదికాస్తా  బాలిక బంధువుకు చేరింది. దీంతో షాకైన ఆమె.. బాలికను నిలదీయడంతో, జరిగిన అన్యాయాన్ని వివరించింది. ఆమె మలాద్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం వీరిని జువైనల్ కోర్టుకు తరలించామని సీనియర్ పోలీసు్ అధికారి తెలిపారు.

కాగా బాలిక తండ్రి చనిపోవడంతో అక్కతో కలిసి అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటోంది. ఈ ఘటన తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిందని బాలిక అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే  గత అయిదు నెలల్లో మలాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది రెండవ గ్యాంగ్ రేప్ కేసు కావడం ఆందోళన రేపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement